ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ | N.G.Ranga should be conferred Bharat Ratna, demands Dattatreya | Sakshi
Sakshi News home page

ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ

Nov 8 2013 12:57 AM | Updated on Sep 2 2017 12:23 AM

ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ

ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలి: దత్తాత్రేయ

నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి రైతు పక్షాన నిలబడిన ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి రైతు పక్షాన నిలబడిన ఎన్‌జీ రంగాకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్ చేశారు. స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆచార్య ఎన్ జీ రంగా 114వ జయంతి జరిగింది. సభలో దత్తాత్రేయ మాట్లాడుతూ, 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం సాధించడంలో రంగా పాత్ర మరువలేనిదన్నారు. వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎందరో ప్రముఖులను రాజకీయాల్లో తీర్చి దిద్దిన ఘనత రంగాకే దక్కిందన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరాంరెడ్డి, భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పెద్దిరెడ్డి చెంగలరెడ్డి, ఎన్‌జీ రంగా అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement