breaking news
PV
-
వాహనాల విక్రయాలు అదుర్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా తయారీ కంపెనీల నుండి డీలర్షిప్లకు చేరిన ప్యాసింజర్ వెహికిల్స్ (పీవీ) సంఖ్య గతేడాదితో పోలిస్తే 2024 నవంబర్లో 4 శాతం పెరిగి 3,47,522 యూనిట్లకు చేరుకున్నాయి. భారత పీవీ రంగంలో నవంబర్ నెలలో ఇవే ఇప్పటి వరకు అత్యధికం.అక్టోబర్లో పండుగ తర్వాత డిమాండ్ ఊపందుకుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. సియామ్ గణాంకాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో మొత్తం ప్యాసింజర్ వాహనాల హోల్సేల్ విక్రయాలు 3,33,833 యూనిట్లుగా ఉన్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా గత నెల హోల్సేల్ అమ్మకాలు 5 శాతం వృద్ధితో 1,41,312 యూనిట్లను తాకాయి.హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి డీలర్లకు చేరిన వాహనాల సంఖ్య 49,451 నుంచి 48,246 యూనిట్లకు తగ్గాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 46,222 యూనిట్లకు ఎగశాయి. ద్విచక్ర వాహనాల హోల్సేల్స్ 2023 నవంబర్లో 16,23,399 యూనిట్లు నమోదు కాగా, గత నెలలో 1 శాతం తగ్గి 16,04,749 యూనిట్లకు చేరుకున్నాయి.స్కూటర్ల విక్రయాలు 12 శాతం పెరిగి 5,68,580 యూనిట్లకు చేరుకున్నాయి. మోటార్సైకిల్స్ 7.5 శాతం తగ్గి 9,90,246 యూనిట్లకు పడిపోయాయి. గత నెలలో మోపెడ్ హోల్సేల్స్ 6 శాతం పెరిగి 45,923 యూనిట్లు నమోదయ్యాయి. త్రీ–వీలర్స్ 1 శాతం క్షీణించి 59,350 యూనిట్లకు వచ్చి చేరాయి. దీపావళి కాని నవంబర్లో మొదటిసారిగా టూవీలర్స్ హోల్సేల్ విక్రయాలు 16 లక్షల యూనిట్ల మార్కును దాటింది. -
‘సోలార్’కు రెండో విడత పీఎల్ఐ
న్యూఢిల్లీ: అధిక సామర్థ్యాలు కలిగిన సోలార్ పీవీ మాడ్యూళ్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ స్కీమ్) కింద మరో రూ.19,500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా 65 గిగావాట్ల అధిక సామర్థ్యం కలిగిన సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్ర సర్కారు లక్ష్యంగా ఉంది. ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ బుధవారం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. పునరుత్పాదక ఇంధన వనరులకు మన దేశం పెద్ద పీట వేస్తుండడం తెలిసిందే. మన దేశ సౌర ఇంధన రంగానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కోసం ఇప్పుడు అధిక శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాం. దీంతో దేశీ అవసరాలను తీర్చే లక్ష్యంతో కేంద్రం మొదటి విడత రూ.4,500 కోట్ల ప్రోత్సాహకాలను సోలార్ మాడ్యూళ్ల తయారీకి ప్రకటించింది. ఇప్పుడు దేశీ అవసరాలతోపాటు.. దేశం నుంచి ఎగుమతులు పెంచే లక్ష్యంతో రెండో విడత కింద రూ.19,500 కోట్లను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాల వల్ల రూ.94,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రత్యక్షంగా 1.95 లక్షల మందికి, పరోక్షంగా 7.8 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది అంచనా వేస్తోంది. భారీగా ఆదా..: తాజా ప్రోత్సాహకాలతో ఏటా రూ.1.4లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో అన్నారు. ఎగుమతుల రూపంలో పెద్ద ఎత్తున విదేశీ నిధులు వస్తాయన్నారు. ఉచిత విద్యుత్ అంశంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు సింగ్ స్పందించారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ ఇచ్చి, బడ్జెట్ నుంచి చెల్లించొచ్చన్నారు. కానీ, చాలా రాష్ట్రాల బడ్జెట్లో ఇందుకు నిధుల్లేవంటూ, అవి రుణాలు తీసుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నాయన్నారు. ఈ భారం తదుపరి తరాలపై పడుతుందన్నారు. రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నేషనల్ లాజిస్టిక్స్ విధానానికి ఆమోదం న్యూఢిల్లీ: రవాణా రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు నెలకొల్పడం, దేశీయంగా ఈ రంగానికి సంబంధించి వ్యయాలు తగ్గింపు లక్ష్యంగా రూపొందించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీకి కేంద్రం కేబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశమంతటా ఎటువంటి ప్రతికూలతలూ లేకుండా సరకు రవాణాకూ తాజా పాలసీ వీలు కల్పిస్తుంది. పాలసీని గత వారం ప్రధాన నరేంద్రమోదీ ఆవిష్కరిస్తూ, ‘‘ప్రస్తుతం జీడీపీ అంకెలతో పోల్చితే 13–14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్యయాలను వీలైనంత త్వరగా సింగిల్ డిజిట్కు తీసుకురావాలని మనమందరం లక్ష్యంగా పెట్టుకోవాలి’’ అని ఉద్ఘాటించారు. సెమీకండక్టర్ పీఎల్ఐలో మార్పులు సెమీకండక్టర్ ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీమ్లో ప్రధాన మార్పులకు కేంద్ర మంతిమండలి ఆమోదముద్ర వేసింది. టెక్నాలజీ నెట్వర్క్ చైన్లో చిప్ ఫ్యాబ్లకు సంబంధించి ప్రాజెక్టు వ్యయాల్లో 50 శాతం ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సెమీకండక్టర్ స్కీమ్ మరింత పటిష్టవంతం లక్ష్యంగా తాజా మార్పులు జరిగినట్లు వెల్లడించారు. భారత్లో సెమీకండక్టర్స్, డిస్ప్లే తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.76,000 కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ప్రకటించింది. -
ఏయూలో పీవీ ఐదవ స్మారకోపన్యాసం
-
హన్మకొండ జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న హన్మకొండ జిల్లాకుమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని బ్రాహ్మణసంఘం కోరారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన పీవీ పేరును హన్మకొండ జిల్లాకు పెట్టాలని బ్రాహ్మణుల పక్షాన కోరుతున్నామన్నారు. వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికవడంతో పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన పీవీ పేరును జిల్లాకు పెట్టి గౌరవించాలని కోరారు. డాక్టర్ వొడితెల విశ్వనాథం మాట్లాడుతూ పీవీ పేరును జిల్లాకు పెట్టడం సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ఆలయాల అర్చకులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు చెప్పెల నాగరాజుశర్మ, దండాపంతుల గోపీనాథ్శర్మ, వల్లూరి పవన్కుమార్, జయప్రసాద్రావు, దెందుకూరి సోమనాథ్, ఎన్వీఎన్.పురుషోత్తం, రమేష్చంద్ర, గణపతిశర్మ, ప్రభాకర్రావు, హన్మంతుశర్మ, ధీరజ్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
గాయాల నుండి కోలుకుంటున్న సింధు
-
పీవీ మేధావి.. అంతర్ముఖుడు!
* తాజా పుస్తకంలో జైరాం రమేశ్ అభివర్ణన * ఆర్థిక సంస్కరణలు పీవీ, మన్మోహన్ల సాహస ఫలితమే న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన కేబినెట్లో ఆర్థికమంత్రిగా చేసిన తాజా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్.. 1991లో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక రంగ నావను ఒడ్డెక్కించి, ప్రగతి పథం పట్టించిన మేధావులని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జైరాం రమేశ్ అభివర్ణించారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన కమ్యూనిస్ట్ నేత డెంగ్ జియావో పింగ్తో పీవీని పోలుస్తూ.. ‘భారతదేశ డెంగ్ మన పీవీ’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. పీవీ హయాంలో వారిద్దరితో అత్యంత సన్నిహితంగా మెలిగిన, వారితో కలిసి పనిచేసిన జైరాం రమేశ్.. నాటి తన అనుభవాలను ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్- ఇండియాస్ 1991 స్టోరీ’ అనే రచన ద్వారా గ్రంథస్తం చేశారు. పీవీని చాలా విషయాలు తెలిసిన, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల ఒక తెలివైన నక్కగా.. మన్మోహన్ సింగ్ను ఒకే ఒక్క అంశంపై లోతైన అవగాహన ఉన్న ఓ హెజ్హాగ్(ప్రమాదం ఎదురైనప్పుడు తనలో తనే ముడుచుకుపోయి, బంతిలా మారే ముళ్లపందిలాంటి జంతువు)గా జైరాం రమేశ్ అభివర్ణించారు. మన్మో హన్సింగ్ కేవలం ఆర్థిక సంస్కరణల నిపుణుడు కాగా, పీవీ అనేక అంశాల్లో అవగాహన ఉందని, వారిద్దరు కలిసి దేశంలో ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేశారని వివరించారు. నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన జాప్యం చేస్తారన్న పేరున్న పీవీ నరసింహరావు.. 1991లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అత్యంత నిర్ణయాత్మకంగా వ్యవహరించారని, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ సహకారంతో 1991 జూన్, జులై, ఆగస్ట్ నెలల్లో ఆయన పాలన అత్యంత సాహసోపేతంగా సాగిందని ప్రశంసించారు. ‘వాస్తవానికి పీవీ ఒంటరివాడు. అంతర్ముఖుడు. సంబంధాలు కలుపుకోవడంలో, పరిచయాలు పెంచుకోవడంలో పెద్దగా ఆసక్తి, అభినివేశం ఉన్నవాడు కాదు. అన్నిటికన్నా ముఖ్యంగా గోప్యత పాటించడంలో ఆయన మేటి’ అని పేర్కొన్నారు. -
మసకబారుతున్న మోదీ ప్రభ
పార్లమెంటు సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, పీవీకి లోక్సభలో మెజారిటీ లేకున్నా పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా సాధించుకోగలిగారు. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం రాజీలకు సిద్ధపడి సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించాలి. ప్రధాని మోదీ చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప సంఘర్షణాత్మక వైఖరి కాదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం సజావుగా సాగుతోంది. హర్యానా మహారాష్ట్ర, జార్ఖండ్, కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ దిగ్భ్రాంతికరమైన విజయాలను సాధించింది. కాబట్టి గత సంవత్సరం విజయోత్సాహభరితంగా ముగిసి ఉండాల్సింది. కానీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు విజయవంతం కాలేదు. బీజేపీకి లోక్సభ లో మెజారిటీ ఉందిగానీ రాజ్యసభలో లేదు. అలాంటి పరిస్థితుల్లో చట్టం చేయా లంటే ప్రభుత్వం ఉభయ సభలను కలిపి సమావేశపరచి ఆమోదముద్ర వేయిం చుకోవాలి. అయితే అది అరుదైన, తీవ్ర పరిష్కారం. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవ డానికి దోహదపడేపలు బిల్లులకు బీజేపీ రాజ్యసభ ఆమోదాన్ని పొందాలను కుంది. ప్రభుత్వ తక్షణావశ్యకతను గుర్తించిన ప్రతిపక్షం ఏదో ఒక సాకుతో అందుకు అడ్డంకులను సృష్టించడం ప్రారంభించింది. మరింత ప్రజా వ్యతిరేకత ను మూటగట్టుకోవాల్సి వస్తుందనే భయంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సమావేశాలకు విఘాతం కలిగించడానికి తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల వంటి చిన్న పార్టీలను వాడుకుంది. విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన మతమార్పి డుల సమస్యలో మోదీ ప్రతిష్టను మసకబరచే అవకాశాన్ని పసిగట్టిన ప్రతి పక్షాలు ప్రధాని ఆ అంశంపై మాట్లాడాలని పట్టుబట్టాయి. బీజేపీ సహజంగానే రాజ్యసభలో మోదీ మాట్లాడకుండా చూసింది. కానీ ప్రభుత్వం ఆర్థిక సంస్క రణలు, బీమా, భూసేకరణలకు సంబంధించిన చట్టాలను తేవాల్సి ఉంది. కాబట్టి ఆర్డినెన్స్లకు జారీ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయించుకుంది. ఆర్డినెన్స్ కూడా చట్టమేగానీ, ఆరు నెలలలోగా అది పార్లమెంటు ఆమోదం పొందాలి. అత్యంత జరూరైతే తప్ప ఆర్డినె న్స్లను జారీ చేయకూడదు. ఇలా ఆర్డినెన్సులను జారీ చేయడం ద్వారా పార్లమెంటును నియంత్రించలేని తన బలహీనతను బీజేపీ బయటపెట్టుకుంది. ప్రతిపక్షాల పట్ల మన్నన చూపడమే రాజనీతి సాధారణంగా అసహనాన్ని చూపే ప్రజలు సైతం సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం ఏర్పడిందని మోదీపట్ల సంతృప్తితోనే ఉన్నారు. పెద్ద చదువుగానీ, అనుభవంగానీ లేని మోదీ విదే శీ వ్యవహారాలను చక్కబెట్టలేరని చాలా మంది తక్కువగా అంచనా వేశారు. అది తప్పని రుజువైంది. దేశాన్ని నడపడం అంటే కేవ లం అధికారులను నియంత్రించడం కాదు. కొత్త చట్టాలను చేయాల్సిందే. కానీ పార్లమెంటు, అది సక్రమంగా పనిచేయడం భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యం. ప్రధాని పార్లమెంటు అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొనాలి. ప్రతి పక్షం చిన్నదే అయినా, ప్రధాని పార్లమెంటును తోసిపుచ్చకూడదు. ఉభయ సభలలోనూ మెజారిటీ ఉన్నా జవహర్లాల్ నెహ్రూ ప్రతిపక్షం పట్ల అత్యంత గౌరవం చూపేవారు, వారి కోరికలను మన్నించడానికి ఎప్పుడూ ప్రయత్నించే వారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు (1991-96) లోక్సభలో మెజారిటీ లేదు. అయినాగానీ పార్లమెంటు నుండి తాను కావాలనుకున్నదల్లా ఆయన సాధించుకోగలిగారు. ఆయన హయాంలో దేశం ఆర్థిక సంక్షోభాన్ని, పంజాబు తిరుగుబాటును, కశ్మీర్ సమస్యను, అస్సాం హింసకాండను ఎదుర్కో వాల్సి వచ్చింది. అయినా ఆయన పార్లమెంటును తనతోపాటు నడిపించ గలిగారు. విడిగాఎంపీల పట్ల, పార్టీల పట్ల సానుకూల వైఖరి చూపేవారు. ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయిని ఐరాస ప్రతినిధి బృందాలకు నేతగా నియమిం చారు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని పీవీ తన మంత్రివర్గ సహచ రులకు చెప్పేవారు. అలా ఆయన పార్లమెంటు అభిమానాన్ని చూరగొన బట్టే 225 మంది ఎంపీలతో ఐదేళ్లూ పదవిలో ఉన్నారు. మోదీకి 280 మందికి పైగా ఎంపీలున్నారు. కానీ ఆయన పార్లమెంటులో ఉన్నది లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన విజయవంతమై ఉండవచ్చు. కానీ పార్లమెంటు, ఢిల్లీలో అధికారం నెరపడం పూర్తిగా భిన్నమైనవి. ఎంపీలకు ప్రధాని తప్పక అప్పయింట్మెంట్లు ఇవ్వాలి. చట్టం పరిధిలో వారు అడిగేవాటిని నెరవేర్చా ల్సి ఉంటుంది. పీవీ ఉదాహణను మోదీ ఏ కొద్దిగా పాటించి ఉన్నా ఆయనకు పార్లమెంటులో సమస్యే ఉండేది కాదు. ప్రతిపక్ష నేతలు సమస్యలు సృష్టించాల నుకున్నా పార్లమెంటు సభ్యులు పాల్గొనేవారు కారు. సభ సజావుగా సాగాలంటే... 1. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని గౌరవించాలని, వారు తమ విధానాలను ఆమోదించేలా చేసుకోవాలని మోదీ, బీజేపీలు అర్థం చేసుకోవాలి, నచ్చజెప్పే పద్ధతుల్లో వారితో రాజీ పడాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోక తప్పదు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిపక్షం మద్దతును కూడగట్టడంలో, దానితో క్రియాశీల సంబంధాలను నెలకొల్పుకోవడంలో విఫలమయ్యారు. కాబట్టే ఇటీవలి కాలంలో కొత్త చట్టాలను చేయలేకపోయారు. ఇక్కడా అదే జరుగుతోంది. 2. బీజేపీ తానిప్పుడు ప్రతిపక్షంలో లేనని అర్థం చేసుకోవాలి. పార్లమెంటు చర్చల్లో గెలవడమే ప్రధానమని అది భావిస్తోంది. కానీ వాస్తవానికి ప్రతిపక్షాలన్నీ దానికి వ్యతిరేకంగా ఐక్యమవుతున్నాయి, ప్రతిపక్షంతో సుహృద్భావ పూర్వకంగా సంభాషించగల నేతే బీజేపీలో లేనట్టుం ది. 3. బీజేపీ మంత్రుల్లో చాలా మంది వృత్తి రాజకీయవేత్తలు కారు. పైగా వారిలో ఎక్కువ మంది ఎలాంటి ప్రజాపునాది లేనివారు, రాజ్యసభ సభ్యులు. ప్రతిపక్ష ఎంపీల పట్ల మన్నన చూపాలని, వారి ఓటర్ల కోరికలను కూడా మన్నిం చి ప్రభుత్వానికి వారి మద్దతును కూడగట్టాలని తెలియదు. 4. మాజీ మంత్రులను, ఓటమిపాలైన ఎంపీలను అధికారిక నివాసాల నుండి ఖాళీ చేయించడాన్ని ప్రభుత్వం పెద్ద సమస్యను చేసి, మొత్తంగా ఢిల్లీ రాజకీయ వర్గమంతటికీ ఆగ్రహం కలిగేలా చేసింది. అది చేయాల్సిన పనే అయినా సున్నితంగా చేయవలసినది. ప్రత్యర్థి రాజకీయవేత్తలను అవమా నిస్తున్నట్టుగా గాక, 62 ఏళ్లుగా నెలకొన్న సంప్రదాయాలను పాటిస్తున్నట్టుగా ఉండాల్సింది. 5. విజయవంతమైన ప్రతి ప్రభుత్వానికి ప్రతిపక్షంతో సంబం ధాలు నెరపే దొడ్డిదారులు ఉంటాయి. బీజేపీకి ప్రతిపక్షాన్ని ఒప్పించడంలో నైపుణ్యం, లౌక్యం పూర్తిగా కొరవడ్డాయి. భారీ మెజారిటీ ఉన్నా ఇందిరాగాంధీ ప్రతిపక్షం ఆమోదాన్ని పొందడంలో విఫలమై, అప్రతిష్టపాలయ్యారు. మెజారి టీ లేకున్నా పీవీ ఆమెలా ఎన్నడూ ప్రతిపక్షాల దాడులకు గురై ఎరుగరు. అదీ తేడా. 6. మోదీ రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్ష ఎంపీలకు అందుబాటులో లేకుండా, సహాయాన్ని అందించని వైఖరిని అవలంబి స్తున్నారు. ఆయన ఆ వైఖరిని మార్చుకోవాలి. రాజ్యసభలో మెజారిటీ లభిస్తే చాలు, ఏమైనా చేయవచ్చని ఆయన అనుకుంటున్నారు. పార్లమెంటరీ వ్యవస్థ పనిచేసేది అలా కాదు. ఎంత గొప్ప మెజారిటీ ఉన్నా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని కూడా తన వెంట తీసుకుపోవాలి. అదెంత కష్టమైనా చేయక తప్పదు. 7. బీజేపీ 2004 నుండి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండి నిరంతరం పార్లమెంటుకు ఆటం కం కలిగించింది. ప్రతిపక్షాలకు ఉదాహరణగా మారింది. బడా కార్పొరేట్లు సైతం పార్లమెంటుతో సరిగా వ్యవహరిచలేకపోతోందని ప్రభుత్వాన్ని తప్పు పడుతుండటం ఆసక్తిదాయకం. పార్లమెంటుకు బాధ్యత వహించాల్సిన ప్రభు త్వం తీవ్ర రాజీలకు సిద్ధపడి మరీ సభ సజావుగా సాగేందుకు హామీని కల్పించా లి. పార్లమెంటు నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది కాదు. పలువురు మంత్రులు మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ తప్పుటడుగులు వేసేలా చేస్త్తు న్నారనే అభిప్రాయం కూడా ఉంది. నెహ్రూ, పీవీల బాటలో సాగాల్సిందే... ప్రధాని మోదీకి ఎంత జనాదరణ ఉన్నాగానీ ఆయన నెహ్రూ, పీవీల వంటి పూర్వ ప్రధానుల లాగే ప్రతిపక్షాల ఆమోదాన్ని సంపాదించుకోవాలి. మరో గుజరాతీ ప్రధాని మొరార్జీ దేశాయ్కి 1977లో 377 మంది లోక్సభ ఎంపీలుండే వారు. కానీ పట్టువిడుపులు, రాజీలేని ఆయన ధోరణి వల్ల ప్రభుత్వం మూడేళ్ల లోగానే కుప్పకూలిందని మోదీ గుర్తుంచుకోవాలి. బీజేపీ తన గెలుపుతో ఇక రాజకీయాలన్నీ అంతమైపోయాయని భావిస్తోంది. ప్రజాస్వామ్యంలో అదెన్న టికీ జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎన్నికల వరకు తనకు ఎదురే లేదనుకున్నారు. కానీ పదిహేనేళ్లుగా ఆయనకు సన్నిహితులైన మంత్రులు సైతం ఆయనను వీడుతున్నారు. రాజకీయవేత్తలు ఎప్పుడూ దెబ్బ తీయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తుంటారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ ప్రత్యర్థులు పలువురిని తమ పక్షానికి తె చ్చుకోగలిగారు. కాబట్టే విజయాలు సాధించారు. బీజేపీ పార్లమెంటులో కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. ఇప్పుడు దానికి పార్లమెంటు సజావుగా సాగేలా చేసే ఒక అమిత్ షా అవసరం. మోదీ పార్లమెంటులో తన వైఫల్యం ఎక్కడుందో, ఎందుకో సమీక్షించుకోవాల్సి ఉంది. పార్లమెంటు గౌరవాన్ని సంపాదించుకోలేకపోవడం వల్లే గొప్ప విజయా లు సాధిస్తున్నా గానీ ఆయన ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రధానిగా మోదీ తన పదవీ కాలం మొదట్లో చేపట్టాల్సింది రాజీ వైఖరే తప్ప, సంఘర్షణాత్మక వైఖరి కాదని గ్రహించాలి. సలహాదారులను పక్కకు నెట్టి, ఆయన రాజీలు చేసుకోవాలి. సమస్యాత్మకమైన అంతర్జాతీయ నేతలతో అంత బాగా వ్యవ హరించగలుగుతున్న ఆయన మన రాజకీయ నేతలతో అదే పని ఎందుకు చేయలేరు? - (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)