breaking news
Noman Ali
-
ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 (WTC 2025-27) సైకిల్ను డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా (South Africa) ఓటమితో ప్రారంభించింది. ఈ సైకిల్లో వారి తొలి మ్యాచ్లో గత సైకిల్లో చివరి స్థానంలో నిలిచిన పాకిస్తాన్ (Pakistan) చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది.రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా లాహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 93 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు పోటాపోటీగా తలపడినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పాక్ను గట్టెక్కించింది. ఇరు జట్లలో ప్రధాన స్పిన్నర్లు అత్యుత్తమంగా రాణించారు. సౌతాఫ్రికా తరఫున సెనురన్ ముత్తుసామి, పాక్ తరఫున నౌమన్ అలీ 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు.రాణించిన పాక్ బ్యాటర్లు.. ఆరేసిన ముత్తుసామిఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.జోర్జి బాధ్యతాయుతమైన శతకం.. ఆరేసిన నౌమన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. నౌమన్ అలీ (6/112), సాజిద్ ఖాన్ (3/98) ధాటికి తడబడింది. టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో అతి కష్టం మీద 269 పరుగులు చేయగలిగింది. దీంతో పాక్కు అత్యంత కీలకమైన 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.పాక్ను మడతపెట్టిన ముత్తురెండో ఇన్నింగ్స్లో ముత్తుసామి మరోసారి (17-1-57-5) చెలరేగడంతో పాక్ రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్లో మరో స్పిన్నర్ సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్ స్కోర్ కూడా కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.చెలరేగిన నౌమన్, అఫ్రిది ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆది నుంచే తడబడుతూ వచ్చింది. నౌమన్ అలీ (28-4-79-4) మరోసారి చెలరేగి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. అతనికి షాహీన్ అఫ్రిది (8.5-1-33-4), సాజిద్ ఖాన్ (14-1-38-2) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో బ్రెవిస్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు (3 టీ20లు, 3 వన్డేలు) కూడా జరుగనున్నాయి. చదవండి: గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు.. -
PAK vs SA: రమీజ్ రాజా ‘చీప్’ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా (Ramiz Raja) మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. పాక్ వెటరన్ ఆటగాడు నొమన్ అలీ (Noman Ali)ని ఉద్దేశించి చవకబారు వ్యాఖ్యలు చేశాడు. దీంతో సొంత జట్టు అభిమానులే రమీజ్ రాజాపై మండిపడుతున్నారు. ‘‘మీకసలు బుద్ధి ఉందా?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా పాక్ సొంతగడ్డపై సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడుతోంది. ఇందులో భాగంగా ఆదివారం లాహోర్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసింది.బాబర్ ఆజం విఫలంఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93), కెప్టెన్ షాన్ మసూద్ (76), సల్మాన్ ఆఘా (93) రాణించగా.. మాజీ సారథి బాబర్ ఆజం (Babar Azam) 23 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో పాక్ 378 పరుగులకు ఆలౌట్ అయింది.కాగా సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మేర్ బౌలింగ్లో బాబర్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ ముందుగా నాటౌట్ ఇవ్వగా.. సౌతాఫ్రికా ఆఖరి నిమిషంలో రివ్యూకు వెళ్లింది. ఇందులో బంతి ముందుగా ప్యాడ్ను తాకినట్లు (లెగ్ స్టంప్ ఎగిరినట్లు) తేలింది. ఫలితంగా థర్డ్ అంపైర్ బాబర్ను అవుట్గా ప్రకటించాడు.రివ్యూతో గట్టెక్కాడుఇక అంతకు ముందు ఒక పరుగు వద్ద ఉన్న వేళ బాబర్ ఆజం రివ్యూతో గట్టెక్కాడు. ముతుసామి వేసిన బంతిని ఆడటంలో బాబర్ విఫలం కాగా.. ప్రొటిస్ బౌలర్లు మాత్రం అప్పీలు చేశారు. ఈ క్రమంలో బంతిని బ్యాట్ను తాకలేదని భావించిన బాబర్ రివ్యూకు వెళ్లగా.. అతడికి అనుకూల ఫలితం వచ్చింది.కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడుఈ విషయం గురించి కామెంట్రీలో రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘‘ఇది అవుటే అనిపిస్తోంది. ఒకవేళ నిర్ణయం తనకు అనుకూలంగా లేకుంటే అతడు కచ్చితంగా డ్రామాకు తెరతీస్తాడు’’ అని నోరుపారేసుకున్నాడు. అయితే, అప్పటికి తన మైకు ఆన్లో ఉందని రమీజ్ రాజాకు తెలియకపోవడం గమనార్హం.ఇక తాజాగా మరోసారి రమీజ్ రాజా తమ జట్టు ఆటగాడిని టార్గెట్ చేశాడు. సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 269 పరుగులకే ఆలౌట్ చేయడంలో పాక్ స్పిన్నర్ నొమన్ అలీది కీలక పాత్ర. ఈ లెఫ్టార్మ్ బౌలర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయిఅయితే, ఈ మ్యాచ్లో నొమన్ అలీ సన్గ్లాసెస్ ధరించి బౌలింగ్ చేశాడు. ఈ విషయం గురించి కామెంట్ చేస్తూ.. ‘‘ఫ్యాన్సీ గ్లాసెస్ ధరించాడు నొమన్ అలీ. ఇవైతే అచ్చంగా వెల్డింగ్ గ్లాస్లా ఉన్నాయి’’ అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్గా సేవలు అందించిన నీ దృష్టిలో ఆటగాళ్లంటే ఇంత చిన్నచూపా. నీ కెరీర్లో అంత గొప్పగా ఏం సాధించావని ఇంతగా బిల్డప్ ఇస్తున్నావు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 18 ఓవర్లు ముగిసేసరికి పాక్.. తొలి ఇన్నింగ్స్తో కలుపుకొని 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: IND vs WI: టీమిండియా వరల్డ్ రికార్డు -
వరుణ్ చక్రవర్తికి భంగపాటు
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)కి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు తొలిసారిగా నామినేట్ అయిన అతడికి భంగపాటు తప్పలేదు. వరుణ్ మాదిరే ఇటీవల అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్(Jomel Warrican) అవార్డును ఎగురేసుకుపోయాడు.ఇదొక చిన్న మైలురాయివరుణ్ చక్రవర్తి, పాకిస్తాన్ స్పిన్నర్ నొమన్ అలీ(Noman Ali)లను వెనక్కినెట్టి జనవరి నెలకు గానూ వారికన్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ఏడాది టెస్టుల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే, ఇంత గొప్పగా దానిని సాధిస్తానని అనుకోలేదు.నా క్రికెట్ ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్తో సిరీస్లో తప్పక రాణిస్తానని మా కెప్టెన్కు మాటిచ్చాను. మా నాన్న కళ్లెదుటే నా నుంచి ఇలాంటి గొప్ప ప్రదర్శన రావడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని వారికన్ హర్షం వ్యక్తం చేశాడు.పాకిస్తాన్తో టెస్టు సిరీస్లోకాగా ఇటీల పాకిస్తాన్తో టెస్టు సిరీస్లో వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ గడ్డపై రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా పందొమ్మిది వికెట్లు తీశాడు. ముల్తాన్ వేదికగా తొలి టెస్టు పాక్ తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చాడు.అయితే, ఈ మ్యాచ్లో విండీస్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా పాకిస్తాన్ చేతిలో 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ముల్తాన్లోనే జరిగిన రెండో టెస్టులో వారికన్ వరుసగా నాలుగు, ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పాకిస్తాన్ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో 2ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డునూ వారికన్ సొంతం చేసుకున్నాడు.వరుణ్ మాయాజాలంమరోవైపు.. ఇంగ్లండ్తో సొంతగడ్డపై టీ20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్లలో కలిపి ఏకంగా 14 వికెట్లు కూల్చిన అతడి ఖాతాలో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వరుణ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వారికన్తో పోటీలో వెనుకబడి విజేతగా నిలవలేకపోయాడు. విజేతగా బెత్ మూనీఇక మహిళా క్రికెటర్ల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ జనవరి నెలకు గానూ ‘’ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఇటీవల ఇంగ్లండ్తో యాషెస్ సిరీస్లో భాగంగా తన టెస్టు కెరీర్లో తొలి శతకం బాదిన ఆమె.. అంతకు ముందు టీ20 సిరీస్లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మూనీ ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.వెస్టిండీస్ స్పిన్నర్ కరిష్మా రామ్హరాక్, అండర్-19 ప్రపంచకప్-2025లో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ తెలుగమ్మాయి గొంగడి త్రిషలను వెనక్కి నెట్టి మూనీ అవార్డును సొంతం చేసుకుంది. కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు ఇచ్చే క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా నామినేట్ అయిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించి.. అవార్డును ప్రదానం చేస్తారు.చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో వరుణ్ చక్రవర్తి
జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఫిబ్రవరి 6) ప్రకటించింది. పురుషుల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నోమన్ అలీ, విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్, టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ, విండీస్ స్పిన్నర్ కరిష్మ రామ్హరాక్, భారత యువ సంచలనం గొంగడి త్రిష జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.నోమాన్ అలీ: ఈ పాకిస్తానీ వెటరన్ స్పిన్నర్ జనవరి నెలలో టెస్ట్ల్లో అత్యుత్తమంగా రాణించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో నోమాన్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 10 వికెట్ల ఘనతతో పాటు హ్యాట్రిక్ ప్రదర్శన ఉంది. నోమాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండోసారి. నోమాన్.. గతేడాది అక్టోబర్లో ఈ అవార్డు గెలుచుకున్నాడు.వరుణ్ చక్రవర్తి: ఈ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాక చెలరేగిపోతున్నాడు. జనవరి నెలలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెలలో జరిగిన 4 మ్యాచ్ల్లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనల తర్వాత వరుణ్ టీ20 ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబకాడు.జోమెల్ వార్రికన్: 32 ఏళ్ల ఈ కరీబియన్ స్పిన్నర్ జనవరి నెలలో పాక్తో జరిగిన రెండు టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్లో అతను 19 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో వార్రికన్ బ్యాటింగ్లోనూ పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో విండీస్ పాక్ గడ్డపై 34 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.బెత్ మూనీ: ఈ ఆసీస్ వికెట్కీపర్ బ్యాటర్ ఇంగ్లండ్తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్ సిరీస్లో సత్తా చాటింది. ఈ సిరీస్లోని టీ20 మ్యాచ్ల్లో మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టీ20 సిరీస్లోని మూడు మ్యాచ్లో మూనీ 75, 44, 94 నాటౌట్ స్కోర్ల సాయంతో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆసీస్ టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రదర్శనల అనంతరం మూనీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్తానానికి ఎగబాకింది.కరిష్మ రామ్హరాక్: ఈ విండీస్ స్పిన్ బౌలర్ బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో కరిష్మ రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది. కరిష్మ సత్తా చాటడంతో ఈ సిరీస్లో విండీస్ బంగ్లాదేశ్పై 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో కరిష్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంది.గొంగడి త్రిష: ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్ 19 టీ20 వరల్డ్కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ టోర్నీలో త్రిష (జనవరిలో) 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. -
PAK Vs WI: చరిత్ర సృష్టించిన నొమన్ అలీ
వెస్టిండీస్తో రెండో టెస్టులో పాకిస్తాన్(Pakistan Vs West Indies) శుభారంభం చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది.ఈ క్రమంలో ఇరుజట్ల ముల్తాన్లో జనవరి 17- 21 వరకు జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య పాక్ ఘన విజయం సాధించింది. విండీస్ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇక అదే వేదికపై శనివారం రెండో టెస్టు మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.విండీస్ బ్యాటర్లకు చుక్కలుఅయితే, పాకిస్తాన్ స్పిన్నర్లు ఆది నుంచే విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్ మికైల్ లూయిస్(4)ను కశిఫ్ అలీ(Kashif Ali) పెవిలియన్కు పంపగా.. సాజిద్ ఖాన్(Sajid Khan) వన్డౌన్ బ్యాటర్ ఆమిర్ జాంగూ(0)ను రెండో వికెట్గా వెనక్కి పంపాడు.నొమన్ అలీ సరికొత్త చరిత్రఈ క్రమంలో పదో ఓవర్లో తన వికెట్ల వేట మొదలుపెట్టిన నొమన్ అలీ(Noman Ali) తొలుత కెప్టెన్ క్రెగ్ బ్రాత్వైట్(9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం సాజిద్ ఖాన్ అథనాజ్(0) ను అవుట్ చేయగా.. నొమన్ అలీ మరోసారి యాక్షన్లోకి దిగాడు.విండీస్ ఇన్నింగ్స్లో పన్నెండో ఓవర్ మొదటి బంతి నుంచే చెలరేగిన ఈ వెటరన్ స్పిన్నర్ వరుస బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్(1), టెవిన్ ఇమ్లాచ్(0), కెవిన్ సిన్క్లెయిర్(0)లను అవుట్ చేశాడు. ఇలా హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన 38 ఏళ్ల నొమన్ అలీ.. సరికొత్త చరిత్ర సృష్టించాడు.పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన తొలి స్పిన్నర్గా నొమన్ అలీ రికార్డులకెక్కాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన ఐదో పాక్ బౌలర్గా నిలిచాడు. అతడి కంటే ముందు వసీం అక్రం, అబ్దుల్ రజాక్, మొహ్మద్ సమీ, నసీం షా ఈ ఫీట్ నమోదు చేశారు.పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్లువసీం అక్రం- 1999లో శ్రీలంకపై లాహోర్ వేదికగావసీం అక్రం- 1999లో శ్రీలంకపై ఢాకా వేదికగాఅబ్దుల్ రజాక్- 2000లో శ్రీలంకపై గాలే వేదికగానసీం షా- 2020లో బంగ్లాదేశ్పై రావల్పిండి వేదికగానొమన్ అలీ- 2025లో వెస్టిండీస్ ముల్తాన్ వేదికగా..163 పరుగులకు ఆలౌట్ఇక పాక్ బౌలర్ల ధాటికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 163 పరుగులకే ఆలౌట్ అయింది. టెయిలెండర్ గుడకేశ్ మోటీ(55) అర్ధ శతకంతో చెలరేగగా.. కేమార్ రోచ్(25), జామెల్ వారికన్(36 నాటౌట్) రాణించారు. టాప్, మిడిలార్డర్లో కలిపి కేవెం హాడ్జ్(21) ఒక్కడే డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. -
పాకిస్తాన్ క్రికెటర్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ నోమన్ ఆలీకి తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను నోమన్ అలీకి ఈ అవార్డు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత పాక్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన నోమన్.. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. 2 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టి పాక్ జట్టుకు అద్బుతమైన సిరీస్ విజయాన్ని అందించాడు. బ్యాట్తో కూడా 78 పరుగులు చేశాడు.రబడాను వెనక్కి నెట్టి..కాగా ఈ అవార్డు కోసం నోమన్ అలీతో పాటు ప్రోటీస్ స్టార్ పేసర్ నోమన్ కగిసో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్లు పోటీ పడ్డారు. . బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో రబాడ 14 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రబాడ నిలిచాడు. మరోవైపు భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో సాంట్నర్ కూడా అదరగొట్టాడు. 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా భారత్ను కివీస్ వైట్వాష్ చేయడంలో సాంట్నర్ కీలక పాత్ర పోషించాడు. అయితే వీరిద్దిరికంటే నోమాన్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు! అతడికి ఛాన్స్? -
Pak vs Eng: చెలరేగిన పాక్ స్పిన్నర్లు.. ఇంగ్లండ్కు ఘోర పరాభవం
Pakistan vs England, 3rd Test Day 3: పాకిస్తాన్తో రావల్పిండి టెస్టులో ఇంగ్లండ్ చెత్త ప్రదర్శన కనబరిచింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌట్ అయింది. పాకిస్తాన్పై ఇంగ్లండ్కు ఇది రెండో అత్యల్ప స్కోరు. అంతకుముందు 2021లో అబుదాబి వేదికగా 72 పరుగులకే కుప్పకూలింది.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్లు ఆడేందుకు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందగా.. అనూహ్య రీతిలో పుంజుకున్న ఆతిథ్య పాక్ రెండో మ్యాచ్లో జయభేరి మోగించింది.ఆరు వికెట్లతో చెలరేగిన నొమన్ అలీమూడో టెస్టులోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను 267 పరుగులకే కట్టడి చేసిన షాన్ మసూద్ బృందం.. రెండో ఇన్నింగ్స్లో 112 పరుగులకే ఆలౌట్ చేసింది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ ధాటికి తట్టుకోలేక ఇంగ్లిష్ బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు.నొమన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సాజిద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ 33 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హ్యారీ బ్రూక్ 26 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ బెన్స్టోక్స్ 12 పరుగులకే వెనుదిరిగాడు.ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ విధించిన 36 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించిన పాకిస్తాన్ సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. రెండో రోజు ఆట ఇలా సాగిందిబ్యాటర్ల పట్టుదలకు, బౌలర్ల సహకారం తోడవడంతో సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాకిస్తాన్ మెరుగైన స్థితిలో నిలిచింది. సిరీస్ నిర్ణయాత్మక పోరులో పాకిస్తాన్ ప్లేయర్లు సమష్టిగా సత్తా చాటారు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 9 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది.ఇక అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 73/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 96.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ ప్లేయర్ సౌద్ షకీల్ (223 బంతుల్లో 134; 5 ఫోర్లు) వీరోచిత సెంచరీతో కదం తొక్కాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొన్న షకీల్ బౌండరీల జోలికి పోకుండా ఒకటి, రెండు పరుగులు చేస్తూ ముందుకు సాగాడు. ఆఖర్లో స్పిన్ ద్వయం నోమాన్ అలీ (45; 2 ఫోర్లు, ఒక సిక్సర్), సాజిద్ ఖాన్ (48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో పాకిస్తాన్కు 77 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కెప్టెన్ షాన్ మసూద్ (26), వికెట్ కీపర్ రిజ్వాన్ (25) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. సల్మాన్ ఆఘా (1) విఫలమయ్యాడు. సహనానికి పరీక్షగా మారిన స్లో పిచ్పై దాదాపు ఐదు గంటలకు పైగా క్రీజులో నిలిచిన షకీల్... నోమాన్ అలీ, సాజిద్ తో కలిసి విలువైన పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రేహాన్ అహ్మద్ 4, షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టారు.చదవండి: Ind vs NZ: రోహిత్ శర్మ మరోసారి ఫెయిల్.. నీకేమైంది ’హిట్మ్యాన్’?!