Ramanaa Reddy
-
తక్షణం ఎన్నికలు జరపాలి
శ్రీకాకుళం అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సి.చంద్రయ్య డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కూడలి వద్ద గల రెవెన్యూ అతిథి గృహంలో గురువారం ఎన్ఎంయూ నెక్ రీజియన్ అధ్యక్షుడు బీఎస్ రాములు అధ్యక్షతన రీజనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఎంప్లాయీస్ యూనియన్ గడువు ముగిసిందని, ఇంతవరకూ ఎన్నికలు నిర్వహించకపోవడం శోఛనీయమన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఏప్రిల్ 1, 2013 నుంచి రావాల్సిన జీతభత్యాలు తక్షణమే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.రమణారెడ్డి మాట్లాడుతూ యాజమాన్యం ఏకపక్షంగా ఎంప్లాయీస్ యూనియన్కు వత్తాసు పలుకుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ గౌరవ సభ్యులపై వేధింపులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కోపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఎన్ఎంయూ కాలంలో లాభాలతో నడిపించి కార్మికులకు త్వరితగతిన లోన్స్ వచ్చేలా కృషి చేశామన్నారు. అయితే ఈయూ గుర్తింపు సంఘంగా వచ్చిన తరువాత సొసైటీని నష్టాలలో నడిపిస్తూ కార్మికులకు లోన్లు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీవీవీ మోహన్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం ఎన్ఎంయూ కార్మికులపై జరుగుపుతున్న దమనకాండను ఖండిస్తున్నామన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పులు, ఆస్తులను ఆంధ్రా, తెలంగాణాలకు 58:42 నిష్పత్తిలో పంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్ఎంయూ నాయకులు ఎస్.సిమ్మయ్య, ఎంవీఆర్ మూర్తి, జోనల్ చైర్మన్ వి.ప్రదీప్కుమార్, కేవీఆర్ నర్సింగరావు, శ్రీకాకుళం, విజయనగరం కార్మికులు పాల్గొన్నారు. -
తండ్రి ఎదుటే.. ప్రాణాలు విడిచిన కొడుకు
ఆటోను ఢీకొన్న పొక్లెయిన్ బాలుని మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు దర్శి : ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పొక్లెయిన్ ఢీకొనడంతో 12 ఏళ్ల బాలుడు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వెంకటాచలం పల్లె సమీపంలోని నడింపల్లి అడ్డ రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని తుమ్మెదలపాడు గ్రామానికి చెందిన నలదిమ్ము రమణారెడ్డి(12) శివదీక్ష తీసుకున్నాడు. ఇరుముడి కట్టుకుని సోమవారం శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. బంధువులను ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టి శ్రీశైలం వెళ్లాలనుకున్నాడు. తండ్రి వెంకటేశ్వర్లుతో కలిసి సరుకుల కోసం దర్శి వెళ్లాడు. సరుకులు తీసుకుని ఆటోలో తండ్రీకొడుకులు స్వగ్రామం బయల్దేరారు. నడింపల్లి అడ్డరోడ్డు వద్దకు రాగానే ఓ పొక్లెయిన్ వచ్చి ఆటోను బలంగా ఢీకొని బోల్తా కొట్టింది. పొక్లెయిన్ డ్రైవర్ అక్కడి నుంచి దూకి పరారయ్యాడు. ఆటోలో డ్రైవర్ పక్కన కుడివైపు రమణారెడ్డి, ఎడమ వైపు తండ్రి వెంకటేశ్వరరెడ్డి కుర్చొన్నారు. పొక్లెయిన్ కుడి వైపున బలంగా ఢీకొనడంతో రమణారెడ్డి అక్కడికక్కడే తండ్రి కళ్ల ముందే కన్నుమూశాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు ఆవుల వెంకటనారాయణరెడ్డి, బూసిరెడ్డి సత్యనారాయణరెడ్డిలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని చూసిన తల్లి రమణమ్మ, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మృతుని సోదరుడు వెంకట కృష్ణారెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. భగవంతుడా ఎందుకు అన్యాయం చేశావన్నారు. పోలీసులు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముంగిలి
భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి. మన వాతావరణంలో విడి పదార్థంగా హైడ్రోజన్ అణువులు మిగిలేవుంటే బహుశా ఇప్పుడు కూడా అలాగే జరిగుండేదో ఏమో! కానీ భూగోళం మీద ఇప్పట్లో దొరుకుతున్నది కేవలం ఇతర పదార్థాలతో సంయోగంలో ఉన్న హైడ్రోజన్ మాత్రమే. మన అదృష్టం కొద్దీ అది విడిపదార్థంగా మన వాతావరణంలో మిగల్లేదు. ‘అదృష్టం’ అని ఎందుకు అనుకోవాలంటే - రసాయనిక ప్రక్రియలో సాటిలేని చురుకుదనముండే ఆ ధాతువు మూలంగా విడుదలయ్యే వేడినిగానీ, వెలుతురునుగానీ భరించడం మనకు సాధ్యపడదు గనక. హైడ్రోజన్ విడిపదార్థంగా మిగిలుండేది సూర్యుడూ నక్షత్రాలవంటి మండుతున్న గోళాల్లో మాత్రమే. ఇన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న మనకు సూర్యుడినుండి ప్రసరించే వేడిగానీ వెలుతురుగానీ హైడ్రోజన్ అణువుల విచ్ఛిత్తి మూలంగా ఏర్పడుతున్నదేనని తెలుసుకున్నప్పుడుగానీ దాని తీవ్రత ఏమోతాదులో ఉంటుందో అంచనా దొరకదు. మొదట్లో, ఆవిరి రూపంలో ఉన్న నీరు ద్రవంగా మారేందుకు కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సూర్యునికి ఎడంగా జరుగుతున్న భూమికి వేడి మందగించి, వేగం మందగించి, సానుకూల వాతావరణం ఏర్పడేవరకు అది ఆవిరిగానే ఉండిపోయింది. బుధ, శుక్ర గ్రహాలు సూర్యుని చుట్టూ ఇప్పుడు తిరుగుతున్న వేగంతో పోలిస్తే భూమి తన వేగాన్ని ఏ మోతాదులో కోల్పోయిందో మనకు అవగాహన కలుగుతుంది. సూర్యుణ్ణి బుధగ్రహం 88 రోజుల్లోనూ, శుక్రగ్రహం 225 రోజుల్లోనూ ఒక చుట్టు తిరిగొస్తుండగా భూమికి 366 రోజులు పడుతూ వుంది. చురుకుదనం తగ్గిన భూమి వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడంతో నీటియావిరి అప్పుడప్పుడు ద్రవరూపం తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ద్రవంగా మారిన తరువాత నీరు భూమిమీద రాలేందుకు ప్రయత్నించిందేగానీ, మాడుతున్న పెనంలా సెగలను ఎగజిమ్మే ఉపరితలాన్ని తాకక ముందే అది తిరిగి ఆవిరిగా మారిపోయేది. ఇలా కురవడం ఆవిరి కావడం పదేపదే జరుగుతూబోయిన క్రమంలో భూమి ఉపరితలం మరింత తొందరగా చల్లబడడానికి దోహదం కలిగింది. అలా కోట్లాది సంవత్సరాల ప్రయత్నంతో ఎట్టకేలకు భూమిని బుజ్జగించుకొని నీరు వర్షంగా కురవడం మొదలెట్టింది. ఇదంతా 450 కోట్ల సంవత్సరాలకు ముందుమాట. చదువుతూంటే, ‘అనుకునేందుకే దుర్లభంగా తోచే ఈ దూరాలూ, కొలతలూ, పరిమాణాలూ, పరిణామాలూ ఇంత కచ్చితంగా చెప్పేందుకు ఎలా కుదిరింది?’ అనే సందేహం తలెత్తడం సహజం. ఆ విధానాలు వివరిస్తూ పోతే ఇందులో ఉద్దేశించిన పాఠానికి మనంగూడా కోటిమైళ్ళు దూరంగా వెళ్ళిపోతాం. టూకీగా చెప్పాలంటే- ఎడతెరపి లేకుండా జరిగిన పరిశీలన, అంకితభావంతో జరిపిన పరిశోధన, టెలిస్కోపు స్పెక్ట్రామీటర్ వంటి పరికరాల అందుబాటు, భౌతిక రసాయనిక గణిత శాస్త్రాల ముందంజ, కొత్త కొత్త సాంకేతిక పరికరాల సహకారం ఫలితంగా ఈ సమాచార సేకరణ సాధ్యపడింది. సెకండులో నూరోవంతుకు సమానమైనంత నిశితంగా కొలతలూ తూకాలూ తెలుసుగనకనే ఈనాడు మానవుడు అంతరిక్షంలో విహరిస్తున్నాడూ, చంద్రుని మీద పాదం మోపగలుగుతున్నాడు. ఇంతదాకా అనుకున్న విషయాలు వాస్తవాలని నమ్మేందుకు ఇంతకు మించిన దృష్టాంతం అవసరం లేదనుకుంటా. భూమి వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల ఫలితంగా తయారైంది కేవలం నీరు మాత్రమే కాదు; కాసింత ముందూ వెనుకగా లెక్కలేనన్ని ఇతర పదార్థాలు ఆవిష్కృతమయ్యాయి. నష్టమైనవి కాగా, మిగతావన్నీ ఇప్పుడుగూడా మనకు అందుబాటులో ఉన్నాయి. పంచభూతాల కలయికతో ఈ చరాచర జగత్తు ఏర్పడిందని మన ముందుతరాలవారి నమ్మకం. ‘పంచభూతాలు’ అంటే గాలి, నీరు, నిప్పు, మన్ను, మిన్ను. స్థూలదృష్టికి అలాగే కనిపించినా, వేరువేరు అణువుల సంయోగంతో పదార్థాలు ఏర్పడతాయని ఆ తరువాత గానీ తెలిసిరాలేదు. ఏదైనా పదార్థాన్ని ముక్కలు ముక్కలుగా విభజిస్తూపోతే, చివరకు విభజించేందుకు ఇక ఏమాత్రం వీలుపడనంత సూక్ష్మాతి సూక్ష్మమైన ముక్కను ‘అణువు’ అంటారు. 18వ శతాబ్దం వాడైన జాన్ డాల్టన్ అనే రసాయనిక శాస్త్రజ్ఞుని పరిశోధనల ఫలితంగా అణుసిద్ధాంతం స్థిరపడింది. ఈ రంగంలో ఆ తరువాత చెప్పుకోవలసినవాడు మెండెలీవ్ అనే రష్యన్ శాస్త్రజ్ఞుడు. అతడు అణువుల నిర్మాణం ఆధారంగా మూలకాల (ఎలిమెంట్స్) జాబితాను తయారుజేశాడు. ప్రపంచంలో ఏ పదార్థం తీసుకున్నా ఈ మూలకాల వేరువేరు తరహా సంయోగాల వల్ల ఏర్పడినదే తప్ప మరొకటి కనిపించదు. మెండలీవ్ కాలానికి గుర్తించిన మూలకాల సంఖ్య 73 మాత్రమే. ఆ తరువాత ఇంకా ఇంకా మూలకాలు వెలుగులోకొచ్చి, ప్రస్తుతానికి 118 దగ్గర ఆ సంఖ్య నిలబడి వుంది. మెండలీవ్ తయారుజేసిన జాబితాకు పునాది అణుసంఖ్య. అదేమిటో తెలియాలంటే అణునిర్మాణం గురించి మనకు కొద్దిగా తెలిసుండాలి. ప్రతి అణువుకూ ఒక న్యూక్లియస్ (కేంద్రం) ఉంటుంది. ఆ కేంద్రంలోని రేణువు ‘ప్రొటాన్’. ఆ ప్రొటాన్ చుట్టూ కొద్ది ఖాలీజాగా తరువాత ‘ఎలెక్ట్రాన్’ అనే మరో రేణువు వృత్తాకార పరిధిలో పరిభ్రమిస్తూ ఉంటుంది. కరెంటు భాషలో చెప్పాలంటే ప్రొటాన్ ధనధ్రువం, ఎలక్ట్రాన్ రుణధ్రువం. ఏ కొంచెం ఏమారినా రుణధ్రువాన్ని ధనధ్రువం తనలోకి లాక్కుని మింగేస్తుంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకునేందుకు, సూర్యునిచుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, ధనధ్రువం చుట్టూ రుణధ్రువం విపరీతమైన వేగంతో తిరుగుతూ ఉంటుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
అయ్యప్ప పాటల వేడుక
అయ్యప్ప మహిమల నేపథ్యంలో సాగే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘శ్రీమణికంఠ మహిమలు’. బి.వి.రమణారెడ్డి, సుమన్, భానుచందర్, కవిత, జొన్నలగడ్డ శివ, సాయి మణికంఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వి.సాగర్ దర్శకుడు. బి.వి.అరుణారెడ్డి, సాయిమణికంఠరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లక్ష్మీ వినాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా శనివారం హైదరాబాద్లో విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్న బి.వి.రమణారెడ్డి ఈ చిత్రానికి కథ, మాటలు కూర్చడమే కాక, కీలకపాత్ర పోషించడం అభినందనీయమని నాయిని అన్నారు. అయ్యప్ప అనుగ్రహం వల్లే ఈ చిత్రాన్ని నిర్మించగలిగామని బి.వి.రమణారెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వ అవకాశం రావడం పట్ల సాగర్ సంతోషం వెలిబుచ్చారు. -
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...
స్కూల్లో చదువుకునే రోజుల్లో రేడియో పుణ్యమా అని ‘‘అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే...’’ పాట చెవిన పడింది. తెగ నచ్చింది. కారణం... బరువైన భావాలు ఏమీ లేకుండా మామూలు మాటల్లో సంభాషణగా సాగడం. రాసింది కొసరాజుగారు. ఆ పాట నాకు బాగా నచ్చిందన్న విషయం గ్రహించి మా అమ్మగారు ఒక క్యాసెట్లో రికార్డ చేయించి ఇంట్లో పెట్టారు. అప్పటినుంచి టేప్ రికార్డర్లో పెట్టుకుని చాలాసార్లు వినేవాడిని. వినేకొద్దీ కొత్త కొత్త అర్థాలు తెలిసేవి. తర్వాత చాలాకాలానికి ‘కులగోత్రాలు (1962)’ టీవీలో వస్తే ఆ పాట కోసమే చూశాను. ఇంకా నచ్చింది. పేకాటలో డబ్బు పోగొట్టుకున్న రమణారెడ్డిని రేలంగి ఓదారుస్తూ, ధైర్యం చెబుతూ మళ్లీ ముగ్గులోకి దింపే క్రమం ఈ పాటలోని సారాంశం. అయ్యయ్యో చేతిలో డబ్బులుపోయెనే/ అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే/ఉన్నది కాస్తా ఊడింది... సర్వమంగళం పాడింది. పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమైపోయింది... అని నెత్తిమీద చెంగేసుకుని ఏడుస్తూ కూర్చుంటాడు రమణారెడ్డి. రేలంగి ప్రవేశించి ‘ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ/ ఓటమి తప్పలేదు భాయీ...’ అంటాడు. సాధారణంగా జూదం అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పాండవులు, శకుని. ‘ఆ మహామహా మన ధర్మరాజుకే తప్పలేదు భాయీ...’ అని రాయొచ్చు. కానీ కొసరాజుగారు నలమహారాజును ఉపమానంగా చెప్పారు. ఎందుకు చెప్పారో చాలాకాలం తెలియలేదు. ఆలోచించగా, ఆలోచించగా ఒక ఔచిత్యం ఉందనిపించింది. నలమహారాజు గుణగణాల్లో పాండవులందరూ కనిపిస్తారు. ధర్మరాజులాగ జూదమాడడం, భీముడిలాగ వంటచేయగలగడం, అర్జునుడి మాదిరిగా వివాహానికి స్వయంవరం కావడం, నకులుడిలాగ అశ్వాలను వేగంగా పరుగెత్తించగలగడం, సహదేవుడిలాగ కత్తియుద్ధంలో నిపుణుడు కావడం... వెరసి పాండవులంతా నలుడిలో కనిపిస్తారు. జూదం ఆడింది ధర్మరాజు అయినా నష్టపోయి కష్టాల పాలైంది మాత్రం పాండవులు ఐదుగురూనూ... అందుకే నలమహారాజును పంచపాండవుల ప్రతీకగా కొసరాజుగారు ప్రయోగించారేమో అనిపిస్తుంటుంది నాకు. అడగడానికి ఆయనలేరు, అనుకోవడమే తప్ప! సరే, ‘నలమహారాజుకే ఓటమి తప్పలేదు, నువ్వెంత?’ అనే అర్థంలో రేలంగి అనగానే... రమణారెడ్డి ‘మరి నువు చెప్పలేదు భాయీ’ అంటాడు. వెంటనే రేలంగి అది నా తప్పుగాదు భాయీ/ తెలివితక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ/ బాబూ నిబ్బరించవోయీ... అంటాడు. నిజమే! జూదమాడే వాడిని ప్రత్యర్థి ఎందుకు హెచ్చరిస్తాడు? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే... అనే సామెత కూడా అలా వచ్చిందే. ఇక డబ్బు పోయాక చేసేదేమీ లేకపోతే పుట్టేది వేదాంతమే. ‘నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది/ ఎంతో పుణ్యం దక్కేది’ అంటూ నిట్టూరుస్తున్న రమణారెడ్డికి వంతపాడుతూ ‘చక్కెర పొంగలి చిక్కేది’ అంటాడు పక్కనున్నతను. ఇది కొసరాజు గారి మార్కు. చిన్న కౌంటరుతో వినేవాళ్లకి నవ్వులు తెప్పించడం వీరి పాటల్లో సర్వసాధారణం. జూదంలో డబ్బు పోగొట్టుకున్నవాళ్ళు ‘మా ఆవిడకి ఇచ్చినా బాగుండేది. నెక్లెస్ కొనుక్కునేది’, ‘తిరుపతి హుండీలో వేసినా బాగుండేది పుణ్యం దక్కేది’ అనుకోవడం సర్వసాధారాణం. కొంతమంది బాధలో ఇంకాస్త అతిశయోక్తికి పోతారు. అందుకే కొసరాజుగారు ఇలా అనిపించారు. ‘ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఏ. దక్కేది’ అనగానే, రేలంగి ‘మనకు అంతటి లక్కేది’ అని రమణారెడ్డిని వాస్తవికలోకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ఏడుపుల పర్వం అవగానే జూదరులు జూదం మానేస్తారనుకోవడం పొరపాటు. పోగొట్టుకున్నచోటే ఏరుకోవాలి అనేది వీళ్ళ ఫార్ములా. అందుకే రేలంగి, రమణారెడ్డిల మధ్య సంభాషణ ఇలా రాశారు కొసరాజు గారు. ఈ చరణంలో రమణారెడ్డికి బ్రెయిన్వాష్ చేయడానికి రేలంగి మిత్రులు కూడా చేరతారు. రేలంగి: గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు రేలంగి మిత్రులు: మళ్ళీ ఆడి గెల్వవచ్చు రేలంగి: ఇంకా పెట్టుబడెవడిచ్చు రేలంగి మిత్రులు: ఇల్లు కుదవ చేర్చవచ్చు రేలంగి: ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు రమణారెడ్డి: పోతే... రేలంగి: అనుభవమ్ము వచ్చు రమణారెడ్డి: చివరకు జోలె కట్టవచ్చు అంటూ మళ్ళీ తనదైన క్లోజింగ్ పంచ్తో ముగించారు కవిగారు. ఎంతపోయినా అనుభవం వస్తుందిలే అనుకుని సరిపెట్టుకోవడం జూదవ్యామోహానికి పరాకాష్ఠ. అలా సరిపెట్టుకునేవాడికి ఎవడు మాత్రం ఏం చెప్పగలడు?! నలమహారాజు నుంచి నేటి తాజా జూదరుల వరకు ఎటువంటి మార్పూ రాలేదు. నా మిత్రులు కొందరు క్యాసినోలాడుతూ ఉంటారు. వారిది ఇదే వరుస. పోయిందన్న బాధ పూట కూడా ఉండదు. అప్పు చేసైనా, క్రెడిట్ కార్డు గీకి అయినా రెడీ అయిపోతారు. ఎంత పోగొట్టుకుంటే అంత కసి పెరిగిపోతుందన్నమాట. కొందరైతే ‘‘దేవుడా! ‘కష్టపడి...’ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు ఎంతిస్తావో 10 శాతం నీ హుండీలో వేస్తాను’’ అని ఇష్టదైవంతో బేరాలు చేస్తుంటారు కూడా. వాళ్ళ ‘కష్టాన్ని...’ భగవంతుడు గుర్తించుగాక! జూదరుల మనస్తత్వానికి అద్దం పట్టే ఈ పాట ఎవర్గ్రీన్. పిఠాపురం, మాధవపెద్ది, రాఘవుల గళాలు, సాలూరి రాజేశ్వరరావుగారి స్వరాలు ఈ పాటకు వరాలు. - సంభాషణ: నాగేశ్