-
డిస్కౌంట్ల పండగొచ్చింది..!
న్యూఢిల్లీ: పండుగల సమయాల్లో డిస్కౌంట్ సేల్స్ నిర్వహించడాన్ని చూశాం. కానీ, ఈ విడత పండుగలకు ముందే ఆఫర్ల విక్రయాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ గూడ్స్ అయిన టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, వస్త్రాలు, నిత్యావసర ఉత్పత్తులను సైతం తగ్గింపు ధరలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. బిస్కెట్లు, పప్పులపైనా ఈ తగ్గింపు ధరలు అమలవుతుండడం విశేషం. కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు, ముడి సరుకుల ధరలు పెరుగుదల ప్రభావంతో అధిక వ్యయాలను అధిగమించేందుకు, కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచుతూ వచ్చాయి. ఇది డిమాండ్పై ప్రభావం చూపించింది. ఈ విడత పండుగల నాటికి విక్రయాలు జోరందుకుంటాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎల్జీ, శాంసంగ్, సోనీ టీవీల ధరలు గత కొన్ని వారాల్లో 5–8% వరకు తగ్గాయి. మధ్య శ్రేణి నుంచి అధిక ధరల ల్యాప్టాప్ ధరలను సైతం రూ.1,500 నుంచి రూ.2,000 వరకు కంపెనీలు తగ్గించి విక్రయిస్తున్నాయి. ఇక స్మార్ట్ఫోన్లపై కంపెనీలు 4–5% డిస్కౌంట్ ఇస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నూనెలు సైతం.. నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగి వస్తుండడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. వంట నూనెల ధరలు 15–20 శాతం వరకు తగ్గాయి. పెద్ద బిస్కెట్ ప్యాక్ల ధరలపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు 15–20 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. వచ్చే కొన్ని నెలల పాటు విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్టు ఎఫ్ఎంసీజీ కంపెనీలు తెలిపాయి. ‘‘తయారీ వ్యయాలు తగ్గినందున ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తూ ఆగస్టు 15 నుంచి మా బిస్కెట్ ప్యాక్లపై 10–15 శాతం తగ్గింపు ఇస్తున్నాం’’అని పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా తెలిపారు. మరికొంత కాలం పాటు ముడి సరుకుల ధరల తీరును గమనించిన తర్వాత, అన్ని రకాల ఉత్పత్తులపై ధరల తగ్గింపు పరిశీలిస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెమీకండక్టర్లు, ఓపెన్ సెల్ ధరలు ఇటీవలి కాలంలో చెప్పుకోతగ్గ మేర తగ్గాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సైతం తయారీ వ్యయాలు 15 శాతం వరకు శాంతించాయి. ధరలు తగ్గించినప్పటికీ, ఇప్పటికీ ఉత్పత్తుల ధరలు కరోనా మహమ్మారి ముందు నాటితో పోలిస్తే అధికంగానే ఉండడం గమనించాలి. దీనికి కారణం కంపెనీలు గత రెండేళ్ల కాలంలో ధరలను గణనీయంగా పెంచాయి. -
గుడ్ న్యూస్.. 70 శాతం వరకూ తగ్గనున్న ఔషధాల ధరలు!
న్యూఢిల్లీ: రోగులకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. కీలకమైన ఔషధాల ధరలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రధానంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్క్యులర్ వ్యాధులకు సంబంధించిన మందుల ధరల తగ్గనున్నాయి. దీనివల్ల రోగులకు భారీ ఉపశమనం లభించనుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. మందుల ధరలను నియంత్రించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. అంతా అకున్నట్లు జరిగితే వాటి ధరలు 70 శాతం వరకు తగ్గిపోతాయని అధికారులు వెల్లడించారు. నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియనల్ మెడిసిన్(ఎన్ఎల్ఈఎం)–2015ను సవరించడంపై కేంద్రం దృష్టి పెట్టింది. రోగులు దీర్ఘకాలం ఉపయోగించే ఔషధాలపై హై–ట్రేడ్ మార్జిన్లపై పరిమితి విధించాలని యోచిస్తోంది. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు కూడా నిర్వహించింది. ఎన్ఎల్ఈఎంలో ఉన్న 355 మందుల ధరలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఇప్పటికే పరిమితి విధించింది. కొన్ని రకాల షెడ్యూల్డ్ మెడిసిన్లపై ట్రేడ్ మార్జిన్ను హోల్సేల్ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లపై 16 శాతానికి పరిమితం చేసింది. ఇలాంటి మందుల తయారీదార్లు సీలింగ్ ప్రైస్ కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. మిగతా మందుల విషయంలో ఇలాంటి నియంత్రణలు ఏవీ లేవు. కంపెనీలు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముకోవచ్చు. ధరలను కంపెనీలే నిర్ధారించుకోవచ్చు. ధరల నియంత్రణ పరిధిలో లేని ఔషధాలపై ట్రేడ్ మార్జిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటున్నాయి. ఫలితంగా ఆ భారమంతా అంతిమంగా రోగులే భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కీలక ఔషధాలను నియంత్రణ పరిధిలోకి తీసుకొస్తే వాటి ధరలు చాలావరకు తగ్గిపోతాయి. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
మొద్దు నిద్ర వదలరా
♦ ధరల నియంత్రణ గాలికి... పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ♦ సమీక్షకు మంత్రివర్గ ఉపసంఘం ఉందో, లేదో తెలియని పరిస్థితి ♦ సర్కారు నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు.. విపక్షాల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల మంటలో సామాన్య ప్రజానీకం అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదు. బియ్యం, పప్పు, చింతపండు, ఎండుమిర్చి, ఉల్లి, టమోటా లాంటి నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా.. ధరలను అదుపుచేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిన మంత్రివర్గ ఉపసంఘం.. అసలు ఉందో లేదో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. గడిచిన మూడు నెలల్లో మంత్రివర్గ ఉపసంఘం ఒక్కసారి కూడా ధరలపై సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. ఆ సంఘానికి దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అసలు నిత్యావసరాల ధరల నియంత్రణ తమ ప్రభుత్వ బాధ్యతే కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిత్యావసరాలపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘం ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించేది. కరువు సమయంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కంటింజెన్సీ ప్రణాళిక రూపొం దించేది. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఈ దిశగా అసలు ఆలోచనే చేయకపోవడం అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఆరు నెలల వ్యవధిలో పప్పుల ధరలు 3 రెట్లు పెరిగినా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా సబ్సిడీ ధరపై విక్రయాలు చేపట్టకపోవడంపై రాజకీయపక్షాలు మండిపడుతున్నాయి. బలవంతపు భూ సమీకరణ గురించి నిత్యం ప్రకటనలు చేస్తున్న మంత్రులకు పెరుగుతున్న నిత్యావరాల ధరలు కనిపించడం లేదా? వాటి నియంత్రణ మంత్రుల బాధ్యత కాదా? ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాజీవనాన్ని విఘాతం కలుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరింది. పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కేంద్రాల వద్ద ధర్నాలు చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ధరల మంటకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, వామపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. ముందుచూపు ఏదీ? : కరువు వల్ల పప్పు దినుసుల సాగు తగ్గిపోతుందని కిరాణా కొట్టు వ్యాపారి కూడా గ్రహించి పప్పుల ధరలు పెరుగుతాయని గుర్తిస్తాడు. సరుకు అందుబాటులో ఉన్నపుడు వీలైనంత కొని నిల్వ చేసుకుంటాడు. ధరలు పెరగ్గానే అమ్ముకుని లాభాలు ఆర్జిస్తాడు. ఒక చిన్న వ్యాపారికి ఉన్న ముందుచూపు అతి పెద్ద నెట్వర్క్ ఉన్న ప్రభుత్వానికి లేదా? అని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం కారణమా? లేక ధరల నియంత్రణ, పేదలకు సబ్సిడీతో సరఫరా అనే విషయాలు తమకు సంబంధం లేదని ప్రభుత్వం భావిస్తోందా? చెప్పాలని ఆ పక్షాలు నిలదీస్తున్నాయి. బాబు చెప్పిందేమిటి? చేసిందేమిటి? ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి అధికారంలోకి రాగానే చంద్రబాబు నీళ్లొదిలారు. ధరలు మండుతున్నా రూ. వెయ్యి కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే పౌరసరఫరాల శాఖ ద్వారా అమలవుతున్న పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బాబు.. అధికారంలోకి రాగానే ‘రూ. 175కే 9 నిత్యావసర సరుకుల పంపిణీ పథకాన్ని’ ఎత్తివేశారు. పథకాలను మెరుగుపరచడమంటే ప్రజలకు ఉపయోగంగా ఉన్న పథకాన్ని రద్ధు చేయడమేనా? అని రాజకీయ పక్షాల నేతలు, ప్రజలు నిలదీస్తున్నారు. ఏటా 12 వంట గ్యాస్ సిలిండర్లను రూ. వంద సబ్సిడీతో ఇస్తామన్న హామీకి నీళ్లొదిలారు. గతంలో ఉన్న రూ. 25 సబ్సిడీకి కూడా మంగళం పాడారు. తనను నమ్మి ఓట్లేసిన ప్రజలకు చంద్రబాబు నేడు చుక్కలు చూపిస్తున్నారు. ధరల మంటపై నేడు వెఎస్సార్సీపీ ధర్నాలు సాక్షి, హైదరాబాద్: వినియోగదారులను హడలెత్తిస్తూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ఈ నెల 2న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని సంకల్పించింది. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఈ ధర్నాల్లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. అక్టోబర్ 30న పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పండుగ సీజన్లో సైతం సామాన్యులు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక కుటుంబం సగటు ఖర్చులు 80 శాతం పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
- పుష్కర కాలం తర్వాత...
Advertisement