-
ట్రంప్ కుమారుడికి పార్శిల్.. నిందితుడి అరెస్ట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్కు ఇటీవల ఓ అనుమానాస్పద పార్శిల్ పంపి కలకలం రేపిన వ్యక్తిని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్కు చెందిన డానియల్ ఫ్రిసెల్లో అని అతడు డెమొక్రటిక్ పార్టీ కార్యకర్త అని, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత నెలలో డోనాల్డ్ ట్రంప్ జూనియర్కు ఓ పార్శిల్ వచ్చింది. ఓపెన్ చేసిన చూడగా అందులో వైట్ పౌడర్ ఉండటం కలకలం రేపింది. నిందితుడు ఫ్రిసెల్లో గతంలోనూ పలు చిన్న చిన్న తప్పిదాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్కు పౌడర్ పార్శిల్ పంపిన అదే నిందితుడు మరో నలుగురు వ్యక్తులకు ఇలాగే పార్శిల్స్ పంపి హెచ్చరికలు జారీ చేశాడు. కాలిఫోర్నియాకు చెందిన ఓ లాయర్, లా ప్రొఫెసర్, ఓ సెనెటర్, నటుడు ఆంటోనియా సబాటోలకు మెయిల్స్ పంపినట్లు పోలీసుల తమ విచారణలో తెలుసుకున్నారు. నిందితుడు ఫ్రిసెల్లోని అతడి ఫేస్బుక్ అకౌంట్ ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ట్రంప్ జూనియర్కు పంపిన పౌడర్ పార్శిల్ కవర్ను తన ఎఫ్బీలో ఫ్రిసెల్లో ఫిబ్రవరి 12న పోస్ట్ చేశాడు. దాంతో పాటుగా ఓ బాంబు పార్శిల్ సందర్భంగా తన అసలుపేరును నిందితుడు రాయడం కేసును ఈజీగా ఛేదించేందుకు ఉపయోగపడిందని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో ట్రంప్ వ్యతిరేక పోస్టులు చాలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. -
మీ ఫోన్ నంబర్ లక్కీడ్రాలో గెలిచిందని..
కడ్తాల్ : 'మీ సెల్ నెంబర్ లక్కీడ్రాలో గెలిచిందని, రూ.16వేల సెల్ఫోన్ను రూ.3500కు ఇస్తాం' అని నమ్మించి హరికృష్ణ అనే యువకుడిని మోసం చేశారు. ఈ ఘటన కడ్తాల్ మండలంలోని కర్కల్పహడ్ పంచాయితీ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు హరికృష్ణ తెలిపిన ప్రకారం.. పదిహేను రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తికి చెందిన సెల్ ఫోన్ నెంబర్ల నుండి, తనకు కాల్ వచ్చిందని చెప్పాడు. తాము నిర్వహించిన లక్కీడ్రాలో మీ సెల్ నెంబర్ గెలుపొందిందని, రూ. 16వేల విలువ గల శాంసంగ్ జే7 ఫోన్ను కేవలం రూ.3500కే పార్శీలు ద్వారా పోస్టులో అందిస్తామని నమ్మబలికారు. హరికష్ణ తన పూర్తి చిరునామా, వివరాలు ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిపి డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం పార్శీలు వచ్చిందని సమాచారం రావడంతో కడ్తాల్ పోస్టాఫీస్కు వచ్చి డబ్బులు చెల్లించి పార్శీలు తీసుకున్నాడు. అది తెరిచి చూడగా.. సెల్ఫోన్ బదులుగా పూజ సామాగ్రి, లక్ష్మీదేవి విగ్రహం, ఓ పల్లెం, మెడల్ లాంటివి కనిపించడంతో షాక్ తిన్నాడు. తాను మోసానికి గురైనట్లు గమనించి స్థానిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతూ వారికి ఫిర్యాదు చేశాడు. తనతా మరెవరూ మోసపోవద్దని.. అపరిచిత కాల్స్పైన నిఘా ఉంచాలని, అనుమానం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుడు హరికృష్ణ అవేదనతో చెప్పాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement