breaking news
Ramadan celebration
-
హైదరాబాద్ : చార్మినార్కు రంజాన్ శోభ (ఫొటోలు)
-
రంజాన్ : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక ప్రార్థనలు (ఫొటోలు)
-
రంజాన్ స్పెషల్ : విద్యుత్ కాంతులతో జిగేల్మంటున్న చార్మినార్ (ఫొటోలు)
-
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ‘ఈద్ ముబారక్’ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా సీఎం జగన్..‘దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దానధర్మాలు, చెడును త్యజించడం, సాటి మానవులకు సేవ, వంటి సత్కార్యాల ద్వారా అల్లాహ్ స్మరణలో తరించే ఈ రంజాన్, రాష్ట్ర ప్రజలకు సుఖసంతోషాలు కలిగించాలి. మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ.. సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. -
విజయవాడ : రంజాన్ ఘుమఘుమలు (ఫొటోలు)
-
సారీ.. హలీమ్
హలీమ్.. ఈ పేరు వినగానే జిహ్వ జివ్వుమంటుంది. నోరు రసార్ణవమవుతుంది. లాగిస్తుంటే మరింత లాగించాలనిపిస్తుంది. రుచుల సంగమానికి చిరునామా ఇది. మధుర పదార్థాల మేళవింపు ఇది. బలవర్ధక, పోషకాల పోహళింపు ఇది. కులమతాలకు అతీతంగా ఆనందంగా ఆరగించే అరుదైన వంటకం ఇది. హైదరాబాద్ హలీమ్ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. సినీ తారల నుంచి సామాన్యుల దాకా.. క్రికెట్ స్టార్ల నుంచి గల్లీ ఆటగాళ్ల దాకా.. అమాత్యుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ల దాకా.. ఎంపీలు.. ఎమ్మెల్యేల నుంచి కార్పొరేటర్ల దాకా.. ఇలా ఒకరేమిటి ఎందరో.. ఎందరెందరో హలీమ్ ప్రియులే. కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్ను ఆనందంగా ఆరగిస్తూ సరదాగా గడుపుతారు. ఇది ఒకవైపు.. మరోవైపు ప్రస్తుతం కరోనా మహమ్మారి నగరాన్ని వణికిస్తోంది. హలీమ్ ఘుమఘుమల మధురిమలకు లాక్డౌన్ చెక్ పెట్టింది. విందుకు, బహు పసందుకు ఈసారి నోచుకోని పరిస్థితి నెలకొంది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని చెప్పడంతో హలీమ్ తయారీదారులు వెనుకడుగు వేశారు. ఇది వేలాదిమంది ఉపాధిపై ప్రభావం చూపనుంది. కోట్లాది రూపాయల వ్యాపారం కుదేల్ కానుంది. చార్మినార్: హలీమ్ పర్షియా వంటకం. కుతుబ్షాహిల కాలంలో మనకు పరిచయమైందీ వంటకం. ప్రస్తుతం ఇరానీయులు సైతం పాతబస్తీ హలీమ్ కోసం ఆరాటపడుతుంటారు. నగరంలోని పలువురు సినీ నటులు, క్రికెట్ స్టార్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లు తమ కుటుంబ సభ్యులతో రాత్రిపూట పాతబస్తీకి వచ్చి హలీమ్ తినేందుకు వస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న హైదరాబాద్ హలీమ్పై కోవిడ్–19 ప్రభావం పడింది. రంజాన్ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్ విందులు తదితర కార్యక్రమాలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేయడంతో హలీమ్ తయారీ నిలిపివేయాలని నిర్వాహకులు భావించారు. ప్రస్తుతం నగరంలో హలీమ్ తయారీ నిలిచిపోతుండటంతో ఇక దేశంలోని ఢిల్లీ, కలకత్తా, ముంబై, పుణె, బెంగళూర్, త్రివేండ్రం, కోయంబత్తూర్, చెన్నై, విజయవాడ తదితర నగరాలకు ఈసారి పాతబస్తీ నుంచి హలీమ్ సరఫరా ఉండదు. ప్రతి రంజాన్ మాసంలో దేశంలోని అన్ని మెట్రో నగరాలకు పాతబస్తీ నుంచి హలీమ్ ఎగుమతి అవుతుంది. అయితే ఈసారి ఈ నగరాలకు కూడా హైదరాబాద్ హలీమ్ అందుబాటులో ఉండదు. అంతేగాకుండా స్విగ్గీ, జోమాటో తదితర ఆన్లైన్ డెలివరీలు కూడా ఉండవు. కార్మికుల జీవనోపాధిపై ఎఫెక్ట్ కోట్లాది రూపాయల వ్యాపారం దెబ్బతింటోంది. లక్షలాది మంది జీవనోపాధి కోల్పోనున్నారు. దీని ప్రభావం అన్ని అనుబంధ వ్యాపారాలపై పడనుంది. నెలరోజుల పాటు జంటనగరాల్లోని దాదాపు 4 వేల హోటల్స్లలో ఈ హలీమ్ తయారీ నిలిచిపోనుంది. రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు మరో తాత్కాలిక ఉద్యోగాలను నిర్వహించే మరో లక్ష మందికి జీవనోపాధి కష్టకాలంగా మారనుంది. రంజాన్ మాసంలో తమ మేకపోతులు, మేకలకు మరింత డిమాండ్ ఉంటుందని తెలంగాణ జిల్లాలోని రైతులు ఆశపడుతుంటారు. హలీమ్ తయారీలో పొట్టేలు, మేక మాసం ఎక్కువగా వినియోగిస్తుండటంతో రంజాన్ మాసంలోని నెల రోజుల పాటు వీటికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. హలీమ్ మేకర్స్ తమకు కావాల్సిన మాంసాన్ని స్లాటర్ హౌజ్ల నుంచి ఖరీదు చేసి హలీమ్ తయారు చేస్తుంటారు. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు రంజాన్ మాసంలో రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలు సాయంత్రం ఇఫ్తార్లో హలీమ్ను తింటారు. పోషక విలువలు అధికంగా ఉండే హలీమ్ తినడం ద్వారా శరీరంలో కేలరీలు పెరిగి వెంటనే శక్తి వస్తుంది. హలీమ్ తిన్న అనంతరమే బిర్యానీ, ఇతర పిండివంటలను ఆరగిస్తారు. దీంతో రంజాన్ మాసంలో హలీమ్కు ఎంతో గిరాకీ. పిస్తాహౌజ్ తయారు చేసే ప్రత్యేక హలీమ్ రుచి చూసేందుకు ముస్లింలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేది. ప్రస్తుతం అమెరికా, దుబాయ్లలో పిస్తాహౌజ్ హోటల్స్ ఏర్పాటు చేసి అక్కడే హలీమ్ తయారు చేసి విక్రయిస్తున్నారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన స్వచ్ఛమైన నేతి, పొట్టేలు మాంసంతో హలీమ్ తయారవుతుంది. హలీమ్ తిని.. ఇఫ్తార్ ముగింపు ఉపవాస దీక్షల అనంతరం నిర్వహించే ఇఫ్తార్ విందులో నోరూరించే రంజాన్ వంటకాలను ఇష్టంగా తింటారు. పిండి వంటలు, శాఖాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు. కర్జూరంతో ఉపవాస దీక్షలను వదిలి అన్ని రకాల పళ్లను తీసుకుంటారు. అనంతరం హలీమ్ను ఆరగిస్తారు. హలీమ్ తినందే.. ఇఫ్తార్ విందును ముగించరు. అందుకే హలీమ్కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గతేడాది పిస్తాహౌజ్ హలీమ్లో బ్లాక్రైస్ వినియోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. యాంటి ఆక్సిడెంట్గా పనిచేసే బ్లాక్రైస్ను మొదటిసారి పిస్తాహౌజ్ యజమాన్యం 2019లో రంజాన్ మాసం సందర్భంగా హలీమ్లో వినియోగించారు. రోజంతా కఠోర ఉపవాస దీక్షలు చేసే ముస్లింలకు బ్లాక్రైస్తో తయారు చేసిన హలీమ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా మారిందని పిస్తాహౌజ్ మేనేజింగ్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ మాజిద్ తెలిపారు. ఇదీ స్పెషల్ ♦ గత 40 ఏళ్లలో హలీమ్ తయారు చేయకపోవడం ఇదే తొలిసారి ♦ ఈ వంటకాన్ని వండేవారు సుమారు 6వేల మందికిపైగా.. ♦ యూఎస్, యూరప్, గల్ఫ్ తదితర దేశాలకు యేటా ఎగుమతి ♦ దాదాపు రూ.600 కోట్ల నుంచి రూ.800 కోట్ల దాకా వ్యాపారం ♦ రంజాన్ సీజన్లో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు ♦ సిటీలో హలీమ్ ధర రూ.140– రూ.170 కొన్నిచోట్ల రూ.200పైనే ♦ జంట నగరాల్లో దాదాపు 4 వేల హోటళ్లలో నిలిపివేత ♦ నిర్ణయం తీసుకున్న సుమారు 22 హోటళ్ల యజమానులు ♦ 21 వస్తువులతో హలీమ్ తయారీ.. ఇలాచీ, దాల్చిని చెక్క, లవంగం, సాజీరా, జీలకర్ర, మిరియాలు, గోధుమ రవ్వ, బాస్మతి బియ్యం, ఉప్పు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి, నెయ్యి, గులాబ్ పువ్వు, పెసరపప్పు, మినుములు, కందిపప్పు, బాదం, కాజు, వేయించిన ఉల్లిగడ్డ, కొత్తమీర తదితర 21 వస్తువులతో ఈ హలీమ్ను తయారు చేస్తారు. ఔషధ గుణాలు కలిగిన ఈ ముడిసరుకులను ఎక్కువగా కేరళ రాష్ట్రంతో పాటు ముంబై, ఢిల్లీ నగరాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ముఖ్యంగా నాణ్యమైన షాజిరాను ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి తెప్పించుకుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19 వైరస్ ప్రభావం కొనసాగుతుండటంతో హలీమ్ తయారీకి వినియోగించే ఈ 21 రకాల స్పైసీస్ సకాలంలో అందుబాటులో ఉండవని హలీమ్ మేకర్స్ ఉంటున్నారు. దిగుమతుల్లో చాలా ఆంక్షలు ఉండబోతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు మసాల దినుసులు అందుబాటులో ఉండవని వ్యాపారస్తులు భావిస్తున్నారు. గోధుమలతో పాటు పొట్టేలు మాంసాన్ని డేక్చా నీటిలో ఉడక బెట్టి.. ప్రత్యేకంగా తయారు చేసిన పొడవాటి కర్రలతో గిలక్కొడతారు. గంటల తరబడి గోధుమలు, మాంసాన్ని మెత్తగా చేసిన అనంతరం మసాల దినుసులను వేసి గిలక్కొడతారు. ఇలా తయారైన మిశ్రమంలో నెయ్యి, కొత్తిమీర, వేయించిన ఉల్లిగడ్డలు వేసి వేడివేడిగా తయారు చేస్తారు. తక్షణ శక్తి ఇచ్చే డ్రైఫ్రూట్స్, ఫలాలు రోజంతా కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించే ముస్లింలు రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తారు. ఉపవాస దీక్షల అనంతరం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందులో తక్షణం శక్తినిచ్చే కర్జూరం, అంజీర్, కిస్మిస్, వాల్నట్, ఆక్రోట్, బాదం తదితర డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో ఐరన్, కాల్షియం అధికంగా ఉండటమే కారుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయంటున్నారు. తెల్లవారు జామున సహార్లో కోకోనట్ వాటర్లో బనానా మిక్స్ చేసుకుని తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ను మెయింటన్ చేస్తాయంటున్నారు. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం తదితర పూర్తిస్థాయి మినరల్స్ ఉంటాయంటున్నారు. ఇక సి విటమిన్ కోసం మోసంబీ, సంత్రా, ఉసిరి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సి విటమిన్ ఎంతో అవసరం అంటున్నారు. సోషల్ డిస్టెన్స్..ముడిసరుకు కొరత.. సామాజిక దూరం, హలీమ్ తయారీ ముడిసరుకు కొరత తదితర కారణాలతో హలీమ్ తయారు చేసేందుకు హలీమ్ మేకర్స్ నిరాకరిస్తున్నారు. ప్రజల రక్షణ ముఖ్యమని, హలీమ్ ఖరీదు చేయడం కోసం ప్రజలు గుంపులుగా ఎగబడటం సామాజిక దూరం పాటించకపోవడం తదితర సమస్యలు తలెత్తుతాయని.. అందుకే ఈ ఏడాది హలీమ్ వంటకాలకు దూరంగా ఉంటున్నామని ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అబ్దుల్ మాజిద్, జంట నగరాల హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జాఫర్ అజీజ్ల అధ్యక్షతన సోమవారం రాత్రి పాతబస్తీలో అత్యవసర సమావేశం జరిగింది. సమావేశంలో జంటనగరాలకు చెందిన మేజర్ 22 హోటల్స్ యజమానులు, నిర్వాహకులు పాల్గొని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచేవి తీసుకోవాలి.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే పౌష్టికాహారంతో పాటు తక్షణం శక్తినిచ్చే పండ్లు, ఫలాలు, డ్రైఫ్రూట్స్ విరివిగా తీసుకోవాలి. పొద్దంతా ఉపవాస దీక్షలో ఉండే వారి శరీరంలో ఎలక్ట్రోలైట్స్ మెయింటనెన్స్ ఎంతో అవసరం. శరీరానికి అవసరమైన మినరల్స్ ఉండే పండ్లు, ఫలాలు ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి. హలీం తినకపోయినా.. పర్వాలేదు.. కానీ పండ్లు, ఫలాలు అధిక మొత్తంలో తీసుకోవాలి. శరీరానికి సమతుల్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ఉపవాస దీక్షలోని ప్రజలు ప్రయత్నించాలి. – డాక్టర్ సురేందర్శర్మ, ఆయుర్వేద వైద్య నిపుణులు రంజాన్ హలీం అంటే ఎంతో ఇష్టం.. హలీం అంటే ఎంతో ఇష్టం. రంజాన్ మాసంలో తయారయ్యే హలీం అంటే మహా ఇష్టం. ఏడాదికోసారి రంజాన్ మాసంలోనే హలీం తింటాం. రంజాన్ మాసంలోని హలీంకు అంత ప్రత్యేకత ఉంటుంది. రోజంతా ఉపవాస దీక్షలు చేసిన అనంతరం సాయంత్రం ఇప్తార్ విందులో హలీం తింటాం. ఇంట్లోనే కాకుండా శాలిబండలోని ఫిస్తాహౌజ్ వద్ద హలీం ఖరీదు చేసి తినడం ఎంతో బాగుంటుంది. ఒక్కోసారి రెండు, మూడు ప్లేట్లు తిన్న సందర్భాలున్నాయి. ఈసారి హలీం లేదంటే బాధగా ఉంది. వీధుల్లో కాలక్షేపం చేస్తూ హలీం తినడం అలవాటుగా మారింది – మహ్మద్ ఇస్మాయిల్, ఖాజీపురా వ్యాపారం కాదు.. ప్రాణాలు ముఖ్యం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతోంది. ఒకవైపు మే 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుండగానే.. ఏప్రిల్ చివరి వారం నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం కూడా ప్రజలు సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. హలీమ్ అందుబాటులో ఉంటే వినియోగదారులు సోషల్ డిస్టెన్స్ పాటించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.అందుకే ఈసారి హలీమ్ తయారీని నిలిపేస్తున్నాం – మహ్మద్ అబ్దుల్ మాజీద్,హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఇళ్లల్లోనే ప్రార్థనలు
మాపట్ల వివక్ష లేకుండా చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్లో ఉన్నా సమర్థవంతంగా విపత్తును ఎదుర్కొంటోంది. ముందుచూపుతో ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ విపత్తును ఎదుర్కోవడానికి బాగా పనికి వచ్చింది. వారి సేవలు అమూల్యమైనవి. ఇవాళ వలంటీర్ల వ్యవస్థ లేకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. – సీఎం వైఎస్ జగన్తో ముస్లిం పెద్దలు ప్రస్తుత పరిస్థితిలో ఈ రంజాన్ మాసంలో అందరూ సహకరించాలని, ఇళ్లలోనే ప్రార్థనలు చేయాలని సూచించాలని అభ్యర్థిస్తున్నాను. ఇది మనసుకు కష్టమైన మాటే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో కోరుతున్నా. దయచేసి అందరూ సహకరించాలి. – సీఎం ప్రభుత్వ మార్గదర్శకాలు, వైద్యుల సూచనలు తప్పకుండా పాటిస్తున్నాం. ఎవరూ కూడా వీటిని ఉల్లంఘించకుండా చూసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రంజాన్ సమయంలో ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునేలా చూస్తాం. – సీఎం వైఎస్ జగన్తో ముస్లిం పెద్దలు సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించడంతో పాటు ఎక్కువ మంది ఒకే చోట చేరడం హానికరమైన పరిస్థితుల్లో రంజాన్ ప్రార్థనలను ఇళ్లల్లోనే చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లిం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ముస్లిం పెద్దలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఏం చెప్పారంటే.. ఇప్పుడేం జరుగుతోందో మీకు తెలుసు ► పవిత్ర రంజాన్ మాసం మరో ఐదు రోజుల్లో మొదలవుతుందనే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ రంజాన్ మాసంలో మామూలుగా ఐదుసార్లు మనమంతా నమాజ్కు పోతాం. రాత్రి పూట కూడా అందరూ ఒక చోట ఏకమై తరావీహ్ నమాజ్ చేస్తాం. ► ఈ పవిత్ర రంజాన్ మాసంలోనే దాన ధర్మాలు ఇంకా ఎక్కువగా చేస్తాం. అయితే ప్రస్తుతం ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతోందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ను అధిగమించేందుకు కొద్ది రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ► ఈ నేపథ్యంలో ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలను ఇళ్లలోనే జరుపుకున్నాం. ఇప్పుడు రంజాన్ రాబోతోంది. అన్ని పండుగల్లోనూ దేవుడికి దగ్గరగా ప్రార్థనా స్థలాల్లో గడపడానికి బదులు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లోకి పోవాల్సి వచ్చింది. ► 14 రోజుల క్వారంటైన్ అనంతరం అందరూ పరీక్షలు చేయించుకోవాలి. ముస్లిం మతపెద్దలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎంలు అంజాద్ బాషా, ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలి ► నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు, ఉద్దేశ పూర్వక దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ముస్లిం పెద్దలు సీఎంకు ఫిర్యాదు చేశారు. కర్నూలులో కోవిడ్–19 నివారణ చర్యలు గట్టిగా తీసుకుంటున్నారని, ఈ చర్యలకు అందరూ సహకరిస్తున్నారని చెప్పారు. ► ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రశంసించారు. అయితే కొన్ని పత్రికలు, చానళ్లు ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ వార్తలు, నకిలీ వీడియోలు ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు, భయాందోళనలు కలిగిస్తున్నారని వివరించారు. కర్నూలు ఎమ్మెల్యే మీద కూడా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ► దీనిపై సీఎం స్పందిస్తూ ఫేక్ వార్తలు, తప్పుడు ప్రచారంపై నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి.. చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోంది ముస్లిం పెద్దల ప్రశంసలు ► మా జీవితంలో అధికారులు, వైద్య సిబ్బంది ఇంత సేవ చేయడాన్ని ఎప్పుడూ చూడలేదు. మేము కూడా క్వారంటైన్లకు వెళ్లి, అధికారులతో కలిసి వారికి కౌన్సెలింగ్ చేస్తున్నాం. ► ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కేసుల వ్యాప్తి, విస్తరణ తగ్గుతోంది. ఒక మనిషికి రోజుకు రూ.500 చొప్పున భోజనం కోసం ఖర్చు పెడుతుండటం అభినందనీయం. ఇంతగా సేవచేసే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ► ఫేక్ వీడియోలతో ముస్లిం సమాజం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా వివక్ష చూపుతున్నారు. ఈ విష ప్రచారాన్ని నిలువరించాలని కోరుతున్నాం. మర్కజ్ ఘటన అనుకోకుండా జరిగింది. ఉద్దేశ పూర్వకంగా జరిగింది కాదు. ఈ ఘటన తర్వాత సీఎం స్పందించిన తీరు చాలా బావుంది. మానవత్వంతో వ్యవహరించాలని, వైరస్కు కులం, మతం తేడా లేదని ఇచ్చిన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. -
నేడు రంజాన్ వేడుక
విజయనగరం టౌన్: రంజాన్ వేడుకకు మసీదులు ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో ప్రత్యేక ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు. హిందూపురం, చిత్తూరు, కోల్కతాలో నెలవంక దర్శనమిచ్చిందని, సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి ప్రత్యేక ప్రార్థనలు, దైవ సందేశం వినిపిస్తామని జమాతే ఇస్లామీ హింద్ సభ్యులు అబ్దుల్ సబూర్, మహ్మద్ హబీబ్లు ఆదివారం రాత్రి తెలిపారు. పట్టణంలోని జామియా మసీదు, చోటీ, హుస్సేనీ, కంటోన్మెంట్ తదితర మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయన్నారు. వర్షం ఎక్కువైతే ఎవరికి వారు ఆయా మసీదుల్లో నమాజ్ చేస్తారని తెలిపారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులు నెలవంక దర్శనంతో పేదలకు దానాలు చేయడం ఆనవాయితీ. ప్రతి వ్యక్తి రెండున్నర కిలోలు చొప్పున నిరుపేదలకు బియ్యం, గోధుమలు అందజేస్తారు. ముస్తాబవుతున్న మసీదులు పట్టణంలో పది వరకూ మసీదులున్నాయి. జామీయా మసీదు, చోటీ, న్యూమజిద్ కంటోన్మెంట్, పల్టన్, హుస్సేనీ, కన్యకపరమేశ్వరీ ఆలయం వద్ద ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు చెబుతూనే సర్వమానవాళి శ్రేయస్సుకు దువా చేస్తారు. దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వమానవ సౌభ్రాత్వత్వం కోసం, దేశంలో ఉన్న అశాంతి నిర్మూలనకు, దేశాభివృద్ధికి, సోదర భావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రార్థనలు చేస్తారు.