breaking news
Rangasamy
-
సీఎం రంగస్వామితో విజయ్ దూత రహస్య భేటీ!
పుదుచ్చేరి: పుదుచ్చేరి రాజకీయాల్లో అర్ధరాత్రి వేళ జరిగిన ఒక రహస్య సమావేశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాబోయే తట్టంచావడి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామితో, తమిళనాడు మంత్రి ఎన్ ఆనంద్ (బుస్సీ ఆనంద్) గురువారం రాత్రి జరిపిన ముఖాముఖి భేటీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తర్వాత ఆ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆనంద్.. నేరుగా సీఎం నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా చర్చలు జరపడం కొత్త పొలిటికల్ ఈక్వేషన్లకు దారితీస్తోంది.ఉపఎన్నికల వేళ వ్యూహాత్మక భేటీముఖ్యమంత్రి రంగస్వామి గత ఎన్నికల్లో మంగళం, తట్టంచావడి రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. అయితే, ఆయన తట్టంచావడి స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. శాసనసభలో తమ బలాన్ని 12 స్థానాలకు పెంచుకోవాలని భావిస్తున్న అధికార పక్షం ఏఐఎన్ఆర్సీ, ఈ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇలాంటి కీలక సమయంలో పుదుచ్చేరి మూలాలు ఉన్న బుస్సీ ఆనంద్.. పెళ్లి వేడుక కోసం వచ్చి, అర్ధరాత్రి సీఎం రంగస్వామిని కలవడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది.విజయ్ దళపతి దూతగా బుస్సీ ఆనంద్?బుస్సీ ఆనంద్ కేవలం తమిళనాడు మంత్రి మాత్రమే కాదు.. గతంలో 2006లో పుదుచ్చేరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నటుడు, సీఎం విజయ్ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడంలో ఆనంద్ కీలక పాత్ర పోషించారు. రంగస్వామితో ఆయనకు పాత వ్యక్తిగత, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. గతంలో పుదుచ్చేరి వచ్చినప్పుడు ఆలయ దర్శనం చేసుకుని వెళ్లిపోయిన ఆనంద్, ఈసారి మాత్రం నేరుగా సీఎం రంగస్వామితో చర్చలు జరపడం వెనుక సీఎం విజయ్ రాయబారం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మారుతున్న పొత్తుల సమీకరణలుతమిళనాడులో టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ, పుదుచ్చేరిలో పొత్తులపై ఇంకా ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు. ఒకవేళ పుదుచ్చేరి ఉపఎన్నికలో టీవీకే, కాంగ్రెస్ చేతులు కలిపితే అధికార ఎన్డీఏ కూటమికి గట్టి పోటీ ఎదురవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, గత ఎన్నికల్లో టీవీకేతో కలిసి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన నేయం మక్కల్ కజగం పార్టీ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బుస్సీ ఆనంద్ను సంప్రదించడం ఈ సీటు చుట్టూ ఉన్న ఉత్కంఠను మరింత పెంచింది. -
పుదుచ్చేరిలో హస్తం హవా!
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈసారి కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) ప్రతిపక్ష హోదాకు పరిమితం కాక తప్పదని సర్వేలు అంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామికి భంగపాటు తప్పదని పేర్కొంటున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్-డీఎంకే 14, ఏఐఎన్ఆర్సీ 9, అన్నాడీఎంకే 2, ఇతరులు 2 సీట్లు దక్కించుకునే అవకాశముందని సీఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్-డీఎంకే 15-21, ఏఐఎన్ఆర్సీ 8-12, అన్నాడీఎంకే 1-4 సీట్లు దక్కించుకోనున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది. -
పుదుచ్చేరి పీఠం మళ్లీ రంగసామిదే!
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) మళ్లీ విజయం సాధిస్తుందని ఎన్నికలకు ముందు సర్వేలు చెప్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన ఎన్.రంగసామి 2011లో కాంగ్రెస్ను వీడి.. ఏఐఎన్ఆర్సీని స్థాపించారు. ఆ పార్టీ మూడు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకుంది. పుదుచ్చేరిలో బలమైన సామాజిక వర్గం వన్నియార్లకు చెందిన రంగసామి.. రాబోయే ఎన్నికల్లోనూ గెలిచి అధికారం నిలబెట్టుకుంటారని పరిశీలకులు చెప్తున్నారు. ఏఐఎన్ఆర్సీతో పొత్తు చర్చలు ఫలించకపోవటంతో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. డీఎంకే - కాంగ్రెస్ ద్వయం కలిసి పోటీ చేస్తున్నాయి. డీఎంకే - కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశాలున్నాయనీ ఒక సర్వే అంచనా వేస్తోంది. అన్నా డీఎంకే కూడా ఒంటరిగానే పోటీ చేస్తోంది. సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఆర్ఎస్పీలతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ (పీఎఫ్డబ్ల్యూ) అధికారపక్షానికి గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని యానాం, కేరళలోని కరైకల్, తమిళనాడులోని మాహె ప్రాంతాలు కూడా పుదుచ్చేరిలో భాగం. యానాంలో మల్లాడి కృష్ణారావు 1996 నుంచి ఐదు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలిచారు. 1996, 2001 సంవత్సరాల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన అనంతరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.


