-
మరణం అంచున నరకయాతన! ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా..
ఆలమూరు: మరణానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరం ఉండి కొన్ని గంటల పాటు నరక యాతన అనుభవించి.. ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. కోనసీమ జిల్లా రావులపాలెం ఇందిరా కాలనీకి చెందిన చిర్రా ప్రదీప్కుమార్ రాజమహేంద్రవరంలోని ఓ ప్రయివేటు కంపెనీలో హోమ్గార్డ్. బుధవారం విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా గౌతమీ గోదావరి కొత్త వంతెనపై వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ పక్కన ఉన్న కాంక్రీట్ గోడను ఢీకొట్టి గోదావరిలో జారి పోయాడు. అదృష్టవశాత్తు గోదావరి నదికి, వంతెన పైభాగానికి మధ్యనున్న చెక్కబల్లపై పడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో ప్రదీప్కుమార్ హెల్మెట్ ధరించడం వల్ల బలమైన గాయాలు కాలేదు. గాయాలు తట్టుకోలేక, మరో పక్క గోదావరిలో పడిపోతానన్న భయంతో ఆర్తనాదాలు చేశాడు. ఆ అరుపులు విన్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు, హైవే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ను తెప్పించి పోలీసులు కిందకు దిగి తాడు సాయంతో అతన్ని పైకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్హెచ్ 16 అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించాక.. రావులపాలెంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్కుమార్ ఒక్క అడుగు ముందుకైనా, వెనుకనైనా పడి ఉంటే.. నీటిలో మునిగి ప్రాణాలు పోయేవని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు, హైవే సిబ్బంది సకాలంలో స్పందించకున్నా పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు. -
వైరల్ : ఆ దొంగోడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది..
మెక్సికో : సైలెంట్గా దొంగతనం చేసి ఉడాయిద్దామనుకున్న ఆ దొంగోడి ప్లాన్ బెడిసి కొట్టింది. దొంగతనం చేసిన డబ్బులతో జల్సా చేద్దామనుకుంటే అతడ్ని దురదృష్టం వెంటాడింది. తల రైలింగ్లో ఇరుక్కుపోవడంతో పోలీసులకు పట్టించింది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చోరీకి వెళ్లిన దొంగకు చేదు అనుభవం ఎదురైంది. రైలింగ్ నుంచి ఇంట్లోకి దూరేందుకు ప్రయత్నించగా, అనుకోకుండా అతడి తల రైలింగ్లో ఇరుక్కుపోయింది. అక్కడి నుంచి బయటపడేందుకు చాలానే ట్రై చేవాడు కానీ ఏదీ వర్కవుట్ కాలేదు. కొంత సమయానికి ఇది గమనించిన స్థానికులు.. దొంగోడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినా అతడిని రైలింగ్ నుంచి విడిపించలేకపోలేరు. దీంతో అత్యవసర విభాగాన్ని సంప్రదించగా, రెండు గంటల తర్వాత అక్కడికి చేరుకున్న సిబ్బంది...బోల్డ్ కట్టర్ల సాయంతో ఇనుప చువ్వలను కట్ చేసి అతడిని విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చదవండి : వైరల్: ఆహారం అనుకుందో.. కోపమొచ్చిందో వైరల్: నడి రోడ్డు మీద తలస్నానం! -
ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా?
తిరుమల భద్రత కోసం శేషాచలంలోని అటవీ మార్గాలను కలుపుతూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ పేరుతో ప్రత్యేకంగా ఇనుప కంచె నిర్మించారు. తొలి దశ పనులు పూర్తయినా రెండో దశపనులపై దృష్టి సారించడంలేదు. ఏడాదిగా ఇదే పరిస్థితి. ఖర్చు తడిసిమోపెడవుతుందని టీటీడీ ఓ ఉన్నతాధికారి ఈ పనులకు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. తిరుమల: తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని దశాబ్దం ముందే నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతాపరమైన సిఫారసుతో ఆలయం చుట్టూ ఉండే అటవీ ప్రాంతాలను కలుపూ ఔటర్ సెక్యూరిటీ కార్డాన్ (ఇనుప కంచె) నిర్మించాలని నిర్ణయించారు. టీటీడీ ధర్మకర్తల మండలి మూడేళ్లకు ముందు ఆమోద ముద్రవేసింది. ఇందులో భాగంగా మొత్తం 12 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు 2014లో ప్రారంభించారు. తొలిదశ పనుల్లో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దారిలో 57 మలుపు నుంచి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాం వరకు మొత్తం 4.8 కి.మీ మేర ఇనుప కంచె నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం రూ.2 కోట్ల అంచనాలతో రెండు కి.మీ దూరం పనులు చేపట్టారు. ఆ మేరకు పనులు పూర్తి చేశారు. ఈ పనులు స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ దిగువ భాగం వరకు పూర్తయ్యాయి. రెండో దశ కంచె పనులపై టీటీడీ సందిగ్ధం 2.8 కి.మీ మేర రెండో దశ పనులకు టీటీడీ ధర్మకర్తల మండలి అంగీకారం తెలిపింది. పాచికాల్వ గంగమ్మగుడి మీదుగా గోగర్భం డ్యాం ఎగువన ఉండే రోడ్డు మార్గం వరకు ఇనుప కంచె నిర్మించనున్నారు. దీనికోసం దాదాపు రూ.2 కోట్లు కేటాయించారు. అయితే, శ్రీగంధం వనాన్ని టీటీడీ అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం 30 ఎకరాల్లో ఉండే ఈ వనాన్ని 145 ఎకరాలకు విస్తరించాలని టీటీడీ యోచిస్తోంది. భవిష్యత్ భద్రతా కారణాల వల్ల శ్రీగంధం వనాన్ని రక్షించుకునే దిశగా కొత్త వనాన్ని కూడా ఇనుప కంచెలోపలికి తీసుకురావడానికి టీటీడీ నిర్ణయించింది. దీంతో మరో రెండు కిలోమీటర్లు మేర పెంచి సుమారు రూ.4.5 కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నారు. అయితే, ఇంత ఖర్చు పెట్టి కంచె నిర్మించాలా? అంటూ టీటీడీకి చెందిన ఓ సీనియర్ అధికారి నిర్మాణంపనులపై మోకాలడ్డేశారు. అందుకే పనులు ఏడాదిగా సాగడం లేదు. కంచె పూర్తి చేయాల్సిందే ఉగ్రవాద చర్యల నేపథ్యంలో తిరుమలలో నిర్మాణంలో ఉన్న ఇనుప కంచెను సాధ్యమైనంత త్వరలోనే పూర్తిచేయాలని రాష్ట్ర డీజీపీ జేవీ.రాముడు టీటీడీకి సిఫారసు చేశారు. దీంతో కంచె నిర్మాణం పూర్తి చేసే ఇనుప కంచె పనుల్లో.. జాప్యమేల గోవిందా? యోచనలేని టీటీడీలో కొంత చలనం వచ్చినట్టయింది. ఇనుప కంచె పరిశీలన తిరుమల అటవీమార్గాలను చుట్టూ కలుపుతూ చేపట్టిన ఇనుప కంచె నిర్మాణాన్ని సోమవారం డీఎస్పీ మునిరామయ్య, సీఐలు కె.వెంకటరవి, విజయ్శేఖర్, ఎస్ఐ వెంక్రటమణ పరిశీలించారు. డీజీపీ జేవీ రాముడు వ్యాఖ్యలతో టీటీడీ, పోలీసు విభాగాల్లో చనలం వచ్చింది. ఆమేరకు ఇప్పటికే పూర్తిచేసిన తొలి దశ పనులు పరిశీలించారు. వాటి వివరాలను టీటీడీ డెప్యూటీ ఈఈ పెద్దబ్బరెడ్డి పోలీసు అధికారులకు వివరించారు. -
భవనం పైనుండి పడి విద్యార్థిని మృతి
నేరేడ్మెట్ (హైదరాబాద్) : నిర్మాణంలో ఉన్న ఇంటి రెయిలింగ్కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుండి కింద పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీష్చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రగిరి కాలనీలో నివాసముండే వెంకటేశ్వర రెడ్డి ఆయన ఉన్న ఇంటిపైన రెండవ అంతస్తులో ఇంటి నిర్మాణం చేపడుతున్నాడు. కాగా డిగ్రీ చదువుకునే వెంకటేశ్వరరెడ్డి కుమార్తె కుమారి నవ్యశ్రీ (19) ఆదివారం రెండవ అంతస్తులో నిర్మాణం చేస్తున్న రెయిలింగ్కు నీళ్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు రెయిలింగ్తోపాటు నవ్యశ్రీ కింద పడిపోయి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్నత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కాంపౌండ్ రైలింగ్ కూలి మహిళ మృతి
మర్పల్లి: రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామంలో ఎదురింటి కాంపౌండ్ వద్ద కూర్చుని ఉన్న మహిళలపై రైలింగ్ కూలింది. ఈ ఘటనలో పద్మ(30) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే మరో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. గమనించిన స్థానికులు గాయపడిన లక్ష్మమ్మను ఆస్పత్రికి తరలించారు. మృతురాలు పద్మకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement