-
విద్వేషపూరిత పోస్టింగ్లు.. మానవ బాంబునై సీఎంను చంపేస్తా..!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మానవ బాంబుగా మారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందిస్తానంటూ ట్విట్టర్లో హెచ్చరిక పోస్టింగ్లు చేసిన ఓ నిందితుడిని సీఐడీ సైబర్ క్రైమ్స్ విభాగం పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరానికి చెందిన రాజుపాలెపు పవన్ఫణి అనే వ్యక్తి కన్నాభాయ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ పోస్టింగ్లు చేసినట్టు గుర్తించారు. హైదరాబాద్లోని ఓ సంస్థలో సేల్స్ సూపర్వైజర్గా పని చేస్తున్న నిందితుడు జనసేన మద్దతుదారుడినని, పవన్కళ్యాణ్ వీరాభిమానని వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఎస్పీ రాధిక తెలిపారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. చదవండి: టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐపీఎస్ అధికారుల సంఘం హెచ్చరిక టెక్నాలజీతో గుర్తించిన సీఐడీ సీఎం జగన్మోహన్రెడ్డి పట్ల ద్వేషంతో ఆయన్ను చంపాలంటూ ఈ నెల 16న ట్వీట్ చేసిన నిందితుడు అదేరోజు రాత్రి దాన్ని తొలగించాడు. ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేశాడు. ఫోన్ స్విచ్ఛ్ ఆఫ్ చేసి ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సీఐడీ సైబర్ నేరాల విభాగం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితుడు ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకుంది. ముఖ్యమంత్రిని హతమారిస్తే ప్రభుత్వం కూలిపోతుందని విద్వేషపూరిత పోస్టులు పెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు.. అభ్యంతరకర, అశ్లీల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చట్ట వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ విభాగం హెచ్చరించింది. తప్పుడు ఖాతాల ద్వారా పోస్టింగ్లు చేసి ఆ తర్వాత డిలీట్ చేసినా నిందితులు తప్పించుకోలేరని హెచ్చరించింది. సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేసేముందు జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసేవారిని తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తితో తమ పారీ్టకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హింస, అశాంతి రేకెత్తించే వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపింది. -
కేసీఆర్ కుటుంబంపై అభ్యంతరకర పోస్టులు
సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ తాజా మాజీ ఎంపీ కవితపై ఫేస్బుక్లో అసభ్య పదజాలం ఉపయోగిస్తూ పోస్టులు చేసిన మహబూబ్నగర్ వాసి చిర్ప నరేశ్ను నగర సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేస్తూ ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేత జి.శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేశారు. టెక్నికల్ డాటా ఆధారంగా నిందితుడు మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలానికి చెందిన చిర్ప నరేశ్ (ప్రైవేట్ఉద్యోగి)గా గుర్తించారు. ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్రావు, ఎస్.మదన్, పోలీసు కానిస్టేబుల్చారి నేతృత్వంలోని బృందం నిందితుడు నరేశ్ను పట్టుకొని సిటీకి తీసుకొచ్చారు. -
‘సోషల్ మీడియా దుర్వినియోగంపై చర్యలు’
ముంబై: సామాజిక వెబ్సైట్లలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్ హెచ్చరించారు. కేవలం అప్లోడ్ చేసినవారిపై మాత్రమే కాకుండా వాటిని లైక్ చేసినవారిపై, షేర్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పుణేలోని హడప్సర్లో సాఫ్ట్వర్ ఇంజనీర్ మొహసిన్ హత్యకేసు నేపథ్యంలో పాటిల్ ఈ హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉపయోగిస్తున్నారని, మంచికి ఉపయోగపడాల్సిన దానిని ఇలా దుర్వినియోగం చేస్తే ఊరుకునేదిలేదన్నారు. మొబైల్ ఫోన్ను దుర్వినియోగం చేసినా కూడా సదరు ఫోన్ యజమానిపై చర్యలు తప్పవన్నారు. ఇందుకు ఏవైనా చట్టాలు అవసరమైతే వాటిని రూపొందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
బారామతిలో అలాంటి చర్యలు పనిచేయవు: అజిత్ పవార్
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
తప్పక చదవండి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement