Rasool Ellore
-
SKY: ఆకట్టుకునేలా 'జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్'
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "స్కై". ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగి రెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "స్కై" సినిమా నుంచి 'జర్నీ ఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్' లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ - "స్కై" సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి వర్క్ చేశాం. వీలైనంత త్వరగా "స్కై" సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా ప్రతి ఒక్క ఆడియెన్ కు నచ్చుతుంది. అన్నారు.హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ - నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రీసెంట్ గా మా మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ ను మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేశా. నేను ఎలా నటించాను అని మా టీమ్ మెంబర్స్ ను అడిగితే ఎంకరేజింగ్ గా చెప్పారు. మా టీమ్ లో రసూల్ గారి లాంటి చాలా ఎక్సిపీరియన్స్ టెక్నీషియన్ ఉండటం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. త్వరలోనే "స్కై" మూవీతో మీ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ - ఒక కాంపాక్ట్ బడ్జెట్ లో పర్పెక్ట్ గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా "స్కై" సినిమా ఎగ్జాంపుల్. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకు ప్రతి ఒక్కరం పనిచేశాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. డైరెక్టర్ పృథ్వీ పొయెటిక్ కథతో చాలా ప్యాషనేట్ గా ఈ మూవీని రూపొందించారు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నా. అన్నారు.డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ - సినిమా మేకింగ్ అంటే ఏంటో, ఏ క్రాఫ్టులు కలిసి పనిచేస్తాయో అవగాహన తెచ్చుకుంటూ ఈ చిత్రానికి సన్నాహాలు చేసుకున్నాం. డైరెక్టర్ గా నాకు ఇది డెబ్యూ మూవీ. నేను ముందు ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలిశాను. ఆ తర్వాత రసూల్ గారిని కలిశాను. సినిమా మీద ప్యాషన్ తో మేమంతా వర్క్ చేశాం. ఇటీవల "స్కై" మూవీ షో చూసి మూవీ చాలా బాగుందని అంతా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మనకున్న బడ్జెట్ లో మంచి సినిమా చేయగలం, ఆడియెన్స్ కు ఒక సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వగలం అనే నమ్మకం కలిగింది. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అన్నారు. -
త్వరలో ఓ మంచి సినిమా : రసూల్ ఎల్లోర్
దర్శకత్వం అంటే ఎంతో ఇష్టం ఇండస్ట్రీ విశాఖ రావాలంటే చాలా జరగాలి సినిమాటోగ్రాఫర్, డెరైక్టర్ రసూల్ ఎల్లోర్ విశాఖపట్నం : తెరపై హీరో హీరోయిన్లు అందంగా కనబడాలన్నా, లొకేషన్లు అద్భుతంగా చూపాలన్నా, దృష్టి మరలకుండా సినిమా చూడాలన్నా... అందుకు కెమెరా పనితనం ఎంతో అవసరం. ప్రేక్షకులకు గుర్తుండిపోయే అతి కొద్దిమంది ఛాయాగ్రహకుల్లో రసూల్ ఎల్లోర్ ఒకరు. ఓ సినిమా వర్క్షాప్ కోసం విశాఖ వచ్చిన ఆయనతో ‘న్యూస్లైన్’తో మాట్లాడింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... నేను ఇక్కడి వాడినే.. రాజమండ్రిలో పుట్టి పెరిగాను. నాన్న జగన్మోహన్రావు ఎలక్రికల్ ఇంజనీర్గా పనిచేసేవారు. అమ్మ షీలా బ్రిటిష్ కుటుంబానికి చెందినవారు. సినిమాల్లో ప్రవేశం విఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్రెడ్డి మా బంధువు. ఆయన వద్ద ఆరేళ్లు పనిచేశాను. తర్వాత జగపతిబాబు నటించిన గాయం చిత్రంతో కేరీర్ ప్రారంభించాను. తర్వాత ఎన్నో సినిమాలకు ఛాయాగ్రహకుడిగా పనిచేశాను. రంగీలా (ఓ పాటకు), దౌడ్, కిక్, జల్సా, నువ్వు నేను, ఊసరవెల్లి, నీకు నాకు డేష్ డేష్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు చేశాను. దర్శకత్వం నాకు డెరైక్షన్ అంటే కూడా ఇష్టం. అందుకే ఒకరికి ఒకరు చిత్రాన్ని రూపొందించాను. అది మంచి హిట్ అయింది. భగీరధ, సంగమం చిత్రాలకు దర్వకత్వం వహించాను. ఈ మూడింటికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం నేనే. ఈమధ్య డైరక్షన్కు బాగా గ్యాప్ వచ్చింది. మంచి కథ కోసం ఆలోచిస్తున్నాను. ప్రస్తుతానికి చర్చల్లో ఉంది. స్క్రిప్టు పూర్తవగానే సినిమా తీస్తాను. కథపై అవగాహన అవసరం నేను సినిమాటోగ్రాఫర్గా చేసిన ప్రతి సినిమాకు ముందే కథ వింటాను. జడ్జ్ చేసుకుని నచ్చితేనే ఒప్పుకుంటాను. నా దృష్టిలో అది చాలా బెస్ట్. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్కు కథపై అవగాహన ఉంటే మంచి అవుట్పుట్ వస్తుంది. విశాఖకు చాలా రావాలి.... నేను తొలి చిత్రం గాయం విశాఖలో షూట్ చేశాం. ఎంతో అందమైన లొకేషన్లున్నాయి. నేడు చాలా డెవలప్ అయింది. కాకపోతే ఇండస్ట్రీ రావాలంటే చాలా అవసరం. మేన్ పవర్ ఉండాలి. టెక్నీషియన్లు కావాలి. ఎడిటింగ్, డబ్బింగ్ తదితర అన్ని వనరులు అవసరం. ఇవన్నీ రావాలంటే ఇక్కడి వారే ముందుకు రావాలి. బంతి విశాఖ కోర్టులో ఉంది. దాన్ని వినియోగించుకోవాల్సిన అవకాశం ఇక్కడి వారికే ఉంది.