Baahubali 2 Movie trailer
-
100 మిలియన్లా.. ఊహించలేదు: రాజమౌళి
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి-2' విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించింది. దీనిపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. 100 మిలియన్లా (10 కోట్లు).. ఈ స్థాయిలో ట్రైలర్ చూస్తారని అసలు ఊహించలేదని.. అభిమానులు దీన్ని సాధ్యం చేశారని ట్వీట్ చేశారు. ఆన్లైన్లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్గా రికార్డులు సృష్టించిన 'బాహుబలి-2'.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 26న బాహుబలి-2 ఆడియో ఫంక్షన్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే రోజు తెలుగు ప్రేక్షకులకు స్టోర్లలో ఆడియో దొరుకుతుందని రాజమౌళి ట్వీట్లు చేశారు. ఈ 26న సాయంత్ర ఆరున్నర గంటలకు 360 డిగ్రీస్లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను 4k రిజల్యూషన్తో అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తుంది మూవీ యూనిట్. మరోవైపు దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ మూవీ విడుదల అవుతుంది. తొలిసారిగా ఓ సినిమా భారత్లో ఇన్ని థియేటర్లలో విడుదల కావడం ఇదే ప్రథమం. బాహుబలిరేడ్ఆన్ అని హ్యాష్ ట్యాగ్తో దర్శకుడు రాజమైళి ఈ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. Along with the regular live stream, for the 1st time,we are streaming the pre release event in 360° with 4K res to give the best experience. — rajamouli ss (@ssrajamouli) 24 March 2017 #Baahubali2 Pre Release Event on March 26th, in Hyderabad. Telugu audio will be in stores on the same day..:) — rajamouli ss (@ssrajamouli) 24 March 2017 100 million !!! Never ever thought of these numbers... For all those who made it possible -
రాజమౌళి 'బాహుబలి' మరో భారీ రికార్డు!
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది. ఇప్పటికే ఆన్లైన్లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్గా 'బాహుబలి-2' రికార్డు సృష్టించగా.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతున్నది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం. 'భారత్లో 'బాహుబలి-2' 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే' అని ట్రేడ్ అనాలిస్ట్ రమేశ్ బాలా ట్వీట్ చేశారు. ఇప్పటికే యూట్యూబ్లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 100 మిలియన్లకుపైగా వ్యూస్ను సాధించి దూసుకుపోతున్నది. ఒక ట్రైలర్ ఇంతటి రెస్పాన్స్ సాధించడం భారత చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి. పాపులర్ సాంగ్స్ మాత్రమే యూట్యూబ్లో ఈ స్థాయిలో వ్యూస్ సాధించాయి. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా విడుదలవుతున్న 6500 థియేటర్లలోనూ ఈ సినిమా హౌస్ఫుల్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25న ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు. -
'బాహుబలి 2' ప్రభంజనం
ఆన్ లైన్ లో 'బాహుబలి 2' ప్రచారచిత్రం ప్రభంజనం కొనసాగుతోంది. అత్యంత ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా ట్రైలర్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గురువారం ఉదయం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ప్రచారచిత్రానికి ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు స్పందన వస్తోంది. విడుదల ఆరు గంటల్లోనే కోటి వ్యూస్ సాధించింది. అక్కడితో ఆగకుండా ప్రభంజనం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరో రికార్డు సాధించింది. 96 గంటల్లో 8.5 కోట్లపైగా వ్యూస్ సరికొత్త శిఖరాలను అందుకుంది. 'బాహుబలి 2' ట్రైలర్ కు వస్తున్న స్పందన పట్ల చిత్రయూనిట్ హర్షాతిరేకం వ్యక్తం చేసింది. ప్రచారచిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా నటించిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 25 ఆడియో ఫంక్షన్ నిర్వహించనున్నారు.