రాజమౌళి 'బాహుబలి' మరో భారీ రికార్డు!
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది. ఇప్పటికే ఆన్లైన్లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్గా 'బాహుబలి-2' రికార్డు సృష్టించగా.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతున్నది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం. 'భారత్లో 'బాహుబలి-2' 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే' అని ట్రేడ్ అనాలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు.
ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 100 మిలియన్లకుపైగా వ్యూస్ను సాధించి దూసుకుపోతున్నది. ఒక ట్రైలర్ ఇంతటి రెస్పాన్స్ సాధించడం భారత చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి. పాపులర్ సాంగ్స్ మాత్రమే యూట్యూబ్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించాయి. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా విడుదలవుతున్న 6500 థియేటర్లలోనూ ఈ సినిమా హౌస్ఫుల్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు.