-
ట్రిబ్యునళ్లలో ఖాళీల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: ట్రిబ్యునళ్లలో నియామకాల ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ), అర్మ్డ్ పోర్సెస్ ట్రిబ్యునల్ (ఏఎఫ్టీ)ల్లో ఖాళీలు భర్తీ చేస్తూ నోటిఫికేషన్లు జారీ చేసింది. నియామకాలు చేపట్టకుండా ట్రిబ్యునళ్లను నిర్వీర్యం చేస్తున్నారని, తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని సుప్రీంకోర్టు ఈనెల 6న కేంద్రం వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13లోగా కొన్ని నియామకాలైన చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఖాళీల భర్తీని కేంద్రం చేపట్టింది. వివిధ ట్రిబ్యునళ్లలో దాదాపు 250 దాకా ఖాళీలు ఉన్నాయి. ఎన్సీఎల్టీ: ఎనిమిది మంది జ్యుడీషియల్, 10 మంది సాంకేతిక సభ్యుల్ని నియమించింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రదీప్ నరహరి దేశ్ముఖ్, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రామతిలగం, పంజాబ్ హరియాణా హైకోర్టు విశ్రాంత రిజి్రస్టార్ జనరల్ హర్నామ్ సింగ్ ఠాకూర్, పి.మోహన్రాజ్, రోహిత్ కపూర్, జస్టిస్ దీప్ చంద్ర జోషి ఎన్సీఎల్టీలో జ్యుడీíÙయల్ సభ్యులు. వీరంతా ఐదేళ్ల పదవీకాలం, 65 ఏళ్ల వయసు.. ఏది ముందు ముగిస్తే అప్పటి వరకూ కొనసాగుతారు. ఐటీఏటీ: జ్యుడీíÙయల్ సభ్యులుగా అన్రిజర్వు కేటగిరీలో అడ్వొకేట్ సంజయ్ శర్మ, అడ్వొకేట్ ఎస్.సీతాలక్ష్మి , అదనపు జిల్లా, సెషన్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.గోయెల్, జస్టిస్ అనుభవ్ శర్మ. ఓబీసీ కేటగిరీలో అడ్వొకేట్ టీఆర్ సెంథిల్కుమార్, ఎస్సీ కేటగిరీలో ఎస్బీఐ లా ఆఫీసర్ మన్మోహన్ దాస్లను నియమించారు. వీరి పదవీకాలం నాలుగేళ్లు, లేదా 67 ఏళ్లు.. ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఏఎఫ్టీ: ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్లో ఆరుగురు జ్యుడీíÙయల్ సభ్యుల్ని కేంద్రం నియమించింది. జస్టిస్ బాలకృష్ణ నారాయణ, జస్టిస్ శశికాంత్ గుప్తా, జస్టిస్ రాజీవ్ నారాయణ్ రైనా, జస్టిస్ కె.హరిలాల్, జస్టిస్ ధరమ్చంద్ర చౌదరి, జస్టిస్ అంజనా మిశ్రాలను నియమించింది. వీరి పదవీ కాలం నాలుగు సంవత్సరాలు, 67 ఏళ్లు ఏది ముందుగా ముగిస్తే అప్పటి వరకూ ఉంటుంది. ఢిల్లీ, చండీగఢ్, లక్నోల్లో ఏఎఫ్టీ నాలుగు బెంచ్లు ఉన్నాయి. ఆయా ట్రిబ్యునళ్లలో 19 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి. రిటైర్డ్ జస్టిస్ రజని -
భూ సమీకరణకు సిబ్బంది కేటాయింపు
సాక్షి, గుంటూరు: భూ సమీకరణను వేగవంతం చేయడంలో భాగంగా 27 యూనిట్లకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఇతర జిల్లాల నుంచి కేటాయించిన రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది గుంటూరు జిల్లాలో రిపోర్ట్ చేస్తున్నారు. దీంతో వీరిని 27 యూనిట్ల పరిధిలో నియమిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు మండలంలోని 16 గ్రామాల్లో భూ సమీకరణ కు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మండలంలో పూర్తి స్థాయిలో రెవెన్యూ, సర్వే సిబ్బందిని నియమించగా, మిగిలిన సిబ్బందిని మంగళగిరి, తాడేపల్లి మండలాలకు కేటాయిస్తున్నారు. ఇప్పటికి ఇతర జిల్లాల నుంచి 11 మంది, గుంటూరు నుంచి ఆరుగురు మొత్తం 17 మంది డిప్యూటీ కలెక్టర్లు, 29 మంది తహశీల్దార్లు, 47 మంది డిప్యూటీ తహశీల్దార్లు, 40 మంది సర్వేయర్లు వచ్చారు. 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు.తాత్కాలికంగా జిల్లాలో ఉన్న సీనియర్ అధికారులను భూ సమీకరణకు వాడుకుంటున్నారు.ఇంకా సీనియర్, జూని యర్ అసిస్టెంట్లను కేటాయించాల్సి వుంది. ఇప్పటికే జిల్లాలో పలువురు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను భూ సమీకరణకు వినియోగిస్తున్నారు. మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, తిప్పాయిపాలెంలో భూ సమీకరణ కోసం డిప్యూటీ కలెక్టర్లు ఆయా గ్రామాల పరిధిలో నోటిఫికేషన్లు విడుదల చేశారు. రైతులు 9.3 దరఖాస్తులు తీసుకెళ్లారు. బుధవారం నాటికి 725 మంది రైతులు 2,058.56 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్కు సమ్మతించినట్టు గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల్లో రైతులు అంగీకార పత్రాలు ఇవ్వలేదు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement