breaking news
Physical fitness test
-
జిమ్నాస్ట్ అరుణ ఆరోపణలపై విచారణ
న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ జిమ్నాస్ట్ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలపై భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) విచారణకు ఆదేశించింది. మార్చిలో జిమ్నాస్టులకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు నిర్వహిస్తుండగా... తన అనుమతి లేకుండా కోచ్ రోహిత్ జైస్వాల్ వీడియో తీయడంపై అరుణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె అప్పట్లోనే ఫిర్యాదు చేసినప్పటికీ భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ) సదరు కోచ్కు క్లీన్చిట్ ఇచ్చింది. జీఎఫ్ఐ తేలిగ్గా తీసుకోవడంపై నిరాశ చెందిన అరుణ చట్టపరమైన చర్య లకు ఉపక్రమించడంతో ‘సాయ్’ రంగంలోకి దిగింది. ‘సాయ్’లోని టీమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధిక శ్రీమన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నియమించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. -
కొనసాగుతున్న సెలక్షన్స్
► కానిస్టేబుళ్ల ఎంపికలో మూడో రోజు అర్హత సాధించిన 730 మంది ►1,200 మందికి 1,115 మంది హాజరు ►నేడు 425 మంది మహిలు.. 800 మంది పురుషులకు పరీక్షలు ఒంగోలు క్రైం: పోలీస్ కానిస్టేబుళ్ల ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో మూడోరోజు శనివారం 730 మంది అర్హత సాధించారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, 1,600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ల్లో పోటీల అనంతరం మూడో దశ అయిన రాత పరీక్షకు అర్హత సాధించారు. ఎస్పీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ పర్యవేక్షించారు. పోలీస్ కానిస్టేబుళ్లు, జైలు వార్డన్ల రెండో దశ ఎంపికకు సంబంధించి 1,200 మంది హాజరుకావాల్సి ఉంది. అరుుతే 1,115 మంది హాజరయ్యారు. మొదట నిర్వహించే ఫిట్నెస్ మెజర్మెంట్ పరీక్షలో భాగంగా ఎత్తు, ఛాతీ కొలతల్లో 182 మంది అనర్హత పొందారు. దీంతో 933 మంది తదుపరి పరీక్షలకు అర్హత సాధించారు. 1,600 మీటర్ల పరుగు పందెంలో 124 మంది అనర్హత పొందారు. ఇక 100 మీటర్ల పరుగు పోటీలకు, లాంగ్ జంప్ పోటీలకు 809 మంది అర్హత సాధించినట్లయింది. 100 మీటర్లు, లాంగ్ జంప్ పోటీల్లో 79 మంది అనర్హత పొందారు. ఆదివారం 425 మంది మహిళా అభ్యర్థులతో పాటు 800 పురుషులు హాజరు కావాల్సి ఉంది.