Miss Shetty Mr Polishetty
-
అతన్ని చూస్తే భయమేస్తోంది.. రిటైర్ అవుతానంటున్న బ్రహ్మజీ!
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో దాదాపు వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' చిత్రంలో ఖైదీలను ఉరి తీసే వైవిధ్యమైన తలారి పాత్రను పోషించారు. ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు మోసాలు చేస్తున్నారంటూ అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మజీ చేసిన మరో ట్వీట్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు') ఇటీవల నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పిల్లల చదువుల గురించి నవీన్ మాట్లాడే సీన్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. అంతే ఈ సీన్ ట్విట్టర్లో చూసిన బ్రహ్మజీ సైతం ఫిదా అయ్యారు. పోలిశెట్టి నటన చూస్తే నాకు భయమేస్తోంది.. ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఫన్నీ పోస్ట్ చేశారు. దీనికి నవీన్ సైతం 'మీకు పవర్ ఉంది.. నాకు బ్రెయిన్ ఉంది.. మనిద్దరం కలిస్తే' అంటూ ఫన్నీగానే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఫన్నీ ట్వీట్ సంభాషణ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. Ee abbayi talent chusthe naaku bhayamesthundi..ika Nenu retire ayipothe better..🙏🏼🙏🏼🙏🏼 https://t.co/3xQY0hgw1f — Brahmaji (@actorbrahmaji) October 8, 2023 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. వినాయక చవిత పండగ అయిపోయింది. అందరూ ఆఫీస్, స్కూల్ హడావుడిలో పడిపోతారు. అదే టైంలో ఈ వారం సినిమాలు ఏమేం వస్తున్నాయనేది కూడా ఓ లుక్కేస్తారు. ఇకపోతే థియేటర్లలో మ్యాడ్, రూల్స్ రంజన్, మామ మశ్చీంద్ర తదితర చిత్రాలు ఉన్నాయి కానీ వాటిపై పెద్దగా హైప్ లేదు. అదే టైంలో ఓటీటీలో మాత్రం 27 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్బాస్' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?) గత కొన్నివారాల నుంచి ఉన్నట్లే ఈ వారం కూడా ఓటీటీల్లో తెలుగు హిట్ సినిమాల దగ్గర నుంచి హిందీ, ఇంగ్లీష్ సిరీస్ల వరకు బోలెడన్ని ఉన్నాయి. ఈ మొత్తం లిస్టులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'మిస్టర్ ప్రెగ్నెంట్', 'గదర్ 2', 'ముంబయి డైరీస్' వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయనేది చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్ఫ్లిక్స్ బెక్హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04 రేస్ టూ ద సమ్మిట్ (జర్మన్ సినిమా) - అక్టోబరు 04 ఎవ్రిథింగ్ నౌ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05 సిస్టర్ డెత్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 05 ఖుఫియా (హిందీ చిత్రం) - అక్టోబరు 05 లూపిన్ పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05 మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు సినిమా) - అక్టోబరు 05 ఏ డెడ్లీ ఇన్విటేషన్ (స్పానిష్ చిత్రం) - అక్టోబరు 06 బల్లేరినా (కొరియన్ సినిమా) - అక్టోబరు 06 ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 06 ఇన్సీడియష్: ద రెడ్ డోర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06 స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ (కొరియన్ సిరీస్) - అక్టోబరు 07 అమెజాన్ ప్రైమ్ డెస్పరేట్లీ సీకింగ్ సోల్మేట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06 ముంబయి డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 06 టోటల్లీ కిల్లర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06 హాట్స్టార్ హాంటెడ్ మ్యాన్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04 లోకి: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06 జీ5 గదర్ 2 (హిందీ సినిమా) - అక్టోబరు 06 ఆహా మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06 ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06 డిస్కవరీ ప్లస్ స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 06 సినీ బజార్ నీ వెంటే నేను (తెలుగు సినిమా) - అక్టోబరు 06 బుక్ మై షో ద నన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 03 గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 05 ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 06 జియో సినిమా ర్యాట్ ఇన్ ద కిచెన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 02 మెయిన్ మహ్మమూద్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 03 గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 06 ద డాటర్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 07 (ఇదీ చదవండి: ఓటీటీలో ఈ నెలలో 45కు పైగా సినిమాలు/సిరీస్లు, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?) -
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఓటీటీ అఫిషియల్ ప్రకటన వచ్చేసింది
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో వెండితెరపై మెరిసింది. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా పాజిటీవ్ టాక్తో ఇప్పటి వరకు సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ఎఫెక్ట్.. సూసైడ్ లేఖతో చరణ్ అభిమాని వార్నింగ్..) తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నుంచి ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ 5న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుందని అఫిషీయల్గా నెట్ఫ్లిక్స్ తెలిపింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే అంటూ గతంలో చిరంజీవి తెలిపారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన తెలిపిన విషయం తెలిసిందే. దీంతో సినిమాకు ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. మెగాస్టార్తో పాటు మహేశ్ బాబు, సమంత కూడా ఈ సినిమాపై పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే రెట్టింపు వినోదం ఇందులో ఉన్నట్లు వారందరూ తెలిపారు. థియేటర్లో ఈ సినిమా చూడలేకపోయిన వారు అక్టోబర్ 5న నెట్ఫ్లిక్స్ చూసి ఎంజాయ్ చేయండి. -
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ మహేష్ బాబు స్పెషల్ ఇంటర్వ్యూ
-
నమ్మకం నిజమైంది
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో వాళ్లే మా సినిమాను ప్రమోట్ చేశారు. ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 75 సిటీస్కి వెళ్లాను. అమెరికాలో ప్రమోషన్కి వెళ్లినప్పుడు హోటల్లో నిద్రపోయే టైమ్ ఉండేది కాదు. ఈస్ట్ నుంచి వెస్ట్కు ప్రయాణం చేసే విమానంలోనే నిద్రపోయేవాణ్ణి. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్లా కాబట్టి నాకు కష్టం అనిపించలేదు’’ అని హీరో నవీన్ పోలిశెట్టి అన్నారు. పి. మహేశ్బాబు దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి విలేకరులతో చెప్పిన విశేషాలు. ► మంచి సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉండేది. అది నిజమైంది. తెలుగులో వసూళ్లు నెమ్మదిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకున్నాయి.. మూడో వారంలోనూ మంచి వసూళ్లు ఉన్నాయి. అమెరికాలోనూ మూడో వారంలో మంచి వసూళ్లు ఉండటంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుతున్నారు. యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లోనూ షోలు పెంచుతున్నారు. మా మంచి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకు హ్యాట్సాఫ్. ► నా తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ నేను బాగా నటించగలనని నిరూపించింది. నా సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం ‘జాతి రత్నాలు’ చిత్రంతో ప్రొడ్యూసర్స్, బయ్యర్స్లో వచ్చింది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు.. భావోద్వేగాలు కూడా పండించగలను అని నిరూపించుకున్నా. ► తెలుగులో చిరంజీవి, ప్రభాస్గార్లు, హిందీలో ఆమిర్ ఖాన్గారు ఇష్టం. అలాగే అన్ని జానర్స్ సినిమాలను ఇష్టపడతాను. హిందీలో రాజ్కుమార్ హిరాణీగారి చిత్రాలంటే ఇష్టం. తెలుగులో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, భైరవ ద్వీపం, ఆదిత్య 369’ వంటి సినిమాలు చేయాలనుంది. ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ఆ గుర్తింపు వచ్చింది: నవీన్ పోలిశెట్టి
ఇప్పటి వరకు నేను చేసిన మూడు సినిమాలు(ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి) చేశాను. ఈ మూడు సక్సెస్ఫుల్ మూవీస్ ఒక్కోటి నా కెరీర్కు ఒక్కో రకంగా హెల్ప్ చేశాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస..మూవీతో నేను బాగా నటించగలనే నమ్మకం వచ్చింది. జాతి రత్నాలు టైమ్ లో పాండమిక్ వచ్చింది. అప్పుడు సినిమాలు థియేటర్ లో చూడరు అన్నారు. కానీ ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి...నవీన్ సినిమా థియేటర్ లో బాగా పే చేస్తుందనే నమ్మకం ప్రొడ్యూసర్స్, బయ్యర్స్ లో వచ్చింది. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో నేను కేవలం కామెడీ మాత్రమే కాదు ఎమోషన్ కూడా చేయగలను అని నిరూపించుకున్నాను’అని యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అన్నాడు. నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం.. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్ మీడియాతో ముచ్చటించారు.ఆ విశేషాలు.. ►మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే మరోవైపు జవాన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. అప్పుడు ఎంతో టెన్షన్ పడ్డా. పెద్ద సినిమాతో వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో అనే కంగారు ఉండేది. కానీ ప్రేక్షకులు మా సినిమాను సూపర్ హిట్ చేశారు. మంచి సినిమా అనే వర్డ్ ఆఫ్ మౌత్ తోనే అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ తెలుగులో కలెక్షన్స్ నెమ్మదిగా మొదలయ్యాయి. కానీ యూఎస్ లో డల్లాస్ లో ప్రీమియర్స్ వేసినప్పటి నుంచే స్ట్రాంగ్ గా రన్ స్టార్ట్ అయ్యింది. మూడు రోజులకే వన్ మిలియన్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు థర్డ్ వీక్ లో కూడా యూఎస్ లో రన్ అవుతోంది. స్క్రీన్స్ పెంచుతున్నారు. ► మన ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది స్టార్ హీరోస్, టెక్నీషియన్స్ మా సినిమాను అప్రిషియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి రివ్యూ ఇచ్చారు. మాతో రెండు గంటలపాటు మాట్లాడారు. నా పర్ ఫార్మెన్స్ గురించి ఆయన చెబుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మహేశ్ బాబు, రవితేజ, రాజమౌళి, చరణ్ గారు, సమంత..ఇంకా చాలా మంది చూసి వాలెంటరీగా రియాక్ట్ అయ్యారు. ఆడియెన్స్ కూడా వాళ్లకు వాళ్లే ముందుకొచ్చి మా సినిమాను ప్రమోట్ చేశారు. ► ప్రమోషన్ టూర్ కోసం గత 25 రోజుల్లో 15 సిటీస్ వెళ్లాను. అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు జర్నీ చేసే ఫ్లైట్ లోనే నిద్రపోయేవాడిని. హోటల్ లో నిద్ర పోయేందుకు కూడా టైమ్ ఉండేది కాదు. రిలీజ్ అయ్యాక కూడా మూవీ ప్రమోషన్ చేశాం. ప్రేక్షకులకు నా థ్యాంక్స్ చెప్పుకోవాడనికి వెళ్తున్నా. కాబట్టి అది కష్టం అనిపించలేదు. ► బాలీవుడ్ లో స్టాండప్ కామెడీ హిట్, తమిళంలో బాగా చూస్తారు. మన దగ్గర ఎందుకు సక్సెస్ కాలేదని అనిపించింది. అయితే మనం పర్పెక్ట్ గా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని ఛాలెంజ్ గా తీసుకుని చేశాను. ఇక్కడ కూడా స్టాండప్ కమెడియన్స్ కు ఆదరణ పెరిగితే హ్యాపీ. ► నటుడిగా ప్రతి సీన్ ను సెట్ లో ఇంప్రొవైజ్ చేసుకుంటా. సీన్ లో నాలుగు జోక్స్ ఉంటే..నేను చేసేప్పుడు ఏడుసార్లు ఆడియెన్స్ నవ్వాలని అనుకుంటా. అలాంటి ఫ్రీడమ్ కావాలని కోరుకుంటా. లక్కీగా నా డైరెక్టర్స్ అందరూ నాకు అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. సీన్ పేపర్ లో ఉన్నది ఉన్నట్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. రేపు చేసే సీన్ గురించి రాత్రే దర్శకుడితో మాట్లాడి పూర్తి క్లారిటీ తీసుకుంటా. ► ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నా. వాటి స్క్రిప్ట్స్ లాక్ అయ్యాయి. వచ్చే ఏడాది మూడు మూవీస్ ఒక్కొక్కటిగా సెట్స్ మీదకు వెళ్తాయి. వాటి అప్ డేట్స్ నేనే మీకు చెప్తా. హిందీలో రెండు మూడు కథలు విన్నాను కానీ నా ప్రయారిటీ ప్రస్తుతానికి తెలుగులో నటించడమే. -
ప్రేక్షకుల వల్లే అది సాధ్యమైంది
‘‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ విడుదల రోజే ఓ పెద్ద హిందీ సినిమా(జవాన్) రిలీజ్ అవుతోందని తెలినప్పుడు ఆందోళన చెందాం. కానీ ఈ నెల 7 నుంచి మొదలైన ప్రీమియర్స్ నుంచి ఇప్పటి వరకూ మా సినిమాకు మంచి స్పందన లభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకుల మౌత్టాక్తోనే ఇది సాధ్య మైంది.. మాకు పెద్ద హిట్ ఇచ్చిన వారికి ధన్యవాదాలు’’ అని హీరో నవీన్ పొలిశెట్టి అన్నారు. అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా పి.మహేశ్బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవంలో నవీన్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాను అందరికంటే ముందు చూసిన చిరంజీవిగారు హిట్ అవుతుందన్నారు.. ఆయన మాటే నిజం అయింది’’ అన్నారు. ‘‘నాకు వచ్చిన ఓ ఐడియాను నవీన్ , అనుష్కలతో పాటు నిర్మాతలు నమ్మకుంటే ఈ సినిమా ఇంత సక్సెస్ అయ్యేది కాదు’’ అన్నారు పి.మహేశ్బాబు. దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్ఎకేఎన్ మాట్లాడారు. -
పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? .. అనుష్క ఆన్సర్ ఇదే!
తమిళసినిమా: అరుంధతి చిత్రం నటి అనుష్క ఇమేజ్ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఆమె అభిమానులు ఆమెను గ్లామర్ పాత్రల్లో ఊహించుకోవడం మానేశారు. దర్శక నిర్మాతలు కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే ఆమెను నటింపజేయడానికి ఇష్టపడ్డారు. అలా రూపొందిన చిత్రాలే భాగమతి, బాహుబలి వంటివి. అగ్ర కథానాయక వెలిగిపోతున్న సమయంలో ఆమె కెరీర్కు బ్రేకులు వేసిన చిత్రం సైజ్ జీరో అనే చెప్పాలి. ఆ చిత్రంలోని పాత్ర కోసం అనుష్క బరువు పెరగడం అనే పెద్ద సాహసమే చేశారు. ఆ తర్వాత ఎప్పటికీ ఆమె బొద్దుగానే ఉన్నారు అదే సమయంలో ముద్దుగానో కనిపించడం విశేషం. అలా తాజాగా అనుష్క నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ చిత్రంపై అనుష్క చాలా ఆశలు పెట్టుకున్నారు. కొంచెం ఆలస్యం అయినా ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకిది కమ్ బ్యాక్ చిత్రం అయిందనే చెప్పాలి. ఈ సందర్భంగా నటి అనుష్క ఓ భేటీలో పేర్కొంటూ నటిగా తనకు ఇంత బ్రేక్ వస్తుందని ఊహించలేదన్నారు. ఆయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి కొత్త కాన్సెప్ట్తో కూడిన ఒరిజినల్ కథా చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. (చదవండి: తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?) ఇకపై వరుసగా నటిస్తానని చెప్పారు. ఇటీవల ఎక్కువగా గుళ్లు గోపురాలు తిరగడం గురించి ప్రస్తావిస్తూ తాను చిన్నతనం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లేదాన్ని, నటిగా బిజీగా ఉండటంతో సమయం కుదరలేదని చెప్పారు. అయితే ఇంట్లో ఇప్పటికీ సోమవారం, శుక్రవారం పూజలు నిర్వహిస్తానని చెప్పారు. ఇక ఇటీవల ఖాళీగా ఉండడంతో ఆలయాలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. పూజలు, మొక్కులు పెళ్లి కోసమేనా..? అన్న ప్రశ్నకు ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం అనుష్క ఓ మలయాళం చిత్రంలో నటించిన సిద్ధమవుతున్నారు. -
ఆడియన్స్ కోసం ఈ సినిమా.. సినిమా చూస్తే..!
-
మంచి సినిమాలను ప్రోత్సహించాలి
‘‘తెలుగు ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారని ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో మరోసారి నిరూపించారు. ఇలాంటి మంచి సినిమాలను అందరూప్రోత్సహించాలి. ‘జవాన్’ విడుదలైన రోజే వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నిలబడి, బలమైన వసూళ్లతో ముందుకెళ్తోంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా పి. మహేశ్బాబు దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పి. మహేశ్బాబు మాట్లాడుతూ– ‘‘మా చిత్రాన్ని చిరంజీవి, మహేశ్బాబు, రవితేజ, రాజమౌళి, వంశీ పైడిపల్లి సమంత అభినందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘త్వరలో సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ టూర్ ΄్లాన్ చేస్తున్నాం’’ అన్నారు ప్రమోద్. -
అనుష్క అందంపై రాజమౌళి ట్వీట్ వైరల్
-
అనుష్క కోసం సమంత.. ఏం చేశారంటే
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైంది. ఈ సినిమాకు ఆడియెన్స్తో పాటు సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను చూసి అభినందించారు. (ఇదీ చదవండి: లిప్లాక్ సీన్కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!) తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనుష్కతో ఆమెకు ఉన్న స్నేహం కోసం సినిమా చూశారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా తనను ఇంతగా నవ్వించలేదని చెప్పారు. సినిమాలో అనుష్క ఛార్మింగ్గా కనిపించారని చెప్పుకొచ్చారు. ఇందులో నవీన్ పోలిశెట్టి సూపర్బ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి; ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్బాస్.. మరో కొత్త ట్విస్ట్!) ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్లో ఆఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేరుకుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. తొలిరోజు పేలవమైన కలెక్షన్స్
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి తొలిసారి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. కామెడీ, ఎమోషన్స్ కలగలిపి తీసిన ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు తొలి రోజు కలెక్షన్స్ మాత్రం పేలవంగా వచ్చాయి. ఇండియాలో కేవలం రూ.4 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్కు ముందు పెద్దగా బజ్ లేకపోవడం, ప్రమోషన్స్కు అనుష్క దూరం కావడం వల్లే వసూళ్లు ఇంత పేలవంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే మౌత్ టాక్ బాగుండటంతో రానున్న రోజుల్లో కలెక్షన్స్ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. మరోపక్క అదేరోజు రిలీజైన బాలీవుడ్ మూవీ జవాన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్లో దూసుకుపోతోంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.125 కోట్ల మేర వసూళ్లు రాబట్టి రికార్డుల వేటకు సిద్ధమని సమరశంఖం పూరించింది. జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఒకేరోజు రిలీజవడం నవీన్-అనుష్కల సినిమాకు పెద్ద మైనస్గా మారింది. జవాన్కు హిట్ టాక్ రావడంతో థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. మరి జవాన్ పోటీని తట్టుకుని మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకుంటుందా? లేదా? అన్నది చూడాలి! చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్ లైఫ్లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్లు.. సూసైడ్ ఆలోచనలు.. -
బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకులను పలకరించింది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో చాలా రోజుల గ్యాప్ తర్వాత అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో కలిసి తెరపై మెరిశారు. పి. మహేశ్ బాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. అ పాన్ ఇండియా మూవీ బాహుబలి-2 తర్వాత పెద్దగా చిత్రాల్లో కనిపించలేదు. ఆ విషయంపై అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంపై తొలిసారి స్పందించింది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దేవసేన మెప్పించిన అనుష్క ఈ చిత్రం తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్లో ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాత 2018లో భాగమతితో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దంలో కనిపించింది. దీంతో పాన్ ఇండియా మూవీస్లో ఎందుకు నటించలేదనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన అనుష్క ఈ విషయంపై తొలిసారి క్లారిటీ ఇచ్చారు. అనుష్క మాట్లాడుతూ..'నేను బాహుబలిని చేసిన తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పా. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఆ సమయంలో అది నాకు చాలా అవసరం. అందువల్లే ఆ సమయంలో పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో మరిన్నీ ప్రాజెక్టులు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి అనిపించింది. కొంత సమయం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ వినలేదు. కానీ మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అది ఏ భాషలోనైనా కావొచ్చు.' అని తెలిపింది. చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ప్రేక్షకులను అలరించింది భామ. చెఫ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) -
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాలు ఒకే ఓటీటీలో!
అనుష్క చాలా కాలం తర్వాత చేసిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పి.మహేశ్బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించగా నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు మరో భారీ సినిమా కూడా థియేటర్లలో విడుదలైంది. అదే జవాన్. జవాన్.. బోలెడన్ని ప్రత్యేకతలు ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దీనికి దర్శకత్వం వహించడం, లేడీ సూపర్స్టార్ నయనతార ఈ చిత్రం ద్వారా బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం, క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం, తమిళ స్టార్ విజయ్సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం, దీపికా పదుకునే అతిథి పాత్రలో మెరవడం.. ఇలా చాలానే ఉన్నాయి. రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కూడా నేడే విడుదలవగా పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు ఈపాటికే ఓటీటీ పార్ట్నర్స్తో డీల్ కుదుర్చుకున్నాయి. నెట్ఫ్లిక్స్ రూ.120 కోట్లు పెట్టి మరీ జవాన్ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, జవాన్.. రెండు సినిమాల ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రెండూ ఒకే ఓటీటీలో సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఫ్లాప్ టాక్ వచ్చిందంటే అంతకంటే ముందే ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. హిట్ టాక్ వస్తే కొంతకాలం ఆగిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. అంటే, ఈ రెండు సినిమాల ఫలితాన్ని బట్టే ఓటీటీ విడుదల ఖరారు కానుంది. మిస్ శెట్టి.. సెప్టెంబర్ నెలాఖరులో లేదంటే అక్టోబర్ నెల ప్రారంభంలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది! జవాన్ మాత్రం అక్టోబర్ చివర్లో రిలీజయ్యేట్లు కనిపిస్తోంది. చదవండి: 'జవాన్' మూవీ రివ్యూ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’మూవీ పబ్లిక్ టాక్
-
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’మూవీ రివ్యూ
టైటిల్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నటీనటుటు: అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, నాజర్, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమటం, సోనియా దీప్తి, తులసి తదిరతులు నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్ నిర్మాతలు: వంశీ-ప్రమోద్ దర్శకత్వం: పి.మహేశ్ బాబు సంగీతం:రధన్ నేపథ్య సంగీతం: గోపీ సుందర్ విడుదల తేది: సెప్టెంబర్ 7, 2023 కథేంటంటే.. అన్విత(అనుష్క శెట్టి) లండన్లో మోస్ట్ సక్సెస్ఫుల్ చెఫ్. ఆమె వంటకు లండన్ వాసులు ఫిదా అయిపోతారు. కెరీర్ పరంగా ఎంతో ఎదిగినా.. పెళ్లి చేసుకోవడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆమె తల్లి(జయసుధ)ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా రిజెక్ట్ చేస్తుంది. పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తల్లితో తెగేసి చెబుతుంది. తల్లి మరణించిన తర్వాత.. తనకు ఓ తోడు కావాలనుకుంటుంది అన్విత. అందుకోసం ఓ బిడ్డను కనాలనుకుంటుంది. అది కూడా పెళ్లి చేసుకోకుండా. ఐయూఐ పద్దతిలో తల్లి కావాలని ఓ డాక్టర్ని సంప్రదిస్తుంది. స్పెర్మ్ డోనర్ని తనే వెతుకుతానని చెప్పి..తనకు నచ్చిన లక్షణాలు ఉన్న యువకుడి కోసం సెర్చ్ చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు స్టాండప్ కమెడియన్ సిద్ధు (నవీన్ పోలిశెట్టి) పరిచయం అవుతాడు. తనతో క్లోజ్గా మూవ్ అయిన తర్వాత అసలు విషయం చెబుతుంది. అయితే అప్పటికే అన్వితతో ప్రేమలో పడిన సిద్దు ఆమెకు సహాయం చేశాడా? లేదా? అసలు అన్విత పెళ్లి చేసుకోకూడదని ఎందుకు నిర్ణయం తీసుకుంది? ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె దేశం విడిచి లండన్ ఎందుకు వెళ్లింది? చివరకు సిద్ధూ-అన్విత కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకునే ఓ యువతి కథే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఈ పాయింట్ వినగానే ఏదో వల్గారిటీ సినిమా అనే ఫిలింగ్ కలుగుతుంది. అదే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి సినిమాలు ఒప్పుకోదులే అనే నమ్మకం కూడా ఉంటుంది. ఆ నమ్మకాన్ని కాపాడుతూ.. ఎలాంటి వల్గారిటీ లేకుండా, ప్యామిలీ మొత్తం కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు మహేశ్బాబు పి. ఓ సున్నితమైన అంశాన్ని కామెడీ, ఎమోషన్స్తో అతి సున్నితంగా తెరపై చూపించాడు. ప్రతి మనిషికి జీవితంలో ఓ తోడు కచ్చితంగా ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. అలా అని కథంతా సీరియస్గా సాగదు. కామెడీ వేలో చెబుతూనే.. అక్కడక్కడ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఫేమస్ చెఫ్గా అనుష్కను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లితో ఆమె బాడింగ్ చూపించారు. అవి కాస్త ఎమోషనల్గా ఉన్నప్పటికీ.. రొటీన్గా అనిపిస్తుంది. నవీన్ పోలిశెట్టి ఎంట్రీ వరకు కథ చాలా సింపుల్గా సాగుతుంది. ఇక హీరో ఎంట్రీ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలు రొటీన్గా ఉన్నప్పటి కామెడీతో కప్పేశారు. స్టాండప్ కమెడియన్గా హీరో చెప్పే జోకులు కొన్ని చోట్ల నవ్విస్తే.. మరికొన్ని చోట్ల బోర్ తెప్పిస్తాయి. హీరోయిన్తో హీరో ప్రేమలో పడడం..ఆమె ఏమో అతన్ని స్పెర్మ్ డోనర్గా చూడడం.. ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అదే సమయంలో తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా అర్థమైపోతుంది. హీరోయిన్కి ప్రపోజ్ చేసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. స్పెర్మ్ డొనేషన్ కోసమే తనతో క్లోజ్గా మూవ్ అయిందనే విషయం తెలిశాక హీరో ఏం చేశాడనేది సెకండాఫ్. ప్రేమించిన అమ్మాయి కాబట్టి ఆమె అడిగిన సహాయం చేస్తాడనేది అందరికి అర్థమైపోతుంది. కానీ ఈ క్రమంలో జరిగే సన్నివేశాలను హిలేరియస్గా రాసుకున్నాడు దర్శకుడు. ఆస్పత్రిలో డాక్టర్కి హీరో మధ్య జరిగే సంభాషనలు కానీ.. హీరోయిన్ ఇంటికి పిలిస్తే.. వేరేలా అనుకొని వెళ్లడం..ఈ సీన్లలన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. చివరల్లో మాత్రం ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అసలు హీరోయిన్ ప్రేమ, పెళ్లి ఎందుకు వద్దనుకుంటుందనే కారణం కన్విన్సింగ్గా ఉంటుంది. ఎమోషనల్గానూ కనెక్ట్ అవుతారు. అయితే కథంతా ఒక పాయింట్ చుట్టే తిరగడంతో సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే సినిమా ఫలితంగా మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం అనుష్క, నవీన్ పోలిశెట్టి పాత్రల చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి, అనుష్క కాకుండా వేరేవాళ్లు నటించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. చెఫ్ అన్విత పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. తన స్టార్డమ్ని పక్కకిపెట్టి.. ఆ పాత్రలో ఎంతమేరకు నటించాలో అంతమేరకు చక్కగా నటించింది. తెరపై చాలా హుందాగా కనిపించింది. ఎమోషనల్ సన్నివేశాల్లో తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించింది. ఇక నవీన్ పోలిశెట్టి మరోసారి తనదైన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. స్టాండప్ కమెడియన్ సిద్దూ పాత్రలో జీవించేశాడు. సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. హీరోయిన్ తల్లిగా జయసుధ తన పాత్ర పరిధిమేర నటించింది. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే ఆమె పాత్ర ముగుస్తుంది. ఇందులో ఆమె బాలయ్య వీరాభిమానిగా కనిపించడం గమనార్హం. హీరో తల్లిదండ్రులుగా తులసి, మురళీ శర్మలు రొటీన్ పాత్రలు పోషించారు. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం, హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా దీప్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గోపీ సుందర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. రధన్ పాటలు బాగున్నాయి. కథలో భాగంగానే పాటలు వస్తాయి. నీరవ్ షా సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్తో పాటు సెకండాఫ్లోనూ కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టే, సాక్షి వెబ్డెస్క్ -
ప్రమోషన్స్కు అనుష్క దూరం? నిజమెంత?
సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకు ప్రమోషన్ చాలా ముఖ్యంగా మారింది. దీంతో చిత్ర వర్గాలు ప్రచారానికి ప్రాముఖ్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు చిత్ర ప్రచారాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, కంగనారనౌత్ లాంటి స్టార్స్ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. షారూఖ్ఖాన్ అయితే జవాన్ చిత్రం కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు. హీరోయిన్ కంగనారనౌత్ తాను తాజాగా నటించిన చంద్రముఖి 2 చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టారు. కాగా జవాన్ చిత్రంలో హీరోయిన్గా నటించిన నయనతార మాత్రం ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనకుండా తన పాలసీకి అలాగే కట్టుబడి ఉంది. అదే విధంగా హీరోయిన్ అనుష్క కూడా ప్రమోషన్స్కు దూరంగా ఉంటోందని ప్రచారం జరుగుతోంది. ఈమె చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. మొన్నటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్లోనూ అనుష్క పాల్గొనలేదు. మయోసైటిస్ వ్యాధికి గురైన నమంతనే వీరికంటే బెటర్. అంత బాధలోనూ తాను నటించిన ఖుషీ చిత్ర ప్రచారంలో ఒక్కసారి అయినా పాల్గొందని కామెంట్లు వినిపించాయి. నిజానికి అనుష్క మొన్నటివరకు హైదరాబాద్లో లేదు. అందుకనే ఏ ప్రమోషన్స్లోనూ కనిపించలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. తాజాగా సాక్షికి ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు యాంకర్ సుమ ఇంటర్వ్యూకు హాజరై ప్రమోషన్స్లో చురుకుగా పాల్గొంటోంది. ఇకపోతే నయనతార నటించిన జవాన్, అనుష్క నటించిన మిసెస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు నేడు (సెప్టెంబర్ 7) ఒకేసారి విడుదలయ్యాయి. చదవండి: Jawan: క్రికెట్ మ్యాచ్లో 'జవాన్' ప్లాన్: అట్లీ -
అనుష్క కోసం రంగంలోకి దిగిన ప్రభాస్
టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కీలక పాత్రల్లో నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ఆమె మళ్లీ ప్రేక్షకులను మెప్పించనున్నారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా హీరో నవీన్ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలకు తిరిగి భారీగా సినిమాను ప్రమోట్ చేయగా.. హీరోయిన్ అనుష్క కూడా వినూత్నంగా ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే ఈ సారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగారు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ పని నెట్టింట ట్రెండ్ అవుతోంది. (ఇదీ చదవండి: ‘జవాన్’మూవీ ట్విటర్ రివ్యూ) 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగుళూరు చికెన్ కర్రీ, నీర్ దోశ ఎలా చేయాలో తయారీ విధానాన్ని అభిమానులతో ఇలా పంచుకున్నారు. (ఇదీ చదవండి: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ) 'చెఫ్ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్ను మొదలు పెడుతున్నాను. ఇందులో ప్రభాస్ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి ఆయన... ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్ను అనుష్క ట్యాగ్ చేశారు. ప్రభాస్ రియాక్షన్ అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్ను స్వీకరించిన ప్రభాస్ వెంటనే ఇన్స్టాలో తన ఫేవరట్ రెసిపీని పోస్ట్ చేశారు. రొయ్యల పులావ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన తయారీ విధానాన్ని కూడా ఆయన షేర్ చేశారు. ఆ తర్వాత ఈ ఛాలెంజ్ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు విసురుతున్నట్లు ప్రభాస్ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్లో ఉంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ పోస్ట్ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడంటే అనుష్క సినిమాకు భారీగా ప్రమోషన్ దక్కినట్లేనని వారు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) -
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్విటర్ రివ్యూ
నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ‘జాతిరత్నాలు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్.. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఆ అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా వెరైటీగా చేయడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 7) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూసేయండి. ట్విటర్లో ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. సినిమా బాగుందని, నవీన్ కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. అనుష్కకు కమ్బ్యాక్ మూవీ ఇది అని కామెంట్ చేస్తున్నారు. Watched premiers in London#MissShettyMrPolishetty In simple words the movie is really very nice and good to watch @NaveenPolishety comedy timing and acting 💥 @MsAnushkaShetty sweetie's comeback movie.#วอลเลย์บอลหญิง — Vinaykumar sura (@Vinaykumarsura) September 7, 2023 ఇప్పుడే లండన్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూశాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. వెరీ నైస్ సినిమా ఇది. చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉంది. అనుష్కకు ఇది మంచి కమ్బ్యాక్ సినిమా’అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #MissShettyMrPolishetty Clean comedy with heartfelt emotions… #Anushka is queen as always and @NaveenPolishety is star of the show….. Comedy matram ROFL👌👌 pic.twitter.com/9ZWx00kxNg — VishnuBose ᴼᴳ (@vishnubose1947) September 6, 2023 మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎమోషనల్తో కూడిన క్లీన్ కామెడీ చిత్రం. అనుష్క ఎప్పటికీ రాణిలాగే ఉంటుంది. నవీన్ కామెడీ చాలా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. Watched the premier of Miss Shetty Mr Polishetty with @NaveenPolishety … met him after 17 years. My second movie with him - first being Krish in 2006. Very humble, nice and down to earth person. The movie is really good. Watch it!!! #MissShettyMrPolishetty #NaveenPolishetty pic.twitter.com/jUy7zzb2Es — Sandeep Tapse (@SandeepTapse) September 7, 2023 #MissShettyMrPolishetty #MissShettyMrPolishettyReview a feel good movie . @NaveenPolishety @MsAnushkaShetty both fit into their worlds perfectly. " bhayta nundi vache prema pina bhayamtho, thanlo thane preminchukovatam modalpetindhi" . This dialogue is deep. Rating: 2.75/5 pic.twitter.com/TBbweThRRO — Thaagubothu🥃 (@reventhmails5) September 7, 2023 #MissShettyMrPolishetty What a beautiful cinema this is ❤️❤️. @NaveenPolishety what an actor , what a talent long way to go man . @MsAnushkaShetty the princess of screen presence and acting does it again effortlessly. Fun and emotion is so organic and situational. Loved it 🙌 — Sravankumar 25 (@25Sravankumar) September 7, 2023 #MissShettyMrPolishetty Overall, movie is a sure shot blockbuster and a hattrick for @NaveenPolishety ! He is a natural rockstar and you won’t be disappointed with this one at all! His description about the movie in climax is apt (IYKYK)!#TrustMyReviews rating: 3.75/5 — Trust my reviews (@trustmyreviews) September 6, 2023 After #Kushi, Another Clean Hit for #Tollywood loading... With #MissShettyMrPolishetty 👏👏👏 Blockbuster Reports from the premiere shows 🤘🤘🤘#MSMP @NaveenPolishety @MsAnushkaShetty #MaheshBabu @UV_Creations @GskMedia_PR @SureshPRO_ — SR Promotions (@SR_Promotions) September 7, 2023 Review #MissShettyMrPolishetty 3/5. ⭐️⭐️⭐️/5 "Outstanding performances by Anushka Shetty and Naveen Polishetty in #MissShettyMrPolishetty. Good songs, engaging screenplay, some minor flaws, top-notch comedy, and emotions. Rating: ⭐️⭐️⭐️/5. Must-watch Telugu movie! #Jaibalayya… pic.twitter.com/oe6YpXZ15C — MovieBuffSmartScopeTV (@SunoritaTrading) September 6, 2023 #MissShettyMrPolishetty one word review It's #NaveenPolishetty show.. He carries the movie with one-liners which work at most parts Rest of the movie is dull — SaiCharan Ande (@SaicharanAnde) September 7, 2023 #MissShettyMrPolishetty Out and out proper rom com Good to see Anushka back. But the real dinosaur of the movie is @NaveenPolishety he literally outperformed everyone in the movie His comedy and emotional performance was terrific, He is the Rajendra Prasad of this generation. — sampathkumar (@Imsampathkumar) September 7, 2023 #MissShettyMrPolishetty Review: ⭐⭐⭐ Comedy is Good👍 Emotions reflected well on Screen 👍 Super First half and a Good 2nd Half Predictable at times But Overall Good movie ✅ Follow @Thyveiw for Genuine Reviews #Jawan pic.twitter.com/VmKKa7cxq8 — Thyview (@Thyveiw) September 7, 2023 -
మెగాస్టార్ ప్రశంసలే మాకు బిగ్ సక్సెస్: దర్శకుడు కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి'. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 7న థియేటర్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో నవీన్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి సినిమా చూసిన మెగాస్టార్ ప్రశంసలు కురిపించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: విజయ్-రష్మిక.. కొత్త విషయం బయటపడింది!) మహేశ్ బాబు మాట్లాడుతూ.. ' చిరంజీవి మాకు ఫోన్ చేశారు. మెగాస్టార్ ఫోన్ రావడంతో సంతోషంతో ఊగిపోయా. ఆయనను అభిమానించే వాళ్లం. మెగాస్టార్ ఫోన్ చేసి అభినందిస్తే ఎలా ఉంటుంది. మా సినిమా గురించి చిరంజీవి మాట్లాడటం సర్ ప్రైజ్ ఇచ్చింది. చిరంజీవి నాతో పాటు నవీన్ను ఇంటికి పిలిచి అభినందించారు. మెగాస్టార్ ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూయర్. ఆయన అభినందనలతో మాకు బిగ్ సక్సెస్ కొట్టిన ఫీలింగ్ కలిగింది. ' అని అన్నారు. సినిమా గురించి మాట్లాడుతూ..' కొత్త తరహా కథలు చేసేందుకు అనుష్క, నవీన్ లాంటి స్టార్స్ సిద్ధంగా ఉన్నందువల్లే మాలాంటి డైరెక్టర్స్ కథలు రాయగలుగుతున్నామని అన్నారు. ఈ సినిమా ఫన్ ఎమోషన్ కలిసి ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని తెలిపారు. సందేశాలు నేరుగా చెప్పడం లేదు.. కానీ కథలో ఆ మోరల్ కనిపిస్తుందన్నారు. శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ పేపర్లో చదివా.. ఆ రైమింగ్ తో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ఫిక్స్ చేశామని తెలిపారు. (ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!) 'మిస్ శెట్టి - మిస్టర్ పోలిశెట్టి' చూశాను.. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, 'జాతి రత్నాలు' కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్… pic.twitter.com/ADJVt6ins6 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 5, 2023 -
ప్రభాస్తో ఎప్పటికీ అలానే ఉంటాను: అనుష్క
ఐదేళ్ల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించనున్నారు. ‘ఇక కెరీర్లో ఇంత లాంగ్ గ్యాప్ ఎప్పుడూ తీసుకోను’ అంటున్నారామె. మహేశ్బాబు పి. దర్శకత్వంలో అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి ముఖ్య తారలుగా యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. రేపు (సెప్టెంబర్ 7) ఈ చిత్రం విడుదల కానుంది. ‘భాగమతి’ (2018) తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్పై కనిపించనున్న చిత్రం ఇది. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనుష్క చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ‘మిస్ శెట్టి..’లో చేసిన షెఫ్ అన్విత క్యారెక్టర్ గురించి... షెఫ్ క్యారెక్టర్ చేయడం నాకు ఇదే తొలిసారి. ఇది నా బెస్ట్ మూవీలా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఐదున్నరేళ్ల థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఒక కొత్త పాత్ర, సరికొత్త కథాంశం ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. ట్రైలర్లో కామెడీ, ఎమోషన్ కనిపించాయి. మీరీ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఇవేనా? నేను కథకి ప్రాధాన్యత ఇస్తాను. నాకు, నిర్మాతలకు వినయ్గారు అని కామన్ ఫ్రెండ్ ఉన్నారు. మహేశ్ వద్ద ఒక స్టోరీ ఉంది వింటారా? అని అడిగారు.. అయితే సినిమా చేయమని కాదు. మహేశ్గారు కథ చెప్పాక అన్విత పాత్ర ఎవరు చేస్తున్నారు? అని అడిగాను. ఇంకా ఎవర్నీ అనుకోలేదని తను చెప్పగానే నేను చేస్తానన్నాను. మహేశ్ ఓ మంచి కథని కొత్తగా, క్లీన్ వేలో చూపించారు. క్లీన్ వే అన్నారు. ట్రైలర్లో ‘తల్లవ్వాలంటే గర్భవతి కావాలి కానీ పెళ్లక్కర్లేదు’ అనే డైలాగ్ చెప్పారు.. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ అన్నది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. లైఫ్లో ఎలా ఉంటాం? మన మైండ్ ఎలా మాట్లాడుతుంది? అనేది చెప్పాం. మైండ్లో ఉన్నదాన్ని బయటకు చెబితే సమాజం ఒప్పుకోదు కదా? మన మైండ్ చాలా విషయాలు చెబుతుంది. కానీ, వాటిలోని సున్నితత్వాన్ని మనం అర్థం చేసుకొని మాట్లాడాలి. నా ఇష్టం వచ్చినది నేను చెబుతాను.. దాన్ని అర్థం చేసుకోకుంటే మీ సమస్య అనను. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని సరైన విధానంలో చెప్పాలి. అంతేకానీ, ఎదుటి వారు హర్ట్ అయ్యేలా చెప్పడం సరికాదని నమ్ముతాను. మన మైండ్లో ఉన్నదాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. 18 ఏళ్ల కెరీర్లో నటిగా మీ గ్రాఫ్ పెరిగింది. వ్యక్తిగతంగానూ పెద్దంత వివాదాలు లేకుండా సాగిన ఇన్నేళ్ల ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే.. యాక్చువల్లీ నేను కాంట్రవర్శీలను హ్యాండిల్ చేయలేను. ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్. ఇలా నాలా సెన్సిటివ్గా ఉండేవాళ్లకు వేరేవాళ్ల ఎమోషన్స్ అర్థమవుతాయి. దాంతో హర్ట్ అయ్యేలా మాట్లాడలేం. నాకు ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి బోలెడంత ప్రేమ, గౌరవం దక్కాయి. అందుకే పెద్దగా వివాదాలు కూడా లేవు. అరుంధతి, దేవసేన (బాహుబలి), భాగమతి.. ఇలాంటి రేర్ క్యారెక్టర్స్ దక్కడం మీకో బ్లెస్సింగ్ అనొచ్చా.. కచ్చితంగా.. మనకి హార్డ్వర్క్ చేయాలని ఉన్నా రైట్ చాన్స్ కూడా రావాలంటాను. శ్యామ్గారు, కోడి రామకృష్ణగారు నన్ను ‘అరుంధతి’గా విజువలైజ్ చేసి, నమ్మి తీసుకున్నారు. దర్శక–నిర్మాతలు నన్ను నమ్మారు కాబట్టి నాకు హార్డ్ వర్క్ చేయడానికి చాన్స్ దొరికింది. నిరూపించుకునే స్కోప్ దక్కింది. ఈ మధ్య మీలో భక్తి భావం ఎక్కువయినట్టుంది.. పూజలు చేస్తున్నారు... ఆలయాలు సందర్శిస్తున్నారు.. ఇప్పుడనే కాదు.. నా చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో గుడికి వెళ్లడం ఒక భాగం. ప్రతి సోమవారం, శుక్రవారం పూజలు చేస్తుంటాం. అయితే కంటిన్యూస్గా సినిమాలు చేయడంవల్ల ఆ మధ్య గుడికి వెళ్లడానికి కుదరలేదు. ఈ మధ్య వచ్చిన లాంగ్ గ్యాప్లో వెళ్లడానికి కుదిరింది. పెళ్లి కాని అమ్మాయిలు పూజలు చేస్తే.. పెళ్లి కోసమే అనే చర్చ జరుగుతుంటుంది... మీ గురించి కూడా అలాంటి ఒక చర్చ ఉంది.. ఇప్పుడనే కాదు.. నేను గుడికి వెళ్లిన ప్రతిసారీ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఒక మంచి విషయం ఏంటంటే.. నా కూతురి గురించి అందరూ ఇంత కేర్ తీసుకుంటారని మా అమ్మానాన్న ఆనందపడతారు (నవ్వుతూ). మరి.. పెళ్లి కబురు ఎప్పుడు చెబుతారు? ఇప్పుడు ప్లాన్స్ లేవు. పెళ్లనేది మంచి విషయం కాబట్టి కుదిరినప్పుడు హ్యాపీగా షేర్ చేసుకుంటా. మీ కో–స్టార్స్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పుడు మీకు సంతోషం అనిపించడం సహజం... అలా పాన్ ఇండియా స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి... ప్రభాస్గారు నాకు 2005 నుంచే తెలుసు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ స్థాయి గుర్తింపు వచ్చాక కూడా ప్రభాస్గారు అలానే ఉన్నారు. ఏ మార్పూ లేదు. తను నాకు ‘వెరీ వెరీ డియర్ ఫ్రెండ్’. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. అలాగే రాజమౌళిగారి ఫ్యామిలీ కూడా నాకు క్లోజ్. భైరవ (కాలభైరవ)ని తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. తనకు మంచి (‘కొమురం భీముడో..’కి సింగర్గా నేషనల్ అవార్డు వచ్చిన విషయాన్ని ఉద్దేశించి) గుర్తింపు రావడం హ్యాపీగా ఉంది. మనకు క్లోజ్గా ఉన్నవాళ్లు ఎదుగుతుంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. -
పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!
స్వీట్ అనుష్క శెట్టి పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే దాదాపు 18 ఏళ్లుగా ఇక్కడే సినిమాలు చేస్తోందిగా. అలానే 'బాహుబలి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అయితే 40 ఏళ్ల వయసు దాటిపోయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చాయి తప్ప అవి నిజం కాలేదు. ఇప్పుడు మాత్రం స్వయంగా అనుష్కనే తన మ్యారేజ్ గురించి మాట్లాడింది. త్వరలో గుడ్న్యూస్ వినే ఛాన్స్ ఉందనేలా కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: 'బిగ్బాస్'లో గొడవలు మొదలుపెట్టిన శోభాశెట్టి!) 'బాహుబలి' తర్వాత హీరోయిన్గా పాన్ ఇండియా హోదా సంపాదించిన అనుష్క.. 'సైజ్ జీరో' సినిమాతో లావుగా మారి ప్రయోగం చేసింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గలేకపోయింది. దీంతో ఒకటి అరా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. తెలుగులో ఆమె చేసిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి గురించి బయటపెట్టింది. 'పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. అయ. అయితే వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం అయితే కాదు. టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను' అని అనుష్క చెప్పింది. దీంతో అందరి కళ్లు ప్రభాస్పై పడ్డాయి. ఎందుకంటే వీళ్లిద్దరూ కలిసి నాలుగు సినిమాలు చేశారు. దీంతో ప్రభాస్-అనుష్క మధ్య సమ్థింగ్ సమ్థింగ్ ఉందన్నారు. కానీ తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అని చాలాసార్లు చెబుతూ వచ్చారు. అయితే వీళ్లిద్దరూ ఇప్పటికీ సింగిల్గా ఉన్నారు. దీంతో ప్రభాస్-అనుష్క ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటారేమో అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత!) -
మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే!
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటించింది. మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేశ్ బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న థియేటర్లో సందడి చేయనుంది. (ఇది చదవండి: అనుష్కతో హగ్స్.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన నవీన్) తాజాగా ఈ చిత్రాన్ని చూసిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో షేర్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు మెగాస్టార్ అందరికంటే ముందుగా రివ్యూ ఇచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి చిరంజీవి అభినందనలు తెలిపారు. మరోసారి అభిమానులతో కలిసి థియేటర్లో చూడాలన్న కోరిక కలిగింది అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ సైతం ఆల్ ది బెస్ట్ అంటూ నవీన్ పోలిశెట్టికి అభినందనలు చెబుతున్నారు. (ఇది చదవండి: తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ.. పెళ్లెందుకు?: అనుష్క!) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఇవాళ బిగ్ బాస్ లో జరగబోయే సీన్స్ గురించి ముందే చెప్పిన నవీన్
-
జనాలు వస్తారా లేదా అని టెన్షన్ పడ్డా..
-
మా నమ్మకం మరింత పెరిగింది
‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ యునిక్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మా సినిమా ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే చిత్రం విజయంపై నమ్మకం మరింత పెరిగింది. కృష్ణాష్టమి రోజు సినిమా రిలీజ్ అవుతోంది. కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, మా సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది’’ అని నవీన్ పొలిశెట్టి అన్నారు. మహేశ్బాబు .పి దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ– ‘‘జాతి రత్నాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. కానీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నచ్చింది. నా ΄ాత్రలో మంచి భావోద్వేగాలు ఉన్నాయి. నాగార్జునగారికి మా ట్రైలర్ బాగా నచ్చింది. ‘బిగ్ బాస్’ హౌస్లోకి 15వ కంటెస్టెంట్గా వెళ్లాను’’ అన్నారు. ‘‘మా సినిమా ట్రైలర్లో చూసింది 30 శాతం అనుకుంటే.. సినిమాలో 70 శాతం భావోద్వేగాలు, వినోదం ఉంటాయి’’ అన్నారు పి. మహేశ్బాబు. -
థియేటర్లో రెండు సినిమాల మధ్య పోటీ.. ఓటీటీలో బోలెడన్ని చిత్రాలు..
సెప్టెంబర్ నెల ఖుషీగా మొదలైంది. చాలాకాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ.. ఖుషి సినిమాతో బోణీ కొట్టారు. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. షారుక్ ఖాన్ నటించిన 'జవాన్'.. నవీన్ పొలిశెట్టి, అనుష్కల 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఒకేరోజు విడుదలవుతున్నాయి. అటు ఓటీటీలోనూ బోలెడన్ని చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ సెప్టెంబర్ 2వ వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లేంటో చూసేద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు ► జవాన్ - సెప్టెంబర్ 7 ► మిస్ శెట్టి- మిస్టర్ పొలిశెట్టి - సెప్టెంబర్ 7 ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియో ► వన్ షాట్ (వెబ్ సిరీస్) - సెప్టెంబర్ 5 ► లక్కీ గౌ (హిందీ చిత్రం) - సెప్టెంబర్ 6 ► జైలర్ - సెప్టెంబర్ 7 ► సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 హాట్స్టార్ ► ఐయామ్ గ్రూట్ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 6 ► ద లిటిల్ మెర్మాయిడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 6 జీ5 ► హడ్డీ - సెప్టెంబర్ 7 నెట్ఫ్లిక్స్ ► స్కాట్స్ హానర్ (హాలీవుడ్ సినిమా) - సెప్టెంబర్ 5 ► షేన్ గిల్లీస్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 5 ► టాప్ బాయ్ (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► కుంగ్ఫూ పాండా (వెబ్ సిరీస్, మూడో సీజన్) - సెప్టెంబర్ 7 ► వర్జిన్ రివర్ (వెబ్ సిరీస్, ఐదో సీజన్) - సెప్టెంబర్ 7 ► సెల్లింగ్ ది ఓసీ (వెబ్ సిరీస్, రెండో సీజన్) - సెప్టెంబర్ 8 బుక్ మై షో ► లవ్ ఆన్ ది రోడ్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 లయన్స్ గేట్ ప్లే ► ది బ్లాక్ డెమన్ (హాలీవుడ్ మూవీ) - సెప్టెంబర్ 8 ఆపిల్ టీవీ ప్లస్ ► ది ఛేంజ్లింగ్ (హాలీవుడ్) - సెప్టెంబర్ 8 హైరిచ్ ► ఉరు(మలయాళం) - సెప్టెంబర్ 4 చదవండి: ఆ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు: గదర్-2 డైరెక్టర్ కామెంట్స్ వైరల్! -
ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రబృందం ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లో నవీన్ పోలిశెట్ అభిమానులను కలిసి సందడి చేశారు. త్వరలోనే అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నవీన్ పాల్గొని సందడి చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నవీన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్కు ఎక్కువ టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులే వల్ల మూవీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ విషయంలో మన్నించాలని ప్రేక్షకులను కోరుతున్నా. మీరు చూపించే ప్రేమకు మంచి సినిమాను తప్ప మేం ఇంకేమీ ఇవ్వలేం. ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడొచ్చు. అడ్వాన్స్ బుకింగ్స్ సోమవారం ఉదయం నుంచి ప్రారంభవుతాయి.' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో స్టాండప్ కమెడియన్గా నవీన్, చెఫ్గా అనుష్క కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ప్రమోషన్స్ నవీన్ పోలిశెట్టి అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెళ్లనున్నారు. డల్లాస్లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
‘తగ్గేదేలే’ అంటున్న నవీన్ పోలిశెట్టి, ఇప్పుడు అమెరికాలో కూడా..
సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లనున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. నవీన్, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు. పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్లో బిజీ అయింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ని తన భుజాన వేసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నింటికి వెళ్లి ప్రమోషన్ టూర్ చేశారు.తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ప్రేక్షకుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యారు. మాటలు, పాటలతో, సినిమా విశేషాలతో ఆడియెన్స్ కు "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అమెరికాలో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మెరికాలోని డల్లాస్ లో ఈ నెల 6వ తేదీన "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమా ప్రీమియర్స్ జరగనున్నాయి. ఈ సినిమా యూఎస్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. డల్లాస్ లో "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" ప్రీమియర్ షోను ఆడియెన్స్ తో కలిసి చూడబోతున్నారు నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చికాగో, వర్జీనియా, న్యూ జెర్సీ, సియాటెల్, బే ఏరియా, అట్లాంట తదితర రాష్ట్రాల్లో నవీన్ పోలిశెట్టి పర్యటిస్తారు. -
కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?
నవీన్ పొలిశెట్టి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా పరిచయం ఎందుకంటే 'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు. ఆ తర్వాత ఇతడు హీరోగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హీరో నవీన్ పొలిశెట్టి.. ప్రముఖ నాయకుడు కేఏ పాల్ని కలవడం ఆసక్తికరంగా అనిపించింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?) నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా నటించిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి అనుకునే ఓ మధ్య వయసు లేడీ.. ఓ కుర్రాడితో ట్రావెల్ అయితే చివరకు ఏం జరిగిందనేదే స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్న నవీన్.. తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సిటీస్ అన్నీ తిరిగేస్తున్నాడు. అలా ఆదివారం వైజాగ్లో సందడి చేశాడు. అయితే వైజాగ్ బీచ్ రోడ్లో వెళ్తుండగా అనుకోకుండా అక్కడే ఓ కారులో కేఏ పాల్ కూడా షికారుకి వచ్చారు. దీంతో మరో కారులో ఉన్న నవీన్ పొలిశెట్టి.. ఆయనకు హాయ్ చెప్పగా, తిరిగి కేఏ పాల్ కూడా పలకరించారు. అలా కాసేపు దూరం నుంచే మాట్లాడుకున్న ఈ ఇద్దరికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లిద్దరితో ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: యూట్యూబర్ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి) #KAPaul & #MrPolishetty pic.twitter.com/Pw5urprkka — Matters Of Movies (@MattersOfMovies) August 28, 2023 -
సెప్టెంబరు నెలలో విడుదల అవుతున్న ఏడు టాప్ సినిమాలు ఇవే..!
సెప్టెంబరు నెలలో సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.. ఇదే నెలలో 7కు పైగా పెద్ద సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయి. సెప్టెంబరు 18న వినాయక చవితి పండుగ ఉండటంతో సెప్టెంబరు 15న ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. సెప్టెంబరు 1 'ఖుషి' విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. 2019లో వచ్చిన మజిలీ సినిమా తర్వాత ఖుషి వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. సెప్టెంబర్ 7 'జవాన్' కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'జవాన్'. పఠాన్ తర్వాత భారీ అంచనాలతో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో నయనతార,దీపికా పదుకోన్ వంటి స్టార్స్ ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 7 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు. పి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుందీ చిత్రం.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సెప్టెంబర్ 15 'స్కంద' రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ను పక్కా మాస్ లుక్లో బోయపాటి చూపించాడు. ఇందులోని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులతో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇందులో రామ్ రెండు కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన 'స్కంద' సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 15 'చంద్రముఖి 2' రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా అప్పట్లో ఒక సంచలన విజయం. ఈ సినిమాకు సీక్వెల్గా ఇప్పుడు 'చంద్రముఖి 2' విడుదలకు రెడీగా ఉంది. ఇందులో రాఘవ లారెన్స్-కంగనా రనౌత్ నటిస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 15 'మార్క్ ఆంథోని' హీరో విశాల్.. ఇప్పుడు 'మార్క్ ఆంథోని'గా వచ్చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తీసిన ఈ సినిమాలో విశాల్కి జోడీగా రీతూవర్మ నటించింది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ 15న వినాయక చవితి సందర్భంగా విడుదల కానుంది. సెప్టెంబర్ 28 'సలార్' ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సలార్' సెప్టెంబర్ 28న విడుదలకు రెడీగా ఉంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ను సెప్టెంబర్ 3న విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అదే రోజు నుంచి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అతిపెద్ద సినిమా 'సలార్' అనే చెప్పవచ్చు. (ఇదీ చదవండి: చిరంజీవి 'చూడాలని ఉంది' సినిమాకు 25 ఏళ్లు.. ఈ విషయాలు తెలుసా?) -
ఈ నగరమంటే నాకు చాలా ఇష్టం: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నవీన్ పోలిశెట్టి. తాజాగా నెల్లూరులో సందడి చేశారు. ఆయనను చూసిన అభిమానులు సైతం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) పోలిశెట్టి మాట్లాడుతూ.. 'నా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ 80 శాతం నెల్లూరులోనే జరిగింది. ఇక్కడి ఫుడ్ సూపర్. నాకు ఎంతో ఇష్టం.' అని అన్నారు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పలువురు ఫుడ్ బ్లాగర్స్తో ముచ్చటించారు.అనంతరం మినీబైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నవీన్ మాట్లాడారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ సమయంలో నగర వీధుల్లో తిరిగానని.. ఈ ప్రాంతం బాగా తెలుసన్నారు. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించడం సంతోషంగా ఉందన్నారు. కథపై ఎంతో నమ్మకంతో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంజీబీ మాల్లో జరిగిన సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. Amazing craze for @NaveenPolishety at Nellore . Stand up promotional tour of #MissShettyMrpolishetty is getting a massive response . Today they are moving to Vijayawada. 6pm PVP Mall meet and greet with #NaveenPolishetty #MSMPStandupTour #MSMPonSep7th pic.twitter.com/1hzhrzKvEC — GSK Media (@GskMedia_PR) August 26, 2023 -
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ స్టిల్స్
-
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
మూడేళ్ల గ్యాప్, అయినా తగ్గేదేలే.. రెమ్యునరేషన్ డబుల్..
టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అనుష్క ఈ మధ్య సినిమాల స్పీడు తగ్గించేసింది. 2019లో చిరంజీవి సైరా సినిమాతో వెండితెరపై మెరిసింది స్వీటి. 2020లో నిశ్శబ్ధం అనే సినిమా చేసినా ఇది నేరుగా ఓటీటీలో రిలీజైంది. అంటే అనుష్క సిల్వర్ స్క్రీన్పై కనిపించి మూడేళ్లవుతోంది. చాలాకాలం తర్వాత ఆమె యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే! యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. రెమ్యునరేషన్ డబుల్ గతంలో అనుష్క సినిమాకు మూడు కోట్ల మేర పారితోషికం తీసుకుంది. అయితే అది అప్పటి ముచ్చట అని తెలుస్తోంది. ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ డబుల్ చేసినట్లు తెలుస్తోంది. మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రానికిగాను ఆమె ఆరు కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు ఓ వార్త వైరలవుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎంత సంపాదించమన్నది కాదు ముఖ్యం.. సినీ పరిశ్రమలో ఎంతమంది స్నేహితులను సంపాదించుకున్నామన్నదే ప్రధానం అనే మాటను నమ్ముతుంది స్వీటీ. డబ్బు కన్నా మనుషులే ముఖ్యం గతంలో ఈ పారితోషికం గురించి అనుష్క మాట్లాడుతూ.. 'ఒక నటి 100 చిత్రాల్లో నటించడం, కోట్లు సంపాదించడం, చాలా ఏళ్లు కథానాయకిగా పరిశ్రమలో నిలదొక్కుకోవడం లాంటివి పెద్ద విషయాలు కావు.. కానీ ఎంతమంది ఫ్రెండ్స్కు సంపాదించుకున్నదే ముఖ్యం. డబ్బు ఆర్జించడం కంటే మంచి మనుషుల్ని సంపాదించడం గొప్ప విషయం. నాకు పారితోషికం ప్రధానం కాదు. మంచి కథా పాత్రలో నటించాలన్నదే నా కోరిక' అని పేర్కొంది. చదవండి: గ్లామర్ క్వీన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా! -
అలా చేశానని ఇంట్లోవాళ్లే తిట్టారు: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి పేరు చెప్పగానే మీకు తెలియకుండానే 'ఈవ్..' అనే సౌండ్ చేస్తారు. ఎందుకంటే 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' మూవీతో హిట్ కొట్టినప్పటికీ 'జాతిరత్నాలు' చిత్రంతో ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'గా రాబోతున్నాడు. సెప్టెంబరు 7న రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టాడు. (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) అప్పుడు కోప్పడ్డారు 'నేను ఓ ఇంజినీర్. చేతిలో ఉన్న ఉద్యోగం పక్కనబెట్టి ఇండస్ట్రీలోకి వచ్చాను. బాగా డబ్బులొచ్చే పని వదిలేసి వచ్చానని అమ్మనాన్న చాలా కోప్పడ్డారు. 'ఏజెంట్ ఆత్రేయ'కి ముందు పదేళ్లపాటు ఇంటిపేరు పాడుచేస్తున్నానని తిట్టారు. నా వల్ల మావాళ్లు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టైటిల్లోనే ఇంటిపేరు ఉండటం చూసి నాన్న హ్యాపీగా ఫీలయ్యారు' అందుకే ఈ మూవీ ''జాతిరత్నాలు' ఈ రేంజులో అలరిస్తుందని మేం అస్సలు ఊహించలేదు. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఒత్తిడికి లోనయ్యాను. అలాంటి టైంలో ఓ మహిళా అభిమానిని కలిశాను. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో నేను ఏడ్చేశాను. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్లకి మంచి ఎంటర్టైన్ మెంట్ ఇవ్వాలని ఫిక్సయ్యా. అలా ఎన్నో కథలు విని.. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఓకే చేశాను. అనుష్కతో కలిసి వర్క్ చేయడం సరదాగా అనిపించింది' అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
Miss Shetty Mr Polishetty : హే కృష్ణా... వస్తున్నాం
మా సినిమాని రిలీజ్ చేయడానికి మంచి తేదీ చెప్పు అంటూ జ్యోతిష్కుడు మహేశ్ దగ్గరికి వెళ్లాడు పొలిశెట్టి. ఓ 70, 80 ఏళ్ల తర్వాత రిలీజ్ చేసుకో అని మహేశ్ అంటే... ‘హే కృష్ణా’ అంటూ ఉట్టి కొట్టి కృష్ణాష్టమికి రిలీజ్ చేసుకుంటాం అంటాడు పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్ బాబు పి. దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్లీ కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించే వీడియోను సోమవారం విడుదల చేశారు. నవీన్ పొలిశెట్టి, మహేశ్ల కామెడీతో సాగే ఈ ఫన్నీ వీడియో ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. -
అనుష్క అభిమానులకు బ్యాడ్ న్యూస్
అనుష్క శెట్టి తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతుంది. నిశ్శబ్దం(2020) చిత్రం తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. త్వరలోనే ఆమె తెరపై కనిపించబోతున్నారని ఆశపడ్డ అభిమానులకు నిరాశే మిగిలింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల వాయిదా పడింది. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. గతంలోనే చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ డేట్ని అనౌన్స్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. (చదవండి: ప్రభాస్-అనుష్క ఫ్యాన్స్కు గుడ్ న్యూస్) పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా ఆగస్ట్ 4న విడుదల చేయడం లేదని, కొత్త రిలీజ్ డేట్ని త్వరలోనే ప్రకటిస్తామని ఓ ప్రకటనను విడుదల చేసింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు కూడా తెలియజేసింది. ఈ చిత్రానికి పి.మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో చెఫ్గా అనుష్క, స్టాండప్ కమెడియన్గా నవీన్ పోలిశెట్టి నటించారు. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం కావడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ట్రైలర్తో పాటు కొత్త రిలీజ్ డేట్ని ప్రకటించే చాన్స్ ఉంది. We apologize from the bottom of our hearts for this unforeseen delays. We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter... Stay tuned for the New release date and trailer... pic.twitter.com/LpMbdrVTsm — UV Creations (@UV_Creations) July 29, 2023 -
అనుష్క సినిమా వాయిదా...పోలిశెట్టి రిలీజ్ కష్టాలు
-
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టిల ‘లేడీ లక్’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
నవీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేశ్బాబు .పి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రథన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లేడీ లక్..’ అంటూ సాగే వీడియో సాంగ్ని సోమవారం రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్ పాడారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ఇది. చెఫ్ అన్వితా రవళిగా అనుష్క, స్టాండప్ కమెడియన్ సిద్ధుగా నవీన్ పాత్రలు మనసులను హత్తుకునేలా ఉంటాయి. ‘లేడీ లక్..’ సాంగ్లో నవీన్ ఎనర్జీ, అనుష్క చార్మింగ్ లుక్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నీరవ్ షా. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి.మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నా కుదర్లేదు. దీంతో తాజాగా ఆగస్టు 4న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, కొత్త పోస్టర్ను విడుదఅనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ల చేశారు మేకర్స్. చెఫ్ అన్విత రవళి శెట్టిపాత్రలో అనుష్కా శెట్టి, స్టాండప్ కమెడియన్ సిద్ధుపాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం: రధఅనుష్కా శెట్టి, నవీ¯Œ ΄÷లిశెట్టి ్రç . -
చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!
వేసవితో పాటు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్గా ఉంది. దాదాపు వచ్చినవన్నీ చిన్న సినిమాలు, వాటిలోనూ హిట్ కొట్టినవి తక్కువే. ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలు పెద్దగా లేవు. మొన్నటివరకు పరిస్థితి ఇది. కానీ రాబోయే కొన్ని నెలలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా ఉండదు. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో ఓ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'మిస్ శెట్టి' రిలీజ్ ఫిక్స్ అనుష్క శెట్టి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఇదే. కొన్నాళ్ల ముందు టీజర్ విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) మెగా బ్రదర్స్తో పోటీ అనుష్క 'మిస్ శెట్టి' సినిమా సోలో రిలీజ్. కానీ దీనికి వారం ముందే అంటే జూలై 28న పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ 'బ్రో' థియేటర్లలోకి వస్తుంది. దీనికి వారం తర్వాత అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' థియేటర్లలోకి వస్తుంది. అటు చిరు ఇటు పవన్ మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఫైట్ ఆసక్తి రేపుతోంది. అనుష్కకే ప్లస్ చిరు, పవన్ సినిమాలతో పోలిస్తే అనుష్క మూవీకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఎందుకంటే 'బ్రో'.. వినోదయ సీతం రీమేక్, 'భోళా శంకర్'.. వేదాళం చిత్రానికి రీమేక్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మాత్రం ఒరిజినల్ కథతోనే తీశారు. అలానే కామెడీని నమ్ముకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ సినిమా హిట్ అవుతుందా అనే ఒకటే టెన్షన్. ఒకవేళ మూడు సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇంకా ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఏం జరుగుతుందో? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) (ఇదీ చదవండి: చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!) -
హతవిధి.. ధనుష్ వాయిస్లో ఉన్న మ్యాజిక్కే వేరు!
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన మొదటి సాంగ్కు మంచి స్పందన లభించింది. బుధవారం ఈ చిత్రం నుంచి మరో పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ను హీరో ధనుష్ పాడడం విశేషం. ధనుష్ గతంలో కూడా ఎన్నో సాంగ్స్ పాడి అలరించాడు. అందుకే సింగర్గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన పాడిన కొలవరి డి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తన గాత్రంతో హతవిధి సాంగ్కు మరింత వన్నె తెచ్చాడీ హీరో. నవీన్ పొలిశెట్టి నిస్పృహతో అరిచే వాయిస్తో ఈ పాట మొదలవుతుంది. హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్లో ఏది గొప్పగా చేయాలనుకున్నా అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్తో సాంగ్ కొనసాగుతుంది. అంతేకాదు తనకు ఎదురవుతున్న సంఘటనల వల్ల హీరో ఎంత నిరుత్సాహానికి లోనవుతాడనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించాడు. లిరిక్స్ విషయానికి వస్తే 'బుల్లిచీమ బతుకుపై... బుల్డోజరైందాయ్' అనే పంచులతో మిస్టర్ శెట్టి జీవితాన్ని స్పష్టంగా వివరిస్తుంది ఈ పాట. ఇంత మంచి లిరిక్స్ను రామజోగయ్య శాస్త్రి అందించడం విశేషం. ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్తో పాటు సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. చదవండి: చాతిపై పవర్ స్టార్ పచ్చబొట్టు -
ప్రభాస్ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?
టాలీవుడ్లో ప్రభాస్-అనుష్కల జోడీకి సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. ఆన్స్క్రీన్లోనే కాకుండా, ఆఫ్స్క్రీన్లోనూ వీరి కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఎప్పటినుంచో ప్రభాస్-అనుష్కలు ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. చదవండి: 'విమానం'లో అనసూయ లుక్ అదిరిందిగా.. రంగమ్మత్తలా ఉందే! కానీ అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏమీ లేదని, కేవలం ఫ్రెండ్స్ అని అనుష్క, ప్రభాస్లో క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ మాత్రం వీళ్లు రియల్ లైఫ్ కపుల్ అయితే బాగుండని కోరుకుంటారు. ఇక తాజాగా మరోసారి ప్రభాస్-అనుష్కల రిలేషన్షిప్పై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏమైందంటే.. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ రీసెంట్గా విడుదలైన సంగతి తెలిసిందే. దీన్ని ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. టీజర్ చాలా బావుందంటూ ప్రశంసలు కురిపించాడు. దీనిపై అనుష్క స్పందిస్తూ.. థ్యాంక్యూ 'పప్సు' అంటూ కామెంట్ చేసింది. ఈ స్టోరీని స్క్రీన్ షాట్ చేసిన పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చదవండి: వారికి ఇష్టమైనప్పుడు.. మనం ఏం చేయగలం: కంగనా -
'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్ కామెడీ
జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్ అందుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలమే అయినా ఇడేట్ప్పటివరకు ఇలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా టీజర్ను వదిలారు మేకర్స్. ఇందులో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్గా కనిపించనుండగా, అనుష్క చెఫ్గా నటించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసుందేకు మేకర్స్ రెడీ అవుతున్నారు. -
Anushka Shetty: బొద్దుగా మారిన అనుష్క.. కారణం ఇదేనా?
సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చాలా మంది రాణిస్తారు. వీరిలో కొంత మంది బ్యూటీస్ మాత్రమే ప్రయోగాలు చేయటానికి ఇష్టపడతారు. వారిలో అనుష్క ఒకరు. అనుష్క అందం అభినయం కలిసిన నటి. సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసిన అనుష్క...తన అందంతోనే కాదు..అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుష్క నటనకే కాదు..గ్లామర్ కు కూడా ప్యాన్స్ ఉన్నారు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తనయుడు, కె.ప్రకాష్ దర్శకత్వంలో అనుష్క సైజ్ జీరో సినిమాలో నటించింది. సైజ్ జీరో ముందు వరకు అనుష్క చాలా స్లిమ్ గా ఉండేది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నార్మల్ లుక్ లోనే కనిపించింది. సైజ్ జీరో కోసం అనుష్క చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. అనుష్క వెయిట్ కంట్రోల్ తప్పింది. ఆ సినిమా కోసం అనుష్క కావాలని విపరీతంగా బరువు పెరిగింది. రాజమౌళి వద్దని చెప్పిన వినకుండా ఆ సినిమాలో నటించింది అనుష్క. ఆ సినిమా మీద నమ్మకంతో బాగా లావుగా మారిపోయింది. అనుష్క నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. తన యోగా పద్దతులు ద్వారా స్లిమ్ కావచ్చు అనుకున్న అనుష్క ప్రయత్నం సక్సెస్ కాలేదు. అనవసరంగా అనుష్క సైజ్ జీరో చేసిందనే కామెంట్స్ ఎక్కువైయ్యాయి.ఇక బాహుబలి 2 కోసం అనుష్క వెయిట్ లాస్ అవ్వటానికి ఎంత ట్రై చేసిన నార్మల్ లుక్ లోకి రాలేకపోయింది. దీంతో రాజమౌళి గ్రాఫిక్స్ తో ఏదో మ్యానేజ్ చేశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన భాగమతి, నిశ్శబ్దం సినిమాలో అనుష్క లావుగానే కనిపించింది. నిశ్శబ్దం తర్వాత అనుష్క ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో అందరూ అనుష్క స్లిమ్ కావటం కోసం గ్యాప్ తీసుకుందనుకున్నారు. ఇక అనుష్క కూడా అమెరికా లో వెయిట్ లాస్ అయ్యేందుకు ట్రై చేసింది. కానీ ఎలాంటి రిజల్ట్ అనుష్క కి అవి ఇవ్వలేదని..ఈ మధ్య కర్ణాటకలోని ఓ ఆలయంలో కనిపించిన అనుష్క చూస్తే అర్ధమౌతుంది. ఇక సోషల్ మీడియా లో బాగా బొద్దుగా మారిన అనుష్క వీడియో వైరల్ అయింది. అయితే అనుష్క ఇంతలా వెయిట్ పెరగడానికి కారణం థైరాయిడ్ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.. అందులో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం అనుష్కనే తేల్చాలి. ఇక అనుష్క బొద్దుగా మారటంపై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.అనుష్కకి సినిమాల్లో నటించే ఆలోచన లేదని..అందుకే ఫిట్ నెస్ విషయం పట్టించుకోవటం లేదంటూ డిస్కషన్ చేస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అనుష్క ఇలా లావు కనిపించటం వెనుక రీజన్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనుష్క..యూవీ క్రియేషన్స్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసమే అనుష్క లావు అయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా రిలీజైన మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి మూవీ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ లో అనుష్క అంత బొద్దుగా కనిపించలేదు. అయితే ఈ సినిమా విషయంలో కూడా అనుష్క లావుగా కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ వాడారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. ఇక అనుష్క ఫ్యాన్స్ మాత్రం స్వీటీ మళ్లీ నార్మల్ లుక్ లో రావాలనుకుంటున్నారు.కానీ ఫ్యాన్స్ కల నిజం అయ్యేలా లేదు. ఎందుకంటే ప్రసస్తుతం అనుష్క వయస్సు నాలుగు పదులు దాటేసింది. ఏజ్ పరంగా చూసుకున్న అనుష్క నార్మల్ లుక్ లోకి..ఫ్యాన్స్ కోరుకున్న విధంగా తయారు కావాలంటే కొంచెం కష్టమే. కానీ అనుష్క కి సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎంత రిస్క్ అయినా చేస్తుంది. అందుకే సైజ్ జీర్ చేసింది. ఆ సినిమా మీద ప్రేమే మళ్లీ అనుష్క ను స్లిమ్ గా మార్చేలా చేస్తుందేమో చూడాలి.