-
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ గూటికి చేరారు. రాథోడ్ బాపురావ్తో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత చెల్లమల కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి, ఇతర నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సందర్బంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ మాట్లాడుతూ.. ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ ఉద్యమంలో చేరానని చెప్పారు. రాష్ట్ర సాధనకోసం తనవంతు ప్రయత్నం చేశానన్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును కాదని నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్కు సీఎం కేసీఆర్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో అసంతృప్తికి గురైన బాపురావు.. బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు. రెండుసార్లు గెలిచిన తనను ప్రజల్లో ఆదరాభిమానాలున్నప్పటికీ కొందరు కక్షగట్టి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని బాపురావ్ తెలిపారు. దీనిపై మాట్లాడాలని కలిసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు గిరిజన ఎమ్మెల్యేలకు కూడా టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని చెప్పారు. అనంతరం ఎల్లారెడ్డికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సుభాష్ రెడ్డి, చెల్లమల కృష్ణారెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు సురిగి నర్సింహా, బిట్టు సత్యనారాయణ పార్టీలో చేరారు. వీరందరినీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదీ చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే..? -
ప్లాట్ల విక్రయంలో.. బోథ్ ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు!
సాక్షి, ఆదిలాబాద్: బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై చీటింగ్ కేసు నమోదైంది. బీఆర్ఎస్కు గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ కేసు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హైదరాబాద్లో మంగళవారం కలిసిన సంగతి తెలిసిందే. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఆదిత్య ఖండేష్కర్కు మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో 2012లో రెండు ప్లాట్లను విక్రయించారు. ఆ తర్వాత 2019లో ఇవేప్లాట్లను సంతోష్ అనే మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుపై 409, 420 సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యాపార భాగస్వామి సుదర్శన్పై కూడా కేసు నమోదైనట్లుగా పేర్కొన్నారు. విచారణ జరుపుతున్నట్లుగా సీఐ వివరించారు. -
బీఆర్ఎస్కు షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎమ్మెల్యే!
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల్లో సీనియర్ నేతలు కూడా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. పరిస్థితి బట్టి అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మరో కీలక నేత బీఆర్ఎస్ను వీడుతున్నట్టు వెల్లడించారు. ఆయన హస్తం గూటిలో చేరుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టికెట్ ఇవ్వకపోవడంపై గుస్సా.. వివరాల ప్రకారం.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో బాపూరావు సమాలోచనలు, చర్చలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా తప్పు చేయలేదని, పార్టీకి నష్టం చేయలేదని ఆయన అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. మరో నాలుగు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం మాత్రం చెప్పలేదు. అయితే, బాపూరావు కాంగ్రెస్లో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్ నో అపాంట్మెంట్.. మరోవైపు.. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కావాలని కోరారు రాథోడ్ బాపురావు. దీనికి కేటీఆర్ స్పందించకపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇక, బోథ్ నుంచి అనిల్ జాదవ్కు టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. దీంతో రాథోడ్ బాపురావు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ మారాలంటూ ఆయన మద్దతుదారులు ఒత్తిడి తేవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కాగా, మొదట పార్టీని వీడే అంశంపై రాథోడ్ బాపురావు విముఖత వ్యక్తం చేశారు. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులు జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సిట్టింగ్లకు టికెట్ లభించకపోవడంతో వారు పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం -
బోథ్ (ST) రాజకీయ చరిత్ర..!
బోథ్ నియోజకవర్గం బోథ్ గిరిజన రిజర్వుడు నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్ధి రాదోడ్ బాపూరావు రెండోసారి గెలుపొందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సోయం బాపూరావుపై 6639 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. కాగా స్వతంత్ర అభ్యర్ధి అనిల్ జాదవ్ 27368 ఓట్లు తెచ్చుకుని మూడో స్తానంలో ఉన్నారు. సోయం బాపూరావు 2009లో టిఆర్ఎస్ తరపున గెలిచి, ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి ఓడిపోయారు. కాగా అనిల్ జాదవ్ కిందటిసారి కాంగ్రెస్ ఐ పక్షాన పోటీచేసి, టిక్కెట్ రాకపోవడంతో 2018లో ఇండిపెండెంట్గా నిలబడ్డారు. రాదోడ్ బాపూరావుకు 60967 ఓట్లు రాగా, సోయం బాపూరావుకు 54328 ఓట్లు లభించాయి. బాపూరావు ఆ తర్వాత 2019లో బిజెపిలో చేరి లోక్ సభకు ఎన్నికవడం విశేషం. బోథ్ నుంచి 2014లో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన రాదోడ్ బాపూరావు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయనకు 26993 ఓట్ల ఆదిక్యత లబించింది. కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ అనిల్ కుమార్ 35877 ఓట్లతో రెండో స్థానంలో ఉండగా, టిడిపి అభ్యర్ధిగా పోటీచేసిన మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావుకు 35218 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 2009లో టిడిపి పక్షాన గెలిచిన ఎమ్మెల్యే గొడం నగేష్ 2014లో టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లో చేరి ఆదిలాబాద్ నుంచి ఎమ్.పిగా పోటీచేసి ఘన విజయం సాధించారు. కానీ 2019లో లోక్సభ ఎన్నికలలో ఓటమి చెందారు. బోథ్ నియోజకవర్గంలో నగేష్ మూడుసార్లు టిడిపి పక్షాన గెలుపొందారు. ఈయన తండ్రి గొడం రామారావు కూడా రెండుసార్లు గెలిచారు. రామారావు గతంలో ఎన్.టి.ఆర్ క్యాబినెట్లో పనిచేస్తే నగేష్ 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు క్యాబినెట్లో ఉన్నారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరు మంత్రుల్కెన ఘనత పొందారు. బోథ్ కు 1962 నుంచి ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐలు, ఐదుసార్లు తెలుగుదేశం, మూడుసార్లు టిఆర్ఎస్ గెలుపొందాయి. 2004లో గెలిచిన టిఆర్ఎస్ అభ్యర్ధి ఎస్.బాపూరావు ఆ తరువాత కాలంలో అసమ్మతి ఎమ్మెల్యేగా మారారు. టిఆర్ఎస్కు భిన్నంగా ఈయన శాసనమండలి ఎన్నికలలో కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతు ఇచ్చిన కారణంగా ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడై పదవిని కోల్పోయారు. శాసనసభ చరిత్రలో తొలిసారిగా అనర్హుల్కెన తొమ్మిది మందిలో ఈయన ఒకరు. 2014 ఎన్నికలో టిడిపిలో చేరి ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఐ, తదుపరి బిజెపిలోకి ఆయన మారి 2019లో లోక్సభకు ఎన్నికయ్యారు. బోథ్ నియోజకవర్గం జనరల్గా ఉన్నప్పుడు ప్రముఖ సోషలిస్టు నేత సి. మాధవరెడ్డి 1962లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన 1952లో సోషలిస్టుగా ఆదిలాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైతే, 1984లో టిడిపి పక్షాన మరోసారి లోక్సభకు ఎన్నికై, ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేయడం విశేషం. బోథ్ ఎస్టిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బోథ్ ఎమ్మెల్యేకి తప్పిన పెను ప్రమాదం.. ఆవు అడ్డం రావడంతో
సాక్షి, అదిలాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారు ప్రమాదానికి గురి కాగా.. తాజాగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. హైదారాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలో కొరటికల్ కార్నర్ వద్ద అకస్మాత్తుగా ఆవు అడ్డం వచ్చింది. దీంతో ఆవును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జు నుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతివేలికి గాయమై తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే మరో వాహనంలో ఆయనను బోథ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బాపురావు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పంచాయితీ.. నిధుల వాడకం వ్యాఖ్యలు మరింత మైనస్? బీజేపీ శ్రేణుల్లో ఆందోళన!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement