breaking news
Naina Lal Kidwai
-
ప్రముఖ కంపెనీలను నడిపిస్తున్న మహిళలు వీరే.. (ఫొటోలు)
-
నాలుగో స్థానంలో చందా కొచ్చర్
న్యూయార్క్: ప్రపంచ వాణిజ్య రంగంలో అత్యంత శక్తిమంతుల జాబితాలో నలుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఫార్చ్యూన్ మేగజీన్ తాజాగా ప్రకటించిన బిజినెస్ వుమెన్ లీడర్స్ టాప్-50 జాబితాలో ఆమె నాలుగో ర్యాంక్లో నిలిచారు. గతేడాది పోలిస్తే కొచ్చర్ ఒక స్థానం మెరుగు పరుచుకున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ 17వ స్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో చిత్రకు తొలిసారిగా స్థానం దక్కింది. ఏక్సిక్ బ్యాంక్కు చెందిన శిఖా శర్మ 32, హెచ్ఎస్బీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నైనా లాల్ కిద్వాయ్ 42 స్థానాల్లో నిలిచారు. బ్రెజిల్ ఇంధన కంపెనీ పెట్రోబ్రాస్ సీఈవో మారియా దాస్ గ్రాకస్ ఫోస్టర్ అగ్రస్థానం దక్కించుకున్నారు. అమెరికా తరపున రూపొందించిన ఇదే జాబితాలో భారత నేపథ్యం కలిగిన పెప్సికో ఇండియా చీఫ్ ఇంద్రా నూయి రెండో స్థానంలో ఉన్నారు. -
ప్చ్.. నిరాశే: పరిశ్రమ వర్గాలు
న్యూఢిల్లీ: పాలసీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తుండగా.. రిజర్వ్ బ్యాంక్ అందుకు భిన్నంగా పెంచడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధిక వడ్డీ రేట్లు... వృద్ధికి ప్రధాన విఘాతంగా భావిస్తున్న తరుణంలో రెపో రేటును మరింత పెంచడం ఆశ్చర్యపర్చిందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయన్నారు. పరిశ్రమ పరిస్థితి బాగా లేదని అంగీకరించిన ఆర్బీఐ.. రెపో రేటును తగ్గించి ఉంటే సెంటిమెంటు మెరుగుపడేలా సానుకూల సంకేతాలు పంపినట్లయి ఉండేదని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు. వడ్డీ రేట్లను తగ్గించడం, రుణాలను అందుబాటులోకి తేవాలన్నదే తమ విజ్ఞప్తి అని, ఆర్బీఐ దీన్ని దృష్టిలో పెట్టుకోగలదని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు. ద్రవ్య లభ్యత లేక పరిశ్రమ సతమతమవుతున్న నేపథ్యంలో రెపో రేటును పెంచకుండా ఉండాల్సిందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ద్రవ్య లభ్యత కఠినతరం కావడం వల్ల వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశముందని, ఎస్బీఐ బాటలోనే మిగతా బ్యాంకులూ నడిచే ప్రమాదముందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు. రియల్టీ పెదవి విరుపు.. ఆర్బీఐ పాలసీ రేటు పెంపు వల్ల వడ్డీల భారం పెరుగుతుందని, పండుగ సీజన్లో హౌసింగ్కి డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని డీఎల్ఎఫ్ సీఎఫ్వో అశోక్ త్యాగి చెప్పారు. మరోవైపు, ఆర్బీఐ నిర్ణయం తీవ్రంగా నిరాశపర్చేదిగా ఉందని పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ తెలిపారు.