breaking news
People First app
-
టీడీపీ సేవలో బరి తెగిస్తున్న 1100 సిబ్బంది
-
టీడీపీ సేవలో బరి తెగిస్తున్న ‘1100’
సాక్షి, అమరావతి : ప్రజలే ముందు అంటూ ప్రభుత్వ సేవల గురించి సృష్టించిన 1100.. టీడీపీ సేవలో తరిస్తోంది. ఎన్నికల వేళ టీడీపీ.. 1100 సిబ్బందిని కార్యకర్తల్లా వాడుకుంటోంది. చంద్రబాబు కోసం ప్రభుత్వ సంస్థ 1100ని అధికారులు వాడుతున్నారు. గూడవల్లిలో రహస్యంగా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మందితో టీడీపీకి సేవలు చేయించుకుంటున్నారు. టీడీపీ బూత్ కమిటీలు, పథకాల లబ్ధిదారులకు అనుసంధానంగా 1100 పనిచేస్తోంది. పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకు ఫోన్లు చేస్తూ.. ప్రత్యేక ప్రశ్నలతో టీడీపీ కి ఓటెయ్యమని 1100 సిబ్బంది ఒత్తిడి చేస్తోంది. నిరుద్యోగ భృతి లబ్ధిదారులకు ఫోన్ చేసి చంద్రబాబుకి ఓటేసేలా ఒత్తిడి తెస్తున్నారు. వ్యతిరేకంగా చెప్పిన వారి సమాచారాన్ని టీడీపీ బూత్ సభ్యులకు చేరవేస్తోంది. గుంటుపల్లి 1100 కేంద్రం నుండి గూడవల్లికి ఉద్యోగులను రప్పిస్తున్నారు. -
పనికిరాని శాఖలను పీకేస్తా: చంద్రబాబు
సాక్షి, అమరావతి : కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలేని శాఖలను మూసేస్తామని, వాటి స్థానంలో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ...‘టెక్నాలజీ అనుగుణంగా కొత్త శాఖలను సృష్టించాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల్లో పాతతరం చట్టాలు ఉన్నాయి. ఉద్యోగులు, అధికారులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి. ఎన్ని గంటలు ఉద్యోగులు ఆఫీసులో ఉంటున్నారో నమోదు కావాల్సిందే’ అని అన్నారు. తన పాలనలో 58శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దేశంలో వృద్ధిరేటు పడిపోయిందని, అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 11.72 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. ‘ఏపీ గ్రోత్ రేటు 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కలెక్టర్ల సదస్సులో సీఎం... ‘పీపుల్ ఫస్ట్’ యాప్ను ఆవిష్కరించారు. 1100 నెంబర్కు ఫోన్చేసి ప్రభుత్వ సేవలు, పథకాల అమలుపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.