-
తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..
కుక్కలు విశ్వాసం గలివి అని అందరికి తెలుసు. అవి మనుషుల కంటే కూడా గొప్ప నమ్మకాన్నిస్తాయి అనడంలో సందేహం లేదు. అందువల్లే కాబోలు చాలామంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇక్కడొక కుక్క తన యజమాని కారుకి యాక్సిడెంట్ అయితే అది ఎంత తెలివిగా వ్యవహరించి తన యజమానిని కాపాడుకుందో చూడండి. (చదవండి: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!) అసలు విషయంలోకెళ్లితే....న్యూ హాంప్షైర్లోని షెపర్డ్ జాతికి చెందిన టిన్స్లీ అనే కుక్క న్యూహాప్షైర్, వెర్మోంట్ సరిహద్దు ప్రాంతంలో తన యజమాని కారుకి ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. దీంతో ఆ కుక్క ఒక్కసారిగా హైవే పై పరుగెడుతుంది. ఈ మేరకు అది వాహనదారులన, హైవే పై ఉండే ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పోలీసులు ఆ కుక్కున పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అది ఎటో చూపిస్తు పరిగెడుతుంది. అంతే పోలీసులు కాస్త అనుమానం కలిగి అది చూపి స్తున్నా వైపుగా పరిగెడతారు. అయితే అది వెర్మోంట్ ప్రాంతంలోకి తీసుకువెళ్లింది. అక్కడ రైల్వే పట్టాలపై బోల్తా పడి ఉన్న కారు కనిపించింది. అంతేకాదు అప్పటికే అక్కడ ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ఆ వ్యక్తులలో ఒకరు కుక్క యజమాని కామ్ లాండ్రీ. దీంతో పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ క్కుక్క మాత్రం పోలీసులు వచ్చి రెస్క్యూ చర్యలు ప్రారంభించడంతో తన యజమాని లాండ్రీ పక్కన ప్రశాంతంగా కుర్చుంది. పోలీసు అధికారి బాల్దాస్రే మాట్లాడుతూ...ఆ కుక్క హైవేపై ఏదో చూపిస్తున్నట్లుగా పరిగెడుతుంటే అనుమానం వచ్చి అనుసరిస్తూ వెళ్లాం. ఇది నిజంగా చాలా తెలివిగా మమ్మల్నీ తన యజమాని వద్దకు తీసుకువెళ్లటమే కాక ఆయన ప్రాణాలను కాపాడుకుందంటూ ప్రశంసించారు. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) -
పట్టాలెక్కనున్న ఫైవ్ స్టార్ హోటల్.. దేశంలో తొలిసారి ఇలా
గాంధీనగర్: దేశంలో తొలిసారిగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కబోతుంది. ఫైవ్ స్టార్ హోటల్ రైలు పట్టాలెక్కడమేంటి అని ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి. గుజరాత్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ను భారత రైల్వేశాఖ కొత్త హంగులతో సుందరీకరిస్తుంది. ఇందులో భాగంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ను పట్టాలపై నిర్మించాలని ఓ వినూత్న ఆలోచన చేసింది. దేశంలో తొట్టతొలిసారి నిర్మించ తలపెట్టిన ఇలాంటి ప్రాజెక్ట్ను భారతీయ రైల్వేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. ఈ ఫైవ్ స్టార్ హోటల్ను లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహించనున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. మూడు టవర్లుగా నిర్మించే ఈ హోటల్లో మొత్తం 300 గదులు ఉండనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. ఈ ఐదు నక్షత్రాల హోటల్ కింద రైళ్లు తిరుగుతున్నా ఎలాంటి ప్రకంపనలు కానీ శబ్దాలు కానీ హోటల్లో ఉన్న వారికి వినిపించకుండా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నామని ఆయన తెలిపారు. నిజానికి అంతర్జాతీయంగా ఇలాంటి ప్రాజెక్టులు సాధారణమే అయినా.. భారత్లో మాత్రం రైలు పట్టాలపై ఇదే తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని వెల్లడించారు. దీని నిర్మాణానికి రెండేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. -
అదృష్టంతో బతికిపోయింది..!
హాంగ్కాంగ్ : ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది. క్షణకాలం పాటు శరీరం భయంతో కంపించిపోయే సంఘటన. పొరపాటున అటుగా రైలు వచ్చుంటే.. అన్న మాట తలపుకు వస్తేనే కాళ్ల కింద భూకంపం వచ్చే భయానక సన్నివేశం హాంగ్కాంగ్లో జరిగింది. హాంగ్కాంగ్లోని యెన్లాంగ్ మెట్రో స్టేషన్లో రైలు కోసం ఒక యువతి ఎదురు చూస్తోంది. రైలు రావడానికి ఇంకా సమయం ఉండడంతో ఆమె అటుఇటు తిరుగుతూ.. అటువైపున ఉన్న మిత్రులకు హాయ్ చెబుతోంది. ఇంతలో ఒక వ్యక్తి.. ఆమెను వెనక నుంచి హఠాత్తుగా రైల్వే ట్రాక్మీదకు తోసేసి.. తనకు ఏమీ తెలియనట్లు వెళ్లిపోయాడు. ట్రాక్ మీద పడ్డ యువతి.. తనకు ఏం జరిగింది? ఎందుకిలా పడ్డాను? అని అనుకుంటూ.. అటుగా వెళ్తున్న వ్యక్తిని గట్టిగా తిడుతోంది. ఆమె అదృష్టం బాగుండి.. అప్పటికే అటు రావాల్సిన రైలు ఆలస్యం కావడంతో ప్రాణాలతో బతికిపోయింది. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ కావడంతో.. నిందితుడిని కొద్ది సేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యాయత్నం నేరం కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 3 లక్షల మందిదాకా చూశారు. -
అదృష్టంతో బతికిపోయింది..!
-
రక్తమోడిన రైలు పట్టాలు
వేర్వేరు చోట్ల రైలు కిందపడి ముగ్గురి మృతి కేసముద్రం : జిల్లాలో వేర్వేరుచోట్ల రైలు పట్టాలు రక్తమోడాయి. రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మృతిచెందారు. కేసముద్రం మండలంలోని ధన్నసరి శివారు బిచ్చానాయక్ తండాకు చెందిన బాదావత్ బాలు(43) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మనోవేదనకు గురైన బాలు శుక్రవారం సాయంత్రం ధన్నసరి శివారు కొత్తూరు వద్దనున్న రైల్వేట్రాక్పైకి వెళ్లి అప్లైన్లో(424కిలోమీటర్వద్ద) అటుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అస్లి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలంలో ముక్కలైన మృతదేహన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసముద్రంస్ల్స్టేషన్ సమీపంలోని రైలు కిందపడి ఓ గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందినట్లు జీఆర్పీ సీఐ స్వామి తెలిపారు. 40 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి 420/25మైలు రాయి వద్ద అటుగా వచ్చే రైలు కింద పడి మృతిచెందాడు. మృతదేహం పరీశీలిస్తే మృతుడి నడు ము భాగం నుంచి తల భాగంవరకు కనిపించకుండా పోయింది. కొంతదూరంలో ఓ వ్యక్తి ఫొటో ఉండటం, మృతదేహం పైభాగం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జీఆర్పీ పోలీసులు మాత్రం ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైలుకింద పడి వ్యక్తి మృతి స్టేషన్ఘన్పూర్ టౌన్ : కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు నుంచి ఓ వ్యక్తి ఘన్పూర్ రైల్వేస్టేషన్లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, బ్లాక్ అండ్ వైట్ షర్ట్ ధరించి ఉన్నాడు. కాజీపేట జీఆర్పీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
కదన రంగంలోకి కమల దళపతులు
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
- ప్రియాంక విజయానికి ‘స్పెషల్ 24’!
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
Advertisement