-
రహీమ్ది హత్యే..!
సాక్షి, కోదాడరూరల్ : కోదాడలో అదృశ్యమై..ఖమ్మం జిల్లా పాలేరు వాగులో విగతజీవుడిగా తేలిన యువకుడిది హత్యగానే పోలీసులు తేల్చారు. ఆ యువకుడితో సఖ్యతగా మెలిగిన వివాహిత, తన భర్త, తల్లి, మరో వ్యక్తి కలిసి దారుణానికి ఒడిగట్టారని ఖాకీల విచారణలో తేలింది. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నడిగూడెం మండల కాగిత రామచంద్రాపురానికి చెందిన షేక్ రహీమ్(24) లారీక్లీనర్గా పనిచేస్తున్నాడు. ఇతను అదే గ్రామానికి చెందిన చిన్ననాటి స్నేహితుడు కోటయ్య భార్య త్రివేణితో సఖ్యతగా మెలిగాడు. ఎనిమిది మాసాలు సాగిన అనంతరం విషయం భర్తకు తెలియడంతో గొడవలు జరిగాయి. కోటయ్య విషయాన్ని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించాడు. కానీ రహీమ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కోటయ్య తన భార్య త్రివేణిని కోదాడలోని ఆజాద్నగర్లో నివాసముంటున్న అమ్మగారింటికి రెండు నెలల క్రితం పంపించాడు. నెల రోజుల కిత్రం భార్య వద్దకు వచ్చిన కోటయ్య నీ వల్ల గ్రామంలో మన పరువు పోయింది.. చనిపోదామని చెప్పాడు. రహీమ్ తనను వేధిస్తున్నాడు.. మనమెందుకు చనిపోవాలి.. అతడినే మట్టుబెడదామని తీర్మానించుకున్నారు. ప్లాన్ ప్రకారమే... రహీమ్ను హత్య చేద్దామని కోటయ్య ,భార్య త్రివేణి అతని అత్త శ్రీదేవి ఆమెతో సఖ్యతగా ఉంటున్న బండి వాసులు నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే గత ఫిబ్రవరి 26 రాత్రి 11.30 గంటల సమయంలో త్రివేణి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను రమ్మని రహీమ్ను ఫోన్చేసి పిలిచింది. అతను ఇంట్లోకి వెళ్లగానే అçప్పటికే కాపుకాసుకుని ఉన్న ముగ్గురు ఇంట్లోకి వెళ్లిన రహీమ్ను రొకలిబండతో కళ్లపై కొట్టి ..చున్నితో మెడకు ఉరేసి హత్య చేశారు. అనంతరం సాక్ష్యాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గొనెసంచిలో కట్టి మునగాల వద్ద సాగర్ కాల్వలో పడేసారు. ఆ తర్వాత అనుమానం రాకుండా యాథా విధిగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. రహీమ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదని తండ్రి నాగుల్ మీరా ఈ నెల 8వ తేదీన పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దిశగా గతంలో జరిగిన గొడవలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోటయ్య, త్రివేణి కదలికలు, ఫోన్కాల్స్పై దృష్టిసారించారు. రహీం మృతదేహం సోమవారం పాలేరువాగులో లభ్యం కావడం, అతడి ఒంటిపై గాయాలుండడంతో హత్యగానే ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. మంగళవారం కోదాడలోని ఆజాద్నగర్లో కోటయ్య అతని భార్య త్రివేణి, అత్త శ్రీదేవి ఈమే సహజీవనం చేస్తున్న బండి వాసులను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరం అంగీకరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ క్రాంతికుమార్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి..
పట్నా : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. 100మంది వరకు గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గోపినాథ్ పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్ల మహిళ తమ పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంటున్నానని చెప్పినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్పుర్ నుంచి సితామర్హికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
కడప అర్బన్ : తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేందుకు ఎంబీఏ పూర్తి చేశాడు. రెండేళ్ల క్రితం కానిస్టేబుల్గా ఎంపికైన యువకుడు తన కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లలేదు. ఈనెల 6 వతేదీన రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుళ్ల ప్రిలిమనరీ రాత పరీక్ష జరిగింది. ఆ పరీక్ష రాసి వస్తానని ఇంటినుంచి బయలుదేరి వెళ్లిన యువకుడు కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్లో ఓ ఇంటిలో మృతదేహమై కనిపించాడు. సంఘటనపై మృతుని బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరుకు చెందిన ఎం.సురేంద్ర (26) పిచ్చన్న, బాలనాగమ్మల రెండవ కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకుని 2013 బ్యాచ్లో కానిస్టేబుల్గా కూడా ఎంపికయ్యాడు. కాలు ప్రమాదానికి గురైందని శిక్షణకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పోలీసుస్టేషన్లో నిర్వహించిన కౌన్సెలింగ్లో సదరు మహిళతో సంబంధం లేకుండా చేసుకునేందుకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పాలని కూడా పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 6వ తేది పోలీసు కానిస్టేబుళ్ల ప్రిలిమినరి పరీక్షకు చిత్తూరులో హాజరు కావాలని గత శనివారం తల్లిదండ్రులకు చెప్పి వచ్చాడు. వారం రోజుల తర్వాత ప్రకాశ్నగర్లోని జయలక్ష్మి అనే మహిళ నివసిస్తున్న ఇంటిలో మృతదేహమై కనిపించాడు. ఈ సంఘటనపై జయలక్ష్మి అనే మహిళ తన తల్లి వెంకటలక్ష్మితో కలిసి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తన సోదరుడు రవికుమార్ స్నేహితుడు సురేంద్ర అని, తన తండ్రి, తమ్ముడు మరణించిన తర్వాత తమ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడని ఈనెల 10వ తేదీ గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో కడపలోని తమ ఇంటికి వచ్చాడని, శుక్రవారం అతను లోపల వేసుకున్న గడియ పగులగొట్టేందుకు ప్రయత్నించామన్నారు. శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మృతదేహాన్ని చిన్నచౌకు సీఐ బి.రామకృష్ణ, ఎస్ఐ యోగేంద్రలు తమ సిబ్బందితో మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. -
తోడల్లుడే హంతకుడు
- వివాహేతర సంబంధమే హత్యకు కారణం - మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు తిరుచానూరు : వివాహేతర సంబంధం కారణంగా తోడల్లుడే వరుసకు తమ్ముడిని హత్యచేశాడు. ఈ నెల 16వ తేదీ దామినేడు రా మక్కచెరువులో లభ్యమైన మృతదేహం కేసును తిరుచానూరు పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసు వివరాలను మంగళవారం సాయంత్రం తిరుచానూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ సురేం ద్రనాయుడు వివరించారు. సీఐ కథనం మేరకు...కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కపట్రాల గ్రామానికి చెందిన బతుకమ్మ, హనుమంతు దంపతులకు జ్యోతి, సుజాత కుమార్తెలు ఉన్నారు. అదే జిల్లా ఎమ్మిగనూరు మండలం అలువాల గ్రామానికి చెందిన ధర్మరాజుకు పెద్దకుమార్తె జ్యోతిని ఇచ్చి వివాహం చేశారు. అలాగే రెండో కుమార్తె సుజాతను కర్నూలు జిల్లా సీ.బెళగళ్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన గజేంద్ర(30)కిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం అలుళ్లు ఇద్దరూ అత్తగారింట్లోనే ఉంటున్నారు. హనుమంతు పెద్దల్లుడు ధర్మరాజు ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం తిరుపతి వచ్చి, సాయినగర్లో స్థిరపడ్డాడు. ఇక్కడికి వచ్చిన కొన్నాళ్లకు లగేజీ ఆటోను కొనుగోలు చేసి, బాడుగులకు తిప్పుతుండేవాడు. ధర్మరాజు తోడల్లుడు, వరుసకు తమ్ముడైన గజేంద్ర కూడా మూడేళ్ల క్రితం తిరుపతికి వచ్చి చేరి, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నెల క్రితం తన భార్య సుజాతను తీసుకొచ్చి ఓటేరులో కాపు రం పెట్టాడు. ఈ క్రమంలో ధర్మరాజు తన మరదలైన సుజాతతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యం గజేంద్రకు తెలిసింది. దీంతో భార్య భర్తల మధ్య గొడవ రావడంతో తాళి బొట్టు తీసి, గజేంద్రకు ఇచ్చేసి సాయినగర్లోని అక్క ఇంటికి సుజాత వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ ధర్మరాజు, అతని భార్య జ్యోతి, మరద లు సుజాత వారి పిల్లలతో కలిసి లగేజీ ఆటోలో కప్పట్రాళ్లకు వెళ్లారు. 14వ తేదీన వారిని అక్కడ విడిచిపెట్టి ధర్మరాజు ఒక్కడే తిరుపతికి వచ్చాడు. ఎలాగైన గజేంద్రను అంతమొందించాలని పథకం పన్నాడు. దీంతో అదే రోజు రా త్రి సాయినగర్లోని ధర్మరాజు ఇంట్లో ఇద్దరు మద్యం సేవించారు. అనంతరం గొడవ పడ్డారు. దీంతో ధర్మరాజు ఇం ట్లోని చిన్న సిలిండర్తో గజేంద్ర నుదిటి పై కొట్టాడు. స్పృహ తప్నిన గజేంద్రను తన ఆటోలో రామక్క చెరువు వద్దకు తీసుకొచ్చి, అక్కడ పడేసి, కాలితో గొంతు నొక్కి చంపేసి వెళ్లిపోయాడు. 16వ తేదీ పందులు మేపుకునే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జేబులోని ఫోన్ డైరీ, నల్లపూసల తాళిబొట్టు ద్వారా ఆధారాలు సేకరించి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ధర్మరాజుపై పోలీసులకు అనుమానం రావడంతో అతన్ని పట్టుకోవడానికి నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మూడో మైలు వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు ధర్మరాజు కంటపడడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. దీం తో ధర్మరాజును అరెస్టు చేసి హత్యకు వాడిన లగేజీ ఆటో, గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించడంలో చొరవ చూపిన డీఎస్పీ రవిశంకర్రెడ్డి, సీఐ సురేంద్రనాయుడు, ఎస్ఐలు మల్లేష్యాదవ్, చిరంజీవి, ఏఎస్సైలు ఈఎంఎస్.నాయుడు, శంకరయ్య, సిబ్బంది మణి, అలీ, షణ్ముగం, మునిమోహన్, సోము, ఐడీ పార్టీ రవిప్రకాష్, విజయకుమార్రాజు, రవిరెడ్డిలను తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్జెట్టి అభినందించారు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
మహిళ దారుణహత్య.. ప్రియుడే కాలయముడు ఖమ్మం: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన ఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం శాంతినగర్ ప్రాంతంలో నివసిస్తున్న గంధం కళావతి(45)కి 20 ఏళ్ల క్రితం ఓ కానిస్టేబుల్తో పెళ్లయింది. వీరికి ఓ కొడుకున్నాడు. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఖమ్మంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కళావతి జీవిస్తుంది. ఆమెతోపాటు ఆమె కుమారుడు ఉంటున్నాడు. కొడకు రాజేష్ (18) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేసే ప్రవీణ్తో కళావతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. మద్యం తాగి కళావతిని ప్రవీణ్ నిత్యం వేధించేవాడు. తన తల్లిని వేధించడం మానుకోవాలని రాజేష్ హెచ్చరించినా.. ప్రవీణ్లో మార్పురాలేదు. బుధవారం రాత్రి కుమారుడు ఇంటికి వచ్చే సరికి గదిలో కళావతి చాపమీద నిర్జీవంగా పడి ఉంది. వెంటనే రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు స్థానికులు విచారించగా ఉదయం నుంచి ప్రవీణ్ ఆమెతోనే ఉన్నట్లు, ఆమెతో గొడవ జరిగినట్లు తెలిపారు. తన తల్లిని ప్రవీణే చంపాడని పోలీసులకు రాజేష్ ఫిర్యాదు చేశాడు. ప్రవీణ్ ఆమెతో గొడవపడి వెనుక గదికి తీసుకోని వచ్చి ముఖంపై దిండు పెట్టి హత్య చేసి ఉండొచ్చని తేదా గొంతు నులిమి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
Advertisement