breaking news
Publishers
-
Election Commission: హోర్డింగులు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు ముద్రించాల్సిందే
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు కచి్చతంగా పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. హోర్డింగులు సహా ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే ఇతర సామగ్రిపై ప్రింటర్, పబ్లిషనర్ పేర్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో జవాబుదారీతనం, పారదర్శకత కోసమే ఈ నిబంధన విధించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన హోర్డింగులపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లు లేవంటూ ఆమ్ ఆద్మీ పార్టీ సహా పలువురు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హోర్డింగుల సహా కరపత్రాలు, పోస్టర్లపై ప్రింటర్, పబ్లిషర్ పేర్లను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. -
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
ప్రచురణ కర్తలు.. సాంస్కృతిక రాయబారులు
న్యూఢిల్లీ: ప్రచురణకర్తలు దేశ సాంస్కృతిక రాయబారుల్లాంటి వారని ఎమెస్కో పబ్లిషర్స్ అధినేత ధూపాటి విజయకుమార్ అన్నారు. రచయితలకూ, ప్రజలకూ మధ్య వారధిలా ఉంటూ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉండే విజ్ఞాన వ్యాప్తికి ప్రచురణకర్తలు దోహదం చేస్తారని ఆయన చెప్పారు. శనివారం ఇక్కడి కేంద్ర సాహిత్య అకాడమీలో ‘భారతీయ సాహిత్యంలో ప్రచురణ కర్తల పాత్ర’ అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. దేశంలోని వివిధ భాషల ప్రచురణకర్తలతో కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి వారి మధ్య ఒప్పందాలకు వీలు కల్పించాలని సూచించారు. జ్ఞానపీఠ ఫౌండేషన్ నిర్దేశకుడు లీలాధర్ మాండ్లోయి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డి.కె. ఏజెన్సీస్ అధినేత రమేశ్ మిట్టల్, డీసీ పబ్లిషర్స్ అధినేత రవి డీసీ తదితరులు మాట్లాడారు. -
నరేంద్ర మోదీ ని 'బుక్' చేసేస్తున్న పబ్లిషర్లు!
బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ అంటే సంచలన రాజకీయాలకు మారు పేరు. చాయ్ వాలా నుంచి పీఎం అభ్యర్థిగా ఆయన యాత్ర ఎంతో ఆసక్తికరం. అంతకుమించి, ఆయన జీవితంలో చాలా రహస్యాలున్నాయి. ఆయనకు పెళ్లైందా? అయితే భార్య ఉందా? భార్య ఉంటే ఆమె ఇప్పుడెక్కడ ఉంది? ఏం చేస్తోంది? మోదీకి, ఆమెకి ఇప్పటికీ సంబంధాలున్నాయా? ఆయన ఒంటరిగానే ఉంటారా లేక తల్లిగారితో కలిసుంటారా? గుజరాత్ అల్లర్లలో ఆయన పాత్ర ఏమిటి? మోదీ పర్సనల్ లైఫ్ కబుర్లేమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నల జవాబుల కోసం చాలా మంది వెతుకుతున్నారు. ఆయన జీవితం ఎంత విలక్షణమో అంతే వివాదాస్పదం. అందుకే మోదీ పట్ల ఉన్న ఈ ఆసక్తిని ఇప్పుడు ఈ ఎన్నికల వేళ ప్రింటింగ్, పబ్లిషింగ్ రంగం సొమ్ముచేసుకుంటోంది. మోదీపైన కుప్పలు తెప్పలుగా పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. తోచినవారు తోచినన్ని వివరాలు సేకరిస్తున్నారు. రాసినవారు రాయగలిగినంత రాస్తున్నారు. ఆన్ లైన్ అమ్మకందారు ఫ్లిప్ కార్ట్ వద్ద మోదీ జీవితానికి సంబంధించిన 42 కి పైగా పుస్తకాలున్నాయి. అందులో గుజరాత్ అల్లర్ల సమయంలో అహ్మదాబాద్ లో జర్నలిస్టుగా పనిచేసి, మోదీకి వ్యతిరేకంగా పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసి చీకాకు పెట్టిన కింగ్ షుక్ నాగ్ రాసిన 'ది నమో స్టోరీ, ఎ పొలిటికల్ లైఫ్( నుంచి నీలాంజన్ ముఖ్యోపాధ్యాయ రాసిన 'నరేంద్ర మోదీ, ది మ్యాన్' వరకూ పలు రకాల పుస్తకాలున్నాయి. ఒక్క ఇంగ్లీషులోనే కాదు, హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ సహా పలు భారతీయ భాషల్లో మోదీపై పుస్తకాలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి. ఒక రచయిత మోదీ చిన్నప్పుడు నాటకాలు వేసేవాడని, అందుకే ఆయన తన ప్రసంగాల్లో హావభావాలను, అభినయకళను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారని రాస్తే, ఇంకొకరు హిందీ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా నుంచి తాను వేసుకునే హాఫ్ కుర్తా ను మోదీ రూపొందించుకున్నారని రాశారు. మోదీపై వెలువడిన పుస్తకాల్లో నరేంద్ర మోదీ - ఎ పొలిటికల్ బయోగ్రఫీ, ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ - నరేంద్ర మోదీ, నరేంద్ర మోదీ - యెస్ హీ కెన్, నరేంద్రమోదీ - ది గేమ్ ఛేంజర్, మోడినామిక్స్, నరకేసరి నరేంద్ర మోదీ వంటివి హాట్ కేక్ లుగా అమ్ముడౌతున్నాయి. అంతే కాదు. నరేంద్ర మోదీ రాసిన సామాజిక్ సమరసతా, కన్వీనియంట్ ఎడ్యుకేషణ్ వంటి పుస్తకాలు కూడా ఇప్పుడు చాలా ఆసక్తిగా కొనుక్కుని చదువుతున్నారు. ఎన్నికల వేడి పెరిగేకొద్దీ తమ పుస్తకాల సేల్స్ పెరుగుతాయని పబ్లిషర్లు అంచనావేస్తున్నారు. మే నెల నాటికి మరిన్ని పుస్తకాలను మార్కెట్ పై వదిలేందుకు ప్రచురణకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. మోదీ ప్రధాని అయితే మాత్రం తమ అమ్మకాలు ఆకాశాన్ని తాకడం ఖాయమంటున్నారు ప్రచురణకర్తలు. ఎన్నికల వేళ రాజకీయ నాయకుల జీవిత చరిత్రల పట్ల గతంలో ఎన్నడూ ఇలాంటి ఆసక్తి కనిపించలేదు. వాజ్ పేయీ ప్రధాని అయిన తరువాత ఆయన రచనల పట్ల కొంత ఆసక్తి పెరిగిన మాట వాస్తవమే అయినా మోడీ క్రేజు దానిని బీట్ చేసేసింది. గత లోకసభ ఎన్నికల సమయంలో బీజేపీ మహారథి లాల్ కృష్ణ అద్వానీ 'మై కంట్రీ, మై లైఫ్' పేరిట తన ఆత్మకథను వెలువరించారు. అయితే దాని వల్ల అద్వానీకి పెద్దగా లాభం కలగలేదు. -
మొదలైన పుస్తకాల పండుగ
ప్రగతిమైదాన్లో తొమ్మిది రోజుపాటు నిర్వహించే 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమయింది. దేశవిదేశాలకుచెందిన 250 మంది ప్రచురణకర్తలు దీనికి హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు ఈ ప్రదర్శనను వీక్షించవచ్చు. న్యూఢిల్లీ: దేశవిదేశాల పుస్తకాల ప్రదర్శన, విక్రయాలకు నెలవైన 19వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన ప్రగతి మైదాన్లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయింది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పుస్తకాలను కొనుక్కోలేని పేద చిన్నారుల్లో పఠనాభిలాషను పెంచాలంటే అన్ని చోట్లా మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ‘మనది ఇప్పటికీ పేదదేశమే కాబట్టి గ్రంథాలయాల ఏర్పాటు తప్పనిసరి. చాలా మంది పిల్లలు పుస్తకాలు కొనుక్కోలేరు. గ్రంథాయాలు, పఠన సంస్కృతి అభివృద్ధికి అంతా కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. భారతీయ ముద్రణాపకుల సమాఖ్య (ఎఫ్ఐపీ) భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ) సహకారంతో 1995 నుంచి ఏటా ఢిల్లీ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తోంది. ఈసారి తొమ్మిది రోజులపాటు నిర్వహించే ప్రదర్శనకు దేశవిదేశాల నుంచి 250 మంది ప్రచురణకర్తలు హాజరయ్యారు. ఈ నెల 31న ప్రదర్శన ముగుస్తుంది. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సామాన్య ప్రజలు దీనిని వీక్షించవచ్చు. పఠనాభిలాష తగ్గుదలపై దృష్టిసారించడానికి ఈసారి దానినే ప్రధానాంశంగా చేశారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించేందుకు ‘లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్’ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ప్రదర్శనలకే పరిమితం కాకుండా సదస్సులు, చర్చాకార్యక్రమాలు, కవితా సమ్మేళనాలు, చిన్నపిల్లల కోసం కథల పఠనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ ప్రాధాన్యం గురించి ఎఫ్ఐపీ ప్రధాన కార్యదర్శి అశోక్గుప్తా స్పందిస్తూ ‘మంచి గ్రంథాలయాలను ఒకప్పుడు సమాజ సంపదగా భావించేవారు. అవి మనలో అంతర్భాగమయ్యాయి. అయితే ఈతరం ప్రజల్లో పఠనాభిలాష తగ్గుతోంది. ఈ అంశంపై దృష్టి సారించడం అత్యవసరం కాబట్టే లైబ్రరీస్ అండ్ రీడర్షిప్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. ప్రతిచోటా కనీసం చిన్నస్థాయి గ్రంథాలయాలనైనా ఏర్పాటు చేసి చదువుపై ఆసక్తిని పెంచాలని అభిప్రాయపడ్డారు. ప్రగతిమైదాన్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఢిల్లీతోపాటు అగర్తలా, ఆంధప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, అమెరికా, చైనాకు చెందిన ముద్రణసంస్థలు హాజరవుతున్నాయి. ఈసారి చిన్నారుల కోసం ‘లైబ్రరీ అండ్ ది రీడర్’ పేరుతో చర్చాకార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ‘సునె, జానే, ఖేలే కహానీ’ పేరుతో మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పలు కొత్తపుస్తకాల ఆవిష్కరణ సభలు కూడా జరుగనున్నాయి. ఇక పుస్తక ప్రదర్శనకు తొలిరోజే విశేష స్పందన కనిపించింది. కాలేజీ విద్యార్థులు యువత పెద్ద ఎత్తున ప్రదర్శనకు వచ్చారు. ప్రదర్శనకు ప్రవేశరుసుము రూ.20కాగా, విద్యార్థులకు 50 శాతం రాయితీ ఇస్తున్నారు. చిన్నారులు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ‘ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఢిల్లీవాసులు అమితంగా ఆసక్తి చూపుతారని అనుకుంటున్నాను. నిజంగా ఇది అద్భుత ప్రదర్శన. గ్రంథాలయాలను ఈసారి ప్రధానాంశంగా (థీమ్) చేశాం. దేశవ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరాం’ అని ఐటీపీఓ చైర్మన్, మేనేజింగ్డెరైక్టర్ రీటా మీనన్ అన్నారు. రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా వారికి ఒక గదిని కేటాయించామని, అక్కడ పాఠకులతో చర్చలు జరుపవచ్చని చెప్పారు. చాలా మంది రచయితలు, ప్రచురణకర్తలతో మాట్లాడడానికి ఆసక్తి చూపారని తెలిపారు. భారీగా తరలివచ్చిన స్కూళ్ల విద్యార్థులు ఢిల్లీలోని పలు పాఠశాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తొలిరోజే పుస్తక ప్రదర్శనకు తరలివచ్చారు. దేశవిదేశాల ప్రచుకరణకర్తలు ఈ ప్రదర్శనకు వస్తుండడం, ప్రత్యేక రాయితీలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను ఇక్కడికి తీసుకువచ్చామని పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి. ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలుగా ప్రగతి మైదాన్ వరకు రవాణా సదుపాయాలు కల్పించేందుకు చ ర్యలు తీసుకున్నామని రీటా తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం బోధన సామగ్రి దుకాణాలు, ఫలహారశాలలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు స్పందన తక్కువే న్యూఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ఈసారి పుస్తక ప్రదర్శనకు స్పందన కాస్త తక్కువే కనిపించిందని చెప్పాలి. దీని నిర్వాహకులు ఈ ఏడాది వారాంతాలకు బదులు శుక్రవారం కార్యక్రమాన్ని ప్రారంభించడమే దీనికి కారణమని చెబుతున్నారు. ‘మామూలు రోజుల్లో ప్రజలు తీరిక లేకుండా ఉంటారు కాబట్టి శుక్రవారం ప్రారంభించడం సరైంది కాదు. అందుకే తొలిరోజు వీక్షకుల సంఖ్య తక్కువగా కనిపించింది’ అని ఓంబుక్స్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈఓ సంజయ్ మాగో అన్నారు. ఇంత తక్కువ మంది వస్తే తమకు నష్టాలు ఖాయమన్నారు. ప్రతి ఏడు రెండు వారాంతాల్లో ప్రదర్శన ఉండేలా చూసేవారని, ఈసారి మాత్రం ఒక్క ఆదివారమే మిగులుతోందని నియోగి బుక్స్ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి చివరి రోజు ఆదివారమే అయినా మేం అప్పుడు స్టాల్స్ను ఖాళీ చేసే పనిలో ఉంటాం కాబట్టి వ్యాపారం పెద్దగా జరగకపోవచ్చు’ అని ఆయన అన్నారు. దీనికి ఐటీపీఓ ప్రతినిధులు వివరణ ఇస్తూ తాము కావాలని ఇలా చేయలేదన్నారు. గత ఆదివారం నుంచే స్టాల్స్ కేటాయిస్తున్నామని చెప్పారు. వచ్చే శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు కాబట్టి, సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మంచి పుస్తకాలు ప్రదర్శించగలిగే ఏ రోజైనా గిరాకీ బాగానే ఉంటుందని నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రతినిధి ఎం.ఎల్.భాటియా అన్నారు. ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోవడం, పుస్తకాలు ధరలు పెరగడం వల్ల ఈసారి అమ్మకాలు తక్కువగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రదర్శన ముగియడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పుడే నిరాశకు గురికావాల్సిన అవసరం లేదని ముంబై ప్రచురణ సంస్థ జైకో పబ్లికేషన్స్ ప్రతినిధి అభిప్రాయపడ్డారు.