breaking news
Nitish Kumar cabinet
-
బిహార్ కేబినెట్లో బిగ్ సర్ప్రైజ్!
పట్నా: ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా ఎన్నిక కాని యువకుడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఫార్మల్ షర్ట్, జీన్స్ పాంట్ ధరించిన యువకుడు మంత్రిగా ప్రమాణం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ యువకుడు ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. అతడి పేరు దీపక్ ప్రకాశ్ (Deepak Prakash). రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా కుమారుడు. విదేశాల్లో చదువుకుని వచ్చిన అతడికి అనూహ్యంగా మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలల్లో అతడు చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఆయనను ఆర్ఎల్ఎం తరపున ఎమ్మెల్సీని చేస్తారని సమాచారం.చక్రం తిప్పిన ఉపేంద్ర ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించింది. ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) సతీమణి స్నేహలత.. ససారాం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నితీశ్ కుమార్ కేబినెట్లో ఆర్ఎల్ఎంకు దక్కే ఒక్క పదవి ఆమెకే కట్టబెడతారని ప్రచారం కూడా జరిగింది. అయితే తన వారసుడి రాజకీయ అరంగ్రేటం చేయిండానికి ఇదే సరైన సమయమని భావించిన ఉపేంద్ర సేఫ్ గేమ్ ఆడారు. తన కొడుకు దీపక్కు నేరుగా కేబినెట్ పదవి దక్కేలా చక్రం తిప్పారు. తన రాజకీయ వారసత్వం కొనసాగేలా దీర్ఘకాల వ్యూహంతో కుమారుడిని అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. సామాజిక సమీకరణాలు కూడా దీపక్కు కలిసివచ్చాయి.చివరి నిమిషంలో తెలిసిందిమంత్రి పదవి గురించి తనకు కూడా చివరి నిమిషంలో తెలిసిందని దీపక్ తెలిపారు. "నాకు తెలిసినంతవరకు.. మా నాన్న, పార్టీ ముఖ్య నాయకుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందే నాకు తెలిసి.. ఆశ్చర్యానికి లోనయ్యానని మీడియాతో చెప్పారు. యువత, మహిళల కోసం పనిచేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని ప్రమాణ స్వీకారం తర్వాత అన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అయితే నితీశ్ కుమార్, అమిత్ షా సానుకూలంగా లేకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అతడికి మంత్రి దక్కిందన్న ఊహాగానాలు వచ్చాయి.బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన 36 ఏళ్ల దీపక్ ఇప్పటివరకు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ససారాం నియోజకవర్గంలో తన తల్లి తరపున ప్రచారం చేసి వెలుగులోకి వచ్చారు. దీపక్ భార్య సాక్షి మిశ్రా (Sakshi Mishra) కూడా అత్తగారి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2007లో పాట్నాలో పాఠశాల విద్యను పూర్తి చేసిన దీపక్ 2011లో మణిపూర్లోని MIT నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. 2011 నుంచి 2013 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విదేశాల్లో పనిచేసిశారు. 2019 నుంచి రాజకీయాల్లో తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ వచ్చారు. దీపక్ తాత రామ్ నరేష్ కుష్వాహా ఎమ్మెల్యేగా పనిచేశారు. నానమ్మ మునేశ్వరి దేవి సామాజిక కార్యకర్త.చదవండి: లాలూ ఫ్యామిలీలో చిచ్చు.. ఎవరీ సంజయ్, రమీజ్?కేబినెట్లో వారసులకు చోటు కల్పించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీపక్ ప్రకాశ్తో పాటు హిందుస్తానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) వ్యవస్థాపకుడు జితన్ రాం మాంఝీ తనయుడు సంతోష్ కుమార్ సుమన్ (Santosh Kumar Suman) కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. -
బిహార్లో మళ్లీ ఆ కుర్చీ కోసం ఫైట్!
బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మంత్రిత్వ శాఖ పంపకాల గురించి ప్రధాన పార్టీలు.. మిత్రపక్షాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆ కుర్చీ కోసం జేడీయూ, బీజేపీలు బెట్టు వీడడం లేదని అక్కడి మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అసెంబ్లీ స్పీకర్ పోస్టు కోసం బీజేపీ, జేడీయూల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో నితీశ్ కుమార్ నేరుగా చర్చలు జరపనున్నారు. ఇందులో మంత్రుల పోర్ట్పోలియోల కంటే ప్రధాన అజెండాగా స్పీకర్ అంశం ఉన్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. అయితే.. ఆ కుర్చీని వదులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని సమాచారం.ఇంతకు ముందు కూడా బిహార్ స్పీకర్ పోస్టు కోసం ఇరు పార్టీలు పట్టుబట్టాయి. అయితే అత్యధిక స్థానాలు సాధించడం.. జేడీయూకి సీఎం పోస్టు అప్పగించడం నేపథ్యంతో బీజేపీకే ఆ అవకాశం దక్కింది. గత ప్రభుత్వంలో బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ స్పీకర్గా, జేడీయూ నేత నరేంద్ర నారాయణ్ యాదవ్ డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. దీంతో ఈ దఫా తమకు అవకాశం కల్పించాలని జేడీయూ కోరుతున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలో అత్యధిక సీట్లు సాధించిన దరిమిలా బీజేపీ అందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. బిహార్ బీజేపీ కీలక నేతలంతా పట్నాలోని కార్యాలయంలో అర్ధరాత్రి దాటాక కూడా మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ పోస్టుతో పాటు కీలక శాఖలను వదులుకోకూడదని అధిష్టానానికి నివేదించాలని నిర్ణయించాయి. మరోవైపు.. జేడీయూ నేతలు సంజయ్ కుమార్ ఝా, లలన్ సింగ్లు ఇవాళ ఢిల్లీకి వెళ్లాలని భావిస్తున్నారు. నితీశ్తో కలిసి కమలం పెద్దలతో జరగబోయే మీటింగ్లో పాల్గొననున్నారు. తద్వారా బీజేపీ అధిష్టానంపై స్పీకర్ పోస్టు కోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు మంత్రి వర్గ కూర్పు బాధ్యతను బీజేపీ హైకమాండ్ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించింది. ఈ నేపథ్యంతో ఆయన ఇవాళ పట్నాకు వెళ్లనున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలైన లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ అవామ్ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహలతో చర్చలు జరపబోతున్నారు. అయితే.. ఇప్పటికే ఈ మూడు మిత్రపక్షాలు కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపు(నవంబర్ 19న) బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఆ తర్వాత ఎన్డీయే సమావేశంలో తమ శాసనసభా పక్ష నేతను అధికారికంగా ప్రకటిస్తాయి. ఎల్లుండి పట్నాలోని గాంధీ మైదాన్లో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారంతో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరనుంది. -
పెద్దోడి కన్నా చిన్నోడే బెటర్!
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తనయులు తేజస్వి, తేజ్ప్రతాప్ యాదవ్ నితీశ్కుమార్ కేబినెట్లో టాప్ రెండు, మూడు స్థానాలను అలంకరించడం.. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలకు కారణమైంది. పెద్దగా అనుభవంలేని వారికి కీలక శాఖలు అప్పగించడంపై విమర్శకులు మండిపడ్డారు. ఇప్పుడు వారు పదవుల్లోకి చేరి నెల గడిచింది. ఈ నెల రోజుల్లో వయస్సులో చిన్నవాడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన తేజస్వి తన పనితీరుతో ఆకట్టుకుంటుండగా.. అన్న తేజ్ప్రతాప్ మాత్రం ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవి చేపట్టిన తేజస్వి పరిణతి గల రాజకీయ నాయకుడి ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అప్పగించిన శాఖలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రయత్నం తేజస్వి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదే అన్న తేజ్ప్రతాప్ విషయానికొస్తే ఆయనకు 'పాస్' మార్కులు ఇవ్వడానికి ఇప్పటికీ పరిశీలకులు వెనుకాముందాడుతున్నారు. ఆరోగ్యశాఖ మంత్రిగా తేజ్ప్రతాప్ ఇంకా చురుగ్గా పనిచేయలేకపోతున్నారు. ఇప్పటికీ ఆయన కొంత సిగ్గుపడుతూ, నెర్వస్కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే తేజ్ప్రతాప్ కూడా అధికారులతో దృఢంగా వ్యవహరిస్తూ.. శాఖను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. 'తేజస్వి శాంతస్వభావం కనబరుస్తున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆయన వివిధ రాజకీయ అంశాలపై సమర్థంగా మాట్లాడి.. విమర్శకుల నోళ్లు మూయించారు. లాలూ రాజకీయ వారసుడు తేజస్వినేనని ప్రతిపక్ష నేతలు సైతం ఇప్పుడు అంగీకరిస్తున్నారు' అని ఆర్జేడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనోజ్ యాదవ్ పేర్కొన్నారు.


