breaking news
programms
-
నాసా ఉపయోగించే ప్రోగ్రామ్స్ ఇకపై ప్రజలకు...
అంతరిక్ష రంగంలో అనేక విజయాలను సాధించిన సంస్థ నాసా. పలు అంతుచిక్కని విషయాలను విశదీకరించడంలో నాసా పాత్ర ఎంతగానో ఉంది. బ్లాక్ హోల్స్, ఇతర గెలాక్సీలు, ఇతర గ్రహాలను క్షుణంగా పరిశీలించడానికి అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లను ఉపయోగిస్తారు. గతంలో నాసా జరిపిన ఈవెంట్ హరిజోన్లో భాగంగా తొలిసారిగా బ్లాక్ హోల్ చిత్రాన్ని తీసిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం వెనుక ఎంతగానో శ్రమ దాగి ఉంది. ఈవెంట్ హరిజోన్లో భాగంగా టెలిస్కోప్లు గ్రహించిన విషయాలను సూపర్ కంప్యూటర్తో గణించి చిత్ర రూపంలో తీశారు. కాగా ప్రస్తుతం నాసా కీలక నిర్ణయం తీసుకుంది. నాసా ఉపయోగించే పలు ఆవిష్కరణలకు ఉపయోగించే సాఫ్టువేర్లను ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ ఆవిష్కరణలతో నిజ ప్రపంచంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నాసా పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేశారు. నాసా అధికారిక వెబ్ సైట్లో సుమారు 800 ప్రోగ్రాంలను అందుబాటులో ఉంచనున్నట్లు ఒక ప్రకటనలో నాసా తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్రోగ్రాంలు ఎంతగానో ఉపయోగపడతాయని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నిల్సన్ పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్స్తో ఏరోనాటిక్స్, అటానమస్ సిస్టమ్స్, బిజినెస్ సిస్టమ్స్, ప్రాజెక్ట్ మేనెజ్మెంట్ , డేటా అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్, డిజైన్ అండ్ ఇంటిగ్రేషన్ టల్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన వాటికి పరిష్కారం చూపవచ్చునని నాసా భావిస్తోంది. నాసా అందించనున్న 832 ప్రోగ్రామ్స్ను ప్రజలకు జూలై 13 న అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేరోజు ఒక వెబినార్ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు సులువుగా ప్రోగ్రాంలను ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలను వివరించనున్నారు. -
జేవీవీ కార్యక్రమాలు ఆదర్శనీయం
–ఆర్డీఓ వెంకటాచారి –ముగిసిన రాష్ట్ర మహాసభలు నల్లగొండ కల్చరల్ : జన విజ్ఞాన వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆదర్శనీయమని ఆర్డీఓ వెంకటాచారి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలు సోమవారం ముగిసాయి. రెండవ రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల్లో పెనవేసుకుపోయిన మూఢ విశ్వాసాలను పారదోలుతూ వారిని చైతన్యం చేయడంలో జేవీవీ 30 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మూఢ నమ్మకాలను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరికీ సైన్స్ పట్ల అవగాహన కలిగివుండాలన్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు ఇలాంటి సభలు దోహదపడుతాయని పేర్కొన్నారు. జేవీవీ నిర్వహించే కార్యక్రమాలకు తన సహాయ, సహకారాలు ఉంటాయన్నారు. అనంతరం జేవీవీ రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వి.ఎం.మనోహర్ప్రసాద్, డాక్టర్ హెహెచ్.మోహన్రావు, డాక్టర్ మెహతాబ్ఎస్ బాబ్జి, అధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ ఆదినారాయణరావు, ఉపాధ్యక్షుడిగా ఫ్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి, ఫ్రొఫెసర్ బీఎన్.రెడ్డి, అందె సత్యం, ఎ.నాగేశ్వర్రావు, డాక్టర్ వి.ప్రభావతి, రామరాజు, ప్రధాన కార్యదర్శిగా టి.శ్రీనాథ్, కోశాధికారిగా ఎస్.జితేంద్ర, కార్యదర్శులుగా నర్సింహులు, టి.రాజు, ఎ.వెంకటరమణారెడ్డి, డాక్టర్ మమత, ఎన్.అరుణకుమార్, కస్తూరి ఎన్నికయ్యారు. సబ్ కమిటీ కన్వీనర్లుగా విద్య ఎల్వీఎన్.రెడ్డి, ఆరోగ్యం, డాక్టర్ రమాదేవి, సమత, ఝాన్సీరాణి, శాస్త్ర ప్రచారం ఫ్రొఫెసర్ కోయా వెంకటేశ్వర్రావు, ప్రచురణలు హరిప్రసాద్, చకుముఖి పి.ఆనంద్కుమార్, పర్యావరణం కె.బి. ధర్మప్రకాశ్, సామాజిక న్యాయం సర్వేశ్వర్రావు, సాంస్కృతిక ఎ.గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జేవీవీ నాయకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య, టి.రమేష్, లక్ష్మారెడ్డి, నాగేశ్వర్రావు, రమాదేవి, సతీష్, ఎన్. రత్నకుమార్, శ్రీనివాస్రాజు, మమత, బీఎన్.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.