టీడీపీ సేవలో బరి తెగిస్తున్న ‘1100’ | 1100 Employees Working For TDP In Elections | Sakshi
Sakshi News home page

టీడీపీ సేవలో బరి తెగిస్తున్న 1100 సిబ్బంది

Apr 8 2019 4:33 PM | Updated on Apr 8 2019 7:19 PM

1100 Employees Working For TDP In Elections - Sakshi

సాక్షి, అమరావతి : ప్రజలే ముందు అంటూ ప్రభుత్వ సేవల గురించి సృష్టించిన 1100.. టీడీపీ సేవలో తరిస్తోంది. ఎన్నికల వేళ టీడీపీ.. 1100 సిబ్బందిని కార్యకర్తల్లా వాడుకుంటోంది. చంద్రబాబు కోసం ప్రభుత్వ సంస్థ 1100ని అధికారులు వాడుతున్నారు. గూడవల్లిలో రహస్యంగా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మందితో టీడీపీకి సేవలు చేయించుకుంటున్నారు. టీడీపీ బూత్ కమిటీలు, పథకాల లబ్ధిదారులకు అనుసంధానంగా 1100 పనిచేస్తోంది. పసుపు కుంకుమ డ్వాక్రా మహిళలకు ఫోన్లు చేస్తూ.. ప్రత్యేక ప్రశ్నలతో టీడీపీ కి ఓటెయ్యమని 1100 సిబ్బంది ఒత్తిడి చేస్తోంది. నిరుద్యోగ భృతి లబ్ధిదారులకు ఫోన్ చేసి చంద్రబాబుకి ఓటేసేలా ఒత్తిడి  తెస్తున్నారు. వ్యతిరేకంగా చెప్పిన వారి సమాచారాన్ని టీడీపీ బూత్ సభ్యులకు చేరవేస్తోంది. గుంటుపల్లి 1100 కేంద్రం నుండి గూడవల్లికి ఉద్యోగులను  రప్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement