-
IPL 2024: ఫీల్డ్ అంపైర్ల పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సిద్దూ
క్రికెట్లో టెక్నాలజీ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఫీల్డ్ అంపైర్ల పాత్రపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత నవ్జ్యోత్ సింగ్ సిద్దూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెక్నాలజీ ఉపయోగించి 90 శాతం నిర్ణయాలు థర్డ్ అంపైర్లు తీసుకుంటుంటే ఫీల్డ్ అంపైర్లు నామమాత్రంగా మారారని అన్నాడు. ఫీల్డ్ అంపైర్ అంటే ప్రతి నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు వదిలేయడం కాదని తెలిపాడు.ఫీల్డ్ అంపైర్లు విచక్షణ ఉపయోగించి సొంత నిర్ణయాలు తీసుకుంటేనే క్రికెట్కు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతి విషయాన్ని థర్డ్ అంపైరే తీసుకోవాల్సి వస్తే ఫీల్డ్ అంపైర్ అవసరమే లేదన్నాడు. ఇటీవల కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి సంఘటనను దృష్టిలో పెట్టుకుని సిద్దూ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. ఆ మ్యాచ్లో హర్షిత్ రాణా బౌలింగ్లో నడుము కంటే ఎత్తులో వచ్చిన ఫుల్ టాస్ బంతికి కోహ్లి ఔటయ్యాడు. Navjot Singh Sidhu said, "now the on field umpire's job is not to stand in the stadium when 3rd umpire technology is being used for 90% of the decisions shown all on screen". (Star Sports). pic.twitter.com/uLmWRboLMZ— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024 నో బాల్ కోసం కోహ్లి అప్పీల్ చేసినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లి.. ఫీల్డ్ అంపైర్తో వాగ్వాదానికి దిగి ఆగ్రహంగా మైదానాన్ని వీడాడు. ఈ వివాదాస్పద ఘటన క్రికెట్ వర్గాల్లో పెను దుమారం లేపింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ ప్రస్తుతం రసపట్టులో సాగుతుంది. ఆర్సీబీ, పంజాబ్ మినహా అన్ని జట్లు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. రాజస్థాన్, కేకేఆర్, సన్రైజర్స్ జట్లకు ప్లే ఆఫ్స్ బెర్తులు దాదాపుగా ఖరారు కాగా.. మరో బెర్తు కోసం ఐదు జట్ల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్, కేకేఆర్, సన్రైజర్స్, లక్నో, సీఎస్కే, గుజరాత్, ముంబై, ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ వరుస స్థానాల్లో ఉన్నాయి. అన్ని జట్లు మరో 5 లేదా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. -
రాజీనామా ఉపసంహరించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") -
'సిద్దూ ఆడకపోవడంతోనే నాకు చాన్స్ వచ్చింది'
సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా ఎంత సక్సెస్ అయ్యాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని కెరీర్లో అగ్రభాగం ఓపెనింగ్ స్థానంలో ఆడిన విషయం విదితమే. అయితే కెరీర్ మొదట్లో పలు మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్ స్థానంలోనూ సచిన్ ఆడాడు. అయితే తాను ఓపెనర్గా ప్రమోట్ అయిన విషయాన్ని సచిన్ తన పర్సనల్ యాప్ 100 ఎంబి ద్వారా మరోసారి గుర్తుచేశాడు. అప్పటి ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్దూ న్యూజిలాండ్ పర్యటనలో గాయపడడంతో తనకు ఓపెనర్గా ఆడే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అజిత్ వాడేకర్లకు కూడా స్థానం ఉందంటూ అభిప్రాయపడ్డాడు. 'ఆరోజు మ్యాచ్కు ముందు ప్రాక్టీస్కు అని హోటల్ నుంచి బయలుదేరాను. అయితే ఓపెనర్గా ఆడే అవకాశం వస్తుందని మాత్రం అనుకోలేదు. నేను మైదానంలోకి వెళ్లేసరికి అప్పటికే అజహర్, వాడేకర్లు డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నారు. మెడనొప్పి కారణంగా సిద్ధూ ఈ మ్యాచ్లో ఆడడం లేదని, ఓపెనర్గా ఎవరిని ఆడిద్దామా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంతలో తాను కలగజేసుకొని ఓపెనర్గా ఒక అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే నా ఆటతీరుపై నాకు నమ్మకం ఉండడంతో ఓపెనర్గా చెలరేగిపోతాననే నమ్మకం ఉండేది. కానీ ఎక్కడో ఓ మూల ఓపెనర్గా రాణించగలనా అనే అనుమానం ఉండేది.. ఏది ఏమైనా నా ఆట నేను ఆడుతూనే అటాకింగ్ గేమ్కు ప్రాధాన్యమివ్వాలని అనుకున్నా' అంటూ తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్లో సచిన్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 15 బౌండరీలు, 2 సిక్స్లు ఉన్నాయి. ఆ తర్వాత సచిన్ ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కెరీర్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించిన సచిన్ వన్డే కెరీర్లో 463 మ్యాచులాడి 18426 పరుగులు చేశాడు. కాగా ఇందులో 49 సెంచరీలు, 96 అర్థసెంచరీలు ఉన్నాయి. (డక్వర్త్ ‘లూయిస్’ కన్నుమూత) -
మాజీ క్రికెటర్పై కాంగ్రెస్ వల
బీజేపీకి రాజీనామా చేసి.. ఆమ్ ఆద్మీ పార్టీలో తగిన స్థానం లభించక ఏం చేయాలోనని కొట్టుమిట్టాడుతున్న మాజీ క్రికెటర్ నవ్జోత్ సింగ్ సిద్ధూపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల విసురుతోంది. వచ్చే సంవత్సరం పంజాబ్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ కీలక పాత్ర పోషించడానికి వేరే పార్టీలో చేరాలని సిద్ధూ ప్రయత్నించి.. బీజేపీ నుంచి బయటకు వచ్చారు. తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. అయితే.. పంజాబ్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని భావించిన సిద్ధూకు అక్కడ తీవ్ర నిరాశ ఎదురైంది. పంజాబ్ ఎన్నికల కోసం ఆప్ విడుదల చేసే అభ్యర్థుల జాబితాలో తన భార్య పేరు కూడా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్ధూను కావాలంటే స్టార్ ప్రచారకుడిగా పెడతాం తప్ప ముఖ్యమంత్రి పదవికి మాత్రం ప్రకటించేది లేదని ఆప్ చెప్పేసింది. పైగా, ఒక కుటుంబం నుంచి ఒకరి కంటే ఎక్కువ మందికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదన్నది తమ పార్టీ విధానమని తెలిపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అలాంటి ఇబ్బందులేమీ లేవు. ఒకే కుటుంబం నుంచి ఎంతమందికైనా టికెట్లు ఇస్తారు కాబట్టి.. సిద్ధూకు తమ పార్టీలో అయితే మంచి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అయితే వాళ్లు కూడా ఆయనను ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రిగా ప్రకటించలేం గానీ, రెండు మూడేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తామని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అమృతసర్ లోక్సభ స్థానాన్ని కూడా కావాలంటే సిద్ధూ లేదా ఆయన భార్యకు ఇస్తామని చెప్పారంటున్నారు. ప్రస్తుతం అక్కడ పార్టీ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇంకా ఇది ప్రతిపాదనల దశలోనే ఉందని.. చర్చలకు సిద్ధూ ముందుకు రావాలని చెబుతున్నారు. ఇక ఈ సిక్సర్ల వీరుడు ఎటువైపు మొగ్గుచూపుతాడో చూడాలి. -
క్రికెటర్ భార్యా భర్తలు చెరో దారి!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement