-
బీజేపీని బలోపేతం చేయాలి
♦ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ♦ ఘట్కేసర్లో కార్యకర్తల సమావేశం ఘట్కేసర్ టౌన్: వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీని బలమైన శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాల యంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సంరద్భంగా మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేలా ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. జిల్లా స్థారుు నుంచి బూత్ స్థారుు వరకు పార్టీని పటిష్టం చేయాలన్నారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వమేనని ఎద్దేవాచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని రూ.100 కోట్లతో 6 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత నాయకులు మాత్రం జిల్లాకు రావాల్సిన నీటిని మెదక్కు తరలిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాలు మినహా గత్యంతరం లేదని ప్రాణహిత-చేవేళ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు-డిండి, పాలమూరు-రంగారెడ్డి ప్రాజకుక్టులపై నిర్ణయం తీసుకోకుండా శ్రీశైలం బ్యాక్వాటర్తో జిల్లాను సస్యశ్యామలం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరితాహారం కార్యక్రమంలో నాటుతున్న కోట్ల మొక్కలను ఎవరు రక్షిస్తారని ప్రశ్నించారు. జిల్లాల విభజన శాస్తీయ్రంగా ఉండాలని, జిల్లాను యాదాద్రి కమిషనరేట్లో కలుపుతామనడం మంచిది కాదని సూచించారు. ఘట్కేసర్ కేంద్రాంగా ముఖ్యమైన కార్యలయాలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలను నగరంలో కలిపితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యుడు బిక్కునాథ్నాయక్, ఎంపీటీసీ సభ్యుడు కరుణాకర్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎదుగని శ్రీరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రామోజీ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజని, మండల అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రాణి, రఘువర్ధన్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా...ఇద్దరు మృత్యువాత
వైఎస్సార్ జిల్లా సంబేపల్లి మండలం మోతుకువాండ్లపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చనిపోయారు. మోతుకువాండ్లపల్లికి చెందిన నర్సింహారెడ్డి, డ్రైవర్ గుత్తి వెంకటరమణ కలసి ట్రాక్టర్లో కలకడ నుంచి మోతుకువాండ్లపల్లి వైపు వెళ్తున్నారు. సమీపంలోని హంద్రీనీవా కాల్వ వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఆ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో నర్సింహారెడ్డి(55), వెంకటరమణ(25) అక్కడికక్కడే చనిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
వరంగల్ జిల్లా మంగపేట మండలం జాకారం వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. గామ సమీపంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ఇసుక లారీని బైక్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో పాల్సాబ్పల్లికి చెందిన నర్సింహారెడ్డి(30), ములుగుకు చెందిన శ్రవణ్(25) అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement