breaking news
Munni Leader
-
Munni Devi: ఇస్త్రీ చేసే మున్ని ఎంఎల్సి అయ్యింది
బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి జీవించే 40 ఏళ్ళ మున్నీ రజక్ ఎం.ఎల్.సి. అయ్యింది. అందుకు కారణం ఆమె గట్టిగా మాట్లాడగలగడం. పెద్దగా అరవగలగడం. లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనే ర్యాలీల్లో ఆమె గొంతు చించుకుని నినాదాలు చేస్తుంది. ధర్నాల్లో ముందు వరుసలో కూచుని టీవీలకు బైట్లు ఇస్తుంది. ఎన్డిఏ గవర్నమెంట్ను విమర్శిస్తూ ధైర్యంగా పాటలు పాడుతుంది. ఇవన్నీ ఆర్.జె.డి నేత లాలూను మెప్పించాయి. ఆమెను నిజమైన కార్యకర్తగా గుర్తించి తమ పార్టీ తరఫున ఎం.ఎల్.సి.ని చేశాడు. 75 మంది సభ్యుల విధాన పరిషత్లో కూచోబోతున్న మున్నీ రాజకీయాల మురికిని కూడా వదలగొడతానంటోంది. కొన్ని ఘటనలు కొందరి మేలుకు జరుగుతాయి. 2019. జుడీషియల్ కస్టడీలో ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్నారు. బయటంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులు. రాంచీకి 300 కిలోమీటర్ల దూరం ఉన్న భక్తియార్పూర్లో అక్కడి రైల్వేస్టేషన్ పక్కన ఇస్త్రీ బండి పెట్టుకుని జీవించే మున్నీ అంత దూరం నుంచి రాంచీకి లాలూని చూడటానికి వచ్చింది. కాని సెక్యూరిటీ వాళ్లు ఆమెను లోపలకు వదల్లేదు. దాంతో ఆమె టీవీ కెమెరాల ముందు పెద్దపెద్దగా ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ ‘నా దేవుడు లాలూని అన్యాయంగా కేసుల్లో ఇరికిస్తారా...’ అంటూ లాలూకు మద్దతుగా విపరీతంగా మాట్లాడింది. ఇది లాలూ కంట పడింది. ఆయన మెచ్చాడు. కట్ చేస్తే – భక్తియార్పూర్లో నడుచుకుంటూ వెళుతున్న మున్నీ పక్కనే మొన్నటి జూన్ మొదటి వారంలో ఒక జిప్సీ ఆగింది. ‘ఎక్కు’ అన్నారు అందులో ఉన్నవారు. బిహార్లో అధికారంలో ఉన్నది జె.డి.యు, బిజెపి అలెయెన్స్ ప్రభుత్వం. తాను ఆర్.జె.డి కార్యకర్త. పోలీసులు కాదుకదా అని భయపడింది. కాదు తమ పార్టీ వాళ్లే. అక్కడికి గంట దూరంలో ఉన్న పాట్నాలో రబ్రీదేవి బంగ్లాకు తీసుకెళ్లారు. లోపల రబ్రీ దేవి, పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ఉన్నారు. ‘లాలూగారు నిన్ను ఎం.ఎల్.సి చేయడానికి నిశ్చయించుకున్నారు’ అని వారు తెలిపితే మున్నీకి మాట రాలేదు. కృతజ్ఞతలు చెప్పి బయట పడింది. ఈ విషయం రాష్ట్రమంతా చర్చనీయాంశం అయ్యింది. అయితే ‘అయినప్పుడు చూద్దాం’ అని కొందరు అనుకున్నారు. మరోవైపు పార్టీలో రజక వర్గానికే చెందిన మరొక నాయకుడు చురుగ్గా పని చేస్తున్నాడు. రజకులలో ఇవ్వాలనుకుంటే అతనికే ఇస్తారని ఊహించారు. కాని అంచనాలు తారుమారయ్యాయి. జూన్ 20న జరగనున్న ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ఆర్.జె.డి. తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్. ముగ్గురు పిల్లల తల్లి మున్నీ ముగ్గురు పిల్లల తల్లి. భర్త అవదేశ్ రజక్ కూడా వృత్తి పనే చేస్తున్నాడు. వీరికి భక్తియార్పూర్లోని రైల్వేస్టేషన్ పక్కనే ఉండే ఇస్త్రీ బండి ఆధారం. అయితే గత పదేళ్లుగా మున్నీ ఆర్.జె.డి. కార్యకర్తగా మారింది. ఆమె పాటలు పాడగలదు. పార్టీ సభలకు స్టేజ్ మీద పాటలు పాడుతుంది. అంతేకాదు లోకల్ టీవీ చానల్స్లో ఆమె పార్టీ విధానాలకు పెద్ద పెద్దగా అరిచి చెప్తుంది. నితీష్ ప్రభుత్వాన్ని బాగా తిట్టి పోస్తుంది. ఇవన్నీ పార్టీని ఆకర్షించాయి. ‘అట్టడుగు స్థాయి కార్యకర్తలను లాలూ అభిమానిస్తారని చెప్పడానికి, ఆ స్థాయి వారికి కూడా పదవులు దక్కుతాయని చెప్పడానికి మున్నీ ఎంపిక ఒక ఉదాహరణ’ అని ఆర్.జె.డి. నేతలు అంటున్నారు. మున్నీ చాలా ఉత్సాహంగా పని చేయాలనుకుంటోంది. ప్రతిపక్షంలో గట్టిగా మాట్లాడేవాళ్లదే పైచేయి కాబట్టి విధాన పరిషత్లో ఆమె విమర్శలు అధికార పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని కొందరు విశ్లేషిస్తున్నారు. మున్నీ రజక్ గురించి మున్ముందు మనం మరిన్ని విశేషాలు వినడంలో ఆశ్చర్యం లేదు. -
హిందూ మున్నని నాయకుడి హత్య!
సాక్షి, చెన్నై: బీజేపీ, హిందూ మున్నని నేతలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్న తీవ్రవాదులను ఇటీవల పుత్తూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉగ్రవాదుల్లో ఒకడైన అబూబక్కర్ సిద్ధిక్ జాడ మాత్రం కానరాలేదు. అతడి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బుధ వారం రాత్రి హిందూ మున్నని నేత దారుణ హత్యకు గురి కావడం కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనతో బీజే పీ, శివ సేన, హిందూ మున్ననని, ఆర్ఎస్ఎస్ వర్గాలు ఆందోళన కు దిగారుు. పథకం ప్రకారం హత్య : కన్యాకుమారి జిల్లా కరక్కొడుకు చెందిన సురేష్కుమార్(46) చెన్నై అంబత్తూరులో స్థిర పడ్డారు. అక్కడి మన్నార్ పేట మలైమత్తయ్యమ్మన్ ఆలయం వీధి లో నివాసం ఉంటున్న ఆయనకు భార్య భావన(40), పిల్లలు కృష్ణవేణి(10), కిరణ్మయి(8) ఉన్నారు. సురేష్కుమార్ తిరువళ్లూరు ఉత్తర జిల్లా హిందూ మున్నని అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నా రు. ఈయనకు అంబత్తూరు ఎస్టేట్ రోడ్డులో కార్యాలయం ఉంది. ప్రతి రోజు ఈ కార్యాలయంలో రాత్రి పది గంటలకు వరకు ఉండేవారు. యథా ప్రకారం బుధవారం రాత్రి పది గంట లకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఆయన అలా బయటకు వచ్చారో లేదో, మోటార్ సైకిల్పై వచ్చిన ముగ్గురు దుండగులు, కత్తులతో నరికి పడేశాడు. సురేష్ కుమార్ కేకలు విన్న సమీపంలోని పోలీస్ బూత్లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆ దండగులు ఉడాయించా రు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేష్కుమార్ను అన్నానగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ సురేష్కుమార్ మృతి చెందారు. ఈ సమాచారంతో బీజేపీ, హిందూ మున్నని, శివసేన, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాల రగిలింది. మృతదేహంతో రాస్తారోకకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని నినాదాలతో హోరెత్తించారు. ఎట్టకేలకు వారిని బుజ్జగించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్తత: తమ నాయకుడు హత్యతో తిరువళ్లూరు ఉత్తర జిల్లా పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మన్నార్ పేట, అంబత్తూరు ఎస్టేట్, పాడి పరిసరాల్లో దుకాణాలన్నీ మూతబడ్డాయి. బంద్ను తలపించే రీతి లో వాతావరణం నెలకొంది. కీల్పాకం పరిసరాల్లో భారీ జన సమీకరణతో బీజేపీ, శివసేన, హిందూ మున్నని, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పూందమల్లి హైరోడ్డులో బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. పూందమల్లి హైరోడ్డు స్తంభించడంతో వాహనాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆందోళన కారులను బుజ్జగించి, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అప్పగించారు. మృత దేహాన్ని అంబులెన్స్ లో మన్నార్ పేటకు తరలించే క్రమంలో నిరసనకారులు వాహనాలపై త ప్రతా పం చూపించారు. బస్సులపై దాడులు : అంబులెన్స్ వెంట పెద్ద ఎత్తున ఊరేగింపునకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కదిలారు. మార్గం మధ్యలో బస్సులు, వాహనాలు అడ్డురావడంతో తమ ప్రతాపం చూపించారు. నగర రవాణా సంస్థకు చెందిన పది బస్సుల అద్దాలు పగిలాయి. కార్లు, మోటార్ సైకిళ్లపై దాడులకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు బలగాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత నడుమ మన్నార్పేటకు సురేష్కుమార్ మృత దేహాన్ని తరలించారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపులో తొలుత ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు బృందాలు సురేష్కుమార్ హత్య ఘటన విచారణకు మూడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డెప్యూటీ కమిషనర్ షణ్ముగ వేల్, అసిస్టెంట్ కమిషనర్లు మైల్ వాహనన్, నందకుమార్ పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. పథకం ప్రకారం ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నారు. పోలీ స్ బూత్కు, అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ హత్య జరిగిందంటే, ముందుగా రె క్కీ నిర్వహించడంతోపాటుగా, సురేష్కుమార్ కదలికలను కొన్నాళ్లు పసిగట్టినట్టు స్పష్టం అవుతోంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉంటారన్న దిశగా విచారణ సాగుతోంది. అదే సమయంలో సురేష్కుమార్ కార్యాలయానికి పక్కనే ఓ షాపులో సీసీ కెమెరా అమర్చి ఉండడంతో అందులోని దృశ్యాలను పరిశీలిస్తున్నారు. తీవ్రవాదుల పనై ఉంటుందా? సురేష్కుమార్కు ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు వేగవంతం అయింది.