breaking news
Raider
-
టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే ఉబర్ రైడ్!
చాలామంది తమ నిత్యజీవితంలో ఎక్కడ ఏం కొనాలన్నా కొంత బేరమాడుతూ ఉంటారు, ఇక ఆటోలో ప్రయాణించాలంటే మాత్రం డ్రైవర్తో కొంత బేరమాడకుండా ఉండలేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ క్యాబ్ సర్వీస్ కంపెనీ 'ఉబర్' ఓ కొత్త ఫీచర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు క్యాబ్ బుక్ చేసుకోవాలంటే సంస్థ యాప్లో ఎంత రేటు చూపిస్తే అంత చెల్లించాల్సి వచ్చేది, దీంతో బేరమాడే అవకాశం లేకుండా పోయింది. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ 'ఉబర్ ఫ్లెక్స్’లో మనకు నచ్చిన రేటుకే క్యాబ్ ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉబర్ పరిచయం చేయనున్న కొత్త ఫీచర్ ఒక రేటును కాకుండా.. యూజర్ ప్రయాణించే దూరం, సమయం వంటి వాటిని ఆధారంగా తీసుకుని తొమ్మిది ధరలను చూపిస్తుంది. ఇందులో వింభియోగదారుడు తనకు నచ్చిన రేటుని ఎంచుకోవచ్చు, అయితే ఆ రేటు డ్రైవర్కి నచ్చితే యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా రిజెక్ట్ చేయొచ్చు. ఇదీ చదవండి: చైనాను దాటేసిన భారత్.. త్వరలో అమెరికా! - ఆనంద్ మహీంద్రా ట్వీట్ ఒకే రేటు దగ్గర నిలిచిపోకుండా.. కస్టమర్ తనకు నచ్చిన రేటును ఎంచుకునే అవకాశాన్ని ఉబర్ కల్పిస్తోంది. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, అదే సమయంలో తక్కువ ధరకే ప్రయాణం చేసే వెసులుబాటుని పొందవచ్చు. ఈ ఫీచర్ను ఉబర్ కంపెనీ భారతదేశంలో ఔరంగాబాద్, ఆజ్మీర్, బరేలీ, చండీగఢ్, కోయంబత్తూర్, దేహ్రాదూన్, గ్వాలియర్, ఇందౌర్, జోధ్పుర్, సూరత్ ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ మాత్రమే కాకుండా లాటిన్ అమెరికా, కెన్యా దేశాల్లో కూడా సంస్థ ఈ ఫీచర్ను అమలుచేసే అవకాశం ఉంది. -
కేసీఆర్ చెప్పిన కథతో...
సీనియర్ దర్శకులు అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిలుకూరు బాలాజీ’. సాయికుమార్, ఎస్పీబీ, భానుశ్రీ మెహ్రా ముఖ్య తారలు. నేడు అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు. ఆయన మాట్లాడుతూ– ‘‘శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి చేతులమీదగా విడుదలైన ‘శ్రీ చిలుకూరు బాలాజీ’ సినిమా పాటలలకు, ఆ తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. అంతర్జాతీయ విలువలతో ఓ బాలల చిత్రం నా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా. ప్రస్తుతం అది నిర్మాణంలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్చెప్పిన కథాంశంతో, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిగారి పర్యవేక్షణలో సుమన్ లీడ్రోల్లో తీసిన ‘రైతేరాజు’ షార్ట్ ఫీచర్ ఫిల్మ్ త్వరలో అన్ని థియేటర్స్లో విడుదల కానుంది’’ అన్నారు.