breaking news
NG ranga
-
ఎన్జీరంగా వర్సిటీని సందర్శించిన అమెరికన్ బృందం
రాజేంద్రనగర్: అమెరికాకు చెందిన విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ బృందం శనివారం ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. బృందం ప్రతినిధులు.. అగ్రిబిజినెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రామిరెడ్డి, ఉపకులపతి డాక్టర్ ఎ.పద్మరాజుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎన్జీరంగా వర్సిటీలోని ఎంఏబీఎం విద్యార్థులకు విస్కాన్సిన్ వర్సిటీ అధ్యాపకులు ప్రసంగాలు ఇవ్వడంపై చర్చించారు.అగ్రిబిజినెస్పై విద్యార్థులలో నైపుణ్యం పెంపుపై సహకరించుకోవాలని అవగాహనకు వచ్చారు. రెండు వర్సిటీల పరస్పర సహకారానికి చర్చలు సానుకూలంగా జరిగాయి. -
ఎన్జీ రంగా పాఠాలే పెద్ద బాలశిక్ష
తమిళనాడు గవర్నర్ రోశయ్య తెనాలి : ఆచార్య ఎన్జీ రంగా పాఠాలే రాజకీయంగా తనకు పెద్ద బాలశిక్ష అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య చెప్పారు. ప్రఖ్యాత పార్లమెంటేరియన్, రైతునాయకుడు ఆచార్య ఎన్జీ రంగా స్మారక అవార్డును ఆదివారం సాయంత్రం హోటల్ గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సభలో కొణిజేటి రోశయ్యకు శాసనమండలి చైర్మన్ చక్రపాణి చేతుల మీదుగా బహూకరించారు. నన్నపనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు ట్రస్ట్ నిర్వాహకురాలు, శాసనమండలి మాజీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి స్వాగతం పలికారు. రోశయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో తన వాక్పటిమ రంగా రాజకీయ పాఠశాలలో అలవడిందేగానీ, ఏ పండితుల శిక్షణలోనూ అభ్యాసం చేసింది కాదన్నారు. అందరూ ఆపాదిస్తున్న ఘనతకు తాను అర్హుడిని కాదని చెబుతూ, రంగాగారు, నాకు మార్గదర్శకులైన పెద్దలకే ఆ ఔన్నత్యం దక్కాలన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల గౌరవాన్ని కాపాడిన రోశయ్య నుంచి, రాష్ట్ర శాసనమండలి కార్యక్రమాల పద్ధతి, పాటించాల్సిన సంప్రదాయాలను అలవరచుకొన్నట్టు చెప్పారు. రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రైతాంగ ఉద్యమ నిర్మాత ఎన్జీ రంగా సాహసోపేతమైన నేతగా చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పొన్నూరు చైర్పర్సన్ సజ్జా హైమావతి, మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు. స్వాతంత్య్రయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య, ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధిపతి అన్నాబత్తుని శివకుమార్, జడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి, మాణిక్యవేల్, ట్రస్ట్ ప్రతినిధులు కొసరాజు వెంకట్రాయుడు, ఆలపాటి మాధవరావు, జెట్టి అంకినీడు, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. -
ఎన్జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ
హైదరాబాద్, న్యూస్లైన్: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి రైతు పక్షాన నిలబడిన ఎన్జీ రంగాకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు. స్థానిక బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో గురువారం ఆచార్య ఎన్ జీ రంగా 114వ జయంతి జరిగింది. సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం సాధించడంలో రంగా పాత్ర మరువలేనిదన్నారు. వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎందరో ప్రముఖులను రాజకీయాల్లో తీర్చి దిద్దిన ఘనత రంగాకే దక్కిందన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరాంరెడ్డి, భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పెద్దిరెడ్డి చెంగలరెడ్డి, ఎన్జీ రంగా అభిమానులు పాల్గొన్నారు.