breaking news
One Time password policy
-
ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా?
సాక్షి, ముంబై: డెబిట్ కార్డు వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. అక్రమ, మోసపూరిత లావాదేవీలను అరికట్టే దిశగా ఏటీఎం లావాదేవీల విషయంలో దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 1, 2020న OTP ఆధారిత నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి. ఈ నిబంధన ప్రకారం ఎస్బీఐ ఏటీఎం నుంచి 10వేలకుమించి మనీ విత్డ్రా చేసే సందర్భంలో ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసినపుడు మాత్రం ఏటీఎం లావాదేవీ పూర్తవుతుంది. అంటే రూ.10,000 లోపు నగదు విత్ డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. ♦ ఏటీఎంలో ఎస్బీఐ మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి. ♦ ఆ తర్వాత మీరు డ్రా చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి. ♦ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ( విత్డ్రా మొత్తం 10వేల రూపాయలకు మించితేనే) ♦ నాలుగు అంకెల అధికారిక ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్డ్రా చేయొచ్చు. ♦ ఈ ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్కు మాత్రమే వర్తిస్తుందనేది గమనించాలి. అంతేకాదు నగదు విత్ డడ్రాలో అక్రమాలను అరికట్టేందుకు మిగిలిన బ్యాంకులు కూడా ఏటీఎం లావాదేవీల్లో ఓటీపి విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది కూడా చదవండి: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారీ షాక్ -
వెబ్ ఆప్షన్లకు వన్టైమ్ పాస్వర్డ్
-
వెబ్ ఆప్షన్లకు వన్టైమ్ పాస్వర్డ్
* 8వ తేదీ నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు! * నేటి సాయంత్రానికి కాలేజీల జాబితా ఇస్తేనే సాధ్యం * లేదంటే వెబ్ ఆప్షన్లలో ఆలస్యం తప్పదు * కోర్టు తీర్పు వచ్చాకే ఇస్తామంటున్న జేఎన్టీయూహెచ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో వన్టైమ్ పాస్వర్డ్ విధానాన్ని అమలు చేయాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. వెబ్సైట్లో విద్యార్థులు తమ వివరాలను ఇవ్వగానే వారి మొబైల్ నంబర్కు వన్టైమ్ పాస్వర్డ్ వచ్చేలా, దానితో లాగిన్ అయి ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ఈ వన్టైమ్ పాస్వర్డ్ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకోవాలంటే మళ్లీ వన్టైమ్ పాస్వర్డ్ పొందాల్సి ఉంటుంది. 8 నుంచి మొదలయ్యేనా? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియను బుధవారం (ఈనెల 8వ తేదీ) నుంచి చేపట్టాలని ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ ఇప్పటికే నిర్ణయించింది. కానీ హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితా ఇంకా ప్రవేశాల క్యాంపు కార్యాలయానికి అందలేదు. అనుబంధ గుర్తింపు నిరాకరణ, కోర్సుల కోతపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడంతో... కోర్టు తీర్పు వచ్చాకే కాలే జీల జాబితాలు, సీట్ల వివరాలు ఇస్తామని జేఎన్టీయూహెచ్ చెబుతోంది. వాస్తవానికి ఈనెల 4వ తేదీనే కోర్టు తీర్పు వస్తుందని... 6వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని తొలుత ప్రవేశాల కమిటీ భావించింది. అలా జరగలేదు. తర్వాత సోమవారం కోర్టు తీర్పు వస్తుందని భావించి.. 8 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ కోర్టు తీర్పు మంగళవారం (7వ తేదీ) సాయంత్రానికి వాయిదా పడింది. అయితే కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జేఎన్టీయూహెచ్ కాలేజీల జాబితాను తమకు అందజేస్తే 8వ తేదీ నుంచే వెబ్ ఆప్షన్లు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టవచ్చని ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. జాప్యం జరిగితే మాత్రం 9వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇదీ వన్టైమ్ పాస్వర్డ్ విధానం వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో నాలుగు దశలు ఉంటాయి. ఇందుకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ను ఉపయోగించడం మంచిది. తొలుత జ్ట్టిఞట://్టట్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి.జీ వెబ్సైట్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ను ఓపెన్ చేయాలి. అందులో విద్యార్థి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి పాస్వర్డ్ జనరేట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అందులో పైబాక్సులో ఒక పాస్వర్డ్ను (అది 8 నుంచి 10 లెటర్లు ఉండాలి. అది క్యాపిటల్ లెటర్, నంబరు, సింబల్, అక్షరాలతో కూడినదై ఉండాలి) ఎంటర్ చేయాలి. రెండో బాక్సులో మరోసారి దాన్నే ఎంటర్ చేయాలి. మూడో బాక్సులో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ను ఇచ్చి, సేవ్ పాస్వర్డ్ను నొక్కాలి. దాంతో మొబైల్ నంబర్కు రహస్య లాగిన్ ఐడీ వస్తుంది. తర్వాత హోంపేజీలో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్లి ఈ లాగిన్ ఐడీ, పాస్వర్డ్లతో లాగిన్ కావాలి. అక్కడ వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) బటన్ను నొక్కితే మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసి వెబ్ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఓటీపీ 20 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఇచ్చిన వెబ్ ఆప్షన్లు ఆటోమెటిక్గా సేవ్ అవుతాయి. మళ్లీ ఆప్షన్లను మార్పు చేసుకోవాలన్నా, మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నా మళ్లీ ఓటీపీని తీసుకుని ఎంటర్ చేయాలి. అఫిలియేషన్లపై నేడు ఉత్తర్వులు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపును నిరాకరించడం, సీట్ల కోతను సవాలు చేస్తూ పలు కాలేజీల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయాన్ని హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేస్తానని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు పేర్కొన్నారు. నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనల మేర బోధనా సిబ్బంది, సౌకర్యాలు లేవనే కారణంతో పలు కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతోపాటు పలు కాలేజీల్లో సీట్లకు కోత వేసింది కూడా. దీనిని సవాలు చేస్తూ పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వాటిపై కాలేజీల యాజమాన్యాల తరఫు న్యాయవాదులతో పాటు, జేఎన్టీయూ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు.