సూపర్కంప్యూటర్ల తయారీకి రూ.42 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్కంప్యూటర్ రంగంలో దేశ అవసరాలను తీర్చడంతో పాటు ప్రపంచానికి దీటుగా ఎదిగేందుకు గాను ‘జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ ’ ప్రారంభించినట్లు ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి రవి శంకర్ ప్రసాద్ బుధవారం లోక్సభకు వెల్లడించారు. ఈ మిషన్కు 2014-15 ఏడాదిలో రూ. 42.50 కోట్లు, ఏడేళ్ల కాలంలో మొత్తం రూ.4,500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించామన్నారు.