breaking news
Palem bus victims
-
న్యాయం కోసం నవీన పోరాటం!
-
'బస్సు పత్రాలన్నీ బోగస్సేనని మంత్రి ఒప్పుకున్నారు'
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాలెం బస్సు ప్రమాద బాధితులు సోమవారం సమావేశమైయ్యారు. అనంతరం వారం మీడియాతో మాట్లాడుతూ.. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు పత్రాలన్నీ బోగస్సేనని బొత్స ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. ఆ ఘటనకు బాధ్యులయిన వారిపై కేసు నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారన్నారు. బాధితులకు పరిహారం, ఉపాది తదితర విషయాలపై సీఎంకు లేఖ రాస్తానని బొత్స హామి ఇచ్చారని వారు తెలిపారు. ఆ దుర్ఘటనలో చనిపోయిన వారందరవి ప్రభుత్వ హత్యలేనని ప్రమాద బాధితులు పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగ విషయం గురించి త్వరలో సీఎంను కలుస్తామని వారు తెలిపారు. -
మాకే సాయం చేయలేని మీరు రాష్ట్రాన్నెలా పాలిస్తారు?
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద గత ఏడాది జరిగిన వోల్వో బస్సు దగ్ధం ఘటనలో బాధితులుగా మిగిలిన 45 మందికే సాయం చేయలేని సీఎం కిరణ్కుమార్ రెడ్డి కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఏవిధంగా పాలిస్తారని, వారికి ఏవిధంగా సాయం చేస్తారని ‘పాలెం’ బాధితులు సూటిగా ప్రశ్నించారు. సీఎం పదవికి కిరణ్ అనర్హుడని, ఆయన వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇక్కడ బస్సు దుర్ఘటన బాధితుల జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ పలువురు బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బాధితులకు సాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆ శాఖ కమిషనర్, బస్సు యాజమాన్యంపై కోర్టులో కేసు వేయాలని నిర్ణయించినట్టు తెలిపా రు. బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ నేతృత్వంలో గురువారం అఖిలపక్ష బృందం సీఎంని కలువనున్నట్టు తెలిపారు. అనంతరం, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డిని కలిసి, తమ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.