-
అది కింగ్మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్ మధ్యప్రదేశ్లో కింగ్మేకర్గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్ ప్రాంతం కీలకంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్కు మాల్వా-నిమాడ్ విజయం ఎంతగానో సహాయపడింది. 2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం! -
కోటంరెడ్డి.. ఆనంరెడ్డి.. ఏ రెడ్డి వెళ్లినా.. ప్రజారెడ్లు జగన్ వెంటే..
శివరాత్రి వచ్చేస్తుంది. అప్పుడే ఎండలు మండిపొతున్నాయి. శివరాత్రి వెళ్లాక చలి కూడా శివ..శివ అంటూ వెళ్లిపోతుందట..!!. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కూడా మండే ఎండలతో పోటీ పడుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ తీరం వెంట రాజకీయ వేడి గాలులు వీస్తున్నాయి. ఆ వేడి గాలులతో ఏర్పడిన బంగాళాఖాతంలో ఏర్పడిన రాజకీయ అల్పపీడనం తీవ్ర తుఫాన్గా మారి నెల్లూరు జిల్లాలో తీరం దాటింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే 'కోటంరెడ్డి' తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాలని ప్రయత్నించింది. 'కోటంరెడ్డి'తుఫాన్ వెంట వచ్చిన 'ఆనంరెడ్డి' తుఫాన్ తీరాన్ని టచ్ చేసి తుస్ మంటే.. 'కోటంరెడ్డి' తుఫాన్ మాత్రం 'ఎల్లో గాలుల' సహయంతో విధ్వంసాన్ని సృష్టించాలని చూసింది. కానీ.. రాజకీయ వాతావరణవేత్తలు అంచనాలను, ఎల్లో వ్యూహకర్తల అంచనాలను 'కోటంరెడ్డి' నెరవేర్చలేకపోయారు. నెల్లూరు జిల్లాలో ప్రకంపనలు 'కోటంరెడ్డి' తుపాన్ సృష్టిస్తుందని చంద్రబాబు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. గత కొన్ని నెలలుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్.. అలానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో టచ్లో ఉన్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణ ఆరోపణ కాదు నిజం కావొచ్చు. ఎందుకంటే..అమరావతి పాదయాత్రికులకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సపర్యలు చేశారు. భోజనం పెట్టారు, మంచినీళ్లు ఇచ్చారు. ఇదంతా చేసింది మానవతాదృక్పథంతో అనుకోవడానికి వీళ్లేదు. దీనిలో రాజకీయ వ్యూహం, కోణం ఉన్నాయి. తన పార్టీ ఫిరాయింపుకు కోటంరెడ్డి ఆ రోజు నుంచే పునాదులు వేసుకుంటున్నాడు. కోటంరెడ్డి ప్రతి అడుగు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే వేశాడు. 'జగనన్న మాట గడప గడపకూ కోటంరెడ్డి బాట' పేరుతో కోటంరెడ్డి పాదయాత్ర చేసినా ఆ పాదయాత్ర తన రాజకీయ స్వార్ధంతో చేసిందే. తన పరపతి పెంచుకోవడానికి చేసిందే తప్పితే పార్టీ, ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ కోసం చేసింది కాదు. వైఎస్ఆర్ సీపీ స్థాపించక ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక సామాన్య కార్యకర్త. అటువంటి కోటంరెడ్డి ఇప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ సీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటో పెట్టుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన మొదటి సారి టికెట్ తెచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో నెల్లూరులో అందరికీ తెలుసు.. రెండోసారి టికెట్ ఇవ్వొద్దని నెల్లూరు రూరల్ నుంచే ఎన్నో వినతలు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి గెలిపించుకున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మొదటి నుంచి ఆ జిల్లా నేతలు, కార్యకర్తలకు అనుమానమే కానీ..సీఎం వైఎస్ జగన్ తన మనిషిగానే కోటంరెడ్డిని చూశారు. 'శ్రీధరన్న' అని ఆప్యాంగా పిలిచేవారు. ఆ మంచి మనసుకు , ఆ మంచి మాటకు కోటంరెడ్డి వెన్నుపోటు పొడిచాడు. రాజకీయాల్లో "హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయి'. వైఎస్ఆర్ సీపీని వదిలేసి టీడీపీలోకి వెళ్లాలనే కోటంరెడ్డి నిర్ణయం 'రాజకీయ ఆత్మహత్య'. దీనిలో సందేహం లేదు. వైఎస్ఆర్ సీపీ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను లాక్కున్నాడు. నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఏమైందీ...ఆ 23 మంది, ముగ్గురు ఎంపీలు ఎక్కడున్నారు..? కోటంరెడ్డి ఆలోచన చేసుకోవాలి. పదవులు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం. నడిపించే నాయకుడు ముఖ్యం. కోటంరెడ్డిలో పదవి కాంక్ష ఎంతగా పెరిగిపోయిందంటే చంద్రబాబును చీకట్లో కలిసే అంతగా పెరిగిపోయింది. కోటంరెడ్డికి పదవిపై ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో డిన్నర్ చేసే అంతగా..!!. జగనన్నను ఎంతగానో అభిమానిస్తానని చెప్పుకునే కోటంరెడ్డి.. చంద్రబాబును ఎందుకు కలిశాడు..? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి ఎందుకు డిన్నర్ చేశాడు..? వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పినట్లు 'కోటంరెడ్డి ఫోన్ కాల్ ట్యాప్ చేయలేదు.. చంద్రబాబు ట్రాప్లో కోటంరెడ్డి పడ్డారు". కాకాణి మాటలు అక్షర సత్యం. " పార్టీ లేదు బొక్కా లేదు" అని అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు. "రోజు రోజుకు పార్టీ నిర్వీర్యమైపోతుందని" చంద్రబాబు స్వయంగా అన్నారు. కుప్పంలో తన పరిస్థితి బాగోలేక పక్క జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తే బాగుంటుందో అని చంద్రబాబు సర్వేలు చేయించుకుంటున్నారు. కుప్పంలో కూర్చొని పక్క చూపులు చూస్తున్నారు. లోకేష్కు మంగళగిరిలో పోటీ చేసే ధైర్యం లేదు. హిందూపూర్లో బాలయ్య ఓడిపోతాడనే టాక్ గట్టిగా వినిబడుతోంది. నా దృష్టిలో టీడీపీ సోషల్ మీడియాలోనే బతుకుతుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ పాడె మీద ఉంది. పాడె మీద ఉన్న టీడీపీలోకి పోయి కోటంరెడ్డి ఏం సాధించాలని..?!!. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఏ రెడ్డి అయినా పదవి కాంక్షతో కాకుండా వాస్తవ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. చంద్రబాబు కౌగిలి విష కౌగిలి, దృతరాష్ట్ర కౌగిలి అని కోటంరెడ్డి, ఆనంరెడ్డి గ్రహించాలి. మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటాడు..తరువాత కరివేపాకులా పడేస్తాడు. ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన బాబుకు కోటంరెడ్డి, ఆనంరెడ్డి ఓ లెక్కా..?. నెల్లూరు జిల్లాలో కావాలనే అసంతృప్తిగా ఉన్న రెడ్లను టార్గెట్ చేశాడు చంద్రబాబు. అనుకున్నదే తడువుగా రాధాకృష్ణను రంగంలోకి దింపాడు. కోటంరెడ్డి గాలం వేశారు. ఆనంను కదిలించారు. ఎందుకు..? నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ కంచు కోట. 2019లో నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ సీటు వైఎస్ఆర్ సీపీ గెల్చుకుంది. నెల్లూరు జిల్లాలో రాజకీయ తుఫాన్ అలజడి అటు రాయలసీమ రెడ్లలోనూ..ఇటూ ప్రకాశం, పల్నాడు రెడ్లలోనూ ఉంటుంది అనేది చంద్రబాబు అంచనా. కానీ..కోటంరెడ్డి వెనుక కార్పొరేటర్ కూడా పోవడానికి సిద్దంగా లేడు. ఇదీ కోటంరెడ్డి బలం. సోనియాతో కలిసి చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ఆర్ కుటుంబాన్ని, జగనన్నను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు, ఎల్లో మీడియా రెడ్లకు సహజ శత్రువులు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం, ఎల్లో మీడియా ఉన్నంత కాలం ఆ శత్రత్వం కొనసాగుతూనే ఉంటుంది. పదేళ్లు ప్రాణాలు ఫణంగా పెట్టి జగనన్న జెండా ఎగిరేలా కష్టపడ్డాం. జగనన్నను సీఎం సీటు మీద చూసుకున్నాం. మన అంచనాలకు మించి జగనన్న పరిపాలన చేస్తున్నారు. దేశమే కాదు, ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తున్నారు. ఎల్లో రాక్షసులతో మహా యుద్ధమే చేస్తున్నారు. ఆ మహా యుద్ధంలో జగనన్నకు మనమంతా తోడుగా ఉండాలి. అండగా నిలబడాలి. జగనన్న చేతిలో మనమే ఆయుధాలమై ఎల్లో రాక్షసుల నీచ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. అంతేకాని..పదవుల కోసం జగనన్నను వదిలేసి వెళ్లకూడదు. 10 ఏళ్లు కష్టపడ్డాం..జగనన్న మాకేం చేయలేదనే రెడ్లు ఒక్కటీ ఆలోచించాలి. జగనన్న ఆలోచనను అర్థం చేసుకోవాలి. జగనన్న కళ్లతో భవిష్యత్తును సందర్శించాలి. గాంధీ జీ, అంబేద్కర్ కలల సాధకుడు సీఎం వైఎస్ జగన్. పదవుల కోసం ఆశపడే వారే జగన్ను విడిచి వెళ్తారు.. చరిత్రలో నిలిచి, చరిత్ర సృష్టించాలి అనుకునేవారు వైఎస్ జగన్తో ఉంటారు.. మళ్లీ ఆయనను సీఎం చేసుకుంటారు. అంటే..ప్రజారెడ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. 'కోటంరెడ్డి' తుఫాన్లు ఎన్ని వచ్చినా తీరం కూడా దాటనీయకుండా అడ్డంగా అడ్డుపడతారు. భవిష్యత్తు దివిటీలై వెలుగుతారు. ::: వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ.. సామాజిక విశ్లేషకులు -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
భారత్ జోడో... కాంగ్రెస్కు తాడో పేడో
పన్నెండు రాష్ట్రాల గుండా 150 రోజుల పాటు సాగేలా కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తోంది. బీజేపీ హిందుత్వ రాజకీయాల నుంచి దేశాన్ని రక్షించేందుకు దీన్ని చేపట్టినట్టుగా పార్టీ చెబుతోంది. కానీ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలను చర్చకు పెట్టడం... తద్వారా బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం; బీజేపీని ఓడించాలంటే ఏ కూటమికైనా తమ మద్దతు తప్పనిసరన్న సంకేతాలను పంపడం; కాంగ్రెస్ను గద్దెనెక్కించడం రాహుల్ గాంధీకి మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం అనే మూడు లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. పడిపోతున్న రాజకీయ గ్రాఫ్ మళ్లీ ఎగబాకడం మాత్రం పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తుందన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సరైన దిశగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రాల ఎన్నికల్లో వరుస ఓటములతో కుదేలైన పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ భారత్ జోడో యాత్రతో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడింది. దేశంలోని మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండా వెళ్లే ఈ పాదయాత్ర భారతీయ జనతా పార్టీ ‘హిందుత్వ’ అజెండా నుంచి దేశాన్ని రక్షించేందుకని కాంగ్రెస్ చెప్పుకుంటోంది. బీజేపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ హిందుత్వ అజెండా రెండూ భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏటికేడాదీ క్షీణిస్తున్న తన ప్రాభవాన్ని పౌర సమాజం, మేధోవర్గం సాయంతో మళ్లీ పొందేందుకు జరుగుతున్న ప్రయత్నమే కాంగ్రెస్ చేస్తున్న ఈ భారత్ జోడో యాత్ర అని చెప్పక తప్పదు. స్థానిక ఎన్జీవోలు, ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై వారిలో నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ పాలన మొత్తం నిరంకుశ ధోరణితోనే నడిచిందనీ, అత్యవసర పరిస్థితులను తలపించేదేననీ కాంగ్రెస్ చెబుతోంది. తద్వారా 1978 నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం జరుగు తోంది. ఎంతో ముందుచూపుతో, పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ఈ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టినా... పడిపోతున్న రాజకీయ గ్రాఫ్ మళ్లీ పైకి ఎగబాకడం మాత్రం ఆ పార్టీ నాయకత్వం, పార్టీ వ్యవస్థ ఎంత సమర్థంగా వ్యవహరిస్తాయన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. నిరాసక్త నేత... పాదయాత్ర! కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లేమి ఉందన్నది నిర్వివాద అంశం. 2019 లోక్సభ ఎన్నికల ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రభావం రాహుల్గాంధీ యాత్రపై కూడా పడే అవకాశం ఉంది. అలాగే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్కు పెద్దగా ప్రయోజనం చేకూరదనేందుకు రెండు కారణాలు కనిపిస్తు న్నాయి. మొదటిగా చెప్పుకోవాల్సింది, అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ చూపిన మొండితనం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలన్న పార్టీ సీనియర్ నేతలు పదేపదే చేస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతూండటం కూడా రాహుల్ గాంధీ నేతృత్వంపై అనుమానాలను రేకెత్తిస్తోంది. రాహుల్ ఆలోచనా ధోరణి ఫలితంగా రాజకీయంగా అతడికి నష్టం చేకూర్చేదిగా పరిణ మిస్తోంది. ఇక రెండో కారణం... తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగడం వల్ల పార్టీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇది పార్టీ కార్యకర్తల్లోనూ, సంప్రదాయ మద్దతుదారుల్లోనూ కొంత గందరగోళాన్ని ఏర్పరుస్తోంది. పూర్తిస్థాయి నేతగా బాధ్యతలు చేపట్టే విషయంలో రాహుల్ గాంధీ ఇప్పటికీ విముఖంగా ఉండటం, అధికార బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఏదీ లేకపోవడం కూడా రాహుల్గాంధీని మాటల నేతగానే మార్చాయే తప్ప... ప్రజలను భారీ ఎత్తున ఆకర్షించే చరిష్మా ఉన్న నేతగా, పార్టీకి అట్టడుగు స్థాయి నుంచి మద్దతు కూడగట్టగల స్థాయి గలవాడిగా మార్చలేక పోయాయి. నేతృత్వం విషయాన్ని కాసేపు పక్కనబెట్టినా భారత్ జోడో యాత్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించే వనరులు, దానికి తగ్గ ప్రతిష్ఠ కూడా కాంగ్రెస్కు లేవనే చెప్పాలి. 2014 ఎన్నికల తరువాత రాజకీయంగా తన ఆధిపత్యాన్ని సాంతం కోల్పోయేందుకు ఉన్న కారణాల్లో ఒకటి వారసత్వ రాజకీయాలు కొనసాగడమైతే... రెండోది మైనార్టీలను బుజ్జగించే విధనాలు. రాజకీయంగా, సైద్ధాంతికంగా ఏర్పడ్డ స్తబ్ధత, పట్టూవిడుపుల్లేని పద్ధతి, పార్టీ వ్యవస్థ కుప్పకూలడం, కీలక నేతలు తండోపతండాలుగా ఇతర పార్టీలకు వెళ్లిపోవడం వంటివి ఇతర కారణాలు. దేశాద్యంతం ఆధిపత్యం చలాయించగలిగే స్థాయిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. సమాజానికీ, పార్టీకీ మధ్య ఉన్న సమాచార వ్యవస్థ కూడా కుప్పకూలిపోయింది. ఈ నేపథ్యంలో 150 రోజుల పాటు సాగే సుదీర్ఘ పాదయాత్ర ఒకటి చేపట్టే ప్రయత్నం చేయడం కొంచె అమాయకంగానూ, మరికొంచెం అవాస్తవంగానూ అనిపించక తప్పదు. బీజేపీని ఎదుర్కోగలదా? భారత్ జోడో యాత్ర ప్రజా ఉద్యమం అని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. పార్టీ లోపలా, బయటా ఉన్న మేధావులు, ఎన్జీవోల మద్దతుతో సాగుతోందని కూడా చెబుతోంది. ఇలాంటి ప్రకటనలే పౌర సమా జపు నిష్పాక్షికత, స్వతంత్రతలపై అనుమానాలు రేకెత్తిస్తాయి. లెఫ్ట్ లిబరల్ పార్టీలతో అంటకాగుతూండే ఎన్జీవోలు, విద్యావేత్తల ముసుగులు తొడుక్కున్న నేతలు కొందరు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటూండటం వారి కృత్రిమత్వాన్ని బయటపెడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణే లక్ష్యంగా వీరు పని చేస్తు న్నారు. తద్వారా అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాలను పొంద వచ్చునని వీరు భావిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ఎన్జీవోల జాతకాలు బట్టబయలయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్జీవోలు కొన్ని మనీలాండరింగ్కు, ఇతర ఆర్థిక అపసవ్యతలకు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమైంది. అలాంటి సంస్థలిప్పుడు భారత్ జోడో యాత్రకు మద్దతుగా నిలవడం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న మర్యాదను మరింత తగ్గించేదిగా మారుతుంది. అది రాజకీయంగా మరింత దిగజారేలా చేస్తుంది. సగం భారతదేశాన్ని చూసేందుకు రాహుల్గాంధీ యాత్ర చేపట్టిన సమయమూ అంత ఉచితంగా ఏమీ లేదు. ఎందుకంటే సొంతింట్లో బోలెడన్ని సమస్యలున్నాయి మరి. వాటిని చక్కదిద్దుకోకుండానే... కాసుల కట్టలతో కళకళలాడుతున్న... విస్తృత స్థాయి కార్యకర్తల మద్దతున్న బీజేపీని ఎదుర్కునేందుకు సిద్ధవమవడం ఎంతవరకూ సబబు? పోనీ రాజకీయంగా అందరినీ ఆకర్షించే విధానం, కథనం ఏదైనా ఉందా అంటే అదీ లేదు. అందరికీ ఆమోదయోగ్యమైన నేత, కాషాయ పార్టీకి చెక్ పెట్టగల వ్యవస్థాగత నిర్మాణం, అన్ని వర్గాల ఓట్లను కూడగట్టగలిగే చాతుర్యమూ కరవే. రాహుల్ ఇమేజ్ పెంచేందుకే... ఆధిపత్య ధోరణలు, ఈగోలపై ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత్ జోడో యాత్ర మొత్తాన్నీ కొంచెం నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ మూడు అంశాలను చెప్పేందుకు ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది. ఒకటి.. భారతీయ ప్రజాస్వామ్య ప్రస్తుత పోకడలనూ, పెరిగిపోతున్న ఒంటెత్తు పోకడలనూ అంతర్జా తీయ స్థాయిలో చర్చకు పెట్టడం... తద్వారా భారతీయ జనతా పార్టీ ఇమేజ్ను దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలను పొందడం. రెండోది... మీడియా సాయంతో క్షేత్రస్థాయిలో తనకు మద్దతు పెరుగుతోందన్న భ్రమ కల్పించడం ద్వారా... బీజేపీని ఓడించాలంటే ఏ పార్టీ, కూటమికైనా తమ మద్దతు తప్పనిసరి అన్న సంకేతాలను పంపడం. కార్యకర్తల్లో రాహుల్గాంధీకి ఉన్న ఇమేజ్ను పెంచడం, అందుకోసం ప్రజామద్దతును ఉన్నదానికంటే ఎక్కువ చేసి చూపడం, కాంగ్రెస్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం రాహుల్కు మాత్రమే సాధ్యమన్న భ్రమను కార్యకర్తల్లో కల్పించడం మూడో ఉద్దేశం. అయితే నాయ కత్వం పరంగా ఇప్పటివరకూ ఏమీ సాధించని రాజకీయ వారసుడు రాహుల్ గాంధీ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రను చేపట్టడం ఏమంత సత్ఫలితాలు ఇవ్వకపోగా... నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి! వ్యాసకర్త: ప్రవీణ్ రాయ్, రాజకీయ విశ్లేషకులు, సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, న్యూఢిల్లీ -
ప్రియాంకతో కాంగ్రెస్ నిధుల సమస్య తీరొచ్చు!
వాషింగ్టన్: ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందనేది ఇప్పటి వరకు స్పష్టం కానప్పటికీ.. ఆమె రంగప్రవేశంతో ఆ పార్టీ వనరులు, నిధుల లేమి నుంచి బయటపడే అవకాశముందని నిపుణులు అంటున్నారు. నిధుల విషయంలో అధికార బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉందని వారు చెబుతున్నారు. ‘కాంగ్రెస్లో కొత్తగా ప్రచార బాధ్యతలు చేపట్టిన ప్రియాంక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు. కానీ, ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన నిధుల కొరత తీర్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి’ అని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్కు చెందిన రాజకీయ విశ్లేషకుడు మిలన్ వైష్ణవ్ అంటున్నారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ’ మేగజైన్కు రాసిన తాజా వ్యాసంలో ఆయన ఈ విషయం పేర్కొన్నారు. ‘కాస్ట్స్ ఆఫ్ డెమోక్రసీ: పొలిటికల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా’ పుస్తకం సహ రచయిత కూడా అయిన వైష్ణవ్.. ‘ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి నిధులు అందకపోవడంతో రాష్ట్ర విభాగాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో చాలా తక్కువ విజయాలు సాధించిన ఆ పార్టీ తీవ్ర నిరాశలో కూరుకుపోయి ఉంది. దేశ రాజకీయాలకు కీలక బిందువైన ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పట్టించుకోకుండా ముఖ్యమైన ఎస్పీ–బీఎస్పీ పార్టీల కూటమి ఏర్పడటం మరో దెబ్బ. ఎంతో కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 41 లోక్సభ సీట్లున్న తూర్పు ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చింది. మిగతా పక్షాలతో కలిసి ఎన్నికల్లో బీజేపీపై పైచేయి సాధించటానికి ఆ పార్టీకి అవకాశం వచ్చింది. అయితే, శ్రేణుల్లో ఉత్తేజం నింపడం, మిత్రుల్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు ఎన్నికల్లో గెలుపునకు డబ్బు ఎంతో కీలకం. ఆ పార్టీకి నిధుల కొరత ఉంది. ప్రియాంక రాకతో అది తీరే అవకాశం ఉంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement