online views
-
వద్దు... మీరెవరూ రావొద్దు!
టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ క్రీడలను మనం జపాన్కెళ్లి చూద్దామంటే కుదరనే కుదరదు. మనమే కాదు... మరే దేశానికి చెందిన ప్రేక్షకులకు ఆ అవకాశం లేదు. చరిత్రలో తొలిసారి విదేశాలకు చెందిన ప్రేక్షకుల్లేకుండా ఒలింపిక్స్ను నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిర్ణయించింది. శనివారం జపాన్ ప్రభుత్వం, టోక్యో అధికారులు, గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ, పారాలింపిక్ కమిటీ వర్గాలతో ఆన్లైన్ మీటింగ్ నిర్వహించిన ఐఓసీ ప్రేక్షకులపై తుది నిర్ణయం తీసుకుంది. జపాన్లో ఇప్పటివరకు ఎన్నో సర్వేలు నిర్వహించారు. ప్రతి సర్వేలో 80 శాతానికి పైగా జపాన్ వాసులు విదేశీ ప్రేక్షకులు వస్తే కరోనా మహమ్మారి వ్యాప్తి అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతుందని భయాందోళనలు వ్యక్తం చేశారు. అంతేకాదు... సర్వేల్లో పాల్గొన్న మెజారిటీ ప్రజలు వారితో వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనన్న బెంగతో అసలు ఒలింపిక్సే రద్దు చేయాలని కోరారు! ఈ నేపథ్యంలోనే జపాన్ కేంద్ర ప్రభుత్వంతోపాటు స్థానిక ప్రభుత్వాధికారులతో ఆన్లైన్లో సమావేశమైన ఐఓసీ ప్రేక్షకులపై స్పష్టత ఇచ్చింది. ఇదివరకే 6 లక్షల టికెట్లను విదేశీయులకు విక్రయించారు. ఇప్పుడు వారందరికీ డబ్బులు తిరిగి చెల్లిస్తారు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరుగుతాయి. ఆన్లైన్ సమావేశంలో ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్, ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ హాషిమోటో -
రాజమౌళి 'బాహుబలి' మరో భారీ రికార్డు!
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది. ఇప్పటికే ఆన్లైన్లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్గా 'బాహుబలి-2' రికార్డు సృష్టించగా.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతున్నది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం. 'భారత్లో 'బాహుబలి-2' 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే' అని ట్రేడ్ అనాలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 100 మిలియన్లకుపైగా వ్యూస్ను సాధించి దూసుకుపోతున్నది. ఒక ట్రైలర్ ఇంతటి రెస్పాన్స్ సాధించడం భారత చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి. పాపులర్ సాంగ్స్ మాత్రమే యూట్యూబ్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించాయి. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా విడుదలవుతున్న 6500 థియేటర్లలోనూ ఈ సినిమా హౌస్ఫుల్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు. -
బాహుబలి 2 ట్రైలర్పై ఆసక్తికర విషయాలు
-
'బాహుబలి 2' ప్రభంజనం
ఆన్ లైన్ లో 'బాహుబలి 2' ప్రచారచిత్రం ప్రభంజనం కొనసాగుతోంది. అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ట్రైలర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ప్రచారచిత్రానికి ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు స్పందన వస్తోంది. విడుదల ఆరు గంటల్లోనే కోటి వ్యూస్ సాధించింది. అక్కడితో ఆగకుండా ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరో రికార్డు సాధించింది. 96 గంటల్లో 8.5 కోట్లపైగా వ్యూస్ సరికొత్త శిఖరాలను అందుకుంది. 'బాహుబలి 2' ట్రైలర్ కు వస్తున్న స్పందన పట్ల చిత్రయూనిట్ హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ప్రచారచిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు.