-
కేంద్ర మంత్రి అనంత్కుమార్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పెట్రోలియం, రసాయనాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మం త్రి అనంత్ కుమార్(59) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల కేన్సర్తో బాధపడుతున్న ఆయన ఆదివారం అర్ధరాత్రి దాటా క 2 గంటలకు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ భారతంలోని కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావటానికి కృషి చేసిన ముఖ్య నేతల్లో అనంత్ కుమార్ ఒకరు. దక్షిణ బెంగళూరు నుంచి ఆయన వరుసగా ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అనంత్ కుమార్కు భార్య డాక్టర్ తేజస్వి, కుమార్తెలు ఐశ్వర్య, విజేత ఉన్నారు. సాయంత్రం ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చి అనంత్ కుమార్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంత్ కుమార్ కుటుంబసభ్యులను ఓదార్చారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు.. బెంగళూరుకు చెందిన హెచ్.ఎన్.నారాయణ్ శాస్త్రి, గిరిజ దంపతులకు అనంత్ కుమార్ 1959లో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్ సభ్యుడయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతగా అరెస్టై జైలుకు వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 1987లో బీజేపీలో చేరారు. 1996లో మొదటిసారిగా దక్షిణ బెంగళూరు నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు. 1998లో వాజపేయి కేబినెట్లో 38 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ సారథులు వాజ్పేయి, అడ్వాణీతోపాటు ప్రధాని మోదీకి సన్నిహితుడిగా అనంత్ కుమార్కు పేరుంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కన్నడలో ప్రసంగించిన మొదటి నేత అనంత్కుమారే. నేడు అంత్యక్రియలు బ్రిటన్, అమెరికాల్లో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందిన అనంత్కుమార్ అక్టోబర్లో స్వదేశానికి తిరిగి వచ్చారు. బెంగళూరులోని శ్రీశంకర కేన్సర్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం చామరాజపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రముఖుల సంతాపం.. అనంత్కుమార్ మృతికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎల్కే అడ్వాణీ సంతాపం తెలిపారు. ‘అనంతకుమార్ మంచి పరిపాలనాదక్షుడు. యువకుడిగా రాజకీయాల్లో ప్రవేశించి అంకితభావంతో పనిచేశారు. కర్ణాటక, ముఖ్యంగా బెంగళూరులో పార్టీ బలోపేతం అయ్యేందుకు కృషి చేశారు. ఆయన భార్య తేజస్వినితో మాట్లాడాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. గవర్నర్, తెలంగాణ సీఎం సంతాపం సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి అనంత కుమార్ మృతికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంత కుమార్ మృతి దేశానికి తీరని లోటని గవర్నర్ పేర్కొన్నారు. అనంత్ కుమార్ దేశానికి చేసిన సేవలను సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. అలాగే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అనంత్కుమార్ మృతి పట్ల ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతకుమార్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కుటుం బ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
చౌకైన శానిటరీ న్యాప్కిన్ల ఆవిష్కరణ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అత్యంత చౌకైన, మట్టిలో కలసిపోయే శానిటరీ న్యాప్కిన్లను కేంద్రం గురువారం ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి భారతీయ జనఔషధి పరియోజన(పీఎంబీజేపీ) కేంద్రాల్లో నాలుగు న్యాప్కిన్లు ఉండే ఒక్కో ప్యాక్ను ‘సువిధా’ పేరుతో కేవలం రూ.10కే అందించనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి అనంత్కుమార్ తెలిపారు. ఈ ఏడాది మే 28 నాటికల్లా దేశంలోని 3,200 పీఎంబీజేపీ కేంద్రాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. -
కృత్రిమ మోకాలి చిప్పల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కృత్రిమ మోకాలి చిప్పల ధరలను ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు వైద్యశాలలు వాస్తవ వెల కన్నా లక్ష రూపాయకుల పైగా అధిక ధరలు వసూలు చేస్తుండటంతో వీటి ధరలపై ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించింది. కేంద్రం తాజా ఉత్తర్వులతో కృత్రిమ మోకాలి చిప్పలు 70% తగ్గి... రకాన్ని బట్టి రూ.54 వేల నుంచి గరిష్టంగా రూ.1.14 లక్షల వరకు ఉండనున్నాయి. అక్రమంగా, అన్యాయంగా ప్రైవేటు వైద్యశాలలు రోగులను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో మోకాలి మార్పిడి చికిత్సలు అవసరమైనవారు దాదాపు 2 కోట్ల మంది ఉండగా, వారిలో ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నారు. కొత్త ధరల ప్రకారం ప్రస్తుతం విస్తృతంగా వాడే కోబాల్ట్–క్రోమియం కృత్రిమ మెకాలి చిప్ప ధర రూ.54,720. ఇప్పటి వరకు ఆసుపత్రులు దీనికి రూ. 1.6 లక్షల వరకు వసూలు చేస్తుండేవి. 80% శస్త్రచికిత్సల్లో ఈ రకం మోకాలి చిప్పలనే వాడుతున్నారు. క్యాన్సర్, కణతిలతో బాధపడుతున్న రోగులకు వాడే ప్రత్యేక మోకాలి చిప్పల ధరను ప్రభుత్వం రూ.1,13,950గా నిర్ణయించింది. ఇంతకుముందు దీనికి ఆసుపత్రులు గరిష్టంగా దాదాపు 9 లక్షల వరకు వసూలు చేసేవి. కొత్త ధరల కన్నా అధికంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులు, దిగుమతిదారులు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంత్ కుమార్ హెచ్చరించారు. -
ప్రధాని జోక్యం చేసుకోవాలి
► భారతీయులపై దాడులను అరికట్టాలి ► లోక్సభలో విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న జాతివివక్ష దాడులపై విపక్షాలు సోమవారం లోక్సభలో ఆందోళన వ్యక్తం చేశాయి. భారత సంతతి ప్రజల భద్రత కోసం ప్రధానిజోక్యం చేసుకోవాలని, దాడులను అరికట్టేలా చూడాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ స్పందిస్తూ.. ఇది తీవ్రమైన విషయమని, ప్రవాస భారతీయుల భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల జీవితాల్లోకి చొరబాటు.. ప్రభుత్వం పన్ను అధికారులకు అపరిమిత అధికారాలు కట్టబెడుతోందని కాంగ్రెస్, ఎస్పీ తదితర విపక్షాలు సోమవారం రాజ్యసభలో మండిపడ్డాయి. ఆధార్ నంబర్ వాడకాన్ని పెంచుతూ ప్రజల జీవితాల్లోకి చొరబడుతోందని విమర్శించాయి. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ 2017 ఫైనాన్స్ బిల్లుపై చర్చను ప్రారంభిస్తూ.. ఆదాయ పన్ను రిటర్న్లకు ఆధార్ను అనుసంధానించాలన్న ప్రతిపాదన ప్రజల జీవితాల్లోకి చొరబడ్డమేనని పేర్కొన్నారు. బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ‘పన్నుచెల్లింపుదారుకు సరైన వివరణ ఇవ్వకుండా సోదాలు, ఆస్తులు జప్తు చేసే అధికారాలను బిల్లులో చేర్చారు. దీని ద్వారా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకునే అవకాశముంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. రూ. 20వేల కోట్ల ‘ఎల్ఈడీ’ స్కాం.. కేంద్రం జరిపిన ఎల్ఈడీ బల్బుల కొనుగోళ్లలో రూ.20 వేల కోట్ల కుంభకోణం చోటుచేసుకుందని సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రభుత్వ రంగ విద్యుత్ కంపెనీల ఉమ్మడి సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సుప్రీం కోర్టు, కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా బల్బులను కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
బీజేపీకి బుద్ధి చెబితేనే ప్రజాస్వామ్య మనుగడ
మట్టపల్లిలో నిత్యకల్యాణం
15 టన్నుల కల్తీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు
‘నీట్’కు 997 మంది హాజరు
కొనసాగుతున్న ‘పోస్టల్’ ఓటింగ్
ఉమ్మడి జిల్లాలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..
ఉరుములు.. మెరుపులు
వంటింట్లో ధరల మంట!
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement