breaking news
ramayam peta
-
బీమా డబ్బుల కోసం బామ్మర్ది హత్య!
భిక్కనూరు: రైతుబీమా డబ్బుల కోసం సొంత బామ్మర్దినే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శనివారం ఆగ్రహోదగ్రులయ్యారు. బావతో పాటు మరో ఇద్దరు నిందితుల ఇళ్లను ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన శేఖర్ (21) రామాయంపేట శివారులోని ఓ బావిలో శుక్రవారం శవమై కనిపించాడు. అతడి మృతికి బావ రాజశేఖరే కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు శనివారం గ్రామంలో ఆందోళనకు దిగారు. వారి ఇళ్లపై దాడి చేసి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆందోళన విరమించాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో వారు శాంతించారు. బీమా డబ్బుల కోసమే శేఖర్ను అతని బావ రాజశేఖర్, మరో ఇద్దరు కలసి హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కరువు కాటు..
యువరైతు ఆత్మహత్య ఏడు నెలల క్రితం భార్య.. కలిసిరాని సాగు.. పెరిగిన అప్పులే కారణం సుతారిపల్లిలో విషాదం రామాయంపేట: రైతు కుటుంబంలో మరో విషాదం. ఈసారి ఏకంగా రైతే ప్రాణాలు తీసుకున్నాడు. కరువు కారణంగా కలిసి రాని సాగు.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. ఇదిలావుంటే సరిగ్గా ఏడు నెలల క్రితమే ఇతని భార్య ఆత్మహత్య చేసుకుం ది. రైతు ఆత్మహత్య ఘటన మండలంలోని రాయిలాపూర్ పంచాయతీ పరిధిలోని సుతారిపల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రా మస్తుల కథనం ప్రకారం... సుతారిపల్లికి చెందిన రాగి పెద్దవాలోల్ల బాల య్య, పోచవ్వ దంపతులకు కొడుకు శ్రీకాంత్(28)తోపాటు ఇద్దరు కూతుర్లున్నారు. బాలయ్య మానసిక వికలాంగుడు. శ్రీకాంత్ వ్యవసాయంతోపాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అప్పులు చేసి ఓ సోదరి వివాహం చేశాడు. మరో సోదరి పెళ్లీడుకు వ చ్చింది. తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో గత ఏడాది మూడు బోర్లు తవ్వగా చుక్క నీరు రాలేదు. వేసిన మొక్కజొన్న సైతం ఎండిపోయింది. ప్రస్తుతం అతని భూమి బీడుగా ఉంది. రూ.5లక్షల వర కు అప్పుల పాలైన శ్రీకాంత్కు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. మరోవైపు 20 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గత మే నెల 2న పుట్టింటికి వెళ్లిన శ్రీకాంత్ భార్య లావణ్య అక్కడ ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటివారు శ్రీకాంత్తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు పెట్టా రు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నాడు. మంగళవారం గ్రామానికి వచ్చాడు. ఇంట్లో అందరుపడుకున్న తరువాత అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీతోనే తెలంగాణ అభివృద్ధి
రామాయంపేట,న్యూస్లైన్: మహానేత వైఎస్సార్ ఆశయ సాధనకోసం స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం ఆయన రామాయంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్పర్థి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ దక్కాయన్నారు. ఆ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ప్రతి రైతును లక్షాధికారి చేయాలనే లక్ష్యంతోనే రాజశేఖర్రెడ్డి పాలన సాగించారన్నారు. వైఎస్సార్ లాగే ఇచ్చిన మాటకు కట్టుబడటం వైఎస్ జగన్మోహన్రెడ్డి నైజమన్నారు. అందువల్లే వైఎస్సార్సీపీ తెలంగాణకోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించారని, పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అభివృద్ధికోసం కృషి చేస్తామన్నారు. అందువల్ల ఓటర్లంతా ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుధాకర్గౌడ్, పరుశురాంరెడ్డి, కిరణ్కుమార్, కార్తీక్, రామాయంపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ మాసుల సిద్దరాంలు పాల్గొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటాం పార్టీ అభివృద్ధికోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు మృతి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ప్రభుగౌడ్ అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మృతి చెందిన వైఎస్సార్ సీపీ జిల్లా సాంసృ్కతిక విభాగం కన్వీనర్ నింగరబోయిన మహేష్, గొల్పర్థి గ్రామానికి చెందిన నడీల రాజయ్యల కుటుంబీకులను గురువారం ఆయన పరామర్శించారు. ఢి.ధర్మారం గ్రామానికి చెందిన నింగరబోయిన మహేష్ గత 15 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గొల్పర్థి గ్రామానికి చెందిన న డీల రాజయ్య విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాడు. దీంతో గురువారం మృతుల కుటుంబీకులను పరామర్శించిన ప్రభుగౌడ్, పార్టీ అధ్యక్షునితో మాట్లాడి తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. రుద్రారంలో ఇంటింటి ప్రచారం మిరుదొడ్డి: జిల్లాలో ఎక్కడకు వెళ్లినా వైఎస్సార్సీపీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని వైఎస్సార్ సీపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ప్రభుగౌడ్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో దుబ్బాక నియోజక వర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రావణ్ కుమార్ గుప్తతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు రుద్రారం గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ, వైఎస్సార్ను అభిమానించే వారంతా వైఎస్సార్సీపీని ఆదరిస్తున్నారనీ, వారి ఆదరాభీమానాలతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం కలుగుతోందన్నారు. అనంతరం రోడ్డుప్రమాదంలో మృత్యువాతపడిన వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి శోభానాగిరెడ్డి ఆత్మ శాంతించాలని నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు హరి శంకర్, సురేష్, రఘుపతి, నర్సింలు, మహేష్, రాజేశం, జమీర్ పాల్గొన్నారు.