Pakistan high commissioner
-
ఐఎస్ఐ ఏజెంట్లను కలిశా
చండీగఢ్: గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన మహిళా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పోలీసు కస్టడీలో కొత్త విషయాలను బయటపెట్టారు. పాకిస్తాన్లోని నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని, పాకిస్తాన్లో వాళ్లను కలిశానని ఆమె ఒప్పుకున్నారు. మే 13న దేశ బహిష్కరణకు గురైన ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ఉద్యోగి డ్యానిష్తో తాను తరచుగా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరిపానని ఆమె వెల్లడించారు. పాక్కు వెళ్లేందుకు అవసరమైన వీసా సాధించేందుకు ఢిల్లీలోని పాక్ హైకమిషన్కు 2023 నవంబర్లో తొలిసారిగా వెళ్లినప్పుడు అక్కడి ఉద్యోగి డ్యానిష్ అలియాస్ ఎహ్సార్ ఉర్ రహీమ్తో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపారు. అరెస్ట్ తర్వాత పోలీసులు జ్యోతికి చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. ఇంకొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలనూ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం జ్యోతిని జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లలో మూడుసార్లు పాకిస్తాన్కు వెళ్లడంతోపాటు చైనా, బంగ్లాదేశ్ ఇతర దేశాల్లో జ్యోతి పర్యటించారు. ఆపరేషన్ సిందూర వేళ భారత్, పాక్ సైనిక చర్యల సమయంలోనూ డ్యానిష్తో జ్యోతి సంప్రతింపులు జరిపినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆమె నాలుగు బ్యాంక్ అకౌంట్లను విశ్లేషిస్తున్నారు. జ్యోతి పాక్ జాతీయుడిని పెళ్లాడినట్టు, మతం మారినట్లు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
వివాదంలో పాకిస్తాన్ హైకమిషనర్.. యువతితో వీడియోలు లీక్
ఢాకా: పాకిస్తాన్ హైకమిషనర్ హనీట్రాప్ వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో తిరుగుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. సదరు అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.వివరాల ప్రకారం.. సయ్యద్ అహ్మద్ మరూఫ్ పాకిస్తాన్ తరఫున బంగ్లాదేశ్కు హైకమిషనర్గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 2023లో బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అయితే, మరూఫ్ ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఉన్న తిరుగుతున్న ఫొటోలు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపించేసింది. మరూఫ్ మే 11న ఢాకా నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్కు విమానంలో వెళ్లారని బంగ్లాదేశ్ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. హనీట్రాప్ కారణంగా అతడు బంగ్లాదేశ్ వీడినట్టు చెప్పుకొచ్చింది.The Pakistani Ambassador to Bangladesh, Syed Ahmed Maroof, was in a relationship with a Bangladeshi Muslim girl. After some intimate details became public, he was sent on leave. There was a time when Pakistanis used to rape Bangladeshi Muslim women nowadays, some Bangladeshi… pic.twitter.com/p60WkJJslU— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) May 12, 2025అయితే, అధికారులు మాత్రం.. మారూఫ్ అధికారికంగా సెలవులో ఉన్నారని నిర్ధారించారు. కానీ, ఎన్ని రోజులు అతను సెలవులో ఉన్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు.. ఢాకాలోని పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ ముహమ్మద్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్గా బాధ్యతలు చేపట్టారు.Pakistan Ambassador to Bangladesh Syed Ahmed Maroof is reportedly untraceable after his honey trapped videos emerged online.There's a leaked video too. pic.twitter.com/UfYmLYfKVl— Avinash K S🇮🇳 (@AvinashKS14) May 13, 2025ఇక, ఇటీవల మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో ఆయన సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని తెలుస్తోంది. ఆయన వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉండగా.. గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగాలపై ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయన్ని అవాంఛిత వ్యక్తి (పర్సనా నాన్గ్రేటా)గా ప్రకటించి 24 గంటల్లోగా మన దేశాన్ని వీడివెళ్లిపోవాలని గడువు విధించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
మీ సేవలు చాలు.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి: భారత్
ఢిల్లీ :న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారి తన దౌత్య కార్యకలాపాలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు సదరు అధికారిని భారత ప్రభుత్వం పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వ్యక్తి దౌత్య అధికారిగా ఉన్న సమయంలో ఏమైనా విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే పర్సనా నాన్ గ్రాటాగా పరిగణించి దేశం నుంచి బహిష్కరిస్తూ నిషేధాజ్ఞాలు అమలు చేస్తారు. ఆ పాకిస్తాన్ అధికారి భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పాకిస్తాన్ పై దాడికి దిగింది భారత్. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సిందూర్ ను ఆరంభించి దాయాది దేశంలోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ లో ని పలు ఎయిర్ బేస్ లను సైతం భారత్ నేలమట్టం చేసింది. పాకిస్తాన్ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడిన తరుణంలో భారత్ ఆపరేషన్ సిందూర్ తో తన సత్తా ఏమిటో చూపెట్టింది. -
పాకిస్తాన్ అధికారుల ఓవరాక్షన్.. పహల్గాం దాడిపై ఢిల్లీలో పాక్ సంబరాలు?
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడికి దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్తాన్ అధికారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఢిల్లీలో పాక్ హైకమిషన్ ఆఫీసులో సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే కేక్ కట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, పహల్గాం ఉగ్రదాడికి పాక్ సంబరాలు చేసుకుంటా? అంటే అవుననే ఆధారాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని పాక్ హైకమిషన్లోకి అక్కడ పనిచేసే ఓ కేక్ తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు అతడిని ప్రశ్నించారు. కేక్ ఎందుకు అని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సదరు వ్యక్తి తప్పించుకుని లోపలికి వెళ్లిపోయాడు. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.This footage shows someone delivering a cake to the Pakistani High Commission in Delhi.What Pakistan’s high commission is celebrating?? TERRORISTS! pic.twitter.com/3lGnIRPcnz— BALA (@erbmjha) April 24, 2025మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. దీంతో, పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ హై కమిషన్ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పాకిస్తాన్ నశించాలి అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను నామరూపాలు లేకుండా చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తరహాలో పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. దీంతో, పాకిస్తాన్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనల్లో బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. #WATCH | During the BJP protest against Pakistan following the Pahalgam terror attack, BJP MLA Satish Upadhyay says, "There is anger in the hearts of people of India. Pakistan could not tolerate how Kashmir joined the mainstream...Yesterday, the Modi government conducted a… pic.twitter.com/Dk61hNA5VM— ANI (@ANI) April 24, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తానీ పౌరులు వెంటనే భారత్ను విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తానీలు తమ దేశానికి తిరిగి వెళ్తున్నారు. వారంతా అట్టారి-వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.VIDEO | Amritsar, Punjab: Pakistani national reach Attari-Wagah border to return to their country after India suspended the SAARC visa exemption scheme (SVES) asking Pakistani citizens in India under SVES visa to leave the country within 48 hours. The decision was taken the… pic.twitter.com/0CVYTaJcBU— Press Trust of India (@PTI_News) April 24, 2025 -
విచారణ వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: ముంబైపై 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల గాయాలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వీడి విచారణను వేగవంతం చేయాలన్నారు. 26/11 దాడులు జరిగి శుక్రవారానికి 13 ఏళ్లు పూర్తికావడంతో అందులో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ దౌత్యవేత్తని పిలిచి గట్టి హెచ్చరికలే జారీ చేసింది. ముంబై దాడులపై విచారణను త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ‘26/11 బాధితులు 13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ భూభాగం నుంచే ఈ దాడులకు కుట్ర జరిగింది. అక్కడ్నుంచే దాడులకు తెగబడ్డారు. 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ కాస్తయినా నిజాయితీగా వ్యవహరించి కుట్రదారులను శిక్షించాలి’ అని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగే వరకు పాక్పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భూ భాగం నుంచే దాడులకు కుట్ర జరిగినట్టు అంగీకరించిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. -
పాక్ హైకమిషనర్కు భారత్ సమన్లు..!
-
పాకిస్తాన్కు భారత్ సమన్లు..!
సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్ హైకమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్కు చెందిన జేషే ఏ మహ్మద్ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం పాకిస్తాన్ హైకమిషనర్కు సమన్లు జారీచేశారు. పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్ను భారత్ ఆదేశించింది. భారత్ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. -
ఆ సీనియర్ లీడర్ ను వీఐపీలా చూడలేదు
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఎక్కిన ఎయిరిండియా విమానం 14 గంటలు ఆలస్యంగా బయలుదేరినా.. ఎయిరిండియా అధికారులు ఆయనను కనీసం పట్టించుకోలేదు. ఆయనను వీఐపీలా పరిగణించి ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీనిపై ఏచూరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిరిండియా తనకు కనీసం ఆతిథ్య మర్యాదలు ఇవ్వలేదని, విమానాల్లో ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలో ఇప్పటికీ ఆ సంస్థ తెలుసుకోలేదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎయిరిండియా 701 విమానంలో ఆదివారం రాత్రి ఏచూరి ఎక్కారు. అయితే ఈ విమానం 14 గంటలు ఆలస్యంగా ఢిల్లీకి చేరింది. ఎయిరిండియా విమానం జాప్యంతో తనకు ఎదురైన అనుభవాన్ని ఏచూరి వివరిస్తూ.. 'నేను మళ్లీ పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ డిన్నర్ చేయాల్సి వచ్చింది. మా పార్టీ కారు వచ్చేవరకు నేను ఎయిర్ పోర్టులోనే వేచి చూసాను. మరో అంతర్జాతీయ విమానంలో నాలుగు సీట్లు ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ ప్రయాణికులు కనెక్టింగ్ విమానం ద్వారా అంతర్జాతీయ ఫ్లయిట్ ను అందుకోవాల్సి ఉండటంతో వారికోసం స్వచ్ఛదంగా ఆ సీట్లను వదులుకున్నాను. ఎట్టకేలకు సోమవారం ఉదయం టికెట్ బుక్కయింది. ఇది జరిగింది' అని ఏచూరి వివరించారు. గతంలోనూ వీఐపీల పట్ల ఎయిరిండియా ఇలాగే వ్యవహరించిందని, తనను, పాకిస్థాన్ హైకమిషనర్ ను, ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ చూడటానికి వచ్చిన పాక్ ఆతిథులను ఇలాగే అవమానించిందని ఆయన పేర్కొన్నారు. అయితే సాంకేతికలోపంతోనే ఈ విమాన ప్రయాణంలో జాప్యం తలెత్తిందని ఎయిరిండియా చెప్తోంది. -
ఆ మ్యాచ్ పై కొనసాగుతున్న సస్పెన్స్
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. చర్చోపచర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి. భరోసా ప్రకటనలు వెలువడుతున్నాయి. తమ జట్టు భద్రతకు భారత ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వాలని పాకిస్థాన్ పట్టుబడుతుండగా, లిఖిత పూర్వక హామీ ఇచ్చేది లేదని ఇండియా అంటోంది. ఈ నేపథ్యంలో చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత బాసిత్ విలేకరులతో మాట్లాడుతూ... తమ జట్టు భద్రతకు హోంశాఖ కార్యదర్శి హామీయిచ్చారని చెప్పారు. ఇదే విషయాన్ని తమదేశ ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు. ఇంతకుమించి వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా, తమ దేశానికి ఎవరు వచ్చినా భద్రత కల్పిస్తామని అంతకుముందు హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-పాక్ మ్యాచ్ ధర్మశాల నుంచి కోల్ కతాకు తరలిస్తామని బీసీసీఐ తనను అడగ్గా భద్రత కల్పించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్ కతాలో వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 19న ధర్మశాలలో భారత్-పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ను భద్రత కారణాలతో కోల్కతాకు మార్చిన సంగతి తెలిసిందే. -
పాక్ హైకమిషనర్ కు భారత్ సమన్లు
శ్రీనగర్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, జమ్ముకాశ్మీర్ లో కాల్పులు జరిపినందుకు పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బసీద్ కు ఆదివారం భారత్ సమన్లు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది... ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా...తీవ్రగాయాలైన మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. -
పాక్ టూర్ వీసాలు భారత్ కు ఇవ్వరట!
కోల్ కతా: పాకిస్తాన్లో పర్యటించాలనుకుంటున్నారా? ఇక మీకు కష్టమే. ఎందుకంటారా, అయితే ఇది చదవండి. పాకిస్తాన్ లో పర్యటించాలనుకునే భారతీయులకు సమీప భవిష్యత్తులో ఆ ఆశ తీరేలాలేదు. ఇరుదేశాలు వీసాల ప్రక్రియకు ఇరుదేశాల నిబంధనలే కారణమని ఈ విషయాన్ని స్వయంగా భారత్ లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసితే తెలియజేశారు. ఇరుదేశాల ప్రజలు పర్యటనలపై ఆసక్తిచూపుతున్నారని ఆయన తెలియజేశారు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. సిక్కులు పాకిస్తాన్ ను సందర్శిస్తుంటారు. అలాగే హిందూ పర్యాటకులు పాకిస్తాన్ లో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వీసాల విషయంలో ఇబ్బందులు తొలగించుకోవచ్చని బాసిత్ తెలిపారు. దీనికి ఇరుదేశాలు ఒకరిపై ఒకరికి నమ్మకమే ప్రధాన విషయమని ఆయన పేర్కొన్నారు. వీసాల నిబంధనల్లో పారదర్శకతపై ఆయన మాట్లాడుతూ...మొదట ఇరుదేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్లను అమలుచేయాలనుకుంటున్నాం. అప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. దానిద్వారా ఈ పరిణామాలను ఇతర ప్రాంతాలకూ వ్యాప్తిచేయవచ్చు అని బాసిత్ తెలిపారు. -
భారత్లో పాకిస్థాన్ హైకమిషనర్గా సయ్యద్ అబ్బాస్
భారత్లో పాకిస్థాన్ కొత్త హైకమిషనర్గా సయ్యద్ ఇబ్నే అబ్బాస్ నియమితులయ్యారు. సల్మాన్ బషీర్ స్థానంలో ఆయనను నియమిస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది. అబ్బాస్ ప్రస్తుతం ఢిల్లీలోని హైకమిషన్ కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయంలో కాశ్మీర్ వ్యవహారాల డైరక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాక్ ప్రభుత్వం అబ్బాస్తో పాటు పలు దేశాలకు తమ రాయబారులను నియమించింది.