breaking news
Raju Webs Rambai Movie
-
'రాజు వెడ్స్ రాంబాయి' తొలిరోజు కలెక్షన్ ఎంత?
ప్రతి శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతుంటాయి. వీటిలో ప్రేక్షకులకు నచ్చేవి, కలెక్షన్స్ తెచ్చుకునే చిత్రాలు కొన్ని ఉంటాయి. పెద్దగా స్టార్స్ లేకపోయినా సరే కొన్ని మూవీస్ అద్భుతాలు చేస్తుంటాయి. నిన్న (నవంబరు 21) విడుదలైన వాటిలో అలా 'రాజు వెడ్స్ రాంబాయి' అనే సినిమా మిగిలిన వాటితో పోలిస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో తొలిరోజు షాకింగ్ వసూళ్లు వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.తేజస్వి రావు, అఖిల్ రాజ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సాయిలు కాంపాటి అనే కొత్త దర్శకుడు తీశాడు. టీజర్, ట్రైలర్, పాటలతోనే కాస్త ఆసక్తి రేపింది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి టాక్ వచ్చింది. దీనితో పాటు అల్లరి నరేశ్ '12 ఏ రైల్వే కాలనీ', ప్రియదర్శి 'ప్రేమంటే' రిలీజైనప్పటికీ.. ఇవి అంతంత మాత్రంగానే ఉన్నాయని టాక్ వచ్చింది. దీంతో మూవీ లవర్స్.. 'రాజు వెడ్స్ రాంబాయి'కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అలా తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.47 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని పోస్టర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ)ఏ మాత్రం స్టార్స్ హీరోహీరోయిన్లు గానీ డైరెక్టర్ గానీ లేని ఈ సినిమాకు ఈ మాత్రం వసూళ్లు రావడం అంటే నిజంగా ఆశ్చర్యమే. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మిగతా చిత్రాలతో పోలిస్తే ఇదే కాస్త లీడ్లో ఉంది. ఈ వీకెండ్తో పాటు వచ్చే వారం రామ్ 'ఆంధ్ర కింగ్ తాలుకా' రిలీజ్ అయ్యేవరకు ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తుందో చూడాలి?'రాజు వెడ్స్ రాంబాయి' విషయానికొస్తే.. 2010లో ఖమ్మం దగ్గర ఓ పల్లెటూరిలో జరిగే కథ. రాజు (అఖిల్ రాజ్) పెళ్లిళ్లకు బ్యాండ్ కొడుతుంటాడు. అదే ఊరిలో ఉండే రాంబాయిని(తేజస్వి రావు)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా రాజు ప్రేమలో పడిపోతుంది. కానీ తనకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండాలనేది రాంబాయి తండ్రి వెంకన్న(చెతన్య జొన్నలగడ్డ) పట్టుదల. ఇంతలోనే రాజు-రాంబాయి ప్రేమ విషయం ఊరంతా తెలిసిపోతుంది. దీంతో వీళ్లిద్దరూ ఊరి వదిలి పారిపోవాలనుకుంటారు. తర్వాత ఏమైంది? చివరకు ప్రేమలో విజయం సాధించారా లేదా అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'రాంబాయి'గా తేజస్వీ.. ఇంతకీ ఎవరీమె? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?) -
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ రివ్యూ
టైటిల్: రాజు వెడ్స్ రాంబాయినటీనటులు: అఖిల్ ఉడ్డెమారి, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులునిర్మాణ సంస్థ: డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్నిర్మాతలు:వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవిదర్శకత్వం: సాయిలు కంపాటిసంగీతం: సురేశ్ బొబ్బిలిసినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్విడుదల తేది: నవంబర్ 21, 2025‘రాంబాయి నీ మీద నాకు మనసాయనే..’ అనే పాటతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే ఓ సినిమా వస్తుందన్న విషయం జనాలకు తెలిసింది. అప్పటి వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. కానీ పాట హిట్ అవ్వడం..ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘రాజు వెడ్స్ రాంబాయి’పై అంచనాలు పెరిగాయి. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్లో ‘ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్పేట్ సెంటర్లో బట్టలిప్పి తిరుగుతా’ అని చిత్ర దర్శకుడు సాయిలు కంపాటి చాలెంజ్ చేయడం..ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. మరి ఆ అంచనాలను ఈ చిత్రం అందుకుందా? డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకం నిజమైందా? లేదా? రివ్యూ(Raju Weds Rambai Review)లో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా..2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్-ఖమ్మం మధ్య ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊళ్లో రాజు(అఖిల్ రాజు) బ్యాండ్ కొట్టడంలో చాలా ఫేమస్. పెళ్లికి అయినా..చావుకైనా రాజుగాడి బ్యాండ్ మోగాల్సిందే. నాన్న(శివాజీ రాజా) వద్దని చెప్పినా బ్యాండ్ కొట్టే పనిని వదలడు రాజు. అంతేకాదు హైదరాబాద్ వెళ్లి ఏదో ఒక పని చేయమని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేసినా.. వినిపించుకోడు. దానికి కారణం రాంబాయి(తేజస్విని రావ్). ఆమె అంటే రాజుకి చచ్చేంత ప్రేమ. రాంబాయి మొదట్లో రాజు ప్రేమను వ్యతిరేకించినా..కొన్నాళ్ల తర్వాత తిరిగి ప్రేమిస్తుంది. రాంబాయి తండ్రి వెంకన్న(చైతన్య జొన్నలగడ్డ)కి మాత్రం..తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. రాజుతో పెళ్లంటే నాన్న ఒప్పుకోడనే భయంతో ముందే గర్భవతి కావాలనుకుంటుంది రాంబాయి. రాజుతో ఈ విషయం చెప్పి పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వెంకన్నకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? వెంకన్న మూర్ఖత్వం రాజు-రాంబాయి ప్రేమకు ఎలాంటి ఇబ్బంది కలిగించింది? చివరకు రాజు-రాంబాయి పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే...పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. రాజు వెడ్స్ రాంబాయి సినిమా నేపథ్యం కూడా అలాంటిదే. అయితే ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలు అగ్రవర్ణాల్లోనే పరువు హత్యలు ఉన్నట్లుగా చూపించారు. కానీ అణగారిన వర్గాల్లోనూ పరువు హత్యలు జరుగుతాయని కళ్లకు కట్టినట్లుగా చూపించడం రాజు వెడ్స్ రాంబాయి ప్రత్యేకత. ఇది కల్పిత కథ కాదు.. నిజంగా జరిగిన సంఘటన. 2010 ప్రాంతంలో ఇల్లందు అనే పల్లెటూరిలో జరిగిన ఓ పరువు హత్య ఘటనకు కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. దానికి కారణం ఇంతరవకు ఏ జంటకు ఎదురు కానీ ఓ దుర్మార్గం ఈ ఘటనలో ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయాలు బరువెక్కుతాయి. అయితే అది క్లైమాక్స్ మాత్రమే. మిగతా కథంతా రెగ్యులర్ లవ్స్టోరీనే గుర్తు చేస్తుంది. 2010 నాటి స్టోరీ కావడంతో..అప్పటి యువత చేసే అల్లరి పనులు..ముఖ్యంగా గ్రామాల్లోనే ఉండే యువతీయువకులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందనేది..90స్ కిడ్స్కి బాగా కనెక్ట్ అయ్యేలా చూపించారు. ఇదంతా ఫస్టాఫ్ వరకే. సెకండాఫ్లో కథను సాగదీశారు. ఓ ప్రేమ జంట పెళ్లిలో రాజు చేసే హడావుడి సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. రాంబాయి ఎంట్రీ తర్వాత కథనం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. తన ప్రేమ విషయాన్ని చెప్పేందుకు రాజు చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఒకవైపు వీరిద్దరి లవ్స్టోరీ.. మరోవైపు రాజు గ్యాంగ్ చేసే అల్లరితో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. రాజు-రాంబాయి లవ్స్టోరీ వెంకన్నకు తెలిసిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సీన్ భావోద్వేగానికి గురి చేస్తుంది. సెకండాఫ్ మాత్రం సాగదీతగా అనిపిస్తుంది. ప్రేమ విషయం తెలిసిన తర్వాత వెంకన్న చేసే పనులు.. రాజు-రాంబాయి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ రొటీన్గా ఉంటాయి. పైగా కథనం నెమ్మదిగా సాగడంతో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అయితే చివరి 20 నిమిషాలు మాత్రం ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ సీన్ షాకివ్వడమే కాకుండా గుండెను బరువెక్కిస్తుంది. సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? అనే భయం ఒకవైపు.. ఇప్పటికీ రాజు-రాంబాయి లాంటి స్వచ్ఛమైన ప్రేమికులు కూడా ఉన్నారా? అనుమానంలో ప్రేక్షకుడు థియేటర్స్ నుంచి బయటకు వస్తాడు. ఎవరెలా చేశారంటే.. హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే అయినప్పటికీ చాలా బాగా నటించారు. అన్ని రకాల ఎమోషన్స్ని పండించారు. తెలంగాణ యాసని చక్కగా పలికారు. కొన్ని సీన్లలో తేజస్వీరావు ఎంతో అనుభవం ఉన్న నటిలాగా నటించింది. వెంకన్నగా చైతన్య నటన ఈ సినిమాకే హైలెట్. చాలా బాగా నటించాడు. అయితే రైటింగ్ లో లోపం వల్ల కొన్ని చోట్ల అతిగా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్గా నటించినవారంతా బాగా చేశారు. ముఖ్యంగా డాంబర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. శివాజీరాజాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. తెలంగాణ పల్లెటూరి అందాలను చక్కగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సినిమా బాగాలేదని టాక్ వస్తే అమీర్పేట్లో అర్ధనగ్నంగా తిరుగుతా: దర్శకుడు
అఖిల్ రాజ్(Akhil Raj), తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాకు నెగటివ్ టాక్ వస్తే తాను అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతానంటూ చిత్ర దర్శకుడు సాయిలు సంచలన కామెంట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ‘‘2004లో పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈక్రమంలోనే దర్శకుడు సాయిలు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని ఆయన అన్నారు. తనకు ఎక్కువగా పల్లెటూరి కథలంటేనే ఇష్టమని, ఈ క్రమంలోనే ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ తెరపైకి వచ్చిందన్నారు. అమాయకంగా ఉండే ఆటోడ్రైవర్లు, కాలేజీల్లోని అమ్మాయిలు.. వారి మధ్య పుట్టే మొరటు ప్రేమ.. ఇవే నాకు తెలుసు. 15 ఏళ్లపాటు ఒక జంటకు నరకం చూపించిన స్టోరీనే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూసిన తర్వాత మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ, నెగెటివ్గా మాట్లాడకండి. 21వ తేదీన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వస్తే అమీర్పేట్ సెంటర్లో అర్ధనగ్నంగా తిరుగుతాను. ఇంత కాన్ఫిడెంట్ ఉందికాబట్టే ఈ మాట చెబుతున్నాను.' అని దర్శకుడు సాయిలు పేర్కొన్నాడు.ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చని మేకర్స్ తెలిపారు. ఆ చిత్రాల్లాగే ఈ సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుందని టీమ్ తెలిపింది. మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారన్నారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుందన్నారు. "Cinema కి Negative Talk వస్తే Ameerpet center లో cut drawer మీద తిరుగుతా" - #RajuWedsRambai director pic.twitter.com/ORLYH9ePK3— Daily Culture (@DailyCultureYT) November 19, 2025 -
విలేజ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రాజు వెడ్స్ రాంబాయి.. ట్రైలర్ వచ్చేసిింది
అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఈ మూవీకి సాయిలు దర్శకత్వం వహించారు. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.(ఇది చదవండి: ‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్)ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో అడివి శేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తే ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తాను ప్రేమించిన అబ్బాయికి.. కుటుంబానికి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి కథే ఈ రాజు వెడ్స్ రాంబాయి అని ట్రైలర్లోనే తెలిసిపోతుంది. గ్రామీణ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా యూత్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21న విడుదల కానుంది. Their hearts beat as one, their love faces every storm ❤️🔥Experience the Emotionally Stirring & heart-touching trailer of the Greatest love saga #RajuWedsRambai ❤️❤️▶️ https://t.co/lrlbW9zT95Launched by The Star of New Age Films @AdiviSesh garu💫#RajuWedsRambaiOnNov21st pic.twitter.com/RufYYOLkvA— Dolamukhi Subaltern Films (@dsfofficial_) November 13, 2025 -
‘రాజు వెడ్స్ రాంబాయి’ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం : మంచు మనోజ్
‘‘ఒక పల్లెటూరులో జరిగిన వాస్తవ ఘటనలతో రూపొందిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అలాగే బోలెడన్ని అవార్డ్స్ వస్తాయి’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా సాయిలు కం΄ాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ‘రాంబాయి నీ మీద నాకు...’ అంటూ సాగే ΄ాటను హీరో మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ తర్వాత సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు తనకు సపోర్ట్గా నేనుంటాను’’ అన్నారు. ‘‘గతించిన చరిత్రకు, ప్రస్తుత చరిత్రకు మా సినిమా ఓ సాక్ష్యం’’ అన్నారు వేణు ఊడుగుల. ‘‘మా సినిమా చూస్తున్నవాళ్లకు తమ ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సాయిలు. ‘‘సూపర్ హిట్ ఆల్బమ్ అనే మాట మా సినిమాతో మళ్లీ వినిపిస్తుందని నమ్ముతున్నాం’’ అని పేర్కొన్నారు రాహుల్ మోపిదేవి.


