-
12 కొత్త సబ్ స్టేషన్లను ప్రారంభిచనున్న సీఎం వైఎస్ జగన్
-
జిల్లాకు నూతన సబ్స్టేషన్లు
కడప అగ్రికల్చర్: జిల్లాలో ట్రాన్స్కో సంస్థ నూతనంగా ఐదు ప్రాంతాల్లో సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర డైరక్టర్ ఆర్ నాగరాజస్వామి వెల్లడించారు. బు«ధవారం జిల్లా కేంద్రమైన కడపలోని శంకరాపురం వద్దనున్న ఫవర్ హౌస్ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వాసులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకుగాను కొత్తగా శాటిలైట్ సిటీ, బ్రహ్మంగారి మఠం, కలసపాడు, చిన్న ఓరంపాడు, వి కోటల్లో 400 కేవీ సబ్స్టేషన్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబందించి టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే లైన్లాస్ తగ్గించడానికి పాత సబ్స్టేషన్లలో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను తొలగించనున్నామని వివరించారు. కడప ఫవర్ హౌస్లో ఉన్న పాత ట్రాన్స్ఫార్మర్లను, కంట్రోల్ మిషన్లను, ప్యానెల్ బోర్డులను మార్చి వేసి నూతన సాంకేతిక ఆటోమేటిక్ మిషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటి కోసం రూ. 4.50 కోట్లు ఖర్చు చేయనున్నామని తెలిపారు. అలాగే జమ్మలమడుగు ప్రాంతంలో మరో రెండు 220 కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. 220 కేవీ సబ్ స్టేషన్ పోరుమావిళ్లలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా లో ఓల్టేజీ లేకుండా చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వంతుగా రూ. 112 కోట్లు అందిస్తోందన్నారు. ఈ సబ్స్టేషన్లు పూర్తి కావాలంటే ఒకటిన్నర సంవత్సరం పడుతుందన్నారు. డైరక్టర్ వెంట ట్రాన్స్కో ఎస్ఈ వెంకటస్వామి, డీఈలు రాజగోపాల్రెడ్డి, శ్రీరామచంద్రమూర్తి, ఏడీఇలు వీరభద్రయ్య, రవీంద్ర, అరుణ్కుమార్, శ్రీనాధుడు, వాసు, రామ్మోహన్, ఏఈఓలు కమలాకర్, మల్లిఖార్జున తదితరులు ఉన్నారు. -
జిల్లాకు సబ్స్టేషన్లు మంజూరు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లాలో కొత్తగా 11 విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటికి త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నామని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్వీఎస్ సుబ్బరాజు తెలిపారు. గురువారం సాయంత్రం కడప నగరంలోని విద్యుత్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కొత్తగా 11 సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే కడప, ప్రొద్దుటూరులో ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి 5–10 సెంట్ల స్థలం, అవుట్డోర్ సబ్స్టేషన్ నిర్మాణానికి 40 సెంట్ల స్థలం కావాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఇటీవల ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశామని, అవి కాలిపోయినట్లు ఫిర్యాదులు రావడంతో వాటి స్థానంలో కొత్త బల్బులు ఇస్తున్నామని తెలిపారు. కాలిపోయిన బల్బులు, కరెంటు బిల్లుల జిరాక్స్ తీసుకెళ్లి ఆయా ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలలో పొందవచ్చన్నారు. విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు విజిలెన్స్ స్వా్కడ్ తిరుగుతోందన్నారు. ఎవరైనా విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. కనుక విద్యుత్ను అక్రమంగా వాడుకునే వారు రూ. 125 చెల్లించి దీన్ దయాళ్ స్కీం కింద సర్వీసును పొందితే దాదాపు రూ. 7 వేల మెటీరియల్ను ఉచితంగా ఇస్తామన్నారు. నగదును ఏ విధంగా ఏటీఎంలలో తీసుకోవడం, డిపాజిట్ చేస్తున్నామో అదేవిధంగా కడప నగరంలో ఏపీపీలను ఏర్పాటు చేశామని, అందులో విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని తెలిపారు. ఇవి 24 గంటలు పని చేస్తాయని, వినియోగదారులు ఎప్పుడైనా బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఎవరైనా వినియోగదారుల నుంచి డబ్బులు అడిగితే తమకు ఫోన్ నంబర్: 94408 11751కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు టోల్ఫ్రీ నంబర్: 1800 425155 333లో సంప్రదించాలని ఆయన వివరించారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బరితెగించిన టీడీపీ నేతలు
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
జనస్వామ్యమా! జయీభవ!!
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
పీఓకేలో తీవ్ర ఘర్షణలు
Lok Sabha Election 2024: ఆమ్ ఆద్మీకి 10 గ్యారంటీలు
రెండ్రోజులు వానలు
అవినీతి సొమ్ముకు హెరిటేజ్ ముసుగు
తప్పక చదవండి
- నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
- Lok Sabha Election 2024: పవార్ వర్సెస్ పాటిల్
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపు కలకలం
- రెండ్రోజులు వానలు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
- Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
- Lok Sabha Election 2024: ఎవరికి రిజర్వుడ్!
- Lok Sabha Election 2024: ఆ ఊరి కోసం 3 రోజుల ట్రెక్కింగ్!
Advertisement