-
బయటపడ్డ మరొక టీడీపీ నేత ప్రలోభాలు
-
‘నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తి ఆయన’
సాక్షి, కృష్ణా: రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కంటి సమస్యను పరిష్కరించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. జిల్లాలోని కానూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు పథకం కింద విద్యార్థులకు ఉచిత కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జిల్లా వైద్య అధికారులు తదితురులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 లక్షల మంది విద్యార్థుల్లో 44 వేల మంది విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి అని పేర్కొన్నారు. కానీ ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి.. దీని కింద ఉన్న1000 వ్యాధులకు చికిత్స అమలు కాకుండా వాటి సంఖ్యను తగ్గించిందని ఆయన మండిపడ్డారు. కాగా ప్రతి వ్యాధి ఆరోగ్య శ్రీ పథకంలోకి వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని, అదనంగా మరో 57 అర్ధోపెడిక్ వ్యాధులను కూడా చేర్చిన ఘనత సీఎం జగన్ది అన్నారు. ప్రభుత్వ బడుల్లో అమలు చేసే ఇంగ్లీష్ మీడియం మత బోధనకే అని, తెలుగు మీడియంను దెబ్బతీస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ అని... 6 నెలల లక్ష్యంతో కూడిన పాలన సాగించారని వ్యాఖ్యానించారు. ఇక కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో 6 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశామని వారిలో 40 వేల విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో 14,734 మందికి కళ్ల జోళ్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
పాకిస్తాన్లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలోనా..?
గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు. వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు. -
లోకేశ్ అవినీతిపై విచారణ జరిపించాలి
-
బాబు భూదాహం తీరడం లేదు
కొలుసు పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ దాహం తీరడం లేదని ఆయన పేద రైతుల నోళ్లు కొట్టి లాక్కుంటున్న భూములను బడా బాబులకు పందేరం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికని చెప్పి రైతుల దగ్గరి నుంచి ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలు చాలక మరో 14 వేల ఎకరాలను కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీన్నిబట్టి ఆయన భూదాహం పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు.మూడు గ్రామాల రైతులు తమ భూములు తీసుకోవాలని తన వెనుక బడి బతిమిలాడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆ గ్రామాల్లో 14 వేల ఎకరాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడంపై ఆయన మండిపడ్డారు. వెల్లంపల్లి ఇంటిపై దాడి గర్హనీయం వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సారథి అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement