breaking news
North Karnataka
-
ఆట పాటల శిక్షణ
‘ఆడుతూ పాడుతూ కూడా చదువు హాయిగా నేర్చుకోవచ్చు’ అంటాడు అక్షయ్ మసెల్కర్. ఉత్తర కర్నాటకలోని సిర్సి జిల్లాకు చెందిన అక్షయ్, బడి అంటే దూరంగా పారిపోయే విద్యార్థుల కోసం హ్యుమనాయిడ్ రోబోను తయారు చేశాడు. దానికి ‘శిక్షణ’ అని పేరు పెట్టాడు.ఎంత టీచర్ అయినప్పటికీ ‘శిక్షణ’ రూపం అచ్చం విద్యార్థిలాగే ఉంటుంది. ఒకటి నుంచి నాల్గో తరగతి విద్యార్థుల కోసం రూ΄÷ందించిన ఈ రోబో టీచర్ పిల్లలను నవ్విస్తూనే కన్నడ, ఇంగ్లీష్ భాషలలో పాఠాలు చెబుతుంది. గేయాలు పాడుతుంది. మాథ్స్ సులువుగా నేర్పిస్తుంది. ΄÷డుపు కథలు వేస్తుంది. ఒకటా రెండా... ఎన్నో ఎన్నెన్నో!}ఈ రోబో పుణ్యమా అని బడికి దూరంగా ఉండే పిల్లలు కూడా బడికి ఇష్టంగా రావడం విశేషం. తమ రోబో టీచర్కు సంబంధించిన విషయాలను రోజూ ఇంట్లో తల్లిదండ్రులకు చెబుతుంటారు.}అక్షయ్ తల్లి టీచర్గా పనిచేసేది. తానూ టీచర్ కావాలనుకోవడానికి అమ్మే స్ఫూర్తి. డిగ్రీ పూర్తయిన తరువాత ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేశాడు అక్షయ్. లెక్చరర్గా పనిచేస్తున్న కాలంలో విద్యావిధానం గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలోనే అతడికి కొత్త కొత్త ఐడియాలు వస్తుండేవి. అయితే తనకు వచ్చే వినూత్న ఆలోచనలను సాకారం చేసుకునే సమయం ఉండేది కాదు.కోవిడ్ కల్లోల కాలంలో బోలెడంత తీరిక దొరకడంతో తన ఐడియాలపై పనిచేసే అవకాశం వచ్చింది. పల్లెటూరు బడుల నుంచి పట్నం బడుల వరకు చాలా బడులలో బోధనకు సంబంధించిన శాస్త్రీయ విధానాన్ని అనుసరించడం లేదని, డ్రాయింగ్ చార్ట్లు, బ్లాక్బోర్డ్ తప్ప ఇతరత్రా ఉపకరణాలను ఉ పాధ్యాయులు ఉపయోగించడం లేదని గ్రహించాడు అక్షయ్.‘మొక్కుబడిగా బోధించడం కాకుండా వినూత్నమైన పద్ధతుల్లో విద్యార్థులకు చేరువ కావాలి’ అనుకున్న అక్షయ్ సంవత్సరానికి పైగా పరిశోధనలు చేశాడు. సంప్రదాయ బోధన, ఆధునిక సాంకేతికతను కలిపి రోబో టీచర్ను తయారుచేశాడు. ఈ రోబోను తయారు చేయడానికి రెండు లక్షల రూ పాయలు ఖర్చు అయింది. ఈ ఖర్చును తానే స్వయంగా భరించాడు.ఈ రోబోలో రెండు కార్డులు ఉంటాయి. మాస్టర్కార్డ్ అన్లాక్ కోసం, నార్మల్ కార్డ్ ఇష్టమైన ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. మొదట్లో ఈ రోబ్ను 25 స్కూల్స్లో ఉపయోగించారు. ఆ తరువాత మరిన్ని స్కూల్స్కు విస్తరించారు.‘రోబో టీచర్ను అక్షయ్ మాకు పరిచయం చేశారు. చాలా ఆసక్తిగా అనిపించింది. పిల్లలైతే ఎంతో సంతోషించారు. క్లాసులో కదలకుండా కూర్చుంటున్నారు. వారికి ఇది రోబో కాదు టీచర్, ఫ్రెండ్. పిల్లలకు మాత్రమే కాదు ఉ పాధ్యాయులకు కూడా రోబో ఎంతో ఉపయోగపడుతుంది. వారి భారాన్ని తగ్గిస్తోంది. సైన్స్, టెక్నాలజీ విషయాలపై ఆసక్తి పెంచుతుంది’ అంటుంది సిర్సిలోని మోడల్ హైయర్ ప్రైమరీ స్కూల్ సైన్స్, మ్యాథ్స్ టీచర్ సునైనా హెగ్డే.‘శిక్షణ’ రోబో దగ్గర మాత్రమే ఆగిపోలేదు అక్షయ్. విద్యారంగంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల కోసం ‘ఎక్స్పిర్మైండ్’ స్టార్టప్ ద్వారా కృషి చేస్తున్నాడు.‘గ్రామీణ్ర పాంత పిల్లలకు టెక్నాలజీని పరిచయం చేయడమే కాదు భవిష్యత్లో వారు కూడా కొత్త ఆవిష్కరణలు చేసేలా స్ఫూర్తి కలిగించడం, ప్రోత్సహించడమే మా లక్ష్యం’ అంటున్నాడు అక్షయ్. -
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ప్రత్యేక తెలంగాణ తరహాలో..
సాక్షి, బెంగళూర్ : పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఉత్తర కర్ణాటకను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు బీజేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములు మద్దతు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు మద్దతుగా ఆగస్ట్ 2న కొన్ని సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపును ఆయన సమర్ధించారు. ఉత్తర కర్ణాటకకు జరుగుతున్న అన్యాయంపై తాము మౌనంగా ఉండలేమని, ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని తదుపరి ఏం చేయాలో కార్యాచరణ రూపొందిస్తున్నామని శ్రీరాములు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ఉద్యమం ఊపందుకుంటుందన్నారు. సంకీర్ణ సర్కార్ ఉత్తర కర్ణాటకను నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యమంత్రి కుమారస్వామి పక్షపాత రాజకీయాలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కుమారస్వామి కేవలం రెండు జిల్లాలకే సీఎంగా ప్రవరిస్తున్నారని, హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తమ ప్రాంత ప్రయోజనాలను సీఎం విస్మరిస్తున్నారని ఉత్తర కర్ణాటకకు చెందిన పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప తోసిపుచ్చారు. -
ఆదుకోండి...
అతివృష్టిపై కేంద్ర సాయం కోరిన సీఎం వరద నష్టం సుమారు రూ.400 కోట్లు 53 వేల హెక్టార్లలో పంట నష్టం నివేదికల తయారీలో అధికారులు నిమగ్నం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉత్తర కర్ణాటకలోని ఎనిమిది జిల్లాల్లో గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల అపార ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. వరద తాకిడికి గురైన గుల్బర్గ, రాయచూరు నగరాల్లో ఆయన శనివారం పర్యటించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైమానిక సర్వే నిర్వహించిన అనంతరం ఆయన గుల్బర్గలో హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వరద నష్టంపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించి, పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతామని చెప్పారు. ఉత్తర కర్ణాటకలో అతివృష్ట వల్ల ఎనిమిది జిల్లాల్లో రూ 400 కోట్లు పంట నష్టం జరిగిందని, 22 మంది చనిపోయారని తెలిపారు. సుమారు 53 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. ఈ నష్టాలపై నివేదికలను తయారు చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పారు. కాగా అక్టోబరు ఆఖరు వారం లేదా నవంబరు తొలి వారంలో గుల్బర్గలో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. గుల్బర్గ హైకోర్టు బెంచ్ పరిధిలోకి బళ్లారి, కొప్పళ జిల్లాలను చేర్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటు విషయాన్ని కూడా ఇదే సమయంలో పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వెంట రెవెన్యూ శాఖ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్, వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ, జిల్లా ఇన్చార్జి మంత్రి ఖమరుల్ ఇస్లాం, యాదగిరి జిల్లా ఇన్చార్జి మంత్రి బాబూరావు చించనసూరు తదితరులు ఉన్నారు.


