mehendi design
-
చిరకాల ప్రియుడితో నటి పెళ్లి, వీణా ‘హెన్నా’ స్పెషల్ ఎట్రాక్షన్
ప్రముఖ నటి హీనా ఖాన్ తన ప్రియుడితో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది.ఇటీవల కేన్సర్బారిన పడి కోలుకుంటున్న హీనా తన 11 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ రాకీ జైస్వాల్ను పెళ్లాడింది. వీరి పెళ్లి మెహిందీ ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. బ్రైడల్ లుక్లో తన అభిమానులకు సరప్రెజ్ ఇచ్చింది. దీంతో అభిమానులతోపాటు, పలువురు సెలబ్రిటీలు ఈ లవ్బర్డ్స్కు అభినందనలు తెలిపారు.హీనా తన డ్రీమీ వెడ్డింగ్ గురించి ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంది. పాస్టెల్-రంగు చీరలోవధువు హీనా , చికెన్ కుర్తాలో వరుడు రాకీ అందంగా కనిపించారు. తన అభిమానులకు హాయ్ చెబుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది.అలాగే సెలబ్రిటీ మెహిందీ డిజైనర్ వీణా నాగ్డా మెహిందీ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. హీనాకు మెహిందీ సొబగులు చూసి ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీణా హీనా, రాకీ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. కలకాలం చిరువ్వుతో సంతోషంగా జీవించాలంటూ కొత్త దంపతులను ఆశీర్వదించారు. చక్కటి మెహందీ డిజైన్స్ వేసిన వీణాకు హీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇంత అందమైన మెహిందీ పెట్టినందుకు ధన్యవాదాలు, ముఖ్యంగా నా పాదాలపై మీరు అద్భుతం చేశారు అంటూ ప్రేమగా కృతజ్ఞతలు తెలిపింది. సాంప్రదాయం, ఆధునికత కలగలిసన వీణా మెహిందీని ఫ్యాన్స్ ప్రశంసించారు. ముఖ్యంగా చేతులపై లోటస్ డిజైన్సహా ఆమె డిజైన్స్ ట్రెండ్గా మారతాయన్నారు.సెలబ్రిటీ మెహిందీ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు అంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Veena Bollywood Mehendi (@veenanagda)p; -
కురులను పొడిబారనివ్వకండి
జుట్టు పొడిబారడానికి కారణం మాడు ఎక్కువ తేమను కోల్పోవడం. అందుకని గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ను మాడుకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి పెరుగును మాడుకు పట్టించి, తర్వాత శుభ్రపరుచుకోవాలి. పెరుగు శిరోజాలకు మంచి కండిషనర్గా ఉపయోగపడుతుంది. బాదంనూనెలో విటమిన్ ‘ఇ’ ఉండటం వల్ల మాడు త్వరగా పొడిబారదు. అందుకని బాదంనూనెతో మాడుకు మసాజ్ చేసుకోవచ్చు. మృదుత్వం కోసం కండిషనర్ని వాడేవారు మాడుకు తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనతో మాడుకు తగిలేలా దువ్వాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగై శిరోజాల కండిషనింగ్ బాగుంటుంది. సుమ కోమలం టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రబ్ చేస్తూ రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేడయం వల్ల చర్మానికి పువ్వులాంటి మృదుత్వం లభిస్తుంది. మరింత ఎర్రగా...మెహెందీ! నిమ్మరసంలో చక్కెర కలిపి, వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు దూది ముంచి మెహెందీ డిజైన్ పెట్టిన చేతులపై అద్దాలి. ఆరిన తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. మెహెందీ పెట్టిన 24 గంటల తర్వాత డిజైన్ మరింత ఎరుపుదనం నింపుకుంటుంది.