breaking news
Pongal race
-
స్టార్ హీరో అజిత్ సినిమా కోసం పాట పాడిన మంజూ వారియర్
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తుణివు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం తుణివు.. షూటింగ్ పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మంజు వారియర్ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది. అదే విధంగా కోలీవుడ్లో వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విడుదలపై ఇప్పటికే టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది అదే విధంగా కోలీవుడ్లోనూ వారీసు, తుణివు చిత్రాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కారణం విజయ్, అజిత్ చిత్రాల మధ్య పోటీ ఉండడమే.గతంలో అజిత్ నటించిన వీరం, విజయ్ నటించిన జిల్లా చిత్రాలు ఒకేసారి విడుదలై రెండూ మం విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత ఇప్పటివరకు అలాంటి పోటీ పరిస్థితి రాలేదు. అలాంటిది ఎన్నాళ్లకు మళ్లీ ఈ ఇద్దరు స్టార్ చిత్రాలు మధ్య పోటీ తప్పడం లేదు. అజిత్ నటిస్తున్న తుణివు చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. దీంతో అజిత్ గానీ.. ఆయన అభివనులు గానీ.. ఎలాంటి టెన్షన్ పడటం లేదు.తమ అభిమాన నటుడు చిత్రానికే అధిక థియేటర్లు.. లభిస్తాయనే ధీమాతో వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తుణివు చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ను ఆ చిత్ర హీరోయిన్ మంజు వారియర్ వెల్లడించారు. ఈ చిత్రం కోసం ఆమె ఒక పాట పాడిందన్నదే ఆ అప్డేట్. ఈ విషయాన్ని ఆమె సంగీత దర్శకుడు జిబ్రాన్తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేస్త తెలియజేశారు. Thrilled to have sung for @GhibranOfficial !!! Happy to be part of a very interesting song in #Thunivu! Waiting for you all to hear it! ❤️#ajithkumar #AK #hvinoth pic.twitter.com/G934UX79sg — Manju Warrier (@ManjuWarrier4) November 26, 2022 -
రేస్ నుంచి వైదొలగిన విజయ్సేతుపతి
పొంగల్ రేస్ నుంచి నటుడు విజయ్సేతుపతి తప్పుకున్నారు. ఈ సారి పొంగల్ బరిలో నాలుగైదు చిత్రాలు పోటీ పడడానికి సిద్ధమయ్యాయి. అలాంటిది రెండు చిత్రాలే చివరికి ఢీ కొంటున్నాయి. పొంగల్ రేసు నుంచి జీవీ.ప్రకాశ్కుమార్ నటించిన బ్రూస్లీ చిత్రం వారం క్రితమే తప్పుకుంది.అలాగే మరో రెండు చిత్రాలు వెనక్కి వెళ్లాయి. దీంతో విజయ్ నటించిన భైరవా, విజయ్సేతుపతి నటించిన పురియాద పుధీర్, పార్తిబన్ చిత్రం కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా మొదలగు మూడు చిత్రాలు పోటీకి సిద్ధమయ్యాయి. అలాంటిది ఇప్పుడు నిక్కా మూమెంట్లో విజయ్సేతుపతి చిత్రం పురియాదపుధీర్ పోటీ నుంచి తప్పుకుంది. ఇక విజయ్ భైరవా, పార్తిబన్ కోడిట్ట ఇడంగళ్ నిరప్పుగా చిత్రాలే బరిలో తలపడుతున్నాయి. భైరవా గరువారం భారీ స్థాయిలో తెరపైకి వచ్చింది. ఇక శనివారం పార్తిబన్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. విజయ్సేతుపతి చిత్రం విడుదల వాయిదా గురించి ఆ చిత్ర నిర్మాత దీపక్ భూపతి తెలుపుతూ విజయ్సేతుపతి, గాయత్రి జంటగా నటించిన తమ తొలి నిర్మాణం పురియాదపుధీర్ చిత్రం పొంగల్ రేసుకు సిద్ధమవుతుందని చాలా సంతోషించామన్నారు.ఇప్పటికే చిత్రంపై మంచి అంచనాలు నెలకొనడం చాలా ఉత్సాహాన్ని కలిగించిందన్నారు.అయితే తన తదుపరి చిత్రానికి ఏర్పడ్డ చిన్న సమస్య కారణంగా పురియాదపుధీర్ చిత్ర విడుదల వాయిదా వేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.తదిపరి విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.