breaking news
pin code
-
లైవ్ లొకేషన్ తరహాలో తపాలా డిజిపిన్
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ పిన్ (డిజిపిన్) వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో అనుసంధానించేందుకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా తపాలాశాఖ ప్రతి 16 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేకంగా ఓ పిన్ నంబర్ను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిన్ నంబర్నే ఇప్పుడు రియల్టైమ్ లొకే షన్గా వాడుకునేలా తపాలాశాఖ గూగు ల్ మ్యాప్ ద్వారా అనుసంధానించింది. దీనిని వైద్యారోగ్య, పోలీసు, అగ్నిమాపక, రెవె న్యూ, మత్స్య తదితర శాఖలతో అనుసంధానిస్తారు. ఇది అత్యవసర సందర్భాల్లో ప్రజ లకు వీలైనంత తొందరలో సహాయం అందేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు ఆయా శాఖలతో అనుసంధానించాలంటూ తాజాగా తెలంగాణ తపాలాశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏంటీ వ్యవస్థ? ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా తపాలాశాఖ ఆధ్వర్యంలో పిన్కోడ్ నంబర్లు ఉన్న విష యం తెలిసిందే. ఓ గ్రామానికో, పట్ట ణాలు/నగరాల్లోని కొంతభాగానికో ఒకటి చొప్పున ఈ పిన్కోడ్ నంబర్లు ఉన్నాయి. అది చాలా పెద్ద పరిధితో కూడిన ప్రాంతానికి ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా చిన్నచిన్న ప్రాంతానికి ఒక ప్రత్యేక పిన్ నంబర్ ఉండేవిధంగా తపాలాశాఖ డిజిపిన్ వ్యవస్థను రూపొందించిన విషయం తెలి సిందే. ఐఐటీ హైదరాబాద్, నేషనల్ రిమో ట్ సెన్సింగ్ ఏజెన్సీల సంయుక్తాధ్వర్యంలో దీనిని రూపొందించారు.దేశంలో ప్రతి 4 చదరపు మీటర్లు ఇంటూ 4 చదరపు మీటర్ల ప్రాంతానికి ప్రత్యేక డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ను కేటాయించారు. దాన్ని అక్షాంశ రేఖాంశాల ఆధారంగా స్థిరీకరించి శాటిలైట్ ద్వారా అనుసంధానించారు. ఇప్పుడు గూగుల్తో దాన్ని అనుసంధానించారు. మనం ఎక్కడున్నా ఆ ప్రాంత డిజిపిన్ను గుర్తించొచ్చు. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ‘నో మై డిజిపిన్’అని టైప్ చేయగానే డిజిపిన్ యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేయగానే గూగుల్ మ్యాప్లో ఆ ప్రాంత డిజిపిన్ కనిపిస్తుంది. దాన్ని కంప్యూటర్/ల్యాప్టాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం గూగుల్ మ్యాప్లో మన లొకోషన్ ఎలా కనిపిస్తుందో, అలాగే మనం ఉన్న ప్రాంత డిజిపిన్ కూడా కనిపిస్తుంది. ⇒ దేశం మొత్తాన్ని 16 గ్రిడ్లుగా విభజించారు. మళ్లీ పత్రి గ్రిడ్ను 16 చిన్న గ్రిడ్లుగా విభజించారు. అలా పది లేయర్లుగా విభజిస్తూ చివరు 16 చదరపు మీ టర్ల ప్రాంతం వరకు విభజించారు. ప్రతి గ్రిడ్కు ఓ నంబరు కేటాయిస్తూ.. చివరకు 16 చదరపు మీటర్ల ప్రాంతానికి పది డిజిట్లతో కూడిన ఫైనల్ నంబరు కేటాయించారు. అదే తుది డిజిపిన్ నంబరు. ⇒ ఇది ఇంచుమించు ప్రతి ఇంటికి కాస్త అటూ ఇటుగా ఓ పిన్ నంబరుగా ఉంటుంది. పెద్ద అపార్ట్మెంట్లు, విశాలమైన ప్రాంగణం ఉన్న వాటికి నాలుగైదు నంబర్లు ఉంటాయి. వాటిల్లో ఏ నంబరును వినియోగించినా... మన కచ్చితమైన చిరునామాను గుర్తించొచ్చు. ⇒ ఇక పార్శల్స్, ఉత్తరాలను పోస్ట్/కొరియర్ చేసేప్పుడు నగరం, పట్టణం, కాలనీ, వీధి, ఇంటినంబరు... ఇలాంటివి ఏవీ లేకుండా వ్యక్తి పేరు, డిజిపిన్ రాస్తే ఎలాంటి వెతుకులాట లేకుండా కచ్చితంగా ఆ చిరునామాను గుర్తించొచ్చు. ⇒ చిరునామాలో వ్యక్తిగత గోప్యత ఉండాలనుకునేవారు వారి వ్యక్తిగత చిరునామా ఇవ్వకుండా కేవలం డిజిపిన్ ద్వారా ఆ పార్శిల్ను ఇంటికి తెప్పించుకోవచ్చు. ⇒ మనం వేరే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నామో.. అవతలి వారికి తెలిపేందుకు ఈ డిజిపిన్ను వాడుకోవచ్చు. ⇒ భారీ వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదా లు, ఇతర ఉపద్రవాల్లో చిక్కుకున్నప్పుడు.. తాను ఉన్న ప్రాంతాన్ని అత్యవసర సేవలు అందించే వారికి ఈ డిజిపిన్ ద్వారా సులభంగా తెలపొచ్చు. ⇒ ఈ–కామర్స్ కంపెనీలు, డిజిటల్ సర్వి సు ప్రొవైడర్లతో కూడా ఈ డిజిపిన్ వ్యవస్థను అనుసంధానించే కసరత్తు జరుగుతోంది. అప్పుడు క్యాబ్/ఆటో ప్రొవైడ ర్లు, ఆహార పదార్థాల సరఫరా సంస్థలు, కిరాణా, మందుల సరఫరా సంస్థలు కూడా వీటిని వినియోగించుకోవచ్చు. ⇒ ఈ డిజిపిన్ ఏపీఐ, ఓపెన్ సోర్స్ రిపోజిటరీ జిట్హబ్లో అందుబాటులో ఉన్నా యని, తమ పోర్టళ్లతో అనుసంధానించుకోవచ్చని తపాలాశాఖ పేర్కొంటోంది. -
ఆన్లైన్ బ్యాంకింగ్లో ‘ఎమోజీ’ పిన్ కోడ్లు
లండన్: ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీల్లో నాలుగు అంకెల పిన్ కోడ్ స్థానంలో ‘ఎమోజీ’లను ఆవిష్కరించింది లండన్కి చెందిన బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇంటెలిజెంట్ ఎన్విరాన్మెంట్స్. పాతబడిన నంబర్ల పద్ధతికి బదులుగా సరదాగా ఉండే ఎమోజీలను పాస్ కోడ్లుగా వాడటమనేది 15-25 ఏళ్ల యూజర్లకు ఆకర్షణీయంగా ఉంటుందని సంస్థ ఎండీ డేవిడ్ వెబర్ చెప్పారు. 0-10 దాకానే ఉండే అంకెలతో పోలిస్తే 44 ఎమోజీల కాంబినేషన్లు మరింత సురక్షితంగా ఉంటాయని వివరించారు. ఎలక్ట్రానిక్ మాధ్యమంలో సమాచార మార్పిడి కోసం... వివిధ రకాల హావభావాలతో కూడిన చిత్రాలను ఎమోజీలుగా వ్యవహరిస్తారు. -
సినీ ఫక్కీలో ఏటీఎం నుంచి డబ్బులు స్వాహా
నాగర్కర్నూల్, న్యూస్లైన్: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేం దుకు వచ్చిన ఓ బాలుడిని నమ్మించి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఏటీఎం కార్డులు తారుమారు చేశాడు. ఆ తర్వాత రెండు ఖాతాల్లోని *46,100 డ్రా చేసుకుని వెళ్లిన సంఘటన ఆల స్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నాగర్కర్నూల్ పట్టణానికి చెందిన ఎం.వసురాంనాయక్కు స్థానిక ఎస్బీహెచ్లో, అతని భార్య ఎం.పద్మకు ఎస్బీఐలో ఖాతాలున్నాయి. ఈనెల 15న తమ కుమారుడు కుమార్నాయక్ను ఎస్బీహెచ్ ఖాతాలోంచి డబ్బులు తీసుకురావాలని తల్లిదండ్రులు పురమాయించారు. రెండు ఏటీఎం కార్డులు ఒకే కవర్లో ఉండటంతో వాటిని తీసుకుని రాంనగర్కాలనీలోని ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లాడు. డబ్బులు డ్రా చేసే క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆగంతకుడు ‘డబ్బులు అలా డ్రా చేయరాదు, నేను చేసిస్తాను తెమ్ము..’ అంటూ ఏటీఎం కార్డులు తీసుకుని పిన్ కోడ్ తెలుసుకున్నాడు. రూ.500 డ్రా చేసి ఆ బాలుడి చేతిలో ఏటీఎం కార్డులు ఉంచిన కవర్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అసలు కార్డులు ఇవ్వకుండా ఏమార్చాడు. ఇది గమనించని కుమార్నాయక్ ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 19న తిరిగి డబ్బులు అవసరం ఉండటంతో తండ్రి వసురాంనాయక్ కార్డులున్న కవర్ తీసుకెళ్లి ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసేందుకు యత్నించగా అవి పనిచేయలేదు. పరిశీలిస్తే ఆ రెండు కార్డులు తమవి కావని తేలింది. మారిన రెండు ఏటీఎం కార్డుల్లో ఒకదానిపై గంప రాకేష్కుమార్ పేరున ఉన్న స్టేట్ బ్యాంక్ క్యాష్కార్డు కాగా, మరొకటి హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు. ఆందోళనకు గురైన అతను బ్యాంకులకు వెళ్లి చూసుకోగా, అప్పటికే భార్య ఖాతా నుంచి రూ.37,900 రెండు విడతల్లో, తన ఖాతా నుంచి రూ.8,200 డ్రా అయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నారు. సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.