-
చెస్ బోర్డు మాదిరి బ్రిడ్జ్... ఎక్కడుందో తెలుసా!: వీడియో వైరల్
చెన్నై: 44వ ఫిడే చెస్ ఒలింపియాడ్ జూలై 28న చెన్నైలోని మహాబలిపురంలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చెన్నై నగరంలోని నేపియర్ బ్రిడ్జ్కి చెస్ బోర్డులా పేయింట్ వేశారు. ఈ బ్రిడ్జ్ ప్రయాణికులను అత్యద్భుతంగా ఆకట్టుకుంటోంది. వందేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో తొలిసారిగా భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది ఈ ఒలింపియాడ్ ఈవెంట్కి సుమారు 2 వేల మంది దాక క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ బ్రిడ్జ్ తాలుకా వీడియోని పోస్ట్ చేస్తూ...భారతదేశానికి చెందిన చెస్ రాజధాని చెన్నై గగ్రాండ్ చెస్ ఒలింపియాడ్ 2022కి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఐకానిక్ నేపియర్ బ్రిడ్జ్గా చెస్ బోర్డులా అలంకరిచండబడిందని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు వావ్ వాటే స్పీరిట్ నమ్మా చెన్నై అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Chennai the Chess Capital of India is all set to host the grand, Chess Olympiad 2022.The iconic Napier Bridge is decked up like a Chess Board.Check it out 😊 #ChessOlympiad2022 #ChessOlympiad #Chennai pic.twitter.com/wEsUfGHMlU — Supriya Sahu IAS (@supriyasahuias) July 16, 2022 (చదవండి: కరోనాతో ఆస్పత్రిలో చేరిన పన్నీర్సెల్వం) -
జిష్ణుకు బంగారు పతకం
చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలోని పుత్తూరు పరిధి రాచపాళెం గ్రామానికి చెందిన బసవరాజు జిష్ణు(18) అంతర్జాతీయ స్థాయి ఒలంపియాడ్లో బంగారు పతకం సాధించాడు. ఈ నెల 19 నుంచి 29 వరకు యూరప్లోని చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశాల్లో నిర్వహించిన 50వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలంపియాడ్ పరీక్షల్లో ప్రతిభ చాటా డు. ఈ పరీక్షల్లో 85 దేశాలకు చెందిన విద్యార్థులు పోటీపడ్డారు. అందులో జిల్లాకు చెందిన జిష్ణు రసాయన శాస్త్రంలో నిర్వహించిన రాతపరీక్ష, ప్రయోగ పరీక్షలో ప్రతిభ చాటి బంగారుపతకం కైవసం చేసుకున్నాడు. అనంతరం ఈ విద్యార్థి ప్రాగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భారతదేశం తరఫున బహుమతి పొందాడు. జిష్ణు ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒలంపియాడ్ పోటీలు మూడంచెల ఎంపిక పరీక్ష విధానంలో జరిపారని చెప్పారు. మన దేశం నుంచి తనతో పాటు ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు చెంగల్రాజు, భారతి ప్రభుత్వ ఉపాధ్యాయులని, వారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ బహుమతి సాధించగలిగానన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు, పోటీపరీక్షలు రాసి దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే తన ఆశయమన్నారు. -
గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నాం
చెన్నై: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత క్రీడాకారులు గెలిచే అవకాశాల్ని చేజార్చుకున్నారని గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ అన్నాడు. అజర్బైజాన్లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో బాలుర బృందం నాలుగో స్థానంలో, బాలికల జట్టు ఐదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్వదేశానికి చేరుకున్న అతను టోర్నీ ఫలితాల్ని విశ్లేషించాడు. ఈ ఈవెంట్లో భారత జట్లు ఓవరాల్గా చక్కని ఆటతీరునే కనబర్చాయని చెప్పిన అతను పతకం దక్కకపోవడానికి కొన్ని గేముల ఫలితాలే కారణమన్నాడు. ‘కొందరు ఆటగాళ్లు మంచి ఎత్తులతో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కనబరిచారు. గెలవాల్సిన ఆ మ్యాచ్ల్ని డ్రాతో ముగించడం వల్లే పతకాన్ని మూల్యంగా చెల్లించుకున్నాం’ అని హరి వివరించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ హరికృష్ణ ఈ టోర్నీలో చక్కని పోరాటంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ సెర్గెయ్ కర్జాకిన్ (రష్యా), మమెద్యరోవ్ (అజర్బైజాన్)లను కంగుతినిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే)తో గేమును డ్రా చేసుకున్నాడు. -
ఒలింపియాడ్లో ఎంపీఎస్ విద్యార్థుల ప్రతిభ
మెుదటి ర్యాంకర్ శ్రీమహాలక్ష్మికి స్వర్ణపతకం సాయిభార్గవికి 7, హర్షిత్కు 10 ర్యాంకులు మండపేట : సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో గత ఫిబ్రవరిలో జరిగిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన తమ విద్యార్థులు పలు పతకాలు అందుకున్నట్టు పట్టణానికి చెందిన మండపేట పబ్లిక్ స్కూల్ (ఎంపీఎస్) కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు తెలిపారు. 9వ తరగతి విద్యార్థిని ఎ.శ్రీమహాలక్ష్మి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిందన్నారు. గురువారం నెల్లూరు టౌన్హాలు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీడా రవిచంద్ర, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్ల చేతుల మీదుగా బంగారు పతకం, నగదు బహుమతి అందుకున్నట్టు తెలిపారు. 5వ తరగతి చదువుతున్న డి.వీరసాయి భార్గవి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకు, 8వ తరగతి విద్యార్థి సీహెచ్ హర్షిత్ 10వ ర్యాంకు సాధించి, బహుమతులు అందుకున్నారన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను చిన్నారావు, స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు. -
దేశాభివృద్ధిలో స్టాటిస్టిక్స్ పాత్ర కీలకం
సెంట్రల్ యూనివర్సిటీ: దేశాభివృద్ధిలో గ ణాంకాల (స్టాటిస్టిక్స్) పాత్ర కీలకమని ప్రధాని మాజీ ఆర్థిక సలహాదారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అభిప్రాయపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీలోని సీఆర్. రావు స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఆదివారం 8వ స్టాటిస్టిక్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.రంగరాజన్ మాట్లాడుతూ సాంకేతిక శాస్త్రాన్ని, ఆధునిక టెక్నాలజీలో విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు. దేశానికి సాంకేతిక శాస్త్రవేత్తల అవసరం ఉందన్నారు. స్టాటిస్టిక్స్కు భారత్ మూలమని, సిఆర్. రావు లాంటి వ్యక్తులు ఈ రంగంలో ఖ్యాతి గడించారని అన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జగన్నాథరావు మాట్లాడుతూ న్యాయ సమస్యలను పరిష్కరించడంలో గణాంకాలు కీలకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని పలు పెండింగ్ వివాదాలను గణాంకాల ఆధారంగా పరిష్కరించిన ఘటనలను గుర్తుచేశారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాభివృద్ధి జరగాలని సూచించారు. అప్పుడే దేశాభివృద్ది సాధ్యమన్నారు. స్టాటిస్టికల్ ఒలింపియాడ్లో విజేతలైన పలు పాఠశాలల విద్యార్థులకు రంగరాజన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ అరుణాచలం, హెచ్సీయూ వైస్ఛాన్సలర్ హరిబాబు, సీఆర్ రావు ఇనిస్టిట్యూట్ డెరైక్టర్ అల్లం అప్పారావు, ప్రొఫెసర్ యుగేందర్, ఎస్బీరావు, తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement