breaking news
Musaida bill
-
ఓటర్లకు అలర్ట్!
హైదరాబాద్: ‘ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసే ఎన్యూమరేషన్ ఫారాలను జూలై 24లోగా సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వోలు) సమర్పించాలి. లేకుంటే జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు ఉండవు’ అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె.చంద్రకళతో కలిసి సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బీఎల్వోలు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తారని, వాటిని నింపి తిరిగి సమర్పించడం తప్పనిసరి అన్నారు.47 లక్షల మంది ఓటర్లకు ఫారాల పంపిణీ జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 23,99,880 మంది, మహిళలు 23,36,448 మంది, ఇతరులు 341 మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరందరికీ వారి వివరాలతో కూడిన ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఫారాలు అందుకున్న ఓటర్లు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా వాటిని నింపి సంబంధిత బీఎల్ఓలకు అందజేయాలని కర్ణన్ సూచించారు. చివరి నిమిషంలో రద్దీ, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఫారాలు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.ఇంటికి వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే ఫారాలు అక్కడే ఉంచి బీఎల్వోలు కనీసం మూడు సార్లు వెళ్తారని చెప్పారు. అయినప్పటికీ వారికి ఫారం అందజేయలేకపోయినా, నింపిన ఫారం తిరిగి అందజేయకపోయినా అలాంటి ఓటర్ల పేర్లు కూడా ముసాయిదా జాబితాలో ఉండవని స్పష్టం చేశారు.ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను www.voter.eci.in వెబ్సైట్ లేదా ఈసీఐ యాప్ ద్వారా డౌన్న్లోడ్ చేసుకుని, అవసరమైన వివరాలు నింపి ఆన్లైన్లో అప్లోడ్ చేసే సౌకర్యాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించిందన్నారు.ఆన్లైన్లో ఫారం సమర్పించిన వారి వివరాలను కూడా బీఎల్వోలు ఇంటి వద్దకు వెళ్లి ధ్రువీకరిస్తారన్నారు. ఎన్యూమరేషన్ ఫారంపై ఓటరు స్వయంగా లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా సంతకం చేసి సమర్పించవచ్చని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, వివరాల సవరణ కోసం ఫారం–8 కూడా అందుబాటులో ఉంటాయన్నారు.భాగస్వాములు కావాలి.. ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియ విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కర్ణన్ పిలుపునిచ్చారు. ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు.. జులై 24 నాటికి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తవుతుందని, 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేస్తామని కర్ణన్ తెలిపారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందని చెప్పారు.ఈ సమయంలో ఓటర్ల చేర్పు, తొలగింపు, వివరాల సవరణకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వోలు) విచారణలు నిర్వహించి, సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలను పరిష్కరిస్తారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 1, 2026న విడుదల కానుంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరుగా నమోదై ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టంప్రకారం శిక్షార్హమైన నేరమని కర్ణన్ హెచ్చరించారు.ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే..? ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని కారణంగా ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే, ఆ వివరాలను ఈఆర్వో కార్యాలయాలు, ముఖ్య ప్రదర్శన కేంద్రాలు, ఎన్నికల సంఘం వెబ్సైట్లలో ప్రదర్శిస్తారు. అనంతరం ఈఆర్వోలు నోటీసులు జారీ చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలని కోరుతారు. ఈ సందర్భంగా పాస్పోర్ట్, జనన ధ్రువీకరణ పత్రం, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డులు, పెన్షన్ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు, భూ లేదా గృహ కేటాయింపు పత్రాలు తదితర గుర్తింపు పత్రాలను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.4,062 పోలింగ్ కేంద్రాలు.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 4,062 పోలింగ్ కేంద్రాలు, 1,684 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ కోసం 15 మంది ఈఆర్వోలు, 93 మంది ఏఈఆర్వోలు, 408 మంది బీఎల్వో సూపర్వైజర్లు, 4,062 మంది బీఎల్వోలు విధుల్లో ఉన్నారని చెప్పారు.రాజకీయ పార్టీల నుంచి బీఎల్ఏలుజిల్లాలోని 4,062 పోలింగ్ కేంద్రాలకు వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు మొత్తం 10,901 మంది బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించాయి. కాంగ్రెస్ పార్టీ 3,601 మంది (88 శాతం), బీజేపీ 2,941 మంది (72.4 శాతం), బీఆర్ఎస్ 1,988 మంది (49.94 శాతం), ఎంఐఎం 2,371 మంది (58.31 శాతం) బీఎల్ఏలను నియమించాయి. బీఎల్ఏలు బల్క్గా అప్లికేషన్లు సమర్పించవచ్చు. -
‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్పై ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. తాజా బిల్లు ప్రకారం భర్త అకస్మాత్తుగా ట్రిపుల్ తలాక్ చెప్పేసి, భార్యకు విడాకులు ఇవ్వటం చెల్లదు. అలా చేసిన పక్షంలో సదరు భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడేందుకు వీలుంటుంది. ముందస్తు సమాచారం లేకుండా ట్రిపుల్ తలాక్ చెప్పే ‘తలాక్– ఇ–బిద్దత్’కు ఇది వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. ఇలాంటి సందర్భాల్లోనే బాధితు రాలు కోర్టును ఆశ్రయించి తనతోపాటు, మైనర్లయిన పిల్లలకు అవసరమైన సాయం కోరే హక్కు కల్పిస్తుంది. హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ ముసాయిదాను తయారు చేసింది. ఈ ఉప సంఘంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, ఆర్థిక మంత్రి జైట్లీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్, సహాయ మంత్రి పీపీ చౌదరి ఉన్నారు. ట్రిపుల్ తలాక్పై కేంద్రం రూపొందించిన బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఉంటేనే మద్దతిస్తామని, లేకుంటే తిరస్కరిస్తామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ బిల్లు రూపొందించటానికి ముందే కేంద్రం ప్రభుత్వం ముస్లిం సంఘాలు, నిపుణులతో చర్చించాల్సి ఉందని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) తెలిపింది. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దటం తగదని పేర్కొంది. ఆలిండియా ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డ్, ముస్లిం ఉమెన్ లీగ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఎండీఆర్ చార్జీల భారం లేదు... ► రూ.రెండు వేలలోపు డెబిట్ కార్డులు, భీమ్, ఆధార్ అనుసంధాన లావాదేవీల చార్జీలను ప్రభుత్వం భరించనుంది. మర్చంట్ డిస్కౌంట్రేట్(ఎండీఆర్) మొత్తాన్ని లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ విధానం వచ్చే ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ►మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఆమోదం. ►తోళ్లు, పాదరక్షల విభాగానికి రూ.2,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ. దీంతో మూడేళ్లలో దాదాపు 3లక్షల ఉద్యోగాల కల్పన అవకాశం. ►జాతీయ ఆయుష్ మిషన్(ఎన్ఏఎం) అమలును 2020 వరకు పొడిగిస్తూ రూ.2,400 కోట్లు కేటాయించింది. ►చెక్ బౌన్స్ కేసులు ట్రయల్ కోర్టులో విచారణలో ఉండగానే కొంత మొత్తాన్ని బాధితుడికి చెల్లించేలా ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్’ చట్టంలో సవరణకు ఓకే. ►జీఎస్టీ ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు నిర్ణయం. జీఎస్టీ చట్టం–2017 ప్రకారం.. వస్తు సేవా పన్ను అమలుతో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయానికి తగు పరిహారాన్ని కేంద్రం అందజేస్తుంది. -
ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ముసాయిదా
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆప్ సర్కారు మరోసారి కేంద్రంతో పోరుకు సన్నద్ధమయింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కోసం ఆప్ ప్రభుత్వం బుధవారం ఒక ముసాయిదా బిల్లును విడుదల చేసింది. తద్వారా పోలీసు, మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రభుత్వ యంత్రాంగం, భూ విభాగాలను తన అధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ విషయంపై జూన్ 30లోగా ప్రజలు తమ సలహాలను పంపాల్సిందిగా ఆహ్వానించింది. ఆ తర్వాత పూర్తి బిల్లును తీర్మానం చేసి.. రాజ్యాంగ సవరణ నిమిత్తం కేంద్రానికి కూడా పంపిస్తామని చెప్పారు.


