breaking news
Moin Qureshi arrest
-
మనీలాండరింగ్ కేసులో ఖురేషీకి బెయిల్
న్యూఢిల్లీ : వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీకి మంగళవారం బెయిల్ లభించింది. ఈ మేరకు మనీలాండరింగ్ కేసులో ఖురేషీకి ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదును ట్రాన్సఫర్ చేపడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మొయిన్ ఖురేషిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై నేరపూరిత కుట్రలతో పాటుగా తన హవాలా ఛానళ్లను మనీ ఛేంజర్ సహాయంతో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించాడనే అభియోగాలు ఉన్నాయి. చాలాకాలం ఈడీ అధికారుల కళ్లుగప్పి తిరిగిన ఖురేషిని ఎట్టకేలకు పట్టుకుని, కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్ కేసులో ఖురేషీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ‘లుక్ అవుట్ సర్కులర్’(ఎల్వోసీ) జారీ చేసింది కూడా. -
బిలీనియర్ మీట్ ఎక్స్పోర్టర్ అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: కోట్లాధిపతి అయిన మాంసం ఎగుమతిదారుడు, హవాలా డీలర్ మోయిన్ ఖురేషిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఢిల్లీలో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదును ట్రాన్సఫర్ చేపడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మోయిన్ ఖురేషిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేడు(శనివారం) అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు. నేరపూరిత కుట్రలు కూడా ఈ మాంసం ఎగుమతిదారుడు, ఏక్యూఎం గ్రూప్ కంపెనీలు చేపడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఏజెన్సీ విచారణ కూడా జరిపింది. మోయిన్ ఖురేషిపై వచ్చిన ఆరోపణలతో గత నెలలోనే దక్షిణ ఢిల్లీలో ఈడీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో అతను తన హవాలా ఛానళ్లను మనీ ఛేంజర్ సహాయంతో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించాడని తెలిసింది. అనుమానిత డాక్యుమెంట్లను, జువెల్లరీని ఈడీ సీజ్ చేసింది. ఈ సీజ్ చేసిన వాటిలో సమాచారం మేరకు ఈడీ పలు దేశాలకు లేఖలు కూడా రాసింది. ఈ మాంసం ఎగుమతిదారుడితో ఉన్న సంబంధాలను ఈడీ ప్రశ్నించింది.