-
సూపర్ ఆఫర్.. డబ్బులు లేకుండా ఓయో రూమ్!
హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ ఓయో (OYO) భారతీయ ప్రయాణికులకు అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. స్టే నౌ పే లేటర్ (SNPL) సౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ-కామర్స్ వెబ్సైట్లు, రిటైల్ షాపులు ఇలాంటి బై నౌ పే లేటర్ ఆఫర్లను అందిస్తుంటాయి. ఆఫర్ వివరాలు SNPL సౌకర్యం కింద కస్టమర్లకు రూ. 5,000 వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తారు. 15 రోజుల బస తర్వాత మొత్తాన్ని సెటిల్ చేయాలి. ఈ ఫీచర్ కోసం క్రెడిట్ ఆధారిత చెల్లింపుల సేవ అయిన Simplతో ఓయో భాగస్వామ్యం కలిగి ఉంది. ఓయో యాప్ హోమ్ స్క్రీన్పై ఈ ఫీచర్ని యాక్సెస్ చేయవచ్చు లేదా చెల్లింపు మోడ్ ఎంపిక సమయంలో Simplని ఎంచుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ SNPL ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని ఓయో గ్లోబల్ సీవోవో, చీఫ్ టెక్నాలజీ & ప్రోడక్ట్ ఆఫీసర్ అభినవ్ సిన్హా చెప్పారు. Simpl ద్వారా హోటల్ బుకింగ్ చేసుకునే కస్టమర్లకు 65 శాతం వరకు తగ్గింపుతోపాటు రూ. 50 క్యాష్బ్యాక్ను లభిస్తుంది. అయితే Simpl యాప్లో చెల్లింపును 15 రోజులకు మించి ఆలస్యం చేస్తే, మీ బిల్లు మొత్తాన్ని బట్టి వడ్డీ, రూ. 250 వరకు ఆలస్య రుసుముతోపాటు జీఎస్టీని విధిస్తుంది. ఇదీ చదవండి: Ritesh Agarwal: ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: తొలినాళ్లను గుర్తు చేసుకున్న ఓయో ఫౌండర్ -
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా?
డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ). ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ లో ట్రావెల్ నౌ పే లేటర్ (TNPL) ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇందు కోసం క్యాషీ (CASHe)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ సదుపాయంతో ప్రయాణికులు తమ రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. టికెట్ మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలలలో ఈఎంఐల ద్వారా తర్వాత చెల్లించవచ్చు. ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. తగ్గనున్న సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు.. దిగుమతి సుంకం ఎత్తేసిన కేంద్రం పేటీఎంలో పోస్ట్పెయిడ్ సదుపాయం ఉండటం వల్ల రైల్వే టికెటింగ్ సర్వీసుల్లో బుక్ నౌ పే లేటర్ ఆప్షన్ ను పేటీఎం యూజర్లు వినియోగించుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది. ఇటీవలి కాలంలో పేటీఎం తమ యూజర్ల కోసం టికెట్ల బుకింగ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, షాపింగ్ లలో బై నౌ పే లేటర్ సదుపాయాన్ని విరివిగా కల్పిస్తోంది. పేటీఎం పోస్ట్పెయిడ్ వినియోగదారులకు 30 రోజుల వ్యవధికి రూ. 60 వేల వరకు వడ్డీ రహిత రుణాన్ని అందిస్తోంది. టికెట్ బుకింగ్ ఇలా.. ఐఆర్సీటీసీ అధికారిక పోర్టల్ లేదా మొబైల్లో ఐఆర్సీటీసీ యాప్లో లాగిన్ అవ్వాలి. మీ వెళ్లాల్సిన ప్రాంతం, ప్రయాణ తేదీ తదితర వివరాలను నమోదు చేయాలి. తర్వాత చెల్లింపు విభాగానికి వెళ్లి 'పే లేటర్'పై క్లిక్ చేయండి. పేటీఎం పోస్ట్పెయిడ్ని ఎంచుకుని, మీ పేటీఎం వివరాలతో లాగిన్ చేయండి. తర్వాత OTPని నమోదు చేస్తే టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. ఇదీ చదవండి: జీఎస్టీ నిబంధనల్లో మార్పులు.. ఆగస్టు 1 నుంచి కొత్త రూల్! -
లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్: మ్యారీ నౌ పే లేటర్!
సాక్షి,ముంబై: ‘బై నౌ..పే లేటర్’ అనే ఆఫర్ స్మార్ట్ఫోన్లు లేదా కొన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోళ్లపైనా, అలాగే రియల్ ఎస్టేట్ కొనుగోళ్లలోను లభిస్తోంది. ఇకపై ఇలాంటి బంపర్ ఆఫర్ పెళ్లిళ్లకు కూడా లభించనుంది. తాజాగా మేరీ నౌ పే లేటర్ (ఎంఎన్పీఎల్) ఆప్షన్తో పెళ్లిక ఈఎంఐ ఆఫర్ సెన్సేషన్గా మారింది. లావిష్గా, జబరదస్త్గా పెళ్లి చేసుకోవానుకునేవారికి తీపికబురు ఇది. ట్రావెల్ ఫిన్టెక్ సంస్థ సంకాష్, రాడిసన్ హోటల్స్ భాగస్వామ్యంతో మ్యారీ నౌ పే లేటర్ను ప్రారంభించింది. దేశంలో పెరుగుతున్న వివాహ మార్కెట్ ట్రెండ్ను అందిపుచ్చు కునేందుకు ఈ ఆఫర్ను ప్రకటించింది. ఎంఎన్పీఎల్ పథకం రాడిసన్ హోటల్లలో లభిస్తోంది. అంటే పెళ్లి ఖర్చుల కోసం ఇక్కడ రుణాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఆఫర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో అందుబాటులో ఉంది. ఉత్తరప్రదేశ్, ఆగ్రాలోని ప్రముఖ ప్రదేశాల తోపాటు, జైపూర్, చండీగఢ్, పూణేలోని హోటళ్లలో త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అలాగే దశలవారీగా దేశవ్యాప్తంగా ప్రారంభించనున్నామని సంకాష్ సహ వ్యవస్థాపకుడు సీఈవోఆకాష్ దహియా తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి తమ రాడిసన్ హోటళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో రానుందని చెప్పారు. ఈ స్కీం అందుబాటులో ఉన్న హోటళ్లలో సగటున రోజుకు 50కి పైగా ఎంక్వయిరీలు వస్తున్నాయట. గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్లకు పేరుగాంచిన రాజస్థాన్, ఆగ్రా తదితర చోట్ల ఈ ప్రత్యేక ఆఫర్ను అందించడంపై దృష్టి పెట్టామని ఉద్యోగ్ విహార్లోని రాడిసన్ గురుగ్రామ్ జనరల్ మేనేజర్ నమిత్ విజ్ అన్నారు. ఎంఎన్పీఎల్ ఎలా పని చేస్తుంది? ► గరిష్టంగా రూ. 25 లక్షలు దాకా రుణం పొందవచ్చు. ఆరు లేదా 12 నెలల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ►ఎంచుకున్న కాల వ్యవధిలో ఆరు నెలలు వడ్డీ లేకుండా లేదా 12 నెలలకు 1 శాతం వడ్డీతో సంకాష్ NBFC (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ) లకు EMI (సమానమైన నెలవారీ వాయిదా) చెల్లించాలి. ► కస్టమర్ల ఐడీ, డ్రస్ పప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్లు, పేస్లిప్, ITR (ఆదాయపు పన్ను రిటర్న్లతో కూడిన థర్డ్-పార్టీ డేటా ద్వారా రుణం ఎంత ఇవ్వాలి అనేది అంచనా వేస్తారు. ఈ ఏడాది దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు దేశీయంగా మ్యారేజ్ మార్కెట్ దాదాపు 4 ట్రిలియన్ డాలర్లని అంచనా. ఈనేపథ్యంలో .ఈ పథకం కింద 24లో రూ. 100 కోట్లరుణాలివ్వాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 35 లక్షల జంటలు పెళ్లి చేసుకోబోతున్నాయి. కనీసం 3 వేల జంటలను పట్టుకున్నా. తమకు రూ.500 కోట్ల మార్కెట్ను వస్తుందని కంపెనీ భావిస్తోంది. . తమ పెళ్లి కుటుంబాలకు ఆర్థికభారం కాకూడదని భావిస్తున్న యువకులు/విద్యావంతులైన జంటలకు ఇది ఉపయోగపడుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు -
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపులు: ‘పే లేటర్’ జోలికి వెళ్లకండి, ఎందుకంటే!
ప్ర. నేను 31–07–2022న రిటర్న్ దాఖలు చేశాను. ఆ రోజు నాటికి రూ. 1,00,000 ట్యాక్స్ చెల్లించాలి. నగదు లేకపోవటం వల్ల ‘పే లేటర్‘ అని ఆప్షన్ పెట్టి ఫైల్ చేశాను. నిన్ననే ఆర్డర్లు వచ్చాయి. రూ. 5,000 పెనాల్టీ కట్టమని. ఏం చేయాలి? – విశ్వనాధ లక్ష్మీ, హైదరాబాద్ జ. చట్టప్రకారం ట్యాక్స్ కట్టలేని పరిస్థితుల్లో గడువు తేదీ లోపల రిటర్ను వేసుకోవడానికి అవకాశం ఇది. సాధారణంగా పూర్తిగా పన్నులు చెల్లించి, రిటర్నులు వేయాలి. విధిలేని పరిస్థితుల్లో ‘పే లేటర్‘ ఆప్షన్ను ఉపయోగించి కూడా రిటర్ను వేయవచ్చు. నిజానికి చాలామంది మీలాగే రిటర్నులు వేశారు. కానీ పెనాల్టీ రూ. 5,000 పడకుండా బయటపడవచ్చు. అయితే, జరుగుతున్నది ఏమిటంటే.. ► సాధారణంగా ఇలాంటి రిటర్నుని డిఫెక్టివ్ రిటర్నుగా భావిస్తారు. ►డిఫెక్టివ్ రిటర్నుగా భావించినప్పుడు నోటీసు ఇచ్చి 15 రోజుల లోపు సర్దుబాటు చేస్తారు. ►అలా చేయకపోతే రిటర్ను వేసినట్లు కాదు. 31–07–2022 లోపల రిటర్ను వేసి, ఆ తేదీలోపల ‘వెరిఫికేషన్‘ పూర్తయితే, ఇటువంటి కేసుల్లో రూ. 5,000 చెల్లించమని ఆర్డర్లు రావటం లేదు. కానీ ఏదో ఒక కారణం వల్ల .. ఉదాహరణకు, సైటు మొరాయించడమో, రిజక్ట్ అవ్వటమో, ఇతర సాంకేతికలోపం వల్లో 31–07–2022 లోగా రిటర్ను వెరిఫికేషన్ పూర్తి కాకపోతే, రూ. 5,000 చెల్లించమని నోటీసులు వస్తున్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ►మీ రిటర్ను ..డిఫెక్టివ్ రిటర్ను అయినట్లు ►మీరు పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఎందుకంటే, రిటర్ను లేటుగా వేశారు కాబట్టి. ►ఆలస్యంగా వేసినందుకు 234 అ ప్రకారం వడ్డీ కూడా చెల్లించాలి. ►పన్నుభారం లేకపోతే 234 అ వడ్డీ పడదు. ►రిఫండు మీద వడ్డీ రాదు. ►నష్టాలుంటే రాబోయే సంవత్సరానికి సర్దుబాటు చేయరు. ►చెల్లించాల్సిన పన్నులు చెల్లించాలి. ►రివైజ్డ్ రిటర్న్ వేయనవసరం లేదు. రిటర్న్ని రివైజ్ చేయనక్కర్లేదు. ►నోటీసుకి జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వటం అంటే కట్టిన చలాన్ల వివరాలు ఇవ్వడమే. చివరిగా చెప్పాలంటే ఈ ‘పే లేటర్‘ ఆప్షన్ కంటికి ఆకర్షణీయంగా కనబడేది. ‘దూరపు కొండలు నునుపు‘ అన్న సామెతలాంటిది. ఇదొక ‘చిక్కు‘ లాంటిది. పెనాల్టీ తప్పదు. వడ్డీ తప్పదు. వివరణ తప్పదు. సవరణ తప్పదు. జవాబు తప్పదు. చెల్లింపూ తప్పదు. అందుకే ‘పే లేటర్‘ జోలికి పోకండి. ఎలాగూ ట్యాక్స్ చెల్లించక తప్పదు, రిటర్ను వేయకాతప్పదు. ’ఆలస్యం అమృతం విషం’ అని గుర్తెరిగి ముందుగానే జాగ్రత్తలు తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్కు పంపించగలరు. -
పండగ సీజన్లో ఫ్లిప్కార్ట్ మరో ఆఫర్ !
Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్ని ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. ఈ కామర్స్ ఫ్టాట్ఫామ్పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి తదుపరి నెలలో బిల్ పే చేసే అవకాశాన్ని పే లేటర్ ద్వారా ఫ్లిప్కార్ట్ కల్పిస్తోంది. కొత్త వారికి అవకాశం ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది కోట్ల మంది కష్టమర్లకే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. పండగ సీజన్ని పురస్కరించుకుని మరింత మందికి పే లేటర్ అవకాశం కల్పిస్తోంది. పే లేటర్ ఆప్షన్ పొందాలని అనుకునే వారు ఆధార్కార్డు, బ్యాంకు డిటైల్స్ అందివ్వడం ద్వారా పే లేటర్ని ఏనేబుల్ చేసుకోవచ్చు. కొత్తగా పది కోట్ల మందిని ఈ ఆప్షన్ పరిధిలోకి తేవాలని ఫిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్కార్ట్ యాప్లో మోర్ ఆన్ ఫ్లిప్కార్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి క్రెడిట్ ఆప్షన్లోకి వెళితే పే లేటర్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఆప్షన్ని పొందవచ్చు. లిమిట్ పెంపు పే లేటర్ ఆప్షన్లో ప్రస్తుతం క్రెడిట్ లిమిట్ కేవలం రూ. 10,000గానే ఉంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ. 70,000లకు పెంచుతూ ఫ్లిప్కార్ట్ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్లో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ లిమిట్ను పెంచినట్టు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది. పే లేటర్ ఆప్షన్లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి ఏడాదిలోగా ఈఎంఐ పద్దతిలో చెల్లించే వీలు సైతం కల్పించింది. పే లేటర్ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లులు చెల్లింపులు చేయడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులకు ఒకే సారి బిల్లును పొంది,ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఒకే సారి చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్కార్లు లేక కోనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న వారికి సైతం ఈ పే లేటర్ ఆప్షన్ ఉపయుక్తంగా ఉంటుంది. చదవండి: వచ్చేస్తోంది.. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement