-
ఢిల్లీలో పొల్యూషన్ ఎమర్జెన్సీ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రమాదపుటంచుల్లో ఉంది. ఢిల్లీని కాలుష్య కారక స్మాగ్ (పొగ+కాలుష్యం) ముంచెత్తింది. దీంతో కాలుష్య అత్యవసర స్థితిని ప్రకటించాల్సిన ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరింది. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించిన వాయు నాణ్యత సూచీ ప్రకారం 500 పాయింట్ల (గరిష్టం) స్కేల్లో కాలుష్యం ఇప్పటికే 487 పాయింట్లు దాటింది. మరో 48 గంటల్లో ఈ సూచీ 500 యూనిట్లకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. రెండ్రోజులుగా ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే రీతిలో పెరిగిన వాయు కాలుష్యం.. బుధవారం మరింత ప్రమాదకర స్థితికి చేరింది. ఈ కాలుష్యం ధాటికి శ్వాస, హృద్రోగ సంబంధింత సమస్యలున్నవారు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకంపై దృష్టిపెట్టారు. నగరంలో పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యమునా ఎక్స్ప్రెస్వేపై పలు వాహనాలు పొగమంచు కారణంగా ఢీకొనగా 22 మందికి గాయాలయ్యాయి. అటు, పంజాబ్లో మంచు కారణంగా ఓ ట్రక్కు దూసుకెళ్లటంతో 9మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. వైపరీత్యానికి అడుగుదూరంలో.. ప్రస్తుత పరిస్థితి కొనసాగి 48 గంటల్లో కాలుష్య సూచీ 500 పాయింట్లు దాటితే.. సరి–బేసి (కారు నెంబర్లు) విధానం, నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో నిర్మాణాలు, భవనాల కూల్చివేతపై నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్న వారు అనారోగ్యం పాలవుతుండగా.. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రమాదకర స్థాయిలో పీఎం 2.5, పీఎం10 భూ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో పీఎం 2.5 తీవ్రత క్యూబిక్ మీటర్కు 420 మైక్రో గ్రాములు, పీఎం10 తీవ్రత క్యూబిక్ మీటర్కు 678 మైక్రోగ్రాములున్నట్లు వెల్లడైంది. ఢిల్లీలో స్మాగ్ (కాలుష్యం, పొగమంచు కలిపి) ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని.. నగరంతోపాటు ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా వ్యాపించిందని మంత్రిత్వశాఖ అధికారి మాధవన్ రాజీవన్ వెల్లడించారు. పంజాబ్, హరియాణాల నుంచి నవంబర్ 6 రాత్రి నుంచి హఠాత్తుగా కాలుష్యంతో కూడిన పొగ వ్యాపించటంతోనే ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీతోపాటుగా ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగావ్, నోయిడాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఆదివారం వరకు స్కూళ్లు బంద్ ప్రమాదకరస్థితికి చేరుతున్న వాతావరణంతో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు ఆదివారం వరకు మూసే ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి మనీశ్ సిసోడియా సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. ‘ప్రజారోగ్య ఎమర్జెన్సీ’ ప్రకటించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్లాసురూముల్లో కాకుండా ఇతర ఔట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్కూలు యాజమాన్యాలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా, హస్తినలో వాతావరణ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయంతో పనిచేద్దామని పంజాబ్, హరియాణాల సీఎంలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖలు రాశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలను కాల్చేయటం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ లేఖల్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో పరిస్థితిని మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో సమర్థవంతంగా ఎదుర్కొనలేమని ఏయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా పేర్కొన్నారు. పొగమంచుకు తొమ్మిది ప్రాణాలు బలి చండీగఢ్: పంజాబ్లో దట్టమైన పొగమంచు తొమ్మిది ప్రాణాలను బలితీసుకుంది. బతిండా–చండీగఢ్ హైవేపై దారి కనిపించకపోవటంతో ఓ సిమెంట్ మిక్సర్ లారీ రోడ్డుపక్కన నిల్చున్న 14మంది విద్యార్థుల పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బతిండా జిల్లాలో ఉదయం కాలేజీలకు వెళ్లేందుకు కొందరు విద్యార్థులు ఓ బస్సెక్కారు. వీరెక్కిన బస్సు పొగమంచు కారణంగానే వేరే బస్సును ఢీకొంది. దీంతో వీరంతా వేరే బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నిలబడ్డారు. అటుగా వస్తున్న సిమెంట్ కాంక్రీటు లారీ డ్రైవరుకు దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపైనున్న విద్యార్థులు కనిపించకపోవటంతో వారిపైనుంచే వాహనాన్ని పోనిచ్చాడు. అయితే మరికొందరు విద్యార్థులు ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు దూకేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. రెండు బస్సులు ఢీకొనటం, తర్వాత లారీ వీరిపైనుంచి వెళ్లిన ఘటనలన్నీ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే జరిగాయని పోలీసులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని ఫ్లైఓవర్పై దాదాపు పది వాహనాలు స్వల్పం గా ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు. -
173 విమానాల రాకపోకలకు ఆటంకం
న్యూఢిల్లీ: పొంగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. పొంగ మంచు దట్టంగా అలముకోవడంతో వెలుతురు మందగించి విజిబిలిటి 50 మీటర్ల దిగువనకు పడిపోయింది. ఫలితంగా ఆరు గంటల పాటు విమాన రాకపోకలు స్తంభించాయి. 173 విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణంగా రెండు విమాన సర్వీసులు రద్దు చేశారు. -
రైళ్లకు బాంబులతో సిగ్నళ్లు
తుపాను ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిపోయిన పొగమంచు సిగ్నళ్లు కనిపించక డ్రైవర్ల ఆందోళన డిటోనేటర్ సిగ్నలింగ్కు అనుమతించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపానులు రైళ్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎర్ర లైటో.. పచ్చలైటో చూసుకుని ముందుకెళ్లే పరిస్థితి లేక.. ఏకంగా డిటోనేటర్లు పేల్చాల్సిన పరిస్థితి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైలు మార్గాల్లో ట్రాక్మెన్లు ‘డిటొనేటర్లు’ పట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాదు.. కచ్చితంగా అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో డిటోనేటర్లు నిల్వ చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు తీవ్రత పెరగటమే దీనంతటికీ కారణం. తెల్లవారుజామున, ఉదయం, సాయంత్రాల్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రైలు డ్రైవర్లకు సిగ్నళ్లు కనిపించవు. ఇది ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో సిగ్నళ్లపై లోకోపైలట్లను అప్రమత్తం చేసేందుకు రైల్వే సిబ్బంది డిటోనేటర్లను పేల్చుతారు. దాంతో లోకో పైలట్లు అప్రమత్తమై రైలు వేగాన్ని బాగా తగ్గించి, సిగ్నల్ను నిశితంగా పరిశీలించి ముందుకు సాగుతారు. సాధారణంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి అవకాశం తక్కువ. చలి తీవ్రత బాగా పెరిగిన ప్పుడు ఏజెన్సీల్లాంటి ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం వరుసగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో పొగమంచు బాగా పెరిగింది. లోకో పైలట్లు ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆగమేఘాలమీద డిటొనేటర్లను సమకూర్చే పనిలో పడ్డారు. డిటొనేటర్లు ఎందుకు?: పొగమంచు దట్టంగా ఉన్నప్పు డు లోకోపైలట్లు సిగ్నళ్లను గమనించగలిగేందుకు తోడ్పడే పరికరాలు మన రైల్వే వద్ద లేవు. దాంతో ప్రత్యేకంగా రూపొందించిన డిటొనేటర్లను రైలు వచ్చే సమయంలో సిగ్నళ్లకు కొన్ని వందల మీటర్ల ముందు పట్టాలపై అమరుస్తారు. రైలు దానిమీదుగా వెళ్లగానే అది పేలుతుంది. వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై ముందు సిగ్నల్ ఉందని గుర్తించగలుగుతారు. వెంటనే రైలు వేగాన్ని కనిష్టస్థాయికి తగ్గించి, సిగ్నల్ను మసకగానైనా పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. సాధారణంగా చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలుపట్టాలు సంకోచిస్తాయి. ఒక్కోసారి విరిగిపోయి, ప్రమాదానికి కారణమవుతాయి. ట్రాక్మెన్ ద్వారా అధికారులు లోపాలను గుర్తించి, సిగ్నళ్లద్వారా లోకోపైలట్లను అప్రమత్తం చేస్తుంటారు. కానీ, పొగమంచుతో సిగ్నల్ కనిపించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా రైలు పట్టాలు తప్పటం వల్లనో, మరే కారణం చేతనో నిలిచిపోతే... వెనుక వస్తున్న ఇతర రైళ్లను ఎక్కడికక్కడ సిగ్నళ్ల ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది. పొగమంచుకు సిగ్నల్ కనిపించకపోతే రైళ్లు ఢీకొనే ప్రమాదముంటుంది. కాగా.. ఉత్తర భారత ప్రాంతంలోని రైళ్లకు పొగమంచును చీల్చుకుంటూ కూడా ప్రసరించగలిగే సామర్థ్యమున్న లైట్లను అమర్చుతున్నారు. కానీ, దక్షిణమధ్య రైల్వేలో అలాంటివి లేవు. వాటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలు కాలేదు. దాంతో ఇంకా డిటొనేటర్ సిగ్నళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement